జాబ్‌మేళాలో 61 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాలో 61 మంది ఎంపిక

Published Sat, Aug 24 2024 1:06 PM | Last Updated on Sat, Aug 24 2024 1:06 PM

జాబ్‌మేళాలో 61 మంది ఎంపిక

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 61 మంది ఎంపికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ గ్యారేజ్‌ వెనుక నెహ్రూ యువకేంద్రం ప్రాంగణంలో ఐఐఎఫ్‌ఎల్‌ సమస్త ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థలో వివిధ స్థాయిల ఉద్యోగాల భర్తీకిగాను జరిగిన ఈ జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 113 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. వీరికి వివిధ మౌఖిక పరీక్షల అనంతరం 61 మందిని ఎంపిక చేశారు. ఎంపికై నవారికి ఆ సంస్థ హెచ్‌ఆర్‌లు నాగేశ్వరరావు, రామకృష్ణన్‌రాజు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌కుమార్‌, ఎన్‌వైకే సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement