నేడు సూర్యాపేటలో గవర్నర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు సూర్యాపేటలో గవర్నర్‌ పర్యటన

Published Thu, Oct 24 2024 1:51 AM | Last Updated on Thu, Oct 24 2024 1:51 AM

నేడు సూర్యాపేటలో గవర్నర్‌ పర్యటన

నేడు సూర్యాపేటలో గవర్నర్‌ పర్యటన

భానుపురి (సూర్యాపేట): రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గురువారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. మూడ్రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి సూర్యాపేటకు చేరుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్‌కు చేరుకుని 11.30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం అనంతరం, ఆయా శాఖలపై సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లాలోని ప్రముఖ కవులు, రచయితలు, అవార్డు గ్రహీతలు 25 మందితో సమావేశం కానున్నారు. గవర్నర్‌ సమావేశం కానున్న 25 మందిలో జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలు, కవులు, కళాకారులు ఉండేలా జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేసినట్లు తెలిసింది. వారితో వారి వృత్తి, జీవన విధానం, తదితర అంశాలపై గవర్నర్‌ మాట్లాడుతారని సమాచారం. మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు మధ్యాహ్న భోజనం చేసి భద్రాచలం బయలుదేరనున్నారు. సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో మొదటిసారి గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా అధికారులంతా తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఇప్పటికే ఆదేశించారు.

ఫ కలెక్టరేట్‌ను సందర్శించనున్న జిష్ణుదేవ్‌ వర్మ

ఫ అధికారులతో సమీక్ష.. కవులు, అవార్డు గ్రహీతలతో సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement