ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం

Published Mon, Oct 28 2024 8:47 AM | Last Updated on Mon, Oct 28 2024 8:47 AM

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం

తుర్కయంజాల్‌: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని టీయూఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కందాల బల్‌దేవ్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఫోరం జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర కీలకమైందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలే దని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్లు, ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నెలాఖరులోగా నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నరేందర్‌, దక్షిణ తెలంగాణ అధ్యక్షురాలు శ్యామల, బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగయ్య గౌడ్‌, నాయకులు వీరస్వామి గౌడ్‌, దాసుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీయూఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బల్‌దేవ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement