పోలీసు పహారాలో ముగిసిన అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

పోలీసు పహారాలో ముగిసిన అంత్యక్రియలు

Published Thu, May 9 2024 6:35 AM

పోలీసు పహారాలో  ముగిసిన అంత్యక్రియలు

సూర్యాపేట : ఎల్లయ్య మృతదేహాన్ని జగ్గయ్యపేట నుంచి అంబులెన్స్‌లో సూర్యాపేట మండలంలోని ఆయన స్వగ్రామం యర్కారానికి బుధవారం తీసుకోచ్చారు. ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసు పహారాలో రాత్రి ముగిశాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సీఐ సురేందర్‌రెడ్డి, రాజశేఖర్‌, బాలునాయక్‌తో పాటుగా మరో నలుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలతో భారీ బందోబస్తు చేపట్టారు. ఎల్లయ్య మృతదేహానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ శాఖ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు కొప్పుల వేణారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి మృతదేహాంపై పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement