సర్దార్‌నగర్‌ తైబజార్‌ వేలం రూ.42.10 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సర్దార్‌నగర్‌ తైబజార్‌ వేలం రూ.42.10 లక్షలు

Published Fri, Mar 24 2023 6:32 AM | Last Updated on Fri, Mar 24 2023 6:32 AM

- - Sakshi

షాబాద్‌: సర్దార్‌నగర్‌ తైబజార్‌ వేలం పాట రూ.42.10 లక్షలు పలికినట్లు ఎంపీఓ హన్మంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సర్దర్‌నగర్‌ పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్‌ మునగపాటి స్వరూప ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 9 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 26.51 లక్షలు ఉండగా కుర్వగూడ గ్రామానికి చెందిన ర్యాకల మల్లేశ్‌ రూ.42.10 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఇంద్రమ్మ, మాజీ సర్పంచ్‌ నర్సింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

పంట పొలాల పరిశీలన

కేశంపేట: యాసంగిలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తపేట రైతువేదిక క్లస్టర్‌లోని వ్యవసాయ పొలాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాము, రైతులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement