ఉదయం
మరుసటిరోజు ప్రతాప్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ కండువాతో కావలి దశరథ
కొందుర్గు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు తమ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదనో, మరే ఇతర కారణంతోనో మరోపార్టీకి వలస వెళ్లడం సర్వ సాధారణమే. అయితే కొందుర్గు మండలంలో నాయకుల తీరు దీనికి భిన్నంగా ఉంది. ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో మండల కేంద్రంలో కిందిస్థాయి నాయకులను తమపార్టీలో చేర్పించుకునేందుకు ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు పోటీపడుతున్నారు. ఎవరైన చిన్నస్థాయి నాయకులు ఏదైన పార్టీలో చేరితే.. మరోపార్టీ నాయకులు వారిని బుజ్జగింజడం లేదా బెదిరించడం వంటివి చేసి తిరిగి తమ పార్టీలో చేర్పిస్తున్నారు. ఇలా గ్రామీణ స్థాయి నాయకుల పరిస్థితి రాత్రికో పార్టీ కండువా వేసుకుంటే.. మరునాడు మరో పార్టీ కండువా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రాత్రికోపార్టీ..పొద్దునమరో పార్టీ మారుతున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment