పరిగి: పట్టణ కేంద్రంలోని సీహెచ్సీ ఆస్పత్రిలో రోగులకు సరిపడా మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో మొత్తం 48 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా పది మంది డాక్టర్లు, 16 మంది నర్సులు, ఐదుగురు కార్యాలయ సిబ్బంది, 17 మంది పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ప్రతీ రోజు 500 మంది వరకు ఓపీ వస్తున్నారు. తమకు సరైన వైద్యం అందడం లేదని పలువురు రోగులు ఆరోపించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ఎక్కువ శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారని పులువురు వెల్లడిస్తున్నారు. కనీసం తాగునీటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు వస్తున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment