● ఎస్పీ అఖిల్ మహాజన్
వేములవాడ: ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యట నకు పటిష్ట బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపా రు. వేములవాడలో సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో స మావేశమయ్యారు. 1200 మందితో బందోబస్తు చేపడుతున్నామని, పది సెక్టార్లుగా విభజించి ఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించినట్లు తెలిపారు. గుర్తింపుకార్డులు ధరించే విధులకు హాజరుకావాలని సూచించారు. హెలికాప్టర్ వద్దకు ఇతరులు ఎవరిని రానీయొద్దన్నారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు కూడా వదిలి వెళ్లకూడదని సూచించారు. ట్రెయినీ ఐపీఎస్ రాహుల్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.