దేశభక్తిని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

దేశభక్తిని పెంపొందించాలి

Published Mon, Oct 28 2024 8:46 AM | Last Updated on Mon, Oct 28 2024 8:46 AM

దేశభక్తిని పెంపొందించాలి

దేశభక్తిని పెంపొందించాలి

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

ముషీరాబాద్‌: విద్యార్థులు, యువతలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ఆదివారం ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో భారత వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు దేశభక్తి బృందగానం పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై చిన్ననాటి నుంచే పిల్లల్లో బీజం వేయాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు యువతలో జాతీయ భావజాలం, దేశభక్తి, క్రమ శిక్షణ పెంపొందించేందుకు భారత్‌ వికాస్‌ పరిషత్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశభక్తి పాటల పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు డిసెంబర్‌ 15న బెంగళూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. భారత్‌ వికాస్‌ పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సతీష్‌గౌడ్‌, నాగరాజులు మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశ భక్తి బృందగాన పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజే శారు. కార్యక్రమంలో భారత వికాస్‌ పరిషత్‌ సౌత్‌ రీజినల్‌ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శాస్త్రి, సంయుక్త కార్యదర్శి నరేంద్రకృష్ణ, నాగేందర్‌, విష్ణువర్థన్‌రెడ్డి, రాజాలింగం, అంబిక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement