● మాజీ ఎంపీ బెల్లాన
గుర్ల: టీడీపీ నాయకులు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. గుర్లలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని శనివారం సందర్శించారు. రోగులకు పాఠశాల బెంచీలపై చికిత్స అందించడంపై ఆందోళన వ్యక్తంచేశారు. నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతిచెందినా టీడీపీ నాయకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
● ఆధునిక యుగంలో డయేరియా
మరణాలా?
● మృతులకు 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
విజయనగరం: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ ఆధునిక యుగంలో కూడా డయేరియా మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ శీర రమేష్ అన్నారు. వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో ఇటువంటి మరణాలకు టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. గుర్ల గ్రామంలోని డయేరియా బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వానికి మద్యం పాలసీపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ పైల రమేష్రాజు మాట్లాడుతూ డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణమని, మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శనపతి ఈశ్వరరావు, తిప్పాన కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నేడు కేజీబీవీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరం అర్బన్: కేజీబీవీల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ దాసన్నపేట రైతు బజార్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం జరగనుందని డీఈఓ, సమగ్ర శిక్ష ఎక్స్ అఫీషియల్ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎన్.ప్రేమకుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ (అకౌంటెంట్ వార్డెన్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, జిరాక్స్లు, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం జిరాక్స్ కాపీలతో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment