భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

భారీగా చేరికలు

Published Thu, May 9 2024 4:00 AM

భారీగా చేరికలు

రాజాం: పట్టణ పరిధిలోని పలు వార్డుల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మున్సిపాలిటీ పరిధి మల్లయ్యపేటకు చెందిన 100 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోగా.. వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జగన్‌ మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కెల్ల సతీష్‌, యందవ చిన్నబాబు, సింబాల రాము, అల్లెన జయలక్ష్మి, యందవ సుశీల తదితరులు ఉన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధి గాయత్రీకాలనీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే తలే రాజేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement