విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలి
నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని సెంచూరియన్ విశ్వ విద్యాలయం వైస్చాన్స్లర్ ప్రశాంత కుమార్ మహంతి సూచించారు. ఈ మేరకు మండలంలోని టెక్కలి వర్సిటీలో టెక్–టాక్, బ్లిజ్ ఫెస్ట్ 2.0 కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఇతర రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, డిజైన్ వంటి అంశాలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. బ్లిజ్ ఫెస్ట్ 2.0 కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖ ఐఐఎం ప్రొఫెసర్ కల్యాణ్ మాట్లాడుతూ..వ్యాపార రంగంలో విద్యార్థులు విజయం సాధించాలంటే ముందుగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమకు అవసరమైన రంగాల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించాలని హితవు పలికారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్
సెంచూరియన్లో టెక్–టాక్, బ్లిజ్ ఫెస్ట్ 2.0 సదస్సులు
Comments
Please login to add a commentAdd a comment