పట్టుదలతో చదవండి | Sakshi
Sakshi News home page

పట్టుదలతో చదవండి

Published Tue, May 7 2024 1:20 AM

పట్టుదలతో చదవండి

● కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల తో చదివి లక్ష్యం సాధించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను తన కార్యాలయంలో సోమవా రం ఆయన సన్మానించారు. డీఈవో మాధవితో కలి సి విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. జిల్లాలో ఈ సారి టెన్త్‌ ఫలితాలు మెరుగ్గానే వచ్చాయని తెలిపా రు. వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఫలితా లు సాధించేలా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ని ర్వహణ, ఇంటివద్ద చదువు ఫాలోఅప్‌ చేయడం లాంటి చర్యలు మంచి ఫలితాల సాధనకు దోహదపడ్డాయని అన్నారు. నూరు మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయస్థాయి ప్రే రణ శిక్షణకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అకడమిక్‌ అధికారి షేక్‌తోపాటు జిల్లా అధికారులు రంగారెడ్డి, మెహరాజ్‌ మహమూద్‌, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement