ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

Published Tue, Aug 27 2024 12:36 AM | Last Updated on Tue, Aug 27 2024 12:36 AM

-

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ సమీప నాగావళి కొత్త వంతెనపై ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ ఎస్‌ఐ వరదరాజులు తెలిపిన వివరాల మేరకు.. రణస్థలం మండలం దేరసాం గ్రామానికి చెందిన కడగళ్ల నారన్నాయుడు తన మేనకోడలు బొంతు యశోద ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీలో చదువుతుండటంతో క్యాంపస్‌కెళ్లి అనుమతిపై బయటకు తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఉన్న తన బావగారింటికి యశోదను చేర్చేందుకు శ్రీకాకు ళం ఆర్టీసీ కాంప్లెక్సులో బస్‌ ఎక్కించేందుకు బయల్దేరారు. కొత్త బ్రిడ్జికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టి తక్షణమే పరారయ్యాడు. రోడ్డుపై పడి ఉన్న ఇద్దరినీ మనోహర్‌ అనే వ్యక్తి 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నారన్నాయుడుకు కాలు ఫ్రాక్చర్‌ కావడంతో పాటు చేతి వేళ్లకు తీవ్రగాయాలు కాగా, యశోదకు కంటి కింద, కుడి కాలికి గాయాలయ్యా యి. దీనిపై సీసీటీవీ ఫుటేజీలో ప్రమాద దృశ్యాలు పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement