టీడీపీ నేత ‘పల్లె’ కళాశాల బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ‘పల్లె’ కళాశాల బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం

Published Sun, Mar 24 2024 1:05 AM | Last Updated on Sun, Mar 24 2024 7:15 AM

- - Sakshi

బుక్కరాయసముద్రం: టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి కళాశాలకు చెందిన బస్సు ఢీకొని ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని రోటరీపురం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్‌ జిల్లా పెద్ద ముడియం మండలం బలపన గూడూర్‌ గ్రామానికి చెందిన ఏశోబు (34), బండెన్న (41)లు నిరుపేదలు. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కూలి నిమిత్తం రెండు రోజుల క్రితం బైకులో అనంతపురం వచ్చారు. పనులు పూర్తి కావడంతో శనివారం స్వగ్రామానికి బయలుదేరారు.

రోటరీపురం గ్రామ సమీపంలో వెళ్తుండగా, పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాల బస్సు ఎదురుగా వేగంగా దూసుకొచ్చి వీరి బైకును ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన ఏశోబు, బండెన్న ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. రోటరీపురం సమీపంలో రహదారి పనులు జరుగుతున్నా లెక్కచేయక నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏశోబుకు భార్య, ఇద్దరు కుమారులు, బండెన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement