ప్రజావాణికి 141 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సందర్భగా డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనంగా రేషన్ బియ్యం కేటాయించాలి
తమకు అదనంగా రేషన్ బియ్యం కేటాయించాలని నగరంలోని ద్వారకానగర్కు పలువురు వితంతులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అందిస్తున్న రేషన్ బియ్యంసరిపోవడం లేదన్నారు.
పరిశీలించిన కలెక్టర్ హనుమంతు
సత్వరమే పరిష్కరించాలని
అధికారులకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment