‘విశాల జనసభ’ విజయవంతం | Sakshi
Sakshi News home page

‘విశాల జనసభ’ విజయవంతం

Published Tue, May 7 2024 10:50 AM

‘విశాల జనసభ’ విజయవంతం

సుభాష్‌నగర్‌: ఇందూరు విశాల జన సభ పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్క కార్యకర్తకు, సహకరించిన పోలీస్‌, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌కులాచారి అన్నారు. నగరంలోని పార్టీలో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి మోదీ అవసరమని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి విశాల జనసభకు తరలివచ్చిన ప్రజలే నిదర్శనమన్నారు. సభ విజయవంతం కావ డంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీకి పటిష్ట నాయకత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు ఆర్థిక, రాజకీయ, అధికార, ఇతర అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, రాష్ట్రం పదేళ్లు వెనుకబడిపోయిందని ఆరోపించారు. ఎంపీ అర్వింద్‌.. ఏడు ఆర్‌వోబీలు, నవోదయ, రెండు కేంద్రీయ విద్యాలయాలతోపా టు రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కమలం గుర్తుకు ఓటేసి అర్వింద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధానకార్యదర్శి న్యాలం రా జు, ఫ్లోర్‌లీడర్‌ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రమోద్‌కుమార్‌, పద్మారెడ్డి, బద్దం కిషన్‌, నారాయణయాదవ్‌, నాయిడి రాజన్న, రోషన్‌, తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement