ఆదాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం | Sakshi
Sakshi News home page

ఆదాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

Published Tue, May 7 2024 5:10 AM

ఆదాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

నెల్లూరు సిటీ: ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. రూరల్‌ నియోజకవర్గంలోని మూలుమూడి గ్రామం ఎస్సీ, బీసీ కాలనీల్లో టీడీపీకి చెందిన వారు సోమవారం ఆదాల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో ఉన్న క్యాంపు కార్యాలయంలో వారికి ఆదాల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, వేమిరెడ్డి అరవింద్‌కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి ధీరజ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమ్‌, బీసీ కాలనీకి చెందిన బండి శ్రీహరి తమ బృందంతో చేరారు. కార్యక్రమంలో నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, వేమిరెడ్డి హరిశివారెడ్డి, వేమిరెడ్డి హరికృష్ణారెడ్డి, స్వర్ణా వెంకయ్య, పాలకీర్తి రవికుమార్‌, జిమ్‌ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement