చేర్యాల(సిద్దిపేట): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు గడిచినా విద్యార్థుల బతుకులు మారడంలేదన్నారు. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రాజు, భాను, రోహిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment