కాంగ్రెస్‌లోకి బీజేపీ నాయకుడు దాస్‌ భొత్ర | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి బీజేపీ నాయకుడు దాస్‌ భొత్ర

Published Wed, May 8 2024 7:15 AM

కాంగ్రెస్‌లోకి బీజేపీ నాయకుడు దాస్‌ భొత్ర

జయపురం: బొరిగుమ్మ సమితి మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్‌ నేత దాస్‌ భొత్ర మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బొరిగుమ్మలో గల కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దాస్‌ భొత్రను జయపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తారాప్రసాద్‌ బాహిణీపతి సాదరంగా ఆహ్వానించారు. భొత్రకు నువాగుడ, పాతబొరిగుమ్మ, జిలిమిలి, ఖుడిగుడ తదితర గ్రామాల్లో మంచి పేరున్న నాయకుడని, అతడి వెంట వందలాది మంది కార్యకర్తలు ఉన్నారని, అతడి పట్ల భొత్ర సంప్రదాయ ప్రజలకు ఆదరణ ఉందని, కాంగ్రెస్‌లో కలవటం వల్ల తమ పార్టీకి మేలు కలుగుతుందని కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి దేవేంద్ర బాహిణీపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బీజేపీలో ఉంటూ బొరిగుమ్మలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని, కొంత కాలంగా బీజేపీ తనను విస్మరించిందని దాస్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహిణీపతి బొరిగుమ్మ సమితిలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు, సారా ప్రవాహాన్ని అరికట్టేందుకు చేపట్టి ఉద్యమాలకు, సమితి అభివృద్ధికి చేసిన కృషి తనను ఆకర్షించడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement