దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడ రోడ్డు పూర్తయితే మా కష్టాలు తీరుతాయి. నిత్యావసర కొనుగోలుకు గాని, ఇతర ఏ అవసరాలకు మైదాన ప్రాంతానికి రావడానికి గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇకమై ఆ కష్టాలుండవు. రోడ్డు ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– జన్ని సీతయ్య,
పల్లపుదుంగాడ, ఎస్.కోట మండలం
గిరిజనుల కష్టాలు గుర్తించారు..
ఎస్.కోట ఎమ్మెల్యే నడుచుకుంటూ కొండమీదికొచ్చి మా ఇబ్బందులను గుర్తించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అటవీశాఖ అనుమతులు లేవని ఇబ్బంది పెడితే ప్రభుత్వంలో మాట్లాడి అనుమతులు సాధించారు. రోడ్డు పూర్తయితే గిరిసీమలు అభివృద్ధి చెందుతాయి.
– జరతా గౌరీష్, ఏపీ గిరిజన సంఘ డివిజన్ బాధ్యుడు, దారపర్తి గ్రామం, ఎస్.కోట మండలం