యాచారం: అసలే దివ్యాంగుడు.. అన్నంటే ఎనలేని ప్రేమ.. అన్న కూడా అన్నీ తానై తమ్ముడిని పోషిస్తున్నాడు. అనారోగ్యంతో అన్న మృతి చెందడంతో తమ్ముడు తల్లడిల్లిపోయాడు. గుండె ఆగి మృతిచెందాడు. ఐదారు గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృత్యుఒడికి చేరుకోవడంతో ఆ గ్రామం శోక సంద్రమైంది.. తమ్మలోనిగూడకు చెందిన చిట్టే మల్ల య్య, పెంటమ్మలకు చిట్టే లింగం(40), చిట్టే ఐలేశ్ (35) చిట్టే కృష్ణ ముగ్గురు కుమారులు. మల్లయ్య ఏడేళ్ల క్రితం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. లింగం ఎల్ఐసీ ఉద్యోగిగా నగరంలోనే స్థిరపడ్డాడు. భార్య సరిత, ఇద్దరు పిల్లలతో పాటు దివ్యాంగుడైన తమ్ముడు ఐలేశ్ను తన వద్దే ఉంచుకు ని పోషిస్తున్నా డు. లింగానికి కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఐదు నెలల క్రితం ఒక కిడ్నీ మార్పిడి చేయించుకున్నా ఆరోగ్యం మెరు గుపడకపోవడంతో శుక్రవారం రా త్రి మృతి చెందా డు. లింగం మృతదేహన్ని కుటుంబీకులు స్వగ్రా మానికి తీసుకువచ్చారు. అన్న అంత్య క్రియలకు ఐలేశ్ను అదే రాత్రి బంధువులు కారులో తీసుకువస్తున్న క్రమంలోనే అన్న మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మృతి చెందాడు.
సోదరుడి మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడు మృతి
Comments
Please login to add a commentAdd a comment