ఈఎంఆర్‌ఎస్‌లో ఇంటర్‌లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

ఈఎంఆర్‌ఎస్‌లో ఇంటర్‌లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

Published Thu, May 9 2024 4:35 AM

-

కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరాఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ టి.విష్ణుప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో బాలురకు 4, బైపీసీలో బాలురకు 11, హెచ్‌ఈపీలో బాలురకు 10, బాలికలకు 25 సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యానాది, ఎరుకుల, నక్కల, సుగాలి తదితర గిరిజన కులాలకు చెందిన విద్యార్థులే అర్హులన్నారు. పదో తరగతి సీబీఎస్‌ఈ, స్టేట్‌ బోర్డు సిలబస్‌లో చదివి ఉండాలన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, దివ్యాంగులకు మొత్తం సీట్లలో 10 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని తెలిపారు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 90101 75322, 94909 57261 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement