కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీసు డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు పదిహేను వినతులు వచ్చాయి. శుక్రవారం ఉద యం 11.30 నిమిషాలకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు విచ్చేసి సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ వేదికలో పదిహేను ఫిర్యాదులు రాగా అందులో 5 భూతగాదాల పైన, 2 ఆస్తి సంబంధాలపైన, 1 శారీరక నేరాలపై, 1 పరిపాలనకు సంబంధించి, పాత ఫిర్యాదులపై 1, ఇతరితర అంశాలతో 5 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజలు శ్రీకాకుళం వరకు రాకుండా ఇక్కడ గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment