చికెన్
విజయనగరం టౌన్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల–మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్లో పోలీసు సిబ్బందిని సుశిక్షితులను చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం శిక్షణ కార్యక్రబమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ–ఫ్రంట్ లైన్ వారియర్గా సమాజానికి ఇంకామెరుగైన సేవలందించేందుకు పోలీసు సిబ్బంది సీపీఆర్ నిర్వహించడంలో సుశిక్షితులను చేసేందుకు తిరుమల–మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏదైనా రహదారి ప్రమాదం లేదా మరేదో సంఘటన జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్గా సంఘటనా స్థలానికి ముందుగా చేరేది పోలీసులేనని, సంఘటనా స్థలంలో గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారికి అవసరాన్ని బట్టి గోల్డెన్ అవర్స్లో సీపీఆర్ చేస్తే, వారికి పునర్జన్మ అందించిన వారమవుతామన్నారు. అయితే, సీపీఆర్ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు నిర్వహించాలన్న విషయాలపై తప్పనిసరిగా పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. తిరుమల–మెడికవర్ ఆస్పత్రి ఎం.డి. డాక్టర్ కె.తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ–దొమ్మీలు, త్రొక్కిసలాటలు జరిగినపుడు మనల్ని మనం రక్షించుకుంటూ, ఇతరులను రక్షించేందుకు పోలీసు సిబ్బందికి తప్పనిసరిగా సీపీఆర్ చేసే విధానం పట్ల అవగాహన ఉండాలని అభిప్రాయ పడ్డారు. తిరుమల–మెడికవర్ ఆసుపత్రి కార్డియాక్ వైద్యుడు డా.దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ–ఏ పరిస్థితుల్లో సీపీఆర్ అందించాలన్న విషయం పట్ల అవగాహన అవసరమని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు డా.జి.రామారావు, డా. షరీన్ హసన్ భట్, డా.రామలక్ష్మి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్ఎస్సైలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, ఆస్పత్రి టెక్నీషియన్ కేవీ సాయికుమార్, జి.దుర్గారావు, ఆర్ఎస్సైలు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment