సం‘గీతా’ మాధుర్యం.. | Music band live music | Sakshi
Sakshi News home page

సం‘గీతా’ మాధుర్యం..

Published Thu, Jul 4 2024 11:54 AM | Last Updated on Thu, Jul 4 2024 11:54 AM

Music band live music

ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ గీతా మాధురి..మొదటిసారి తన సొంత మ్యూజిక్‌ బ్యాండ్‌ లైవ్‌ మ్యూజిక్‌తో నగరవాసులను సంగీతసాగరంలో ముంచెత్తనున్నారు. ఈ నెల 12న నగరంలోని ఓడియం ప్రిజమ్‌ వేదికగా నిర్వహిస్తున్న లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో ఆమె స్వరాలతో అలరించనున్నారు.

 ఈ నేపథ్యంలో సింగర్‌ గీతా మాధురి మాట్లాడుతూ., సంగీత ప్రియులను సంతృప్తి పరచడానికి వారికి అత్యంత ఇష్టమైన పాటల లిస్ట్‌ను తయారు చేసుకుంటున్నానని తెలిపారు. ఎస్‌వీఎమ్‌ గ్రాండ్, వేదమ్‌ ఆర్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మ్యూజిక్‌ లైవ్‌ కన్సర్ట్‌లో పాడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని గీతా మాధురి పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, బుక్‌ మైషోలో దీనికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement