కొడంగల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 300 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా సీజనల్ వ్యాధులతో ఓపీ పెరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రప్రియ తెలిపారు. వైద్యులు, సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటున్నారని దగ్గు, జ్వరం, కడుపునొప్పి, జలుబు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రిలో చిన్న పిల్లల డాక్టర్ జయదీప్రెడ్డి, అనస్తీషియా డాక్టర్ సాకేత్, డాక్టర్లు మైమూనా, పూజ, శ్రావణి, శివ తదితరులు ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజిస్టు లేనందున సిజేరియన్లు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment