తాండూరు టౌన్: పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచాలనే ఉద్దేశ్యంతో పాత తాండూరులో బస్తీ దవాఖాన, ఇందిరానగర్లో అర్బన్ పీహెచ్సీ ఏర్పాటు చేశారు. బస్తీ దవాఖానలో వైద్యుడు లేకపోవడంతో డిప్యూటేషన్పై డాక్టర్లు వస్తున్నారు. నిత్యం 150మంది వరకు రోగులు వస్తుంటారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల అనంతరం డాక్టర్లు రాసే మందులు లభించడం లేదు. ఫార్మసిస్ట్ ఉండరు, స్టాక్ అందుబాటులో ఉండదు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్కు ఫార్మసిస్ట్ బాధ్యతలు అప్పగించారు. సరైన వెద్యం అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం కోసం వచ్చిన ప్రజలు
ఫీవర్ బాధితులే ఎక్కువ
వర్షాలు ఎక్కువగా కురియడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్తో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్పై వచ్చాను. అందుబాటులో ఉన్న మందులు, ఇంజక్షన్లు రోగులకు ఇస్తున్నాం. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
– డాక్టర్ అక్షయ్, బస్తీ దవాఖాన, పాతతాండూరు
శాశ్వత వైద్యుడు లేడు
కొన్ని నెలలుగా ఇక్కడ శాశ్వత వైద్యుడు లేడు. ఎవరో ఒకరు వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో మందులు, ఇంజక్షన్లు లేవు. అక్కడ అందుబాటులో ఉన్న నాలుగైదు రకాల గోళీలనే అందరికీ ఇస్తున్నారు. అధికారులు స్పందించి మందులు అందుబాటులో ఉండేలా చూడాలి.
– అబ్దుల్ నయీమ్, పాత తాండూరు
Comments
Please login to add a commentAdd a comment