● సెప్టెంబర్ 22న మామునూరు సమీపాన రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో చెన్నారానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ విలాసాగరం రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో బలమైన గాయాలై దుర్మరణం చెందాడు.
● వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగా ద్విచక్ర వాహనదారులు మృత్యువాత
పడుతున్నారు.
● ఇటీవల సింగారం గ్రామానికి చెందిన ఆకులపల్లి అఖిల్(20) ఖమ్మం జాతీయ రహదారి సింగారం క్రాస్ రోడ్డు నుంచి మామునూరు వైపు బైక్పై బయల్దేరాడు. మామునూరు చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. అఖిల్కు హెల్మెట్ లేకపోడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment