ఈవీఎం కమిషనింగ్‌ సమర్థవంతంగా చేపట్టాలి | Sakshi
Sakshi News home page

ఈవీఎం కమిషనింగ్‌ సమర్థవంతంగా చేపట్టాలి

Published Tue, May 7 2024 12:15 AM

ఈవీఎం కమిషనింగ్‌ సమర్థవంతంగా చేపట్టాలి

బెల్లంపల్లి: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈవీ ఎం కమిషనింగ్‌ కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా చేపట్టాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్ని కల సాధారణ పరిశీలకులు రావేష్‌గుప్తా అన్నారు. సోమవారం బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా ప రిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించారు. బెల్లంపల్లి అసెంబ్లీ ని యోజకవర్గ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రాహు ల్‌, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం కమిషనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులను అధి కారులు, సిబ్బంది సవాల్‌గా స్వీకరించి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని చెప్పారు. అదనపు బ్యాలెట్ల ర్యాండమైజేషన్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేపట్టామని అన్నారు. తహసీల్దార్లు, ఎన్నిక ల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement