ప్రతి అంశంపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

ప్రతి అంశంపై అవగాహన ఉండాలి

Published Wed, May 8 2024 3:30 AM

ప్రతి అంశంపై అవగాహన ఉండాలి

నారాయణపేట: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని మాస్టర్‌ ట్రైనర్స్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఓలు, సహాయ పీఓల శిక్షణ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈసందర్భంగా ఈవీఎంల నిర్వహణతో పాటు వివిధ రకాల ఫారాలు నింపడంపై మాస్టర్‌ ట్రైనర్స్‌ అవగాహన కల్పించారు. అదేవిధంగా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే సరిచేయడం.. వీవీ ప్యాట్‌లో బ్యాటరీ అమరిక, మాక్‌ పోలింగ్‌ నిర్వహణ అంశాలపై పునఃపరిశీలన చేశారు. కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 
Advertisement
 
Advertisement