కొడైకానల్‌లో వ్యాన్‌ బోల్తా | Sakshi
Sakshi News home page

కొడైకానల్‌లో వ్యాన్‌ బోల్తా

Published Fri, May 10 2024 6:25 PM

-

● ఏడుగురికి గాయాలు

తిరువొత్తియూరు: కొడైకానల్‌ పర్యటన ముగించుకుని పళణికి వెళుతున్న సమయంలో వ్యాన్‌ బోల్తాపడి ఏడుగురు పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యా యి. వివరాలు.. చిదంబరం సమీపంలో ఉన్న సేతి యా తోపు ఈ ప్రాంతానికి చెందిన 18 మంది ఒక వ్యాన్‌లో కొడైకానల్‌ పర్యటనకు వెళ్లారు. తర్వాత పళణి మురుగన్‌ ఆలయానికి వెళ్లడానికి వ్యాన్‌లో బయలుదేరారు. మార్గం మధ్యలోని వట్టుమలై అనే ప్రాంతంలో వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్‌ నడుపుతున్న చంద్రమోహన్‌ (44), కోదండ రామన్‌ (56), రేణుక (45), గాంధీమతి (50) సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పళణి ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement