ఆమనగల్లు: పీసీసీ అధ్యక్షుడు ఎనుమల రేవంత్రెడ్డిని కాంగ్రెస్ కల్వకుర్తి అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా వేడుకల సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని తన నివాసానికి రెవంత్ వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డిని కసిరెడ్డితో పాటు స్థానిక నాయకులు సంజీవ్యాదవ్, సురేందర్రెడ్డి, ఆనంద్కుమార్ తదితరులు కలిశారు.
యువకుడికి సన్మానం
ఆమనగల్లు: ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన యువకుడిని ఘనంగా సత్కరించారు. మున్సిపాలిటీ పరిధి సంకటోనిపల్లి గ్రామానికి చెందిన ఏకుల అంజయ్య, నర్సమ్మల కుమారుడు ప్రేమ్కుమార్ పోలీసు ఉద్యోగానికిఎంపికైన సందర్భంగా మంగళవారం ఆయన్ను, ఆయన తల్లిదండ్రులను కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమటం రాధమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇందులో నాయకులు వెంకటయ్య, ధనుంజయ, అనంతం, యాదగిరి, రవీందర్, జైపాల్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు బాల్రాజ్, మహేశ్, యాదగిరి, నిరంజన్, మల్లేశ్, వంశీ, సుధీర్, శ్రీశైలం, నరేశ్, రాజు, మల్లేశ్, శ్రీకాంత్, శ్రీదర్ ఉన్నారు.
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్: ఇద్దరు వేర్వేరు ప్రయాణికులు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం రస్అల్ఖైమా నుంచి వచ్చి ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా 483 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దాని విలువ రూ.29.48 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. దుబాయ్ నుంచి మరో ప్రయాణికుడి లగేజీలో 610 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.32 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ శాంతి, మానవత్వం, సమానత్వాలను ఆకాంక్షిస్తూ ప్రముఖ రచయిత, గిన్నిస్ రికార్డ్ విజేత వంగీపురం శ్రీనాథాచారి రచించిన ‘యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డిఐజీ బి.సుమతి మాట్లాడుతూ విశ్వవ్యాప్త థృక్పథంతో ఈ రచన సాగిందంటూ రచయితను ప్రశంసించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్లైన్లో ఈ బుక్గా అందుబాటులో ఉన్న ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా పేర్కొన్నారు. దీని ఖరీదు రూ.5 కోట్లుగా నిర్ణయించామని, ఈ పుస్తకాన్ని ఐక్యరాజ్యసమితికి అంకితమిస్తూ.. పుస్తకంపై వచ్చే ఆదాయంలో 50శాతం అందిస్తున్నామన్నారు. అదే విధంగా సేవా కార్యక్రమాలకు తోడ్పాటుగా భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు 25శాతం చొప్పున అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినీ రచయిత జేకే భారవి, భిన్న రంగాల ప్రముఖులు పుస్తక ప్రియులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment