అమర జవాన్‌ స్థూపం నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

అమర జవాన్‌ స్థూపం నిర్మించాలి

Published Mon, Aug 26 2024 10:22 AM | Last Updated on Mon, Aug 26 2024 10:22 AM

-

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అమర జవాన్‌ స్థూపం ఏర్పాటు చేయాలని జిల్లా మాజీ సైనిక సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దరెల్లివీధిలోని తమ కమ్యూనిటీ హాల్‌ లో మాజీ సైనికులు, వీరనారులు, కటుంబ సభ్యులతో ఆది వారం ఏర్పాటుచేసిన సమావేశంలో పూర్ణచంద్రరావుతోపాటు శ్రీకాకుళం జిల్లా చైర్మన్‌ కెప్టెన్‌ పి.ఈశ్వరరావు(రిటైర్డ్‌), ఎల్‌.ఎల్‌.రావు, వి.సూర్యనారాయణ, ఎస్‌.రామకృష్ణ, తదితరులు మాట్లాడారు. మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇటీవల వీర మరణం పొందిన జిల్లా సైనికులను స్మరించుకుంటూ కొద్ది సేపు మౌనం పాటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మాజీ సైనికుల కవాతులో మన జిల్లా నుంచి పాల్గొన్న హవాల్దార్‌ ఇ.రాజారావు(రిటైర్డ్‌)ను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సమాఖ్య ట్రెజరర్‌ ఎమ్‌.సింహాచలం, జి.అమ్మన్నమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement