వ్యాసరచన పోటీలో ప్రతిభ
సోన్: సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గతేడాది అక్టోబర్లో కళాశాల స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలలో మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన జి.వైష్ణవి ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సత్యసాయి జాతీయ సేవాదళ్ కోఆర్డినేటర్ ఎస్.కోటేశ్వరరావు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్జి దొర, తెలంగాణ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్రావు చేతుల మీదుగా పతకం అందుకున్నట్లు సోమవారం ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment