నకిలీ అధికారుల కేసు దర్యాప్తు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

నకిలీ అధికారుల కేసు దర్యాప్తు వేగవంతం

Published Tue, Aug 27 2024 12:36 AM | Last Updated on Tue, Aug 27 2024 12:36 AM

-

శ్రీకాకుళం క్రైమ్‌ :

జీఎస్టీ అధికారులమని చెప్పి ముగ్గురు మీడియా ప్రతినిధులు స్వీట్ల వ్యాపారిని బెదిరించి రూ. 2 లక్షలు తీసుకుని మోసగించడమే కాకుండా కులం పేరుతో దూషించిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో రెండో పట్టణ పోలీసులే కాక జీఎస్టీ అధికారులు సైతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాకేంద్రంలో ప్రస్తుతం ఈ కేసు హాట్‌టాపిక్‌గా మారింది. దళిత వ్యక్తిని బెదిరించిన నేపథ్యంలో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు కావడంతో ఈ కేసును కాశీబుగ్గ డీఎస్పీ పాత్రుని శ్రీనివాసరావుకు దర్యాప్తు బాధ్యతలు ఎస్పీ అప్పగించారు. శ్రీకాకుళం నూతన డీఎస్పీ ఇంకా బాధ్యతలు స్వీకరించకపోవడంతో కాశీబుగ్గ డీఎస్పీకి కేసు అప్పగించారు.

మీడియా అనే గౌరవంతో..

మీడియా అనే గౌరవంతో ఫిర్యాదు అందిన నాలు గు రోజులైనా కేసు నమోదు చేయకుండా తీసుకున్న డబ్బులు బాధితునికి ఇచ్చేయమని పోలీసులు ఆ ముగ్గురికీ చెప్పారు. రాజీ చేసేందుకు ప్రయత్నించగా విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి బాధితుడు ఎస్పీని ఆశ్రయిస్తాననడంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రోజే విషయం జిల్లా జీఎస్టీ అధికారిణి రాణీ మోహన్‌ దృష్టికి వెళ్లడంతో శాఖాపరంగా విచారణ జరిపించారు. వ్యాపారి రాయపురెడ్డి చంద్రశేఖర్‌ని పిలిపించి అతను చెప్పిన వివరాలను నివేదిక రూపంలో జీఎస్టీ కమిషనర్‌కు అందించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement