విజయనగరం అర్బన్: కేంద్రియ గిరిజన విశ్వ విద్యాలయంలో గురువారం ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తేజస్వి కట్టిమణి తన తల్లి ‘‘సంగమ్మ’’ పేరు మీద ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన అందరిలో స్ఫూర్తిని నింపారని ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తల్లి పేరుమీద కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కంప్యూటర్ విభాగాధిపతి డా. బొంతు కోటయ్య సమన్వయ కర్తగా వ్యవహరించారు. యూనివర్సిటీ డీన్లు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు తమ తమ తల్లి పేరు మీద మొక్కలను నాటారు.
Comments
Please login to add a commentAdd a comment