![Music band live music](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/22_2.jpg.webp?itok=GOUCxOFn)
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి..మొదటిసారి తన సొంత మ్యూజిక్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్తో నగరవాసులను సంగీతసాగరంలో ముంచెత్తనున్నారు. ఈ నెల 12న నగరంలోని ఓడియం ప్రిజమ్ వేదికగా నిర్వహిస్తున్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్లో ఆమె స్వరాలతో అలరించనున్నారు.
ఈ నేపథ్యంలో సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ., సంగీత ప్రియులను సంతృప్తి పరచడానికి వారికి అత్యంత ఇష్టమైన పాటల లిస్ట్ను తయారు చేసుకుంటున్నానని తెలిపారు. ఎస్వీఎమ్ గ్రాండ్, వేదమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్లో పాడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని గీతా మాధురి పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, బుక్ మైషోలో దీనికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment