● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
కేయూ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది.. అందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు పాల్గొనేలా ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ మైదానంలో రెండోరోజు ఆదివారం నిర్వహించిన కేయూ అంతర్ కళాశాలల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేయూ విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగడానికి తనవంతు సహకారం అందిస్తానని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి ఇస్తే వీసీతో మాట్లాడతానని చెప్పారు. అనంతరం బాల్బ్యాడ్మింటన్లో ప్రథమ వాగ్దేవి, ద్వితీయ సీకేఎం, ఖోఖో ప్రథమ కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, రన్నరప్ కేడీసీ, సాఫ్ట్బాల్ విన్నర్ ఆర్ట్స్ కళాశాల, రన్నరప్ వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నిలవగా విజేత జట్లకు ముఖ్యఅతిథి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, స్పొర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లా రమేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈనెల 21తో ఈ క్రీడాపోటీలు ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment