● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య
గోదావరిఖని:ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలని ఏఐటీయూ సీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్కుమార్ కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎండీ బలరాంను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. తమ పోరాట ఫలితంగా మొదటిషిఫ్టును ఉద యం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12గంటల వరకు, రాత్రి డ్యూటీ యథావిధిగా ఉంటుందని సింగరేణి ప్రకటించిందన్నారు. దీనిని కార్మికవర్గం వ్యతిరేకిస్తోందన్నారు. మొదటి షిఫ్ట్ను ఉదయం 7 నుంచి 1గంట వరకు, మధ్యాహ్న భోజనం కంటి న్యూ, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని ప్రతిపాదించామని అన్నారు. సీఎండీ సానుకూలంగా స్పందించారని సీతారామయ్య తెలిపారు. తద్వారా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11గంటల వరకు, రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల పని వేళలు ఉంటాయని వివరించారు. కాగా, ఎన్నికల విధులను ఆన్లైన్ డ్యూటీగా పరిగణించాలని నేతలు కోరారు.