పోలింగ్‌ కేంద్రాల తనిఖీ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

Published Tue, May 7 2024 1:20 AM

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

ఫెర్టిలైజర్‌సిటీ: 39వ డివిజన్‌ శాంతినగర్‌లోని ప్ర జా పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రా లని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ సో మవారం తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. డిప్యూటీ తాహసీల్దార్‌ మాధవి పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

7 నుంచి 11 తేదీ వరకు తేలికపాటి వర్షాలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Advertisement
 
Advertisement