పథకాలను ప్రజలకు వివరించండి | Sakshi
Sakshi News home page

పథకాలను ప్రజలకు వివరించండి

Published Tue, May 7 2024 6:25 PM

-

చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వే యించాలని మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో మండల పరిధిలోని గ్రామాల, పట్టణ పరిధిలోని వార్డుల వారీగా బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు చిరంజీవులు, నాయకులు, కిష్టయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement