NIA team
-
ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు -
ముంబై ఉగ్రదాడి: తహవ్వుర్ హుస్సేన్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.వివరాల ప్రకారం.. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. -
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్ను విడుదల చేసింది. -
సరైన న్యాయం!
పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్సుఖ్నగర్లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్ భత్కల్ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్ భత్కల్ భారీయెత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే తీర్పు
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. ఈ శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఫిబ్రవరి 21న నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుకోగలిగారు. ఢిల్లీ(2008), దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్ను కిగాలీ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
ఎన్ఐఏతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దాడి, విగ్రహ ధ్వంసంపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు విభాగానికి (ఎన్ఐఏ) అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, డీజీపీ జితేందర్కు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలోని ఓ హోటల్లో దేశ వ్యతిరేక శక్తులు, దాడులకు పాల్పడిన వారు నెలల తరబడి జరిపిన అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకోవాలని గవర్నర్ను కోరారు. రాష్ట్రంలో మూడునెలలుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. సోమవారం ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్కు, డీజీపీ కార్యాలయంలో వేర్వేరుగా ఎంపీలు ఈటల రాజేందర్,ఎం.రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్బాబు, రాకేష్రెడ్డి, నేతలు జి.ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ తదితరులు వినతిపత్రాలు సమరి్పంచిన వారిలో ఉన్నారు. హిందువులపై కేసులు పెడుతున్నారు : ఈటల రాజ్భవన్ వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హిందువులపైనే కేసులు పెడుతున్నారు..ఆత్మగౌరవాన్ని కించపరిస్తే క్షమించేది లేదు అని సీఎంను హెచ్చరించారు. ‘హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ను కోరాం’ అని ఈటల తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగినా సీఎం ఖండించలేదు : ఏలేటి ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంతవరకు ఖండించలేదన్నారు. ‘నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోంది? నగరంలో దాడులకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దేవాలయాల మీద దాడి.. మా తల్లి మీద దాడిలా భావిస్తాం.. తిప్పికొడతా’ అని మహేశ్వర్రెడ్డి హెచ్చరించారు. స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా : రఘునందన్రావు డీజీపీ కార్యాలయం వద్ద ఎంపీ రఘునందన్రావు మీడియాతో మాట్లాడుతూ ‘ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్పై పూర్తిస్థాయి విచారణ జరగాలి. సంఘ విద్రోహశక్తులు, స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్నది పరిశీలించాలి. ముత్యాలమ్మ టెంపుల్కు సమీపంలో స్లీపర్ సెల్స్కు శిక్షణ ఇచ్చారా? రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో 15 గుడులపై దాడుల వెనుక కుట్రకోణంపై విచారణ జరపాలి’ అని రఘునందన్ డిమాండ్ చేశారు. -
భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్గా మారే చోట బోల్ట్నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం
న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.లారెన్స్ బిష్ణోయ్కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్వర్క్ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.బిష్ణోయ్ గ్యాంగ్లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్కు చెందినవారని ఎన్ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లకు కమాండ్గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్లోని మాల్వా, మీరట్, ముజఫర్నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇది కూడా చదవండి: సల్మాన్కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ, అస్సాం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా, గత నెలలో చైన్నెతో పాటు రాష్ట్రంలో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సెల్ఫోన్లను, లెక్కలోకి రాని నగదును సీజ్ చేశారు. ఇస్ బత్ తహీర్ పేరిట ఉన్న నిషేధిత తీవ్ర వాద సంస్థకు తమిళనాట యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్టు ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ సంస్థకు మద్దతుగా సాగుతూ వస్తున్న వీడియో ప్రచారాలు, వాటికి లైక్లు కొట్టే వారిని టార్గెట్ చేస్తూ తరచూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి,మైలాడుతురై జిల్లాలో విస్తృతంగా సోదాలు జరిగాయి.ఇదీ చదవండి: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
బెంగళూరులో కుక్కర్ పేలుడు.. రంగంలోకి ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది. బెంగళూరులోని జేపీ నగర్లోని ఉడిపి ఉపహారా ఫుడ్షాప్లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. -
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్కు లోక్సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ను కోల్కతాలో అరెస్టు చేశారు. -
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్కతాలో మూడు హోటల్స్లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్కు తీసుకెళ్లారు. ఫోన్ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఎన్ఐఏ’పై దాడి.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
కలకత్తా: పశ్చిమబెంగాల్లో వేసవితో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందంపై తూర్పు మిడ్నపూర్లో స్థానికులు దాడి చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 7)న జల్పాయ్గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్ఏఐ బృందంపై దాడి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పనేనని ఆరోపించారు. తృణమూల్ నేతలకు రాజ్యాంగం, శాంతిభద్రతలు ఏవీ పట్టవని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్వయానా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఎన్ఐఏ ఉన్నతాధికారులను బీజేపీ నేతలు వెళ్లి కలిసిన తర్వాతే తమ పార్టీ నేతలకు బాంబు పేలుడు కేసులో నోటీసులు వచ్చాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అవసరమైతే బీజేపీ నేతలు ఎన్ఐఏ పోలీసు అధికారులను కలిసిన వీడియో కూడా విడుదల చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు ఎన్ఐతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్ఐఏ స్పందించింది. అభిషేక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఇదీ చదవండి.. తిరువనంతపురం ఫైట్.. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
ఎన్ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్ ఆగ్రహం
కోల్కతా : యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్వర్క్లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్వార్ ముప్పు -
Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో బీఎస్పీ నేత దారుణ హత్య -
హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్నగర్లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హర్యానాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్ షూటర్లు అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను విచారించేందుకు సోనిపట్ జిల్లాకి ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. VIDEO | NIA conducts raids in connection with #SidhuMooseWala murder case in Sonipat, Haryana. pic.twitter.com/ofm93XDhnI — Press Trust of India (@PTI_News) January 11, 2024 ఇదీ చదవండి: అశ్లీల కంటెంట్... యూట్యూబ్కు సమన్లు -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్పీ అలర్ట్ -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. 2021నాటి పేలుళ్లతో లింక్
ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం. పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు. రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్పై విపక్ష ఎంపీ మిమిక్రి -
పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. Nia Foils ISIS Ballari Module’s Plans to Trigger IED Blasts Arrests 8 Terror Operatives, including Module Head, in Raids Across 4 States, Seizes Explosive Raw Materials, Weapons, Documents Exposing Terror Plans, etc. pic.twitter.com/jluje0B91b — NIA India (@NIA_India) December 18, 2023 సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
టార్గెట్ ఐసిస్..44 చోట్ల ఎన్ఐఏ రెయిడ్స్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ లక్ష్యంగా కర్ణాటక,మహారాష్ట్రల్లో ఏకకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)రెయిడ్స్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 44 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మహారాష్ట్రలో 43 చోట్ల ఎన్ఐఏ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు ఐసిస్ కుట్ర పన్నిందని సమాచారం రావడంతోనే ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ రెయిడ్స్లో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే 13 మంది దాకా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్లోని అమృత్సర్లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలంగాణతో సహా దేశంలో 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. National Investigation Agency (NIA) is conducting raids across 10 states in connection with Human Trafficking cases. More details awaited. — ANI (@ANI) November 8, 2023 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్లో సోదాలు జరుగుతున్నాయి. Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case. — ANI (@ANI) November 8, 2023 మరోవైపు టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్లో ఎస్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. #WATCH | J&K: State Investigation Agency (SIA) is conducting raids at several places in the Anantnag & Pulwama districts of South Kashmir. The raids are being conducted in connection with a terror funding case. (Visuals from Panzgam village of Kokernag area in Anantnag district) pic.twitter.com/ZWbxDUwryy — ANI (@ANI) November 8, 2023 -
19 ఏళ్లకే గ్యాంగ్స్టర్గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్స్టర్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్పోర్ట్తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్స్టర్ యోగేష్ కాద్యాన్పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్లోని బాబిన్హా గ్యాంగ్లో చేరిన కాద్యాన్కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్స్టర్-టెర్రర్ నెట్వర్క్లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్పోర్ట్లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
రాష్ట్రంలో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, మద్దతుదారులు, పౌరహక్కుల నేతల నివాసాల్లో సోమవారం సోదాలు చేసింది. విప్లవ రచయితల సంఘం (విరసం), మానవహక్కుల సంఘం, రాష్ట్ర పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజాకళా మండలి, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ తదితర సంఘాల నేతల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణంలో 53 నివాసాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ఒక నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతోపాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కూటగల్లులోని రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్రనర్సింహులు ఇంట్లో నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కడపలోని ఒక ఇంట్లో రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఎన్ఐఏ అధికారులు గుంటూరు జిల్లాలో 13 ఇళ్లలోను, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నాలుగేసి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మూడేసి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, విజయనగరం, శ్రీసత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లో ఒక్కో ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2020లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ ఓ కేసు నమోదు చేసి 2021 మే నెలలో చార్్జషీట్ దాఖలు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
జిల్లాలో ఎన్ఐఏ తనిఖీలు
పొన్నూరు/తాడేపల్లి రూరల్/మంగళగిరి: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరుకు చెందిన ప్రజావైద్యశాల డాక్టర్ టి.రాజారావు పౌరహక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నారు. సుమారు ఐదు గంటలపాటు రాజారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. డాక్టర్ రాజారావు వద్ద లభించిన కరపత్రాలు, కమ్యూనిస్టు సంబంధిత పుస్తకాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివాసముంటున్న ప్రగతిశీల సమైఖ్య సభ్యుడు బత్తుల రామయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం డోలాస్నగర్లోని పలువురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మంగళగిరి నగర పరిధిలోని నవులూరు మక్కెవారిపేటలో నివాసం ఉంటున్న చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా నివాసంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక సెల్ఫోన్, విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన దేవభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమలపాకుల సుబ్బారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరిగారు. డాక్టర్ రాజారావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు, రాజకీయ పార్టీలతో సంబంధాలపై ఆరా తీశారని అన్నారు. -
వరంగల్పై ఎన్ఐఏ గురి! సోమవారం మళ్లీ దాడులు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యమాలకు కేరాఫ్ అయిన వరంగల్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురిపెట్టింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత విప్లవ రాజకీయాలకు అడ్డాగా మారిన ఈప్రాంతంలో కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. పౌరహక్కులు, ప్రజాసంఘాల కార్యకలాపాలు, నాయకుల కదలికలపై నిఘా పెట్టింది. ఈమేరకు ఎన్ఐఏ వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల తరచూ సోదాలు నిర్వహిస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైనట్లు సమాచారం ఉందని.. 152 మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత హరగోపాల్ సహా ఆరుగురిపై కేసులు ఎత్తివేయగా.. ప్రొఫెసర్ ఖాసీం సహా 146 మందిపై విచారణ జరుగుతోంది. గత సెప్టెంబర్లో విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు విషయంలో హనుమకొండ హంటర్రోడ్డులోని సముద్రాల అనిత ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కూడా వరంగల్లోని ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా సోమవారం హంటర్రోడ్డు, ప్రకాశ్రెడ్డిపేట, పైడిపల్లిలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించి సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఓ వైపు ‘ఉపా’.. మరోవైపు సోదాలు.. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాల వ్యూహంలో భాగంగా ఎన్ఐఏ నిఘా ముమ్మరం చేసింది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలపై ఓ వైపు కేసులు.. మరోవైపు ఇళ్లల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి సమీపంలో మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇతర మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ములుగు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువతను దళంలో చేర్చుకోవడం.. అధికారులు, అమాయక పౌరులను హత్య చేయడం, నిధుల సేకరణ వంటి లక్ష్యాలతో ఈ సమావేశం జరగ్గా, పోలీసుల రాకతో వారంతా పారిపోయారు. ఈమేరకు పస్రా సీఐ ఫిర్యాదు మేరకు అక్కడ పంచనామా నిర్వహించి ఐపీసీ 120బీ, 147, 148 రెడ్ విత్ 149.. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)’లోని సెక్షన్లు 10, 13, 18, 20, 38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 (1–బీ)(ఎ)ల కింద తాడ్వాయి పోలీసులు 152 మందిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులు, సమావేశ స్థలం వద్ద లభించిన సాహిత్యంలో ఉన్న ఇతరుల పేర్లపై కేసులు నమోదు చేశారు. 2023 జూన్లో ఈ కేసు వెలుగు చూడగా.. ఈ కేసులో ప్రొఫెసర్ హరగోపా ల్, పద్మజా షా, రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్కుమార్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని కేసులు ఎత్తివేశారు. ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ నేత సంధ్య, విమలక్క సహా 146 మందిపై కేసు కొనసాగుతుంది. ఇదంతా సద్దు మణిగిన కొద్ది రోజులకే ఉమ్మడి జిల్లాలో ఎన్ఐఏ సోదాలు ఉధృతం చేయడం కలకలం రేపుతోంది. ‘కవర్ సంఘాల’ కట్టడి.. అనుమానంతో సోదాలు.. మావోయిస్టు పార్టీకి కవర్సంఘాలు పని చేస్తున్నాయంటూ పలు ప్రజాసంఘాల నాయకులపై తరచూ కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థి కొన్నేళ్ల క్రితం కిడ్నాప్ కాగా.. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై 2022న ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది. ఈకేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈక్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో చురుగ్గా పని చేసిన సముద్రాల అనిత, ఆమె తల్లిగారిళ్లలో గతేడాది సెప్టెంబర్లో సోదాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆమె ఇంట్లో మళ్లీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కొత్తకొండ శాంతమ్మ ఇంట్లోనూ ఈసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. పైడిపల్లిలోని ఆమె ఇంటిని ఉదయమే పోలీసులు చుట్టుముట్టగా.. తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇల్లంతా తనిఖీ చేశారు. ఇంట్లో ప్రజాకవి వరవరరావుపై ప్రొఫెసర్ కాశీం రాసిన ‘కాగితం మీద అక్షరానికి కమిటైన కవి వరవరరావు’, ‘జన హృదయం జనార్దన్.. అమరుడు సూరపనేని జనార్దన్’ తదితర పుస్తకాలు లభ్యమయ్యాయి. 2016 మార్చి 1న ఎన్కౌంటర్లో మృతిచెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను పరిశీలించిన అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా వరంగల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నున్పై ఎన్ఐఏ సంచలన నివేదిక..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కెనడా-భారత్ మధ్య ఖలిస్థానీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కెనడాలో ఉంటున్న హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్.. భారత్ను విజజింజే కుట్ర చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. దేశ విభజనకు బిగ్ ప్లాన్.. వివరాల ప్రకారం.. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు సంబంధించిన కొన్ని విషయాలను ఎన్ఐఏ వెల్లడించింది. ఇందులో భాగంగా అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు ఓ నివేదిక తెలిపింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతడు సవాల్ చేసినట్టు.. ఆడియో మెసేజ్ల ద్వారా అధికారులు గుర్తించారు. కశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని, వారి కోసం ఒక ముస్లిం దేశం సృష్టించాలని, దానికి ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అనే పేరు పెట్టాలని పన్నూన్ కుట్ర పట్టిన్నట్టు నివేదికలో వెల్లడించింది. Khalistani terrorist Pannun wants to divide India, create many countries: NIA report#NIA #KhalistaniTerrorist #GurpatwantSinghPannu pic.twitter.com/n66SETX3OS — Bnz English (@BnzEnglish) September 25, 2023 ఎన్ఐఏ సంచలన నివేదిక.. ఎన్ఐఏ రిపోర్టు ప్రకారం.. ఇండియా గేట్ వద్ద ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2.5 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమతిని ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీసు సిబ్బందికి అతను ఒక మిలియన్ అమెరికా డాలర్లను కూడా ఆఫర్ చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని ప్రముఖ ప్రదేశాలలో ఖలిస్తానీ పోస్టర్లు, జెండాలను అమర్చడానికి అతను చాలాసార్లు ప్రయత్నించాడని పేర్కొంది. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే భారత్ అతడికి స్ట్రాంగ్ కౌంటర్చింది. పన్నూన్ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. అనంతరం.. అమృత్సర్ జిల్లా ఖాన్కోట్లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. మరోవైపు అతనిపై పంజాబ్లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఇవి పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్లలో నమోదయ్యాయి. Gurpatwant Singh Pannu is nothing more than a Drama Queen! He is openly threatening Hindu diaspora of India residing in Canada in a new video & yet the Canadian govt is silent, how can one not rule out the fact that the Canadian govt is not hand in glove with this Terrorist! pic.twitter.com/pNzvWdKZPR — Racheal (@2004Racheal) September 25, 2023 ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్బై.. -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ(National Investigation Agency) ఇవాళ దాడులు చేసింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం.. ఈ దాడులు జరిగాయి. మావోయిస్టులకు అదునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా అవుతున్నాయనే అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై NIA కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
పక్కా ప్లాన్ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్కు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో దాఖలు చేసిందని వెల్లడించారు. కాగా, సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నంపై కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్ఐఏకి సిట్ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్పై కేసు నమోదైంది. శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్ఐఏకి రికార్డ్ చేయవద్దని సిట్కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. ఎయిర్పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?.. ఎయిర్పోర్టు అథారిటీకి శ్రీనివాస్ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్ది ఎయిర్పోర్టులో ఇల్లీగల్ ఎంట్రీ. కత్తితో ఎయిర్పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్పై కేసు ఉన్నందుకు ఎయిర్పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్పై కేసు పెండింగ్లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్ వేశారు. ప్లాన్ ప్రకారమే దాడి.. సీఎం జగన్పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
AP: హరగోపాల్ భార్య శిరీష అరెస్టు
సాక్షి, అమరావతి: కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్తో పాటు దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) భార్య కందుల శిరీష అలియాస్ పద్మక్కను కూడా అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ఛత్తీస్గఢ్లోని ట్రియ గ్రామంలో భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన దాడి కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించింది. దీనిని ఆర్కే డైరీ కేసుగా ఎన్ఐఏ పరిగణిస్తోంది. శిరీష, దుడ్డు ప్రభాకర్తో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. శిరీషను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆమె నివాసంలో, ప్రభాకర్ను విజయవాడలో ఆయన నివాసంలో ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి నిధులు పొందుతూ.. ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాల పటిష్టత కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు -
మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 2019లో తిరియా ఎన్కౌంటర్లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్లు పాల్గొన్నారని ఎన్ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్ఘడ్కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష -
ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష
టంగుటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. అనంతరం ఆమెను టంగుటూరు పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి, ఐదు నిమిషాలు అక్కడ ఉంచారు. అనంతరం సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై శ్రీరామ్, ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. ఈ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్ఘడ్కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఆ సమయంలో శిరీష వైద్యం నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విరసం నేత కళ్యాణరావును తీసుకొచ్చారు. శిరీష లేకుండా తలుపులు తీయడానికి ఆయన నిరాకరించడంతో తహసీల్దార్, వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టారు. శిరీష ఇంటి నుంచి సాధారణ షాపుల్లో దొరికే కొన్ని పుస్తకాలు, పలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్రమ అరెస్టు: కళ్యాణరావు శిరీషను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్లు తెలుసుకున్న విప్లవ రచయితల సంఘం నేత గంగుల కళ్యాణరావు హుటాహుటిన స్టేషన్కు వచ్చారు. కళ్యాణరావు, ఇతర బంధువులు ఎస్సై శ్రీరామ్తో మాట్లాడారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. శిరీషను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్ఐఏ బృందం తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లిందని, ఎక్కడ ఉంచారన్నదీ ఇప్పటివరకు తెలపకపోవడం దారుణమని చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాలని అన్నారు. శిరీషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శిరీషపై పెట్టినవన్నీ బూటకపు కేసులేనని అన్నారు. -
ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఇవేనా?
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది. ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లో ఐదుగురు, భోపాల్లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది. వీరి టార్గెట్లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్లో సినీ ఫక్కీలో అరెస్ట్
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ నేపాల్లో తలదాచుకున్న మావోయిస్టు నేత దినేష్ గోపే అరెస్ట్ అయ్యాడు. ఇక, అంతకుముందు గోపే ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. వివరాల ప్రకారం.. మావోయిస్టు నేత దినేష్ గోపే మారు వేషంతో నేపాల్లో తలదాచుకుంటున్నాడు. మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న గోపేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. కాగా, నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన దినేష్ గోపే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా నేపాల్లో దాబా నడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఆయన.. జార్ఖండ్లోని బీజేపీ నేతలకు ఫోన్ కాల్ చేయడంతో ఎన్ఐఏకు చిక్కాడు. అతడి ఫోన్కాల్ను ట్రేస్ చేసిన అధికారులు.. గోపే నేపాల్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు ఎంతో చాకచక్యంగా గోపేను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. గతేడాది జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భమ్లో గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్నగర్లో ధాబా నడుపుతున్నాడు. అయితే, నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు దినేష్ గోపే. కాగా, గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. Most wanted Naxal Commander Dinesh Gope was living in Delhi arrested in Joint op by NIA & JH Police. He is wanted by JH, Odisha, Bihar in 100+ cases & had ₹30L reward. Has 100's of pockets all around the borders of Delhi where u have Illegal Immigrants staying in millions. pic.twitter.com/F35UuJVs0R — Kavi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) May 22, 2023 ఇది కూడా చదవండి: 'మా స్టాండ్ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్ -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్కి మొదటి భార్య మైజాబిన్తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్పై ఎన్ని కేసులన్నాయంటే..) -
ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్స్టేషన్ పరిధి టేకల్ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్షీట్లో చేర్చింది. 2021 ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ కేసులో (ఆర్సీ–02/ 2021/ఎన్ఐఏ/ఆర్పీఆర్) 23మందిపైన చార్జ్షీట్ను దాఖలు చేశారు. సంచలనం కలిగించిన తారెం ఘటన పోలీస్ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్స్టేషన్ ఎఫ్ఐఆర్ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్ఐఏ ద్వారా 2022 జూన్ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులపై బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్)లు, ఆటోమేటిక్ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా జవాన్ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 21 నెలల విచారణ తర్వాత ఎన్ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్) సీనియర్ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్విత్/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, సుజాత అలియాస్ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్రావు భార్య), ఉమ్మడి వరంగల్కు చెందిన సాగర్ అలియాస్ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్ వికాస్, నిర్మల అలియాస్ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన పొడియం హిద్మా అలియాస్ హిడ్మన్న, మద్నా అలియాస్ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్ఐఏ ప్రధానంగా పేర్కొంది. -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్ప్రీత్ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన హర్ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
నార్కో టెర్రరిజం కేసులో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తేవడం, వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఉగ్రవాదం వ్యాప్తికి వాడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్తో సంబంధమున్న గ్యాంగ్స్టర్ల నివాసాల్లోనూ సోమవారం దాడులు కొనసాగాయి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులైన గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్పురియా ఇళ్లలో అధికారులు సోదా చేశారు. ఢిల్లీసహా 50 చోట్ల దాడులు చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారుల మధ్య ఏర్పడుతున్న కొత్త నెట్వర్క్ను విచ్ఛిన్నంచేశామని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పారు. దేశ, విదేశాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న గ్యాంగ్స్టర్లపై గత నెల 26లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ ముమ్మర సోదాలు జరిపింది. ఈ గ్యాంగ్స్టర్లలో కొందరు భారత్ నుంచి పారిపోయి కెనడా, పాకిస్తాన్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచే భారత్లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!
వేలూరు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్ కలకలం రేపింది. ఆంబూరు పట్టణానికి చెందిన అనార్ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అనార్ అలీ ఇంటిని చుట్టుముట్టారు. అతని వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని రహస్యంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు ఉసేన్ లస్కర్తో ఈ విద్యార్థి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదీ చదవండి: రాడికల్ శక్తులను కట్టడి చేయండి -
‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
బెంగళూరు: భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టార్ను పొట్టనబెట్టుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. దేశ వ్యతిరేకులు, మతతత్వ శక్తులను ఏరిపారేసేందుకు అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవీణ్ హంతకులను ఎన్కౌంటర్ చేయాలని కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ్ అన్నారు. ప్రవీణ్ను దక్షిణ కన్నడ జిల్లాలోని ఆయన సొంతూరులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్పై వెంబడించి దారుణ హత్య.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు ఈనెల 27న దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్ను బైక్పై వెంటాడి మరీ నరికి చంపారు. ఇదీ చదవండి: Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్.. బైక్పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు -
భారత్లోకి పాకిస్థాన్ ఆయుధాలు, డ్రగ్స్... వయా శ్రీలంక!
చెన్నై: శ్రీలంక నుంచి భారత్లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు తమిళనాడులో సోదాలు నిర్వహించింది జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ). ఈనెల 19వ తేదీన 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్కు చెందిన హాజీ సలీమ్ సహకారంతో.. సీ గునశేఖరన్, పుష్పరాజన్లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్ మాఫియా అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్, ఆయుధాల మాఫియా భారత్, శ్రీలంకల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లిబర టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)ని పునరుద్ధరించటం, హింసాత్మక కార్యక్రమాలను పెంచటమే వారి లక్ష్యమని తెలిపారు. చెన్నై, తిరుపుర్, చెంగళ్పట్టు, తిరుచిరపల్లి జిల్లాల్లోని పలువురు నిందితుల ఇళ్లు, పరిసరాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరాపై సుమోటోగా తీసుకున్న ఎన్ఐఏ జులై 8న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ సర్వీసెస్, నేరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. శ్రీలంక సైన్యం, ఎల్టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009, మేలో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ మద్దతు తెలిపింది. సామాన్య ప్రజలపై ఎల్టీటీఈ సాగించిన మారణకాండపై విచారం వ్యక్తం చేసింది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో ఆయుధాల సరఫరాపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి
అమరావతి(మహారాష్ట్ర): అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేశ్ కోల్హె హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్(35)కు కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శనివారం నాగపూర్లో అరెస్ట్ చేసిన ఇర్ఫాన్ఖాన్ను ఆదివారం ఎన్ఐఏ బృందం కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించింది. అనంతరం అతడిని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 7వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు ఉమేశ్ కోల్హెను దుండగులు జూన్ జూన్ 21వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ ఏడో నిందితుడు. అమరావతికి చెందిన ఉమేశ్కు వెటరినరీ మందుల దుకాణం ఉంది. ఈయన వెటరినరీ వైద్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. అందులో ఇర్ఫాన్ ఖాన్ సభ్యుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇర్ఫాన్ రాహ్బర్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్లో నుపుర్ శర్మకు అనుకూలంగా ఉమేశ్ పెట్టిన పోస్టుపై ఇర్ఫాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇతడే ఉమేశ్ హత్యకు పథకం వేసి, కొందరికి బాధ్యతలు అప్పగించాడు. వీరిలో నలుగురు ఇతడి స్వచ్ఛంద సంస్థకు చెందిన వారే. ఉమేశ్ హత్య అనంతరం అంత్యక్రియల్లో కూడా ఇర్ఫాన్ పాల్గొన్నాడు. కన్హయ్యాలాల్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఏకే ఈ కేసును కూడా అప్పగిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారంగా అందాల్సి ఉందని అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ చెప్పారు. దర్జీ హత్యపై భారీ నిరసన ర్యాలీ ఉదయ్పూర్లో కన్హయ్యాలాల్ అనే దర్జీ దారుణ హత్యకు నిరసనగా జైపూర్లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్పూర్లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
దావూద్ అనుచరుల ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు
ముంబై: ముంబైలో గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తోంది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది. బాంద్రా, నాగ్పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్లలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు, దేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి ఎన్ఐఏ ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై నిశీతంగా పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ఇప్పటికే ఎన్ఐఏ నిఘా పెట్టింది. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: ఉద్ధవ్కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్ -
నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం రాంజీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు
ఒంగోలు/టంగుటూరు/చీరాల/ఆరిలోవ (విశాఖ తూర్పు)/నెల్లూరు (క్రైమ్): రాష్ట్రంలో ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, మెదక్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసముంటున్న విరసం నేత కల్యాణ్రావు, వేటపాలెం మండలం జాండ్రపేటలోని మాచర్ల మోహన్రావు ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన పేరుతో హైదరాబాద్లో పుస్తకాన్ని ముద్రించేందుకు ఆయన సతీమణి ప్రయత్నించిన నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ను సైతం పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఆర్కేకు చెందిన డైరీ లభించినట్టు తెలిసింది. 2019 జూలై 28న చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. కల్యాణ్రావు ఇంట్లో రెండు సంచుల పుస్తకాలను సీజ్ చేశారు. ఆయనకు ఆర్థిక సహకారం ఏమైనా అందుతుందా అనే కోణంలోనూ విచారించినట్టు సమాచారం. చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్రావు ఇంట్లో కూడావిప్లవ సాహిత్యాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, ఐదుగురు ఎన్ఐఏ అధికారులు, 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా న్యాయవాది అన్నపూర్ణ నివాసంలో.. విశాఖ ఆరిలోవలో మావోయిస్టు సానుభూతిపరురాలు ఎ.అన్నపూర్ణ నివాసముంటున్నారు. ఆమె న్యాయవాదిగా ఉంటూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యురాలుగా ఉన్నారు. ఆమె భర్త ఎం.శ్రీనివాసరావు కూడా న్యాయవాదే. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆమె ఇంటిలో సోదాలు చేశారు. రూరల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంట్లో లభించిన పలు డాక్యుమెంట్లు, పుస్తకాలు సీజ్ చేశారు. మావోయిస్టులకు సహాయసహకారాలు అందిస్తున్నారని గతంలో ఆమెను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేసినట్లు తెలిసింది. రవి కుటుంబ సభ్యుల ఇంటిలో.. నెల్లూరు అరవిందానగర్లో ఎన్ఐఏ అధికారులు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి అలియాస్ జైలాల్ అలియాస్ సునీల్ కుమార్ కుటుంబసభ్యుల ఇంటిలో సోదాలు నిర్వహించారు. రవి సోదరీమణులు.. అనూష, అన్నపూర్ణల సెల్ఫోన్లు, వారు రాసుకుంటున్న కవితల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవి గతేడాది జూన్లో జార్ఖండ్లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో బాణం బాంబును పరీక్షిస్తుండగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోనూ సోదాలు హైదరాబాద్లోని నాగోల్లో నివాసం ఉండే బీహార్, జార్ఖండ్ మావోయిస్టు పార్టీ కమిటీ నేతగా ఉన్న నార్ల రవి శర్మ, ఆయన భార్య బెల్లపు అనురాధ, అల్వాల్లో నివాసం ఉంటున్న అమర వీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకు మారి, న్యాయ శాస్త్ర విద్యార్థిని బి.పద్మ, కవి అరుణాంక్ లత తదితరుల ఇళ్లల్లోనూ, హిమాయత్ నగర్లోని అదితి ఉమెన్స్ హాస్టల్లో సోదాలు చేసి విప్లవ సాహిత్యం, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాలతోనే సోదాలు.. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నట్లు ఆధారాలు లభించినందువల్లే సోదాలు నిర్వహించారని సమాచారం. మెయిల్స్ రూపంలో మావోయిస్టు పార్టీకి, వీరికి మధ్య సమాచార మార్పిడి జరిగిందని ఎన్ఐఏ అనుమానిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన కొందరు మళ్లీ సాయం చేస్తున్నట్లు ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన కొన్ని ఆధారాల ద్వారా బయటపడి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రశ్నించడమే నేరంగా మారింది సమాజంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే నేరంగా మారింది. ఎన్ఐఏ అధికారులు ఇంట్లోని ప్రతి పుస్తకాన్ని, కాగితాన్ని పట్టిపట్టి చూశారు. నిజం మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన నిలబడేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రాసే హక్కు రచయితకు, మాట్లాడే హక్కు మనిషికి, ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు ఉంది. ఇలా వేధించడం అప్రజాస్వామికం. – కల్యాణ్రావు, విరసం నేత కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.. ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులను అడిగాం. కోర్టు ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మా సెల్ఫోన్లు, పుస్తకాలను తీసుకెళ్లారు. తమ్ముడు రవి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగం కోసం వెళుతున్నా అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇటీవల మృతి చెందడంతో ఉద్యమంలో పనిచేశాడని తెలిసింది. – రవి సోదరి అన్నపూర్ణ -
డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!
-
అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్సుఖ్ హిరాన్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్ వాజే, ప్రదీప్ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జీషీటులో సచిన్ వేజ్, ప్రదీప్ శర్మ, వినాయక్ షిండే, నరేష్ గోర్, రియాజుద్దీన్ కాజీ, సునీల్ మానె, ఆనంద్ జాదవ్, సతీశ్ మోతుకూరి, మనీష్ సోని, సంతోష్ షెలార్ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్ కాగా, కాజీ, మానెలను అరెస్ట్ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. -
దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడింది. పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖానా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. హాజీ సలీమ్కి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ తో ఇక్బాల్ ఖానా వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఒక్కో బ్లాస్ట్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని మాలిక్ సోదరులకు ఇక్బాల్ ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. -
దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్ : దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పండగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కాగా, ఎన్ఐఏ అధికారులు తాజాగా హైదరాబాద్లో ఒకరిని, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ-హైదరాబాద్ లింకులపై ఆరా తీస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తొయిబా స్లీపర్సెల్స్ను యాక్టివ్ చేసినట్లు.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దర్భంగా పేలుడు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్భంగా రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేయడంతో విచారణను ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో హై అలెర్ట్ ప్రకటించారు. -
కరుణ లేని కాఠిన్యం
ఒక మనిషి తన ప్రాణం కోసం కాకుండా, తనకు ప్రాణానికి ప్రాణమైన మనుషుల కోసం తపిం చడం పాపమా? ప్రాణం పోతోందని తెలిసినా, అదేదో తన వాళ్ళ మధ్య ప్రాణాలు వదిలితే బాగుం టుందని కోరుకోవడం నేరమా? నిరూపితం కాని నేరాన్ని సాకుగా చూపి, ఉగ్రవాదం ముసుగు వేసి, నిందితుల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచడం ఏ చట్టం కిందైనా న్యాయమా? ఆఖరు శ్వాస విడిచేవరకు గిరిజనుల హక్కులైన ‘జల్, జంగిల్, జమీన్’ కోసమే పోరాడి, అన్యాయంగా కన్ను మూసిన క్రైస్తవ సన్యాసి 84 ఏళ్ళ ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నా, చదివినా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. కరోనా కేసులు ఎక్కువున్న కిక్కిరిసిన తలోజా జైలు నుంచి మార్చమనీ, అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిలు ఇవ్వమనీ కోర్టులో పదే పదే ప్రార్థించినా, ప్రాథేయ పడ్డా ఆయనది అరణ్య రోదన కావడం ఓ విషాదం. చెవులు వినిపించని, శారీరకంగా బలహీనుడైన ఓ మానవతావాది దేశంలో అశాంతి సృష్టించి, ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర చేస్తున్నారని ఎన్ఐఎ కోర్టు భావన. కానీ, అలా తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని ఐరాస ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. స్టాన్ స్వామిది మామూలు మరణం కాదు... ‘వ్యవస్థ చేసిన హత్య’ అని అనేకులు అంటున్నది అందుకే! దళితులు, అడవిబిడ్డల కోసం ఆఖరిదాకా తపించిన మనిషి సోమవారం మధ్యాహ్నం సంకెళ్ళు లేని లోకానికి, ఏ బెయిలూ అవసరం లేకుండానే శాశ్వతంగా వెళ్ళిపోయారు. అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ సేవామూర్తి అయినవాళ్ళనుకున్న గిరిజనుల మధ్య ఆఖరు క్షణాలు గడిపేందుకు కాస్తంత కనికరం చూపమనే కోరడం గమనార్హం. జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు 10 రోజులు ఆలస్యం చేసిన స్టాన్ స్వామి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. ఇరవై ఆరేళ్ళ క్రితం సంచలనమైన వివాదాస్పద వ్యాపారవేత్త, ‘బిస్కెట్ కింగ్’ రాజన్ పిళ్ళై కస్టడీ మరణం కేసు అనివార్యంగా గుర్తొస్తుంది. అరెస్టయి, అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి తగిన వైద్యం అందక తీహార్ జైలులో తుదిశ్వాస విడిచిన పిళ్ళై కేసు అనేక పాఠాలు నేర్పింది. జైలు యంత్రాంగం నిర్లక్ష్యానికీ, న్యాయవ్యవస్థ కాఠిన్యానికీ పిళ్ళై మరణం మచ్చుతునక. ఇప్పుడు ‘ఎల్గార్ పరిషత్ కేస్థు’ నిందితులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాదిస్తున్న ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ), జైలు అధికారుల లోపభూయిష్ఠ వ్యవహారం అందుకేమీ తీసిపోవడం లేదు. ఇదే ఇప్పుడు పలువురి ఆవేదన. స్టాన్ స్వామితో సహా పలువురు విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కార్యకర్తలపై ఇంతటి కర్కశత్వం అవసరం లేదనేదే వారి వాదన. ‘ఎల్గార్ పరిషత్’ సమావేశం, ‘భీమా – కోరేగావ్’ హింస కేసులో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ – ఉపా) కింద ఇప్పటికీ మరో 15 మంది జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. వారిలో మన విప్లవ కవి వరవరరావు సహా సుధా భరద్వాజ్ లాంటి ప్రజాక్షేత్రంలోని ప్రసిద్ధులు పలువురు ఉన్నారు. వారందరిలోకే కాదు... ‘ఉపా’ చట్టం కింద దేశంలో ఇప్పటి దాకా అరెస్టయినవారిలోనే బహుశా అత్యంత వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామే! పార్కిన్సన్స్ వ్యాధితో వణుకుతున్న చేతులతో అన్నం తినడానికీ, నీళ్ళు తాగడానికీ వీల్లేక, కనీసం స్ట్రా, సిప్పర్ కావాలని ప్రాథేయపడితే, ఎన్ఐఏ అందుకు 4 వారాల గడువు తీసుకుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. న్యాయపోరాటంలో అలసిపోయిన స్టాన్ స్వామి కథ చివరకు అత్యంత విషాదంగా ముగిసింది. ఇప్పుడిక మిగతా ఖైదీల విషయంలోనైనా సమయం మించిపోక ముందే సరైన నిర్ణయం తీసు కోవడం అవసరం. ఆ కేసు నిందితుల్లో అత్యధికుల శారీరక అశక్తత, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలు గుర్తించాలి. ఒకపక్క దర్యాప్తు, విచారణ కొనసాగిస్తూనే, మానవతా దృక్పథంతోనైనా వారికి మధ్యం తర జామీనివ్వడం న్యాయపరంగా తప్పేమీ కాదు. కఠిన చట్టాల ఉక్కుపాదం మోపి, రుజువు కాని దేశద్రోహం కింద వారిని ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెట్టడం మానవీయతా కాదు. ‘అర్బన్ నక్సల్’ అనే కొత్తముద్ర తయారుచేసి, కర్కశత్వానికి కొత్త చిరునామాగా మారిందనే అపఖ్యాతి పాలకులకూ శోభనివ్వదు. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడి, ఆఖరు నిమిషంలో అదృష్టవశాత్తూ బయటపడ్డ వరవరరావు లాంటి వారిని చివరి రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వడమే న్యాయం, సమంజసం. రాజన్ పిళ్ళై మరణించిన దశాబ్దిన్నర తరువాత ‘ఆ మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ న్యాయస్థానమే తప్పుబట్టింది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. అమితమైన ఆలస్యమూ అయిపోయింది. ఆలస్యమైన న్యాయం... అక్షరాలా అన్యాయమే! పోయిన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన విషతుల్యమే! అందుకే, అతి వృద్ధుడైనా... కనీసం సర్కారు వారి టీకాకు కూడా నోచుకోక, అన్యాయంగా కరోనా కోరలకు చిక్కి కన్నుమూసిన స్టాన్ స్వామి ఆఖరి వీడియో సందేశం ఇక ఎప్పుడు చూసినా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. వ్యవస్థలో జరిగిన అన్యాయాన్నీ, కరుణించని న్యాయదేవత కాఠిన్యాన్నీ, సమాజ వైఫల్యాన్నీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులకూ, మానవతావాదులకూ ఇది పాలకులు మిగిల్చిన ఓ శాశ్వతమైన గుండెకోత. స్టాన్ స్వామి వెళ్ళిపోయారు... ఆయన చూపిన బాట, చేసిన పని మాత్రం మిగిలిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫాదర్ స్టాన్ స్వామీ! మూడు దశాబ్దాల పైగా మీరు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల మధ్యే తుదిశ్వాస విడవాలన్న మీ ఆఖరి కోరికను తీర్చలేకపోయాం. మన్నించండి! ఇప్పటికైనా వ్యవస్థలో వివేకం మేలుకోవాలని దీవించండి!! -
హైదరాబాద్ లోనే బాంబు తయారు NIA సీన్ రికన్ స్ట్రక్షన్
-
Darbhanga Blast: యూపీలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా... నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్తో పాటు యూపీకి చెందిన హాజీ సలీం, కాఫీల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కుట్రలో హాజీ సలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల వివరాల ప్రకారం.. హజీ సలీం, కాఫిల్ లష్కరే తోయిబాకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. దర్భంగా బ్లాస్ట్కు ఫిబ్రవరి 2021లో వ్యూహాలు రచించగా, యూపీలోని హాజీ సలీం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఈ పేలుడుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం వాళ్లు రన్నింగ్ ట్రైన్లో ఐఈడీ బాంబులను ఫిక్స్ చేయాలనుకున్నట్లు తెలిపారు. లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్భాల్ ఖాన్కు హాజీ సలీం దగ్గరి బంధువని, పేలుడుకు సంబంధించి మాలిక్ బ్రదర్స్కు ఇక్భాల్ ఖాన్ కు హాజీ సలీం మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిపారు. ఇవే కాక మాలిక్ బ్రదర్స్కు ఇక్భాల్ ఖాన్ నుంచి నిధులు సమకూర్చింది కూడా హాజీ సలీమేనని దర్యాప్తులో తేలింది. 9 రోజులు ఎన్ఐఏ కస్డడీలో మాలిక్ బ్రదర్స్ గతనెల 30న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అరెస్టు కాగా శుక్రవారం వీరిని పాట్నా కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతినిచ్చింది. -
మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు
ముంబై: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు పెట్టడం, మరో వ్యాపారవేత్త మన్సుఖ్ హిరానీ హత్య కేసులతో ఆయనకు సంబంధం ఉందని ఎన్ఐఏ చెబుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. లోనావాలా హిల్స్ ప్రాంతంలో అంబీవ్యాలీలో ఆయన్ను అదుపులోకి తీసుకొని, ఎన్ఐఏ ఆఫీసులో ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రదీప్ శర్మతో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 28వ తేదీ వరకు న్యాయస్థానం వారిని ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకోవడానికి ఎన్ఐఏ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆయన ఇంటితో సహా పలు చోట్ల సోదాలు జరిపింది. ఈ క్రమంలో ఎన్ఐఏకు పలు కీలక పత్రాలు కూడా దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ సంతోష్ షెలార్, ఆనంద్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తుండగా ప్రదీప్ శర్మ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. చదవండి: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం చదవండి: మరో 9 నగరాల్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ -
నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
ముంబై: నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్ఐఏ కోర్టు విధించింది. ముజామిల్, సాదిక్, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు. చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు -
కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
విజయవాడ లీగల్: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది. చదవండి: ఇసుక రీచ్ల సబ్ లీజుల పేరిట భారీ మోసం -
అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట దొరికిన కారు బాంబు కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీసు సునీల్ మానెను అరెస్టు చేశారు. కారు ఓనర్ హిరానీ హత్యకు సునీల్ మానెకు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు వివరించి ఈ నెల 28 వరకూ కస్టడీలోకి తీసుకుంది. సునీల్ను ఈ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, దాంతో పాటు ఆయనకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను, కాల్ రికార్డులను పరిశీలించాలని భావిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. ( చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! ) -
చెన్నై విమానాశ్రయంలో కలకలం..
సాక్షి, చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఓ యువకుడి చర్యలు అనుమానాలకు దారి తీశాయి. నిషేధిత తీవ్ర వాద సంస్థ ఐసీస్లో శిక్షణ పొంది చెన్నైకు వచ్చినట్టుగా వచ్చిన సమాచారం కలకలం రేపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో గతంలో సాగిన పేలుళ్ల తదుపరి తరచూ కేరళ నుంచి ఎన్ఐఏ వర్గాలు రాష్ట్రంలోకి రావడం, అనుమానితులు, నిషేధిత సంస్థల సానుభూతి పరులను పట్టుకెళ్లడం జరుగుతోంది. ఈ పరిణామాలతో సముద్ర తీరాల్లో, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ విమానంలో 31 ఏళ్ల యువకుడిపై అధికారుల దృష్టి పడింది. అతడి పాస్పోర్టు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒమన్కు ఎందుకు వెళ్లినట్టో.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా ఆ యువకుడు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. గత ఏడాది కరోనా సమయంలో ఇతడు దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. అదే సమయంలో ఆరు నెలలు ఒమన్లో ఉండడం అనుమానాలకు దారి తీసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఒమన్ మారి ఉండడంతో ఆ దేశంపై భారత్ నిషేధం విధించింది. ఇక్కడకు తమిళనాడు నుంచి ఇప్పటికే పలువురు యువకులు సరిహద్దులు దాటి వెళ్లినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఒమన్కు వెళ్లిరావడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. ఆ యువకుడు పెరంబలూరుకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అతడి కుటుంబం నేపథ్యం గురించి విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు సైతం యువకుడిని విచారించారు. దుబాయ్లో ఉద్యోగం నచ్చక, ఒమన్కు వెళ్లి పనిచేసినట్టుగా ఆ యువకుడు పేర్కొంటున్నాడు. అందులో వాస్తవాలు లేవని భావించిన అధికారులు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించే పనిలో పడ్డారు. యువకుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? లేదా, అతడితో పాటుగా పెరంబలూరు నుంచి దుబాయ్కు వెళ్లిన వారి వివరాలను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్లోకి ‘ఎన్నికల వీరుడు’ -
సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ బెదిరింపుల కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే మరో ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వాజ్ వారిని చంపి ఈ కేసును పరిష్కరించినట్లు చెప్పుకోవాలనుకున్నాడు. కాని ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో మరో ప్లాన్ అమలు చేసి పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీని ముఖేష్ అంబానీ ఇంటి ముందు నిలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నా సమయంలో థానేలో ఉన్న వాజ్ ఇంటిని పరిశోధిస్తున్నప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందానికి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ లభించింది. పాస్ పోర్ట్ హోల్డర్, మరో వ్యక్తిని "నకిలీ ఎన్కౌంటర్"లో చంపడానికి వాజ్ ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ బృందం అనుమానిస్తోంది. గత ఏడాది నవంబర్లో వారిద్దరి సహాయంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుంచి దొంగిలించబడిన మారుతి ఈకో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి అంబానీ ఇంటి ముందు నిలిపి, తర్వాత వారు దోషులను నిర్దారింఛి "ఫేక్ ఎన్కౌంటర్" చేయాలనీ మొదట ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇలా పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ కేసును పరిష్కరించి తానే ప్రశంసలు పొందాలని వాజ్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తుంది. అలాగే కొంత మొత్తం డబ్బులు కూడా డిమాండ్ చేయాలనీ చూసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏజెన్సీలలో జరిగిన "నకిలీ ఎన్ కౌంటర్" విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల ఆపి ఉంచినట్లు కనుగొనబడింది. ఎస్యూవీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వాహన యజమాని వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మార్చి 5న థానేలోని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. మార్చి 13న ఎన్ఐఏ సచిన్ వాజ్ను అరెస్టు చేసింది. చదవండి: సచిన్వాజే హైఎండ్ బైక్ స్వాధీనం -
సచిన్వాజే హైఎండ్ బైక్ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ
సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్శ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్ చేరింది. అలాగే సచిన్ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్ను కూడా శోధించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం థానే వెళ్లారు. అయితే మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. In CCTV footage (in pic), Sachin Waze was seen going to Chhatrapati Shivaji Maharaj Terminus at 7 pm on 4th March. He had taken a local train to Thane that day. He was brought to CSMT y'day for scene recreation Body of Mansukh Hiren was found at Kalwa creek in Thane on 5th March pic.twitter.com/gnMfdaMLLQ — ANI (@ANI) April 6, 2021 -
ఎన్ఐఏ దాడులు: ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ జిల్లా ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేత లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాలన్నీ ముంచంగిపుట్టు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగానే జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపింది. ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి, మెదక్ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు వివరించింది. గతేడాది కేసు నమోదు.. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడం తోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంఘల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పంగి నాగన్న, అదులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వర్రావు, మానుకొండ శ్రీనివాసరావు, రేలా రాజేశ్వరి, బొప్పుడి అంజమ్మ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాగించిన తనిఖీల్లో 40 మొబైల్ఫోన్లు, 44 సిమ్కార్డులు, హార్డ్డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు తదితర 70 స్టోరేజ్ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్డ్రైవ్లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్ఆర్డర్ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. -
అసోం పోల్స్: అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు
సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశచూపిందంటూ అఖిల్ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్ దళ్ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్ను 2019 డిసెంబర్లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్క్వార్టర్స్లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో చేరితే బెయిల్ పొందవచ్చన్న ఆఫర్ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు. అంతేకాకుండా కేఎంఎస్ఎస్(కృషిక్ ముక్తి సంగ్రామ్ సమితి)ని వీడి ఒక ఎన్జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్ కారణంగా అఖిల్ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్ను ఎన్ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : కీలక వీడియో ఫుటేజ్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటిముందు అనుమానాస్పద వాహనం రేపిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో తాజాగా మరో కీలక విషయాన్ని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేతో కలిసి ఉన్న వీడియోను గుర్తించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రకటించాయి. (అంబానీ ఇంటివద్ద కలకలం : బతికుండగానే నీటిలో ) ఫిబ్రవరి 17న వీరిదద్దరూ కలిసి ఉన్నట్లు వెల్లడించే వీడియో ఫుటేజీని కనుగొన్నామని విచారణ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ప్రకారం హిరేన్కు చెందిన నల్ల మెర్సిడెస్ బెంజ్ కారులో వాజేను కలుసుకున్నారు. వీరి సమావేశం సుమారు 10 నిమిషాల పాటు కొనసాగింది. వీడియోలో, వాజే ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని బెంజ్ కారులో వెళ్ళడాన్ని గమనించవచ్చని ఏటీఎస్ తెలిపింది. ఈ సందర్భంగా హిరేన్ స్కార్పియో కారు తాళాలను వాజేకు అప్పగించి ఉంటాడని కూడా ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న, హిరేన్ తన స్కార్పియో చోరికి గురైందని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25 న బెదిరింపులేఖతోపాటు జెలిటిన్ స్టిక్స్ ఉన్న అదే స్కార్పియోను అంబానీ నివాసం యాంటిలియా వెలుపల కనుగొన్నారు. ప్రస్తుతం వాజే వాడుతున్న బ్లాక్ బెంజ్ కారును ఇటీవల ఏటీఎస్ సీజ్ చేసింది. తాజా పరిణామంతో హిరేన్ మృతిలో వాజే పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే వాజేకు చెందిన మూడు ప్రధాన వ్యాపార సంస్థలపై నిఘాపెట్టాయి. వాజ్ డైరెక్టర్గా పనిచేసిన డిజీ నెక్స్ట్ మల్టీ మీడియా లిమిటెడ్, మల్టీ-బిల్డ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్, టెక్లీగల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఆరా తీస్తున్నాయి. ఈ సంస్థలలో ఇతర డైరెక్టర్ల పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు థానే సెషన్స్ కోర్టులో వాజే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్కు ఏటీఎస్ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ మార్చి 30 కి వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. ఇందులోని ఒకవాహనం స్కార్పియో వాహనం యజమాని హిరేన్ మార్చి 5 న ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. అయితే ఈ కారును సచిన్ వాజే నాలుగు నెలలు ఉపయోగించారని, ఫిబ్రవరి 5న తిరిగి ఇచ్చారని హిరేన్ భార్య విమల ఆరోపించారు. తన భర్త మరణంలో వాజ్ పాత్ర ఉందని కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వాహన యజమాని థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదమరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్ఐఏ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందులో 5లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను సీజ్ చేసింది. వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న ఈ బెంజ్కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం లైసెన్స్ ప్లేట్ను కూడా సీజ్ చేయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సచిన్వాజేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్టాప్లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్ను కూడా డిలీట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అలాగే సీసీటీవీలో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది. చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్తోనే పీపీఈ కిట్ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్ కారు అసలు యజమాని ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నామని ఎన్ఐఏ అధికారి అనిల్ శుక్లా తెలిపారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం) కాగా ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. తన స్కార్పియో కనిపించడం లేదంటూ మన్సుఖ్ హిరేన్ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్ శవమై తేలాడు. దీంతో హిరేన్ భార్య విమల సచిన్వాజేపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శివసేన ప్రభుత్వం వాజేను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాజేపై మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే. -
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి) రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్ని, వాజ్ టెలిఫోన్ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ని వాజ్ కలిశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మరోవైపు మన్సుఖ్ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులోఅంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు. కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి కనిపించకుండా పోయిన మన్సుఖ్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. -
మై ఇండియా, కానీ ఐఎస్ కోసం పనిచేస్తా!
సాక్షి, న్యూఢిల్లీ: సూసైడ్ బాంబర్ అవడం సాదియా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల అమ్మాయి సాదియా. పుణె దగ్గరి ఎరవాడ తనది. ఇప్పటికి రెండుసార్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఎ) పోలీసులు ఆమెను డీ–రాడికలైజ్ చేశారు. అంటే.. మారు మనసు పొందేలా చేయడం. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి, 18 ఏళ్ల వయసులో ఒకసారి ఆమెకు డీ–రాడికలైజేషన్ జరిగింది. ‘నేను భరతమాత ముద్దుబిడ్డని’ అని వాళ్లు చెప్పమన్నట్లే చెప్పి, తన మనసు ఎక్కడుందో మళ్లీ అక్కడికే వెళ్లిపోయింది భరత మదర్ ని వదిలేసి! ఐఎస్తో కలిసి ఇండియాలో ‘మ్యాచ్’ కి ప్లాన్ చేస్తుండగా ఈ జులై లో సాదియా ను పట్టుకుంది ఎన్. ఐ.ఎ. ‘ఏం చేస్తున్నావు వారితో కలిసి?!’ అని అడిగితే అబద్ధమేమీ చెప్పలేదు సాదియా. ‘నా మనసు ఇండియన్ మదర్ దగ్గర లేదు’ అంది. ‘మరి ఇండియా వదిలి పోతావా?’ అంటే.. ‘పోను.. ఇది నా దేశం. నేను ఎందుకు పోవాలి?’ అంది! సెప్టెంబర్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎన్. ఐ.ఏ. సాదియా మీద. ‘అంకుల్.. కరోనాను ఒక మనిషికి ఎక్కించి, ఆ మనిషి తో సుమారుగా ఎంతమందికి కరోనాను తెప్పించవచ్చు?’ అని ఎవరినో అడుగుతుంటే విని పోలీసులు ఆమెను పట్టుకున్నారు. సాదియా అన్వర్ షేక్ (పూర్తి పేరు) కు దేశం బయట మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్, ఆల్ ఖైదా, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో ఆమె టచ్ లో ఉంది. ఫిలిప్పీన్స్ లో ఆయిషా హమిదాన్ అని ఆన్ లైన్ ‘మోటివేటర్’ ఒకావిడ ఉన్నారు. ఇరవై ఏళ్ల లోపు పిల్లల్ని ఆదరించి, అక్కున చేర్చుకుని ఉచితంగా ఐ.ఎస్.పాఠ్యపుస్తకాలు అందించి చక్కగా తల దువ్వుతూ వారి చేత ప్రతి పేజీనీ శ్రద్ధగా చదివించడం ఆమె జీవిత లక్ష్యం. ఆమెతో కూడా టచ్ లో ఉంది సాదియా. మలేసియాలో అజ్ఞాతం లో ఉన్న ఇస్లాం మత ప్రబోధకులు డాక్టర్ జకీర్ నాయక్ కూడా సాదియా కు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఐ.ఇ.డి. ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుంది సాదియా. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్!! ఫేస్బుక్లో మల్టిపుల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చెయ్యడం కూడా వచ్చు. ఇన్ని చేస్తూ కూడా ‘ఇండియా ఈజ్ మై కంట్రీ’ అంటున్న ఈ అమ్మాయిని చూస్తుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ముచ్చటగా ఉందట. మళ్లీ ఇంకోసారి ఆమెను డీ–రాడికలైజ్ చేసే పాపాన్నయితే వాళ్లు మూటగట్టుకోదలుచుకోలేదు. దీనికి సంబంధించి నవంబర్లో కేసు విచారణ మొదలు కాబోతోంది. -
ఐఎస్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్ అబ్దుల్(40), ఇర్ఫాన్ నజీర్(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. జహన్జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్, నాసిర్లను గుర్తించారు. వీరు హిజ్బ్ ఉత్ తహ్రీర్(హుట్)లో సభ్యులు. వీరు ఖురాన్ సర్కిల్ అనే మాడ్యూల్ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్ హుట్ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్, నాజిర్ నిధులు సమకూర్చారు. (చదవండి: ‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!’) కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు. -
బెంగళూరు అల్లర్లు: కీలక వ్యక్తి అరెస్టు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. బెంగళూరులో తీవ్ర హింసకు దారి తీసిన దాడికి కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుంది. కాగా సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు కలకలం రేపిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆగష్టు 11న అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే నివాసం ఎదుట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటుగా, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.(చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) ఈ ఘటన జాతీయస్థాయిలో ప్రకంపనలు రేపడంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబరు 21న బెంగళూరు అల్లర్లపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం 30 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఎయిర్గన్, పదునైన ఆయుధాలతో పాటు, ఐరన్ రాడ్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ బ్యాంకులో రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ ఆగష్టు 11 ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడని, నేడు అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అక్రమ బాంబుల తయారీకి నిలయంగా మారిందని గవర్నర్ జగదీప్ దంఖర్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం కేరళ, పశ్చిమ బెంగాల్కు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రవాదుల ద్వారా భారత్లో స్థావరం ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చేసిన ప్రయాత్నాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన అనంతరం గవర్నర్.. దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలోని పలు చోట్ల శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే అక్రమ బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది' ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటూ గవర్నర్ వరుసగా ట్వీట్స్ చేశారు. যা কিছুই ঘটুক না কেন; In service of WB NIA busts Al-Qaeda module in Murshidabad, WB. DGP on this alarming affairs @MamataOfficial to me “West Bengal police firmly adheres to the path laid down by law. There is no discrimination for or against anyone in an extra legal sense” pic.twitter.com/7DCqPyCaz9 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 19, 2020 ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ తప్పిదాలు చేయడంలో మమతా అధికార పోలీసులు బిజీగా ఉన్నారని గవర్నర్ ఆసహనం వ్యక్తం చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల భయంకర క్షీణతకు కారణమవుతున్న రాష్ట్ర ఉన్నతాధికార పోలీసులు వారి జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని' హితవు పలికారు. మరొక ట్వీట్లో పశ్చిమ బెంగాల్ డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి బాధాకరమని, రాష్ట్రంలో జరిగే అక్రమాలు పట్టనట్టుగా చూస్తున్న డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి నిజంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. -
సహరన్పూర్లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్’ (జేకేహెచ్) మాడ్యూల్కు సంబంధించిన తొలి సమావేశం ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ మీటింగ్కు నగరం నుంచి నఫీజ్ ఖాన్ వెళ్లాడని తేల్చింది. ఈ వివరాలను ఎన్ఐఏ తన అభియోగపత్రాల్లో పొందుపరిచింది. ఈ కేసులోనే తొమ్మది మందిని దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది. వీరిలో హైదరాబాద్కు చెందిన నఫీజ్ ఖాన్ సహా ముగ్గురు ఉన్న విషయం విదితమే. 2016 జనవరిలో సిటీలో చిక్కిన నఫీస్ ఖాన్ ఈ మాడ్యుల్లో అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్ధారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ధ్రువీకరించారు. ఫేస్బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై నివాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు. సహరన్పూర్లో మీటింగ్... ఈ మాడ్యుల్కు చీఫ్గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్కు చెందిన నఫీస్ ఖాన్తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ 2015 జనవరిలో యూపీలో ఉన్న సహరన్పూర్ ప్రాంతంలో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్కు ఎంచుకున్నారు. ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్ ఖాన్ అలియాస్ అబు జరార్ సైతం ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీ గా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యు ల్ సహరన్పూర్తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్ఐఏ నిర్థారించింది. నిఘాకు దొరకని యాప్స్తో... ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్’ మాడ్యుల్ సమాచార మార్పిడికి కొత్త యాప్స్ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్ యాప్స్ ‘ట్రిలియన్’, ‘సురిస్పోట్’లను తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్ఘర్ ప్రాంతాల్లో మీడియా వింగ్స్ ఏర్పాటు చేశాడు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకుని ఉగ్రవాద బాటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ తమ అభియోగపత్రాల్లో పొందుపరిచింది. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్ఫోన్ సాయంతో ‘ఉగ్ర’నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) నిర్వహిస్తున్న ఆన్లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్కు చెందిన ఐఎస్కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్పై వచ్చిన బాసిత్ను ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్కు చెందిన దంపతులు జహన్ జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. బాసిత్ ఆదేశాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఓ దశలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్ ఆఫ్ హింద్’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్ రావడంతో బాసిత్ నెట్వర్క్లో మరికొందరు బయట ఉన్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్ఫోన్ వినియోగించిన బాసిత్ పుణేకు చెందిన నబీల్ ఎస్ ఖాత్రి, సాదియా అన్వర్ షేక్లను ఐఎస్కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవరీ బాసిత్?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
‘అమూల్య కేసు ఎన్ఐఏకి అప్పగించండి’
బెంగళూరు : పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన బెంగళూరుకు చెందిన విద్యార్థిని అమూల్య లియోన్(19) కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక సభలో ఫిబ్రవరి 20న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఫ్రీడమ్ పార్క్లో అమూల్య లియోన్ పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. సభ నిర్వాహకులు ఆమె ప్రసంగాన్ని బలవంతంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్) అయితే జూన్ 11న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమూల్య లియోన్ కేసులో దర్యాప్తు బృందం సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని న్యాయవాది విశాల్ రఘు పిటిషన్లో దాఖలు చేశారు. అమూల్య లియోన్కు ఇచ్చిన బెయిల్పై హైకోర్టును సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.(చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం) -
హనీట్రాప్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్తాన్కు చేరవేస్తున్న హనీట్రాప్ కేసులో మరో కీలక సూత్రధారిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. సెయిలర్స్కి ఫండింగ్ చేసిన ముంబైకి చెందిన అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ జబ్బర్ షేక్(53)ను అక్కడే పట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో తీవ్రంగా పరిగణించిన ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్నోస్ లో వెల్లడైన నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లోనే 11 మంది ఇండియన్ సెయిలర్స్ను, ఆ తర్వాత మరో ముగ్గురు సూత్రధారులను అరెస్ట్ చేసింది. మొత్తంగా ఈ కేసులో 15మందిని అరెస్ట్ చేసింది. భార్యాభర్తలిద్దరూ.. ఈ గూఢచర్యం కేసులో అబ్దుల్ భార్య షైష్టా ఖైజర్ని గతంలోనే అరెస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ పాక్లోని వ్యక్తుల సూచనల మేరకు సమాచారం అందించిన సెయిలర్స్ ఖాతాల్లోకి నగదుని బదిలీ చేస్తుండేవారు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న ఎన్ఐఏ.. అబ్దుల్ని అరెస్టు చేసి 120బీ, 121ఏ, ఐపీసీ సెక్షన్ 17,18, సెక్షన్ 3 యాక్ట్(అఫీషియల్ సీక్రెట్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసింది. డిజిటల్ డివైజ్లు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ప్రకటనలో తెలిపింది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్తాన్కు ఈ సెయిలర్స్ సమాచారం ఇవ్వడం ప్రారంభించినట్లు పేర్కొంది. యుద్ధనౌకలు, సబ్మెరైన్ల సమాచారం ఎప్పటి నుంచి చేరవేశారు.. దాని వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. -
హనీట్రాప్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, విజయవాడ: విశాఖ నౌకాదళ హనీట్రాప్ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా శుక్రవారం రోజున ముంబయికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇండియన్ నావీకి చెందిన నౌకలు, సబ్మెరైన్ల లోకేషన్లను హనీట్రాప్లో పడ్డ అధికారులు షేర్ చేసినట్లు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించి పాకిస్థాన్కు చేరవేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్లో వ్యక్తుల సూచన మేరకు సమాచారం ఇచ్చిన వారి ఖాతాల్లోకి అబ్దుల్ రహమాన్ నగదును బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా గతంలో ఇతనిపై 120బి, 121ఏ, ఐపీసీ సెక్షన్ 17, 18 మరియు సెక్షన్ 3యాక్ట్ కిందన ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అరెస్ట్ సమయంలో రహమాన్ నుంచి డిజిటల్ డివైజ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కీలక సమాచారం కోసం విచారణ కొనసాగుతున్నట్లు ఎన్ఐఏ అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: హనీట్రాప్లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు కాగా.. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై సమాచారంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గతంలో 11 మంది నావీ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఏ2 మద్దిలేటిని కస్టడీకి ఇవ్వండి
గద్వాల క్రైం: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కేసులో అరెస్టయిన వారిలో ఏ2 (టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందం శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, 2019 అక్టోబర్ 5న మల్దకల్ మండలం ఎల్కూరుకు చెందిన నాగరాజు అలియాస్ నాగన్న (ఏ1), నారాయణపేట జిల్లా మక్తల్ వాసి బండారి మద్దిలేటి (ఏ2), వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వైనమోని బలరాం (ఏ3), జన గామ జిల్లా బాచణ్పేట్ వాసి జగన్ (ఏ4), మేడ్చల్ జిల్లా చాకిరిపురానికి చెందిన చుక్క శిల్ప (ఏ5), జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం పార్చర్ల వాసి గుంత రేణుక (ఏ6), హైదరాబాద్కు చెందిన మెంచు రమేశ్ (ఏ7), నలమాస కృష్ణ (ఏ8) ను గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరంతా సంఘ విద్రోహ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని యువతను నిషేధిత కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అప్పట్లో పలు నివాస గృహాల్లో సోదాలు నిర్వహించి విప్లవ సాహిత్యం, వివిధ లేఖలు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్, పెన్డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి (ఏ2)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ బృదం పిటిషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాజీ మవోయిస్టుల ఇళ్లలో తనిఖీ చేసిన సమయంలో లభించిన ఆధారాలను బట్టి ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే కోణంలో గద్వాల పోలీసుల సహకారంతో విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎన్ఐఏకు అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టును నిందితుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. -
హనీట్రాప్లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు
-
హనీట్రాప్లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం: పాక్ గూఢచారి విభాగం పన్నిన హనీట్రాప్ వలలో చిక్కుకుని భారత నౌకాదళ సమాచారాన్ని అందించిన కేసులో తాజాగా మరో ముగ్గురు నేవీ ఉద్యోగుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం అదుపులోకి తీసుకుంది. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 20న ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్(నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్ను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందం రెండు రోజులక్రితం విశాఖకు వచ్చింది. ఈ కేసుపై తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో చర్చించి.. పూర్తి వివరాలు రాబడుతోంది. ఈ క్రమంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్(ఈఎన్సీ)లో 2015లో విధుల్లోకి చేరిన రాజేష్, నిరంజన్, లోక్నందాలను అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరితో కలపి ఇప్పటివరకు ఈ కేసులో పది మంది నేవీ సెయిలర్స్ను అరెస్ట్ చేసినట్లయింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎన్ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. -
నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఏ!
రక్షణ దళాల్లో ఒకటైన నావికాదళంపై వలపు వల(హానీ ట్రాప్) విసిరి కీలకమైన రహస్యాలను చోరీ చేస్తున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది. పాకిస్థాన్ ఏజెంట్లు ఫేస్బుక్లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను పరిచయం చేసుకొని.. క్రమంగా వారిని ట్రాప్ చేసి రహస్యాలు రాబడుతున్నట్లు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరిట ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేయడం కలకలం రేపింది. దరిమిలా నేవీలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తుకు ఎన్ఐఏను రంగంలోకి దించుతున్నారు. ఆ సంస్థ అధికారులు రెండు మూడు రోజుల్లో తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చి విచారణ జరుపుతారని సమాచారం. సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్కు చేరవేస్తున్న ఏడుగురు ఇండియన్ సెయిలర్స్ని ఈ నెల 20న అరెస్టు చేసిన కేంద్ర నిఘా వర్గాలు లోతైన విచారణ చేపడుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఈ కేసుని సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ డాలి్ఫన్ నోస్లో వెల్లడైన నిజాల నిగ్గు తేల్చేందుకు రెండు మూడు రోజుల్లో ఎన్ఐఏ బృందం విశాఖ రానుంది. తూర్పు నౌకాదళంలో అధికారుల బృందాలతో మాట్లాడి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఎన్ఐఏ ప్రయతి్నంచనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ సంఘటనతో అప్రమత్తమైన నౌకాదళం ఇకపై షిప్లలో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని బంద్ చేసినట్లు ఆదేశాలు జారీ చేసింది. వలపు వలలో చిక్కుకుని.. భారత నౌకాదళ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు శత్రుదేశం పాకిస్థాన్ దృష్టి సారించింది. 2017లో నౌకాదళంలో సెయిలర్స్గా చేరిన వారిని ఇందుకోసం టార్గెట్ చేసుకుని వలపు వల విసిరింది. ఆర్మీ జవాన్లపై ఈ ఏడాది జనవరిలో విసిరిన ఫేస్బుక్ వల మాదిరిగానే... వీరిపైనా అలానే అ్రస్తాన్ని సంధించింది. ఈ వలలో విశాఖ ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళానికి చెందిన ముగ్గురు సెయిలర్స్, ముంబయికి చెందిన ఇద్దరు, కర్వార్కు చెందిన మరో ఇద్దరు సెయిలర్స్ చిక్కుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. డిసెంబర్ 20న ఏడుగురు సెయిలర్స్తోపాటు ఒక హవాలా బ్రోకర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరికొందరి ప్రమేయంపైనా అనుమానాలు పాకిస్థాన్ ఇంటర్ సరీ్వస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) చట్రంలో కేవలం ఏడుగురు సెయిలర్స్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా చిక్కుకున్నారని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ డాలి్ఫన్ నోస్’ నిర్వహించిన సమయంలోనే ఇంకొందరు సెయిలర్స్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా.. కేవలం ఏడుగురి నుంచి మాత్రమే సమగ్ర సమాచారం పాక్కు చేరిందని భావించడంతో వారిపైనే దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మరికొందరు సెయిలర్స్ కూడా పాక్ హనీట్రాప్లో చిక్కుకొని నౌకలు, సబ్ మెరైన్స్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేశారనే కోణంలో నిఘా వర్గాలు విచారణ ముమ్మరం చేశాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం బంద్ కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్న సంఘటన వెలుగు చూడటంతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నారన్న అనుమానాలను నిఘావర్గాలు వెల్లడించడంతో అప్రమత్తమైంది. ఇకపై నౌకల్లో, సబ్మెరైన్లలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిగానీ, కెపె్టన్, సెయిలర్స్.. ఏ స్థాయి ఉద్యోగి కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాట్సప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, టెలిగ్రామ్, టిక్టాక్, హైక్ మొదలైన సోషల్ మీడియా యాప్స్ని పూర్తిగా నౌకల్లో నిషేధిస్తున్నట్లు ఆదేశించింది. ఈ ఆదేశాలు కఠినంగా అమలు చెయ్యాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు ఎన్ఐఏ బృందాలు మరోవైపు ఇప్పటికే అరెస్టైన ఏడుగురు సెయిలర్స్ నుంచి నిజాలు రాబట్టేందుకు ఎన్ఐఏ బృందం ప్రయతి్నస్తోంది. అరెస్టైన సెయిలర్స్ సన్నీకుమార్, ఎస్.కుమార్శర్మ, ఎస్.దాస్, అకుమా, అశోక్కుమార్, వి.కుమార్, సోమనాథ్కు విజయవాడ ఎన్ఐఎ కోర్టు జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది. వీరిచ్చిన సమాచారం మేరకు తూర్పు నౌకాదళంలో విచారణకు ఎన్ఐఎ బృందం రెండు మూడు రోజుల్లో రానుంది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్కు ఈ సెయిలర్స్ సమచారం అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా యుద్ధనౌకలు, సబ్మెరైన్ల కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు చేరవేశారు. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది..? వివిధ జలాంతర్గాముల ప్రస్తుత స్థితి ఏమిటి.. ఇలా కీలకమైన సమాచారం చేరవేశారు. అయితే ఏయే నౌకలు, సబ్మెరైన్ల సమాచారం అందించారు., ఏయే సమయాల్లో అందించారు.. ఆ సమయంలో ఆయా నౌకలు, జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయి.. ఏ ఆపరేష న్లో ఉన్నాయి.. సెయిలర్స్ ఇచ్చిన సమాచారం వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించే దిశగా ఎన్ఐఏ బృందం ప్రయతి్నంచనుంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే తూర్పు నౌకాదళానికి సమాచారం ఇచ్చినట్లు నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం. -
ఉగ్ర భీతి.. పేలుడు పదార్థాలు స్వాధీనం
కర్ణాటక, బనశంకరి: దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఐటీ రాజధానిలో విస్ఫోటక పదార్థాలు దొరకడం సంచలనమైంది. బెంగళూరులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది తలదాచుకున్న ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడిచేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ అదుపులో ఉన్న జేఎంబీ ఉగ్రవాది జహిదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ విచారణ సమయంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు చెప్పాడు. దీంతో మంగళవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు ఓ ఇంటిపై రహస్యంగా దాడి చేశారు. గదిలో ఎవరూ లేరు. పేలుడు వస్తువులు తయారు చేసే సమాచారం, కొన్ని ఉత్తరాలు, ప్లాస్టిక్ టేపుతో చుట్టిన బ్యాటరీ, కెపాసిటర్, మూడు స్విచ్లు, ఒక మైక్రో లిథియం బాటరీ, ఒక ప్లాస్టిక్ బాక్స్ను కనుగొన్నారు. చేతి గ్లౌజ్లు, గుర్తింపుకార్డులు, ఇంటి అద్దె ఒప్పంద పత్రం, బెంగాళీ బాషలో రాసిన పత్రం, ఒక డిజిటల్ కెమెరా, 2018లో బెంగళూరులో దొంగగించిన కొన్ని వెండిపాత్రలను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని అత్తిబెలె, కాడుగోడి, కేఆర్.పురం, చిక్కబాణవార, శికారిపాళ్య, ఎలక్ట్రానిక్సిటీ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహాయపడే సహాయకులు గుట్టుగా మకాం వేసినట్లు మరోసారి వెల్లడైంది. -
కోవైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పేలుడు సంఘటనలతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్న కోయంబత్తూరుకు చెందిన ఐదుగురికి చెందిన ఇళ్లు, పుస్తకాల దుకాణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం తనిఖీలు చేశారు. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్లో ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవ ప్రార్థనామందిరాలు, స్టార్ హోటళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకోగా సుమారు 200 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జహరాన్ ఐఎస్ఐ తీవ్రవాది అనే ఇందుకు ప్రధాన సూత్రధారి అని కూడా అధికారులు గుర్తించారు. అతనితో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కోయంబత్తూరుకు చెందిన కొందరు సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలడంతో ఎన్ఐఏ అధికారులు వారిపై తీవ్రస్థాయిలో ఇటీవల నిఘా పెట్టారు. జూన్లో కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి మహమ్మద్ అజారుద్దీన్, అక్రంజిందా, షేక్ ఇదయతుల్లా, అబూబకర్, సదాం హుస్సేన్, ఇబ్రహీం ఇళ్లు, అజారుద్దీన్కు చెందిన ట్రావెల్స్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయం నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్డ్రైవ్లు, మెమొరీకార్డులు, సీడీ, డీవీడీలు, నిషేధిత పోస్టర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. మిగతావారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో కోయంబత్తూరులో మరో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించారు. షాజహాన్, షబీబుల్లా, మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అరెస్టయిన అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణలో కోయంబత్తూరు ఉక్కిడం జీఎంనగర్ మసీదు వీధికి చెందిన సదాం హుస్సేన్కు తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో అతనికి కూడా సమన్లు పంపి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సద్దాం హుస్సేన్ ఇంటిలో తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన 25 మంది ఎన్ఐఏ అధికారుల బృందం కోయంబత్తూరు పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో సదాం హుస్సేన్తోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోకి అకస్మాత్తుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉదయం 10.30 గంటల వరకు సాగాయి. ఇదిలా ఉండగా, చెన్నైకల్పాక్కం సమీపం కూవత్తూరు గుండమనిచ్చేరి గ్రామానికి చెందిన సూర్య (22) ఈనెల 23వ తేదీన తిరుప్పోరూరులోని తన మేనమామ ఇంటికి వచ్చినపుడు తన స్నేహితులు దిలీప్రాఘవన్ (24), తిరుమాల్ (24), యువరాజ్ (27) జయరామన్ (26), విశ్వనాథన్ (24)లతో కలిసి 24వ తేదీన అక్కడి గంగై అమ్మన్ ఆలయ కొలను పూడిక తీశారు. అదేరోజున దిలీప్ జన్మదినం కావడంతో ఆలయ పరిసరాల్లో కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడ కనపడిన వస్తువులను చేతికి తీసుకుని తెరుస్తుండగా అది పేలడంతో సూర్య, దీలీప్ రాఘవన్ దారుణంగా మరణించారు. అలాగే చెంగల్పట్లు సమీపంలోని ఒక చెరువులో బాంబు బయటపడింది. సైనికులు, ఐపీఎస్ అధికారులకు అక్కడికి సమీపంలోని మైదానంలో తుపాకీపై శిక్షణ ఇస్తున్నందున వారిని లక్ష్యంగా చేసుకునే ఈ బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరుసలో గురువారం హనుమంతపురం చెరువులో ఒక ఆవు మేతమేస్తుండగా భారీఎత్తున పేలుడు పదార్థాలు బైటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కాగా, పుళల్ జైలు సూపరింటెడెంట్పై గురువారం దాడియత్నానికి దిగిన ఇద్దరు తీవ్రవాదులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
జమ్మూకశ్మీర్లో ఎన్ఐఏ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రనిధుల కేసులో భాగంగా జమ్మూకశ్మీర్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలో ఏకకాలంలో నాలుగు చోట్లు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు. వేర్పాటువాద నేత మసరత్ ఆలంను గతవారం జమ్మూకశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించిన ఎన్ఐఏ.. విచారణలో అతడని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసు 2012లో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మసరత్ ఆలంతోపాటు వేర్పాటువాద నేతలు అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 12మందిపై అభియోగాలు నమోదుచేసింది. -
ఉగ్రవాద నిధుల కేసులో ఎన్ఐఏ దాడులు
న్యూఢిల్లీ: క్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) సరిహద్దుల్లో వాణిజ్య వ్యాపారులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం దాడులు చేసింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కెల్లర్ ప్రాంతంలోని వ్యాపారి గులాం అహ్మద్ వానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం కలసి దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై 2019 ఫిబ్రవరి 14 న ఉగ్రదాడి జరగక ముందే అహ్మద్ వానీ క్రాస్ ఎల్ఓసి వాణిజ్యంలో పాల్గొన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఉగ్రవాదలకు అందుతున్న నిధులపై ఎన్ఓఏ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రసిద్ధ కాశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ వతాలీ, షబ్బీర్ షా, ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం సహా కీలకమైన వేర్పాటువాద నాయకులను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై వతాలీని 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడిని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీకి సన్నిహితుడిగా పేర్కొంటారు. ఎన్ఐఏ దర్యాప్తులో వతాలీకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. బ్రిటన్, దుబాయ్లలో వతాలీకి అనేక ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి అరెస్టయిన వేర్పాటువాదులందరూ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశాల నుంచి నిధులు, విరాళాలు సేకరిస్తున్నట్లు దుఖ్తరన్-ఎ-మిల్లతాద్ సంస్థ చీఫ్ ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం విచారణలో అంగీకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. -
మదురైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురైలో ఆదివారం ఎన్ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన తమిళనాడుకు చెందిన ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్ సూత్రధారి మహ్మద్ అజారుద్దీన్ను కోయంబత్తూరులో ఎన్ఐఏ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అజారుద్దీన్ తెలిపిన వివరాల మేరకు ఇదయతుల్లాను అరెస్టు చేయగా, మరో ఐదుగురిని విచారిస్తున్నారు. కోయంబత్తూరుకు చుట్టుపక్కల రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఎన్ఐఏ బృందాలు ఆదివారం మదురైకు మకాం మార్చాయి. ఆధ్యాత్మిక నగరం మదురైలో పేలుళ్ల విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లుగా లభించిన సమాచారం మేరకు ముగ్గురు యువకుల్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ వర్గాలు తనిఖీలు, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విల్లాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సోదాలు పొద్దు పోయే వరకు సాగాయి. సదాం కుమారుడు ముర్షిద్ సహా ముగ్గుర్ని రహస్య ప్రదేశంలో ఉంచి అధికారులు విచారిస్తున్నారు. -
ఐసిస్ కలకలం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఐసిస్ కలకలం బయలుదేరింది. తమిళ పోలీసుల కళ్లు గప్పి ఇక్కడ సాగుతున్న ఐసిస్ వ్యవహారాలను ఎన్ఐఏ పసిగట్టడం రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేసింది. దాడులకు వ్యూహరచన జరిగినట్టు విచారణలో తేలడంతో ఆలస్యంగానైనా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో విచారణను ముమ్మరం చేశారు. అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రం తీవ్రవాదుల హిట్ లిస్ట్లో ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమతంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అయితే, ఇక్కడ చాప కింద నీరులా సాగుతున్న వ్యవహారాలు పోలీసుల పని తీరు మీద విమర్శలు గుప్పించడమే కాదు, రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థకు అనుకూలంగా యువత ఏకం అవుతోండటాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించే వరకు ఇక్కడి పోలీసులు, ఇంటెలిజెన్స్ పసిగట్టలేని పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడి పోలీసులు హడావుడి సృష్టించినా, ఫలితం శూన్యం. ఇక, సెంట్రల్ రైల్వేస్టేషన్ పేలుడు కేసు విచారణ ఓ సవాలుగానే మారింది. అలాగే, హిందూ నేతల హత్యకు వ్యూహ రచనలు సాగి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలు, సమాచారాలు ఉన్నా, ఇక్కడ ఐఎస్ఐఎస్(ఐసిస్) కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నా భద్రతా పరంగా దూకుడు పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఎన్ఐఏ వర్గాలు ఇక్కడ దాడులు చేసే వరకు ఐసిస్ సానుభూతి పరుల గురించిన వివరాలు, వారి కార్యకలాపాలను రాష్ట్రపోలీసులు పసిగట్టలేని పరిస్థితి ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. దాడులే లక్ష్యంగా వ్యూహాలు శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేసి రాష్ట్ర పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే, రాష్ట్రంలో నక్కి ఉన్న ఆ దాడులకు మాడ్యూల్ సూత్రధారి గురించి సమాచార సేకరణలో విఫలం కావడం గమనార్హం. ఇది కూడా ఎన్ఐఏ బుధవారం రంగంలోకి దిగడంతోనే వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వర్గాలు కోయంబత్తూరు నగరం అన్భునగర్లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో దాడులు సాగించిన విషయం తెలిసిందే. పొద్దు పోయే వరకు ఈ దాడులు సాగగా, అజారుద్దీన్ ఎన్ఐఏ టార్గెట్ అయ్యాడు. మిగిలిన ఐదుగుర్ని విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ వర్గాలు సమన్లు జారీ చేసి వెళ్లాయి. అయితే, అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణ, లభించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సామగ్రి మేరకు ఐసిస్ మాడ్యూల్గా ఇక్కడ అతగాడు వ్యవహరిస్తుండం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన మానవ బాంబు జహ్రన్ హషీంకు ఫేస్బుక్ మిత్రుడిగా ఉండటమే కాదు, తమిళనాడులో ఐసిస్కు యువతను పంపించడం లక్ష్యంగా అజారుద్దీన్ ఇక్కడ తిష్ట వేసి ఉండటం గమనార్హం. అలాగే, తమిళనాడులో దాడులే లక్ష్యంగా వ్యూహ రచనలు సైతం సాగి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడటం ఆందోళన కల్గిస్తోంది. ఆలస్యంగా ఉరకలు ఎన్ఐఏ వర్గాలు మహ్మద్ అజారుద్దీన్ను అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లినానంతరం ఆలస్యంగా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో బుధవారం అర్థరాత్రి నుంచి హడావుడి పెంచారు. అజారుద్దీన్తో సన్నిహితంగా ఉన్నట్టు పేర్కొనబడుతున్న ఉక్కడం మహ్మద్ హసీం, కరుంబుకడై సయబుల్లా, అన్భునగర్ షాజహాన్ ఇళ్లల్లో సోదాల్లో నిమగ్నం అయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఈ సోదాలు సాగాయి. అజారుద్దీన్ ఇంటి పరిసరాల్లో ఉన్న వారి వద్ద, అతడితో సన్నిహితంగా ఉన్న మిత్రులు, వారికి సంబంధించిన వాళ్లను టార్గెట్ చేసి విచారణ పేరిట ఉరకలు తీశారు. అలాగే, అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. కోయంబత్తూరులో గత కొంత కాలంగా హఠాత్తుగా కన్పించకుండా పోయిన యువత, వారికి సంబంధించిన వివరాల్ని సేకరించి, వీరు ఐసిస్లో చేరడానికి ఏమైనా దేశం దాటారా? అన్న అనుమానాలతో విచారణను ముమ్మరం చేసి ఉన్నారు. అలాగే, తీవ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్న చెన్నై, మదురై నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
శ్రీలంక చేరుకున్న ఎన్ఐఏ బృందం
కొలంబో: శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్లలో భారత్ మూలాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం కొలంబోకు చేరుకుంది. బాంబులకు పాల్పడిన వారు భారత్లోని కశ్మీర్, కేరళలో శిక్షణ పొందినట్లు తెలుస్తోందని శ్రీలంక పోలీస్ చీఫ్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై లోతైన విచారణ కోసం ఎన్ఐఏ బృందం సంబంధిత అధికారులతో చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయి. -
వెలుగులోకి ఐసిస్ ఉగ్రవాది వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐసిస్ విస్తరణకు భారీ కుట్ర పన్నిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ జమ్మూకశ్మీర్లోనూ తన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాంతానికి చెందిన మరికొందరితో కలసి ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్ (జేకేఐఎస్) పేరుతో ఐసిస్కు అనుబంధ సంస్థను విస్తరించాలని ప్రయత్నాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెబుతున్నారు. దీనికోసం బాసిత్ గత ఏడాది ఆగస్టులో అరెస్టు కావడానికి ముందు అక్కడకు వెళ్లివచ్చాడని ఓ అధికారి పేర్కొన్నారు. కశ్మీర్కు చెందిన లోన్ అనే ఉగ్రవాది ఇతడికి షెల్టర్ ఇచ్చాడని బయటపడింది. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ ఢిల్లీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12న బాసిత్, ఖదీర్ను అరెస్టు చేసి తీసుకువెళ్లిన విషయం విదితమే. ఆది నుంచీ ఉగ్రభావాలతోనే... చంద్రాయణగుట్టలోని హఫీజ్బాబానగర్కు చెందిన అబ్దుల్లా బాసిత్ బీటెక్ రెండో సంవత్సరం వరకు చదివాడు. ఐసిస్లో చేరాలనే ఉద్దేశంతో 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్తో కలసి బంగ్లాదేశ్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. కోల్కతాలో వీరిని పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టారు. తరువాత కూడా వీరు ఐసిస్లో చేరేందుకు ప్రయత్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్కు వెళ్లేందుకు యత్నించిన వీరిని 2015, డిసెంబర్ 27న నాగ్పూర్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్పై బయటకొచ్చిన బాసిత్ విదేశాలతో పాటు ఢిల్లీ, కశ్మీర్ల్లో ఉన్న ఐసి స్ నాయకులతో సంబంధాలు కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది మరోసారి ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఇతడు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వారి విచారణకు విరామం... బాసిత్ అరెస్టు కావడానికి ముందు అతడితో సంప్రదింపులు నెరపారని, పాతబస్తీలో సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలపై షహీన్నగర్కు చెందిన జీషాన్, శాస్త్రీపురం వాసి మసూద్ తాహాజ్, మైలార్దేవ్పల్లికి చెందిన షిబ్లీ బిలాల్ను ఎన్ఐఏ శనివారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ కార్యాలయంలో వీరిని 3రోజులు విచారించారు. మరోపక్క వార్దాలో ఉన్న బాసిత్ రెండో భార్య మోమిన్ను కూడా ఆమె ఇంటి వద్ద విచారించారు. ఈ ప్రక్రియకు మంగళవారం తాత్కాలిక విరామమిచ్చారు. వీరి నుంచి ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న 13 సెల్ఫోన్లు, 11 సిమ్కార్డులు, ఐపాడ్, ఎక్స్టెర్నల్ హార్డ్డిస్క్, ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు, ఎస్డీ కార్డులు, వాకీటాకీలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కశ్మీర్ ‘ప్రత్యేకం’ కావాలని.. జమ్మూకశ్మీర్ను ప్రాంతాన్ని ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే జేకేఐఎస్. ఖురాసన్ మాడ్యూల్కు అనుబంధంగా ఇది పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జేకేఐఎస్లో బాసిత్తో పాటు కశ్మీర్కు చెందినలోన్, ఉత్తరప్రదేశ్లోని గజ్రోలాకు చెందిన పర్వేజ్, జంషీద్ సహా మరో నలుగురు సభ్యులు మాత్రమే కీలకంగా వ్యవహరించారు. జేకేఐఎస్ విస్తరణ కోసం గత ఆగస్టు 1న కశ్మీర్కు వెళ్లి వచ్చిన తర్వాతే ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పర్వేజ్, జంషీద్ను అరెస్టు చేశారు. -
రాజధానిలో మళ్లీ ఐసిస్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరోసారి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కలకలం రేగింది. గతేడాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ–ఢిల్లీ) అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్, అతని అనుచరుడు ఖదీర్ల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శనివారం మహారాష్ట్రలోని వార్దాతోపాటు హైదరాబాద్లోని షహీన్ నగర్, శాస్త్రీపురంలోని కింగ్స్ కాలనీ, మైలార్దేవ్పల్లిలలో ఏకకాలంలో దాడులు చేసింది. బాసిత్ రెండో భార్య మోనాతోపాటు అతడి స్నేహితులు, అనుచరులైన జీషాన్, మసూద్ తాహాజ్, షిబ్లీ బిలాల్లను అదుపులోకి తీసుకుంది. మోనాను మహారాష్ట్రలో, మిగిలిన ముగ్గురినీ గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయంలో ప్రశ్నించింది. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వారి నుంచి 13 సెల్ఫోన్లతోపాటు 11 సిమ్కార్డులు, ఐపాడ్, ఎక్స్టెర్నల్ హార్డ్డిస్క్, రెండు ల్యాప్టాప్స్, ఆరేసి చొప్పున పెన్డ్రైవ్లు, ఎస్డీ కార్డులు, మూడు వాకీటాకీ సెట్స్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్... దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగే ‘అబుదాబి మాడ్యూల్’పై ఎన్ఐఏ 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మర్నాడే ప్రధాన నిందితుడు షేక్ అజర్ ఉల్ ఇస్లామ్ను, రెండో నిందితుడు అద్నాన్ హసన్ను, మూడో నిందితుడు మహ్మద్ ఫర్హాన్ షేక్లను అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్లో స్థిరపడ్డారు. అక్కడ నుంచే ఐసిస్ కోసం పని చేశారు. ఐసిస్కు చెందిన కీలక నేత ఖలీద్ ఖిల్జీ (కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్తాన్కు చెందిన ఖలీద్ అప్పట్లో దుబాయ్ కేంద్రంగా ఐసిస్ కార్యకలాపాలు నడిపాడు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తూ దేశంలో ఐసిస్ కోసం రిక్రూట్ చేసుకోవడం, వారికి అవసరమైన నిధులు సమకూర్చడం, సిరియా వెళ్లేందుకు సహకరించడం వంటివి చేయడానికి కుట్రపన్నారు. వారికి అప్పట్లో దుబాయ్లో నివసించిన ఈదిబజార్వాసి మహ్మద్ ముజ్తబ ద్వారా చంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్ బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్ ద్వారా బాసిత్తో సంప్రదింపులు జరిపిన అద్నాన్ హసన్ భారీగా నిధులు సమకూర్చాడు. అద్నాన్ దుబాయ్ నుంచే బాసిత్, సన, ఖురేషీలతోపాటు అబ్రార్, మాజ్, ఫారూఖ్, అద్నాన్, నోమన్, లతీఫ్లతోనూ సంప్రదింపులు జరిపాడు. 2014 ఆగస్టులో బాసిత్ తన స్నేహితులు, సమీప బంధువులైన నోమన్, అబ్రార్, మాజ్లతో కలసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘానిస్తాన్కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశాడు. ఇందుకోసం కోల్కతా చేరుకోగా వారిని అక్కడ పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం విడిచిపెట్టారు. అయినప్పటికీ పంథా మార్చోకోని బాసిత్ బృందం... ఐసిస్లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాగ్పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకొని పీఓకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 24న ప్రయాణం ప్రారంభించి 27న నాగ్పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిపై ఎన్ఐఏ అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. వారంతా నేరుగా ఐసిస్ కీలక నేత షఫీ ఆర్మర్తో సంబంధాలు నెరిపారు. ‘అబుదాబి మాడ్యూల్’పై ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ 2016లో కేసు నమోదు చేసింది. అప్పట్లోనే ముగ్గురినీ అరెస్టు చేసింది. దీనికి కొనసాగింపుగా చెన్నై, ఢిల్లీల్లోనూ అరెస్టులు జరిగాయి. నాటి దర్యాప్తులోనే బాసిత్, ఖరేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, సన, మాజ్, ఖురేషీ, ఖదీర్ ఇళ్లలో సోదాలు చేయడంతోపాటు కీలక ఆధారాలు, పత్రాలు స్వాధీనం చేసుకుంది. అబ్దుల్లా బాసిత్తోపాటు షహీన్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ను అరెస్టు చేసింది. అప్పట్లో బాసిత్ విచారణలో అనేకవిషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్... మసూద్, బిలాల్ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మసూద్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఈ నలుగురు అనుమానితుల్ని వివిధ కోణాల్లో విచారించి పంపారు. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో అధ్యయనం చేస్తున్నారు. ఈ విశ్లేషణలో సాంకేతిక ఆధారాలు లభిస్తే అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ... బాసిత్కు టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన హుజైఫా అనే ఐసిస్ కీలక నేత గతేడాది మార్చిలో కొన్ని కుట్రలు చేశాడు. ఆయుధాలు సమకూర్చుకొని స్థానికంగా ఆపరేషన్స్ చేయాలని బాసిత్ను ప్రేరేపించాడు. దీంతో పంజాబ్, ఢిల్లీ, బిహార్ల నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ బాసిత్ బదులిచ్చాడు. తాను అందించే నిధులతో ఓ భారీ వాహనాన్ని ఖరీదు చేసుకోవాలని, దాన్ని వినియోగించి జనసమ్మర్థ ప్రాంతంలోకి దూసుకెళ్లి వీలైనంత మందిని ‘లోన్ వూల్ఫ్’తరహాలో దాడులు చేయాలని ఉసిగొల్పాడు. అలాగే కత్తులతో కనిపించిన వారినల్లా పొడుచుకుంటూ పోవాలని నూరిపోశాడు. దీంతో బాసిత్ తాను ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా బలగాలు, నిఘా వర్గాలు, ఆర్ఎస్ఎస్ నేతలు, ఓ వర్గానికి చెందిన ముఖ్యుల్ని టార్గెట్ చేసుకుంటానని చెప్పాడు. ఈ ఆపరేషన్స్ కోసం అతనికి కొన్ని నిధులు కూడా అందాయి. ఆ ఏర్పాట్లలో ఉండగా ఈ కుట్రలు కార్యరూపం దాల్చకుండానే బాసిత్, అతడికి సహకరించిన ఖదీర్ కటకటాల్లోకి చేరారు. గతేడాది వారిని అరెస్టు చేసిన ఎన్ఐఏ... రెండు నెలల క్రితం అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. అరెస్టు కావడానికి ముందు బాసిత్తో సంబంధాలు నెరపిన అతడి స్నేహితులు షహీన్నగర్కు చెందిన జీషాన్, శాస్త్రీపురంవాసి మసూద్ తాహాజ్, మైలార్దేవ్పల్లికి చెందిన షిబ్లీ బిలాల్లతోపాటు మహారాష్ట్రలోని వార్దాకు చెందిన బాసిత్ రెండో భార్య మోనాపైనా కేంద్ర నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయి. బాసిత్ చేపట్టలేని ఆపరేషన్స్ను పూర్తి చేయడానికి వాళ్లు సిద్ధమవుతున్నారని గుర్తించాయి. బాసిత్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు... శనివారం ఏకకాలంలో హైదరాబాద్, మహారాష్ట్రల్లోని నాలుగు ప్రాంతాల్లో దాడులు చేసి మోనా, జీషాన్, మసూద్ తాహాన్, షిబ్లీ బిలాల్లను అదుపులోకి తీసుకున్నారు. -
కలకలం సృష్టిస్తోన్న ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పలు ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ మేరకు కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో పట్టుబడ్డ బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేయడంతో.. ప్లాన్ విఫలమైంది. దీంతో బాసిత్ హైదరాబాద్కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్లో బాసిత్ పాటు మరో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరిని అదుపులోకి.. ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ యువకుడి (తహన్)ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్ను గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. -
ఎన్ఐఏలో ‘మావో’ సెల్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల కేసుల దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గతేడాది వరకు కేవలం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపైనే ఎన్ఐఏ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేది. ఇందులో కశ్మీరీ చొరబాటుదారులు, ఈశాన్య భారతదేశంలోని తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, దేశంలో పాక్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం, దొంగనోట్ల చలామణి తదితర కేసులుండేవి. ఇక నుంచి మావోయిస్టు కేసులను కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ విభాగం ఏం చేస్తుందంటే..? వాస్తవానికి ఇటీవల 75 కొత్త పోస్టులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. ఇందులో 22 మంది అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఎల్డబ్ల్యూఈ (వామపక్ష తీవ్రవాదం) కేసులను విచారించనుంది. దేశవ్యాప్తంగా ఇకపై మావోయిస్టులు పాల్పడే దాడుల కేసుల సంగతి ఎన్ఐఏ చూసుకుంటుంది. ఎందుకంటే భారీగా నగదు తరలింపు, అక్రమంగా ఆయుధాలు నిల్వచేయడం, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, ప్రజాప్రతినిధులను హత్యలు చేయడం తదితరాలన్నీ దేశ వ్యతిరేక చర్యల కిందకే వస్తాయి. అందుకే, కేవలం ఉగ్రకేసులనే దర్యాప్తు చేసే ఎన్ఐఏకు మావోయిస్టులకు సంబంధించిన కేసులను కూడా అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో కారణం ఏంటంటే.. మావోయిస్టు కార్యకలాపాలన్నీ వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో జరు గుతుంటాయి. ఒక రాష్ట్రంలో దాడికి పాల్పడి మరో రాష్ట్రంలోకి దండకారణ్యాల ద్వారా వెళుతుంటారు. ఆయా రాష్ట్రాల పరిధుల సమస్యలు తలెత్తడంతో ఇలాంటి కేసుల దర్యాప్తు స్థానిక పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. అందుకే, జాతీయస్థాయిలో ఉన్న ఎన్ఐఏ అయితే ఇలాంటి చిక్కులు, పరిమితులు ఉండవు. అన్ని రాష్ట్రాల పోలీసులతో టచ్లో ఉంటూ కేసులను ఎలాంటి అడ్డుంకులు లేకుండా దర్యాప్తు చేసుకునే వీలుంటుంది. ఏమేం కేసులు డీల్ చేస్తోంది? గతంలో హైదరాబాద్లో చోటు చేసుకున్న మక్కామసీదు, గోకుల్చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2012లో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మావోయిస్టు దళానికి చేరవేస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. 2017 ఆగస్టు లో రాంచి రైల్వేస్టేషన్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సత్వాజీ తమ్ముడు నారాయణ తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఏపీలోని అరకులో గతేడాది సెప్టెంబర్ 23న ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన కేసు కూడా ఎన్ఐఏకు బదిలీ అయింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న నగదు అక్రమ రవాణా, చెలరేగే హింసలను బట్టి, కేసుల తీవ్రత ఆధారంగా వీటిని స్థానిక పోలీసులు లోతైన దర్యాప్తు కోసం ఎన్.ఐ.ఏకి బదిలీ చేయనున్నారు. -
నగరంపై ఎన్ఐఏ నిఘా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్పై భారత వాయుసేన సర్జికల్ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్ సెల్స్పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. తనిఖీ చేశాకే అనుమతి నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్ సెర్చ్లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
‘ఉగ్ర నిధుల’ కేసులో హైదరాబాదీ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయీద్కు చెందిన సంస్థ జమాత్ ఉల్ దవాకు (జేయూడీ) మరో రూపంగా ఏర్పడిన నిషిద్ధ ఫల్హాహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) నిధుల కేసులో ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు చెందిన ఓ యువ వ్యాపారికి నోటీసులిచ్చారు. ఈ కేసులో వాంటెడ్గా ఉన్న పాకిస్తానీతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బహదూర్పురాకు చెందిన మన్సూరీని సోమవారం విచారణకు హాజరుకావాలని ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ ఆదేశించింది. అయితే ఆయన కొంత సమయం కోరారని, దీంతో అనుమతినిచ్చిందని ఓ అధికారి పేర్కొన్నారు. పీఓకేలో మంగళవారం జరిగిన సర్జికల్ దాడుల నేపథ్యంలో అత్యంత అప్రమత్తత కొనసాగుతుండగా ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో హఫీజ్ సయీద్ కో–ఫౌండర్గా ఏర్పాటు చేసిన లష్కరే తొయిబా (ఎల్ఈటీ) సంస్థ హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. నగరంలో 2001లో గణేష్ ఉత్సవాల సందర్భంగా పేలుళ్లకు కుట్ర, 2002లో దిల్సుఖ్నగర్లో పేలుడు, 2004, 2005లో విధ్వంసాలకు కుట్రతో పాటు 2008 నాటి ముంబై మారణహోమం వరకు ఎల్ఈటీ దారుణాలెన్నో ఉన్నాయి. ఎల్ఈటీని నిషేధించడంతో సయీద్ జేయూడీకి రూపమిచ్చాడు. దీని ద్వారా ఆపరేషన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీనిపైనా నిషేధం విధించడంతో స్వచ్ఛంద సంస్థ అంటూ ఎఫ్ఐఎఫ్ నెలకొల్పాడు. దీన్ని అమెరికా 2010లో ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ బ్యాన్ చేసింది. ఐఎస్ఐ నుంచి నిధులు... అప్పటి నుంచి చాప కింద నీరులా కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఐఎఫ్ అనేక దుశ్చర్యలకు పురిగొల్పిందన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు అవసరమైన నిధుల్ని ఐఎస్ఐ సమకూరుస్తోంది. ఇవి నేరుగా భారత్కు రాకుండా దుబాయ్ మీదుగా మళ్లిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిని అందుకోవడంలో, ఎఫ్ఐఎఫ్ క్యాడర్కు అందించడంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖకు (ఎంహెచ్ఏ) నిఘా వర్గాలు గత ఏడాది సమగ్ర నివేదికను అందించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎంహెచ్ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశించింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ యూనిట్ ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఫలితంగా ఈ నిధులు హవాలా రూపంలో వస్తున్నాయని వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఎఫ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కొందరిని అనుమానితులుగా నిర్ధారించింది. ఆ వివరాల ఆధారంగా గత ఏడాది సెప్టెంబర్ 26న ఢిల్లీతో పాటు శ్రీనగర్లోనూ ఏకకాల దాడులు చేసింది. ఢిల్లీకి చెందిన మహ్మద్ సల్మాన్, దుర్యాగంజ్ వాసి మహ్మద్ సలీమ్, శ్రీనగర్కు చెందిన సజ్జద్ అబ్దుల్ వనీలను అరెస్టు చేసింది. వీరి విచారణలోనే రాజస్తాన్లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ మూలానీ అలియాస్ బబ్లూ పాత్ర వెలుగులోకి వచ్చింది. బబ్లూను అరెస్టు చేసి విచారించగా దుబాయ్లో ఉంటున్న పాకిస్తానీ కమ్రాన్ తన సొంత దేశం నుంచి నిధులు సేకరించి భారత్కు పంపిస్తున్నట్లు తెలిసింది. ఇతడి పూర్వాపరాలు, వ్యవహార శైలి, లింకుల్ని ఎన్ఐఏ లోతుగా అధ్యయనం చేసింది. దీంతో హైదరాబాద్కు చెందిన మన్సూరీ పాత్ర వెలుగులోకి వచ్చింది. బహదూర్పురాకు చెందిన ఇతను కమ్రాన్తో సంబంధాలు కలిగి ఉన్నాడని అనుమానించాయి. దీంతో ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్లో ఎస్పీగా పని చేస్తున్న విశాల్ గర్గ్ ఈ నెల 19న మన్సూరీకు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీన్ని అందుకున్న మన్సూరీ తనకు కొంత సమయం కావాలంటూ మంగళవారం ఎన్ఐఏను కోరినట్లు తెలిసింది. -
పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్నాగ్ జిల్లా కేంద్రంలోని హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్లోని బిజ్బెహారాకు చెందిన సజ్జాద్ భట్కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్లోని సిరాజ్–ఉల్–ఉలూమ్ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
తౌసీఫ్ మాటవిని తిరిగొచ్చాడు.. కానీ ఆదిల్..
న్యూఢిల్లీ : పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఆదిల్ అహ్మద్దార్ కుటుంబ సభ్యులను ఎన్ఐఏ విచారిస్తోంది. ఆదిల్ సోషల్ మీడియా ప్రొఫైల్ లింకులతో పాటు, అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏలు సేకరించింది. ఆదిల్తో పాటు అతని బంధువు తౌసీఫ్ కూడా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో చేరినట్టు తెలిసింది. అయితే, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు తౌసీఫ్ ఇంటికి తిరిగొచ్చినా.. ఆదిల్ మాత్రం రాలేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. (దీటుగా బదులిస్తాం: పాక్ హెచ్చరిక) కాగా, తౌసీఫ్ ప్రస్తుతం జమ్మూ జైలులో ఉన్నాడు. అతన్ని ఎన్ఐఏ విచారించనుందని సమాచారం. పుల్వామా ప్రాంతంలోని స్థానికులు, అక్కడి జవాన్ల స్టేట్మెంట్లను ఎన్ఐఏ రికార్డు చేసింది. పుల్వామా ఉగ్రకుట్రకు అంత భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ ఎలా లభ్యమైందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జైషేకు బయటనుంచి మద్దతిచ్చే వారు డిసెంబర్లో 100 కేజీ ఆర్డీఎక్స్ను తరలిస్తుండగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీ స్వాధీనం చేసుకుంది. పుల్వామాలో అంత భారీ స్థాయిలో ఆర్డీఎక్స్తో విధ్వంసం సృష్టించడానికి చిన్న చిన్న మొత్తాల్లో కొన్ని నెలలపాటు ఆర్డీఎక్స్ను పోగుచేశారని అధికారులు గుర్తించారు. (మోదీ ఆ రోజు తిన్నారా, తినలేదా !?) -
అవకాశం రాగానే దాడి చేశాడు...
-
జగన్ను చంపడమే శ్రీనివాసరావు లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు అలియాస్ చంటి కత్తితో దాడికి పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది. జగన్ను అంతమొందించాలనే మెడపై పొడిచేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించాడని, ఈ ప్రక్రియలో జగన్కు తన ఎడమ చేయి పై భాగంలో గాయమైందని స్పష్టం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లోకి వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఉండదని, అందువల్ల నిందితుడు సెల్ఫీ పేరుతో లోనికి ప్రవేశించాడని తెలిపింది. జగన్పై దాడి చేసేందుకు శ్రీనివాసరావు సరైన సమయం కోసం ఎదురు చూశాడని వివరించింది. ముందస్తు పథకంలో భాగంగానే 2018 జనవరిలో కోడి పందేల సందర్భంగా తన ఊరికి సమీపంలో కత్తిని సంపాదించాడని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ జనవరి 12 నుంచి 18 వరకు తాము చేపట్టిన విచారణలో శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించాడని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. శ్రీనివాసరావు చర్యలు పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ) కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయంది. అంతేకాక జగన్పై హత్యాయత్నానికి పాల్పడం ద్వారా ఐపీసీ సెక్షన్ 307 కింద కూడా నేరానికి పాల్పడ్డారంది. ఈ నేరాలను విచారణ నిమిత్తం స్వీకరించాలని కోర్టును కోరింది. పౌర విమానయాన చట్టం కింద శ్రీనివాసరావును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేశామని తెలిపింది. అనుమతి రాగానే ఆ విషయాన్ని కోర్టుకు నివేదిస్తామంది. జగన్ను చంపాలన్న కుట్ర ఎవరిది? ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు? తదితర అంశాలపై సీఆర్పీసీ సెక్షన్ 173(8) కింద దర్యాప్తును కొనసాగిస్తామని కోర్టుకు నివేదించింది. ఇలా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ జనవరి 23న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి మహ్మద్ సాజిద్ ఖాన్ చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వివరాలు, సేకరించిన డాక్యుమెంట్లను జత చేశారు. ఈ చార్జిషీట్కు ప్రత్యేక కోర్టు ప్రొవిజినల్ క్రిమినల్ నెంబర్(పీఆర్సీ) కేటాయించాల్సి ఉంది. అనుబంధాలను మినహాయిస్తే, ఈ చార్జిషీట్ 9 పేజీలుంది. జగన్ రాకపోకలపై కన్ను... శ్రీనివాసరావు విమానాశ్రయంలో తిరిగేందుకు ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిర్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసింది. ఎంట్రీ పాస్ను అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసినప్పుడు శ్రీనివాసరావు అనేక కీలక విషయాలను దాచి పెట్టాడు. తనపై కేసు విషయాన్నీ మరుగునపెట్టాడు. దీని గురించి అధికారులూ విచారణ చేయలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో జగన్ చేసిన పాదయాత్రను శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు. అలాగే విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన రాకపోకలను కూడా పరిశీలించాడు. ప్రతివారం హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చేవారు. ఈ సమయంలోనే జగన్పై దాడి చేయాలని శ్రీనివాసరావు ప్రణాళికలు రచించారు. కోడి పందేలకు ఉపయోగించే కత్తిని ఇందుకోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన ఈ ప్రణాళికను అమలు చేసేందుకు వైఎస్సార్ సీపీ వారితో మాట్లాడి జగన్తో తనకు సెల్ఫీ తీసుకునే అవకాశం ఇప్పించేలా చేయాలని ఫ్యూజన్ ఫుడ్స్లో క్యాషియర్గా పనిచేస్తున్న యువతిని అడిగాడు. అక్టోబర్ 25న జగన్ విశాఖ విమానాశ్రయం వస్తున్నారని, ఆ రోజున సెల్ఫీ తీసుకోవచ్చునని ఆ యువతి శ్రీనివాసరావుకు చెప్పింది. ఆరోజున విమానాశ్రయం చేరుకున్న జగన్ నేరుగా వీఐపీ లాంజ్లోకి వెళ్లారు. ఆయన వెంట పీఏతో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బంది జగన్, ఇతర నేతలకు కాఫీ, టీ అందించారు. అవకాశం రాగానే దాడి చేశాడు... శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫాం ధరించి, వీఐపీ లాంజ్లోకి అడుగుపెట్టే సమయంలో కత్తిని గుర్తించకుండా ఉండేందుకు చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లాడు. జగన్కు ఎడమ వైపు నిల్చున్నాడు. సమయం రాగానే చంపేందుకు ఆయన మెడపై కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో జగన్ ఎడమ చేయికి గాయమైంది. ఆ వెంటనే ప్రొటోకాల్ అధికారులు, స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు లాంజ్లోకి వచ్చి శ్రీనివాసరావును పట్టుకుని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ) వైపు తీసుకెళ్లారు. ఈ విషయాలన్నింటినీ శ్రీనివాసరావు మా ఇంటరాగేషన్లో వెల్లడించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయం... దాడి తరువాత జగన్ విమానాశ్రయంలో ఉన్న అపోలో హెల్త్ డెస్క్ డాక్టర్ వద్ద చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడికి చేరుకోగానే జగన్ నేరుగా సిటీ న్యూరో సెంటర్కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్సను అందించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆ మేర చికిత్స అందించి, 26వ తేదీ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. శ్రీనివాసరావు తన చర్యల ద్వారా పౌర విమానయాన చట్టం కింద నిర్ధేశించిన నేరాలకు పాల్పడ్డారని చార్జీషీట్లో ఎన్ఐఏ పేర్కొంది జగన్పై హత్యాయత్నం కేసు 8కి వాయిదా విజయవాడ లీగల్: జగన్పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్చార్జి జడ్జి అచ్యుత పార్థసారథి ఈ నెల 8కి వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెమోలపై కౌంటర్ అండ్ వాదనల నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేశారు. -
‘కుట్ర ప్రకారమే వైఎస్ జగన్పై హత్యాయత్నం’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కుట్ర ప్రకారమే జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చడానికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర బయటకు వస్తుందనే భయం కనిపిస్తోందని ఆరోపించారు. అందుకే సిట్ దర్యాప్తు మాత్రమే ఫైనల్ కావాలనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోందన్నారు ఎన్ఐఏ విచారణను ఆపేందుకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారని తెలిపారు. ఈ కేసులో ఆధారాలను ఎన్ఐఏకు ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేపదే ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు అడ్డుపడటం చూస్తుంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును అంతా గమనిస్తున్నారని.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబుకు ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి.. ఇంకా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రంలో సమస్యలను వదిలి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. కానీ ఆయనతో మీటింగ్ అంటే ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈవీఎంలు వద్దని అంటున్నారని.. అయితే 2014లో ఆయన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే గెలిచారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కలసి వచ్చిన తర్వాత టీజీ వెంకటేశ్ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అంతా ఒక్కటేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబు సాకులు వెతుక్కునే పనిలో పడినట్టుగా కనిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం; ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తికి చార్జిషీట్ను సమర్పించింది. నిందితుడు శ్రీనివాసరావు జైలులో రాసుకున్న 22 పేజీల పుస్తకాన్ని చార్జిషీట్తో పాటు జత చేసింది. చార్జిషీట్ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జునుమిల్లి శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్టు సమాచారం. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. చార్జిషీట్లో ఏముందో ఈ నెల 25న తెలిసే అవకాశముంది. ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిందితుడి తరఫున న్యాయవాది మట్టా జయకర్ ప్రశ్నించారు. -
ఠాణేల్లంకలో ఎన్ఐఏ విచారణ
ముమ్మిడివరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో రెండో రోజు శనివారం కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ బృందం.. సీఐ మహబూబ్బాషా ఆధ్వర్యంలో మరో ముగ్గురు అధికారులు శుక్రవారం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను విచారించారు. రెండో రోజు శనివారం ఠాణేల్లంకలో వీఆర్వో భాస్కరరావు సమక్షంలో శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిన సోదరి విజయదుర్గను, జగన్తో కలిసి ఉన్న ఫ్లెక్సీ వేయించిన శ్రీనివాసరావు స్నేహితుడు, విజయదుర్గ రాసిన ఉత్తరాల జిరాక్స్ కాపీలు తీసిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు జె.శివసుబ్రహ్మణ్యంను విచారించారు. శ్రీనివాసరావు ప్రవర్తనపై గ్రామంలో పలువురు యువకులను విచారించారు. నిందితుడి తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులకు సంబంధించి ఆస్తి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలపై విచారణ చేశారు. నిందితుడిపై గతంలో ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో నమోదైన కేసు వివరాలు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగంలో చేరే సమయంలో ఎన్ఓసీ కోసం శ్రీనివాసరావు పోలీస్స్టేషన్కు దరఖాస్తు చేసుకున్నాడా.. లేదా.. తదితర వివరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలిసింది. మీరైనా నిజాయితీతో విచారించి దోషులను పట్టుకోండి ‘మీపై నమ్మకంతో వచ్చాం.. ఏం జరిగిందో మొత్తం చెబుతాం.. నిజాయితీతో విచారణ చేపట్టి దోషులను పట్టుకోండి. కుట్రదారులను, సూత్రధారులను బయటపెట్టండి’ అంటూ ఎన్ఐఏ అధికారులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. శనివారం మధ్యాహ్నం ఎన్ఐఏ బృందం ఎదుట వారు విచారణకు హాజరయ్యారు. విశాఖ విమానాశ్రయంలో జగన్పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీవీఐపీ లాంజ్లో ఉన్న నేతలందరినీ సాక్షులుగా పేర్కొంటూ ఎన్ఐఏ నోటీసులిచ్చింది. విచారణకు ముందు మళ్ల విజయప్రసాద్ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో సరైన వసతులు లేనందున వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ నివాసంలో విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారమిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలు విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారుల బృందం ఒక్కొక్కరితో కనీసం పావుగంట సేపు విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించింది. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కరణం ధర్మశ్రీ, నేతలు మజ్జి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, ఎ.సుధాకర్, జియ్యాని శ్రీధర్, కొండా రాజీవ్గాంధీ విచారణకు హాజరయ్యారు. ‘ఆ రోజు ఏం జరిగిందో వివరించాం.. ఎన్ఐఏ అధికారులైనా నిజాలు నిగ్గు తేలుస్తారని భావిస్తున్నాం’ అని నేతలు మీడియాతో చెప్పారు. -
నెల్లూరులో టీడీపీకి ఎదురు దెబ్బ
సాక్షి, నెల్లూరు : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోట్టి శ్రీరాములు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్ నందకుమార్ డెవిడ్తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్పార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యయత్నంపై ఎన్ఐఏ విచారణపై చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నాడో అర్థం కావడం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వెంకట రమణను టీడీపీలో చేర్చుకోవడంతోనే మీ బండారం బయటపడిందన్నారు. వెంకటరమణ చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
సిట్ తీరుపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు. -
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
-
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏ, సిట్ అధికారులను ఆదేశించింది. (ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ) వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఏం లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పటిష్ట భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రికి తీసుకెళుతున్నారు. (ఎన్ఐఏ విచారణకు హర్షవర్ధన్ గైర్హాజరు) -
ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి బ్యూరో, విజయవాడ లీగల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు తమకు ఏమాత్రం సహకరించడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురువారం విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. వాదనలను విన్న అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వైఎస్ జగన్పై గత ఏడాది అక్టోబరు 25న జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్లు స్పందిస్తూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెలిసిందే. అనంతరం ఈ కేసుపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన విచారణకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, వస్తువులను ఎన్ఐఏకు అప్పగించాలని విశాఖ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే విశాఖ పోలీసులు కేసుకు సంబంధించిన రికార్డులను ఇంతవరకు తమకు అప్పగించకుండా సహాయ నిరాకరణ చేయడంపై ఎన్ఐఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖ పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమకు కేసు రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్స్అందించడం లేదని పేర్కొంది. 23లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితుడికి బెయిల్! విశాఖ పోలీసు అధికారులు నిందితుడు శ్రీనివాసరావుకు సహకరిస్తున్నారని, తమ విచారణకు మాత్రం సహకరించడం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో 90 రోజుల్లోగా అంటే ఈ నెల 23లోగా తాము చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉందని, లేదంటే నిందితుడు శ్రీనివాసరావు బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ న్యాయస్థానానికి నివేదించింది. ఈ కేసులో తాము ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చాలా రోజులైనా రాష్ట్ర పోలీసు అధికారులు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. రికార్డులు లేకుండా చార్జ్షీట్ దాఖలు చేయలేమని కోర్టు దృష్టికి తెచ్చింది. కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్లను తమకు అప్పగించేలా విశాఖ పోలీసులను ఆదేశించాలని ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కస్టడీ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మరో వారం రోజులు పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోరే అవకాశం ఉంది. కుట్ర కోణం వెలుగులోకి వస్తోందనే... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే సూత్రధారులని స్పష్టమవుతోంది. ఈ హత్యాయత్నం కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని బెంబేలెత్తుతూ రాష్ట్ర పోలీసుల ద్వారా కేసు విచారణను తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఈ కేసు విచారణను చేపట్టడంతో సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సూత్రాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం బరితెగించడం విస్మయపరుస్తోంది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపడితే తమ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈమేరకు 2018 నవంబరు 8న ప్రత్యేక జీవో జారీ చేసింది. జగన్పై హత్యాయత్నం కేసు విచారణను సీబీఐ చేపట్టకుండా అడ్డుకునేందుకే హడావుడిగా ఈ జీవో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘ఎన్ఐఏ’పై సహాయ నిరాకరణ అస్త్రం న్యాయస్థానం ఆదేశాలతో జగన్పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్ఐఏను సైతం సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హత్యాయత్నం సూత్రధారులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించేందుకు యత్నిస్తోందన్నది దీనిద్వారా మరింతగా ప్రస్పుటమైంది. రాష్ట్ర పోలీసుల సహాయ నిరాకరణపై ఎన్ఐఏ తాజాగా న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. రికార్డులను తారుమారు చేసే అవకాశం? న్యాయస్థానం ఆదేశించిన తరువాత నిబంధనల ప్రకారం జగన్పై హత్యాయత్నం కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏకు అప్పగించాలి. కానీ విశాఖపట్నం పోలీసులు ఇంతవరకు ఆ పని చేయకపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెయిల్పై తరలించి మట్టుబెట్టే కుట్ర? వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే కేసు విచారణ చేపట్టిన విశాఖపట్నం పోలీసులు ఉద్దేశపూర్వకంగానే రెండు నెలలు దాటినప్పటికీ చార్జ్షీట్ దాఖలు చేయలేదు. మరోవైపు ఈనెల 9న విచారణ చేపట్టిన ఎన్ఐఏకు రికార్డులు అందించకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నెల 23 వరకు ఇలాగే వ్యవహరించి నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఉంది. బెయిల్పై శ్రీనివాసరావు బయటకు వస్తే తరువాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంతు చిక్కకుండా ఉంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే నిందితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. భద్రత లేని బాహ్య ప్రపంచంలోకి శ్రీనివాసరావును తరలించి మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టుకు సర్కారు! సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం లేదా శనివారం హౌస్మోషన్ (న్యాయమూర్తి ఇంటి వద్ద విచారణ జరపడం) రూపంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హౌస్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరిస్తే సోమవారం కోర్టు పునఃప్రారంభమయ్యాక ఈ వ్యవహారంపై వాదనలు వినాలని అభ్యర్థించనుంది. హౌస్మోషన్ రూపంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులంతా శనివారం లేదా ఆదివారం అమరావతి చేరుకునే వీలుంది. ఎన్ఐఏ తన దర్యాప్తును ఎప్పుడో ప్రారంభించినందున హౌస్మోషన్ రూపంలో విచారణ జరిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. సీఎంతో డీజీపీ ఠాకూర్ భేటీ ఎన్ఐఏ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు గురువారం డీజీపీ ఠాకూర్తో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించి దర్యాప్తును అడ్డుకునే విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
ఎన్ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్ హెడ్క్వార్టర్స్ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ 2 రోజులక్రితం హాజరయ్యారు. నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్పోర్ట్లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. గురువారం ఆయన హాజరుకావొచ్చని భావించారు. నిజానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్ అధికారులు హర్షవర్ధన్ జోలికే పోలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏవిచారణకు హర్షవర్ధన్ చౌదరి హాజరైతే కీలక సమాచారం రాబట్టవచ్చన్న వాదనలు వినిపించాయి. దీంతో గురువారమే హర్షవర్ధన్ విచారణకు హాజరు కావొచ్చన్న ప్రచారంతో పెద్దఎత్తున మీడియా ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్ సహా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్చల్ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని టీడీపీ నేతలే చెప్పుకొస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి. -
వైఎస్ జగన్పై దాడి కేసులో ఏముంది?
సాక్షి, అమరావతి: ‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన అభిమానే కోడి కత్తితో దాడి చేశాడు.. ఆ కేసులో ఏముంది.. ఆ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్ర హక్కులను హరించడమే’నని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర హక్కులను హరిస్తే కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. మాజీమంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలకు కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున టీడీపీ కోసం ప్రచారం చేయాలని.. 25 లోక్సభ స్థానాల్లోనూ టీడీపీనే గెలిపించాలని కోరారు. చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు దావోస్ పర్యటనను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. ఆయనకు బదులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ నేతృత్వంలోని 15 మంది అధికారుల బృందం వెళ్లనుంది. ఈనెల 22 నుంచి 25 వరకూ అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆ బృందం పాల్గొననుంది. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు.. ఎన్ఐఏ విచారణకు సిట్ నిరాకరణ
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టినా కేసు రికార్డులు అందజేసేందుకు సిట్ నిరాకరిస్తోంది. ఎన్ఐఏకు అప్పగించిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అప్పగించేందుకు ఏపీ సిట్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈమేరకు ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ తీరుపై మండిపడ్డ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. -
‘ఎయిర్పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ) శ్రీనివాస్ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్ డేటా వివరాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్ను ఎక్కడ విచారస్తారనేది ఎన్ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు. కాగా, వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. -
కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమ కార్యాలయంలో నాలుగో రోజు విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు పలువురిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలు ముందుంచి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు చెప్పే విషయాలను రికార్డ్ చేస్తున్నారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు నిందితుడు ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్ఐఏ అధికారులతో కూడిన మరో బృందం విశాఖపట్నంలో విచారణ జరుపుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగుందని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్ను మరోసారి విశాఖపట్నం తీసుకెళ్లే అవకాశం లేదని, మిగతా మూడు రోజులు హైదరాబాద్లోనే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. (వైఎస్ జగన్పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?) -
వైఎస్ జగన్పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
సాక్షి, అమరావతి/సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించింది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ మూడో రోజు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్లోని మాదాపూర్లో వైద్య పరీక్షలు నిర్వహించాక విచారణ కొనసాగించారు. మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాస్రావును అతని న్యాయవాది సమక్షంలోనే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. జగన్పై హత్యాయత్నం ఎందుకు చేశావు.. వెనుక ఎవరున్నారనే దానిపై విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఒక్క సంవత్సరంలో వందలాది సిమ్ కార్డులు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు మార్చడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. టీడీపీ నేతతో శ్రీనివాసరావు ఫోన్ కాల్స్పై దృష్టి: జగన్పై హత్యాయత్నం చేయడానికి ముందుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్ఫుడ్స్ యజమాని వద్ద పనికి కుదిర్చిందెవరు? సంబంధిత టీడీపీ నేతతో శ్రీనివాస్రావుకు జరిగినట్టు భావిస్తున్న ఫోన్ కాల్స్ సంభాషణలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్టు లోపలికి వెళ్లేందుకు ఇచ్చే అనుమతి పాస్ తాత్కాలికమైనా క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఎలా ఇచ్చారు? తాత్కాలిక పాస్ ఇప్పించిందెవరన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాస్కు సిఫారసు లేఖతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరన్నది ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హత్యాయత్నం చేయడానికి ఎవరైనా పురిగొల్పారా? అనే కోణంపై దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావు కస్టడీలో నాల్గో రోజైన మంగళవారం మరోసారి విశాఖ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేర స్థలంలో మరికొన్ని అదనపు వివరాలు సేకరించే విషయంపై ఎన్ఐఏ అధికారులు దృష్టిసారించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. -
లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం) -
ఎన్ఐఏ అదుపులో శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు) శ్రీనివాసరావును విచారణ నిమిత్తం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే వారం రోజుల పాటు నిందితుడిని అధికారులు విచారించనున్నారు. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
విశాఖ లీగల్/అల్లిపురం (విశాఖ దక్షిణం): ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ను విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నెల 9న శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు ఈ నెల 4న ఎన్ఐఏకు బదిలీ అయినందున ఎన్ఐఏ పీపీకి నోటీసు ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది అబ్దుల్ సలీమ్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సలీమ్, ఎన్ఐఏ పీపీ సిద్దరాములుకు నోటీస్ అందజేసి, దానిని కోర్టువారికి అందజేశారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఎన్ఐఏ పీపీ ని వివరణ కోరగా.. ఆయన కేసుకు రికార్డుల నిమిత్తం 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. ఇంకా రికార్డులు ఏపీ పోలీసుల నుండి తమకు చేరలేదని విన్నవించారు. దీంతో న్యాయమూర్తి కేసు ఎన్ఐఏకి బదిలీ చేసినందున కోర్టు పరిధిలోకి రాదని తెలియజేశారు. న్యాయవాది సలీమ్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. కాగా ఎన్ఐఏ అధికారులు ఈ నెల 7న కేసు రికార్డులు తమకు అప్పగించాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. జనవరి 1న (ఆర్సీ నంబరు 01/2019/ఎన్ఐఏ/హైదరాబాద్) ఎఫ్ఐఆర్ నమోదైనందన రికార్డులు అప్పగించాలని కోరారు. ఈ మేరకు న్యాయమూర్తి గురువారం సాయంత్రం కేసు రికార్డులను ఎన్ఐఏ అప్పగించే నిమిత్తం విజయవాడకు తరలించారు. ఎన్ఐఏకు నిందితుడి అప్పగింత నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ శుక్రవారం వరకు ఉండటంతో గురువారం సాయంత్రం నిందితుడిని ఎన్ఐఏకు అప్పగిస్తూ వారెంట్ జారీ చేశారు. ఉత్తర్వులు అందినట్లు జైలు అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి దాటాక శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు విజయవాడ తరలించారు. అతడిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. -
జగన్పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
-
జగన్పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పునిచ్చింది. జగన్పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజయవాడకు బదిలీ చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఎన్ఐఏకు అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘చంద్రబాబు స్టేల సీఎం’
-
‘చంద్రబాబు స్టేల సీఎం’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలేవి రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎన్ఐఏని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుంటుండగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన మీద పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్టేల సీఎంగా బాబు పేరు మారుమోగి పోతుందంటూ ఎద్దేవా చేశారు. బాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. టీడీపీ మంత్రులు, నాయకుల అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు వస్తే సహకరించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న లక్షల కోట్ల అవినీతి సొమ్మును దాచుకునేందుకు బాబు కూడా విజయ్ మాల్యాలా దేశం విడిచి పారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అడ్రస్ లేని గంటా ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిలో గంటాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలన్నారు. సహచర మంత్రి అయ్యన్న ఆరోపణలకు గంటా ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కాక దోచుకున్న ఆస్తులు దాచుకోవడానికి సీఎం పర్యటనలు చేస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. -
ఇవ్వంగాక ఇవ్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కుట్ర కేసు దర్యాప్తు మొదలు పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు విశాఖ పోలీసుల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోం శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగిన ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐఓ) మహ్మద్ సాజిద్ఖాన్ సహా ఐదుగురు అధికారులకు విశాఖ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కేసులను సైతం ధైర్యంగా, చాకచాక్యంగా ఎదుర్కొన్న ఎన్ఐఎ అధికారులకు ఇలా ఓ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నుంచి సహాయనిరాకరణ ఎదురుకావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కేసు విచారణ ఫైళ్లు అప్పగించడం సంగతి పక్కన పెడితే కనీసం కేసు వివరాలను కూడా చెప్పేందుకు విశాఖ పోలీసు అధికారులు నిరాకరించడాన్ని ఎన్ఐఎ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలతో ఎన్ఐఎ అధికారులు విశాఖ చేరుకున్న రోజు నుంచే నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఎన్ఐఎ బృందం జగన్పై హత్యాయత్నం ఘటనపై విచారణకు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులను, కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులను సంప్రదించింది. తొలి రెండురోజులు సమాచారం ఇవ్వలేమని, ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలున్నాయని ఎన్ఐఎ వర్గాలతో చెప్పిన సిట్ అధికారులు సోమవారం కనీసం వారిని కలిసేందుకు కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. కేసును ఎన్ఐఎకు అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో విశాఖ పోలీసులు, సిట్ అధికారులు ఎన్ఐఎ వర్గాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. కాగా ఎన్ఐఎ అధికారులకు విశాఖ పోలీసుల్లో ఎవరైనా సహకరిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిఘా వేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి, టీడీపీలో కీలక నాయకుడు ఆదివారం పొద్దుపోయాక ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎన్ఐఎ అధికారులకు ఏ మాత్రం సహకరించినా బాగుండదు.. అని హుకుం జారీ చేసినట్లు పోలీసువర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక సోమవారం విశాఖ వచ్చిన హోం మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కేసును ఎన్ఐఎకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. కుట్ర లేకుంటే అంత ఆందోళన ఎందుకో వైఎస్ జగన్పై హత్యాయత్న ఘటన వెనుక భారీ కుట్ర, విచారణలో పెద్దల ప్రభావం లేకుంటే ఎన్ఐఎ రంగంలోకి దిగగానే రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీ పెద్దలకు ఇంత ఉలికిపాటు ఎందుకన్న వాదనలు ప్రతిపక్షాలు, ప్రజల నుంచే కాదు స్వయంగా ఎన్ఐఎ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ మేరకే ఎన్ఐఎ వర్గాలు యోచిస్తూ కేసు దర్యాప్తు ఎటు నుంచి మొదలుపెట్టాలనే యోచిస్తున్నాయి. పోలీసులు సహకరించడం లేదు.. ఎన్ఐఎ వర్గాలు వాస్తవానికి విచారణ దశలో ఉన్నప్పుడు కేసు వివరాల గురించి మేం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. విశాఖలోనే మకాం వేసిన మాకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి సహకారం అందని మాట నిజమే. ఎన్ఐఎకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లేదో ఛాలెంజ్ చేయాలని చూస్తున్నారు.. ఈ విషయాలను మేం కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లి కేసు దర్యాప్తును ముందుకు ఎలా తీసుకువెళ్లాలో చూస్తాం.. అని ఎన్ఐఎకి చెందిన ఓ అధికారి సోమవారం సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. కోర్టుకూ అదే సమాధానం.. న్యాయమూర్తి ఆగ్రహం విశాఖ లీగల్: రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. నగరంలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సీడీ ఫైల్ ఇవ్వాలని ఏపీపీ పోలీసులను కోరగా.. పైఅధికారుల అనుమతిలేనిదే ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనితో ఏపీపీ అదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి పార్థసారధి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన నోటీస్ను ఎన్ఐఏకు జారీ చేశారు. ఎన్ఐఏకు నోటీస్ ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశిస్తూ కేసును ఈనెల 19కి వాయిదా వేశారు. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు.. వైజాగ్ చేరుకున్న ఎన్ఐఏ బృందం
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ బృందం సోమవారం వైజాగ్ చేరుకున్నారు. స్థానిక పోలీసులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అనంతరం ఎన్ఐఏ బృందం ఎయిర్ పోర్టులోని సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించనున్నరు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసులో నిందుతుడు శ్రీనివాస్ రావును విచారణ చేయనున్నట్లు తెలిపారు. -
పోలీసులు బాబు ఒత్తిళ్లకు తలొగ్గితే కోర్టుకెళ్తాం : ఆర్కే
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన జరిగిన హత్యాయత్నం కేసు నిరూపించడానికి అవసరమైతే న్యాయ పోరటానికి దిగుతామంటున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడి మీద జరిగిన హత్యాయత్నం కేసులో చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు విచారణకు సహకరించకపోతే వారిపైన కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు విచారణకు సహకరించాలని ఎన్ఐఏ చట్టంలో సెక్షన్ 9 స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్ఐఏను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే దానిపైన పోరాడాల్సిన బాధ్యత కూడా ఎన్ఐఏదేనని తెలిపారు. ఎన్ఐఏ విచారణకు సహకరించని అధికారులపై ఐపీసీ 166 సెక్షన్ ప్రకారం కోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు. -
బాబు అవినీతి చిట్టాను పార్లమెంట్ సాక్షిగా చాటుతాం
సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబుకు చట్టాల మీద నమ్మకం లేదని, ఆయనకు దమ్ము, ధైర్యం లేకనే వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏకు సహకరించడం లేదని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీ వెళ్తున్నామని, అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాల్పడిన రూ. ఆరు లక్షల 17వేల కోట్ల అవినీతి చిట్టాను పార్లమెంట్ సాక్షిగా వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు కోసం ఎన్ఐఏ రంగంలోకి దిగగానే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగపరంగా ఉన్న ఏజెన్సీలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ, నిన్న (శనివారం) విశాఖపట్నం వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందానికి పోలీసులు సహరించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను చంద్రబాబు అడుగుపెట్టనివ్వడం లేదని, కానీ, టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వర్రావు, సోమ హత్య కేసులో మాత్రం ఎన్ఐఏ విచార జరపాలని చంద్రబాబు కోరుతున్నారని, ప్రభుత్వం వైఖరిని వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
ప్రతిపక్ష నేత హత్యకు కుట్ర కేసులో... 10 అంకాలు
అక్టోబరు 25, 2018.. మ.12.45 గం.–12.48 గం. : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై నిందితుడు జునుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మ.1.30గం. : డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నిందితుడు పేరు, ఊరు వెల్లడించి అతను వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, జగన్ అభిమాని అని ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. మ.2గం. : వైఎస్జగన్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని ముగ్గురు మంత్రులు మొబైల్లో చూపించారు. (సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఆర్పీసీ–156 ప్రకారం.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. స్వయంగా సీఎంయే నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు?) మ.3.30గం. : తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంకలోని నిందితుడు శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న స్థానిక టీడీపీ నేతలు. శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటన. మారుమూల ఉన్న ఆ ఇంటికి అంత తక్కువ సమయంలో ఎలా చేరుకోగలిగారు? రాత్రి 7గం. : సీఎం చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసమే వైఎస్ జగన్పై హత్యాయత్నం నాటకం ఆడారని ప్రకటించారు. 1.ఏడాదిన్నర క్రితమే హత్యకు కుట్ర.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను హతమార్చడానికి చేసిన కుట్రకు బీజం.. హత్యాయత్నం జరగడానికి ఏడాదిన్నర ముందే ప్రారంభమైంది. జగన్ గొంతులో కత్తిదింపి అంతమొందించడానికి నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఏడాదిన్నర క్రితమే ఎంపిక చేసుకుని ఆ కుటుంబానికి ‘అన్నీ’ సమకూర్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆ కుటుంబం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని తమ స్వగ్రామం ఠానేలంకలో చకచకా ఇంటిని నిర్మిస్తుండటం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఆ ఇంటి నిర్మాణానికి అధికార పార్టీ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం.. ఠానేలంకలోని నిందితుడి కుటుంబం నిర్మిస్తున్న ఇంటిని చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా రోజువారీ కూలీ మీద జీవనం సాగిస్తున్న కుటుంబం ఉన్నట్లుండి ఇంటి నిర్మాణానికి రూ.20 లక్షలు వ్యయం చేయడానికి సిద్ధపడటం అనుమానాలను రేకెత్తిస్తోంది. నిందితుడి కుటుంబం ఠానేలంక గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టి 60 శాతానికి పైగా పూర్తిచేసింది. ఇప్పటివరకు రూ.12 లక్షలు ఖర్చు చేశామని నిందితుడి తల్లి సావిత్రమ్మ చెప్పారు. ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణ పథకం కింద అందింది రూ.2 లక్షల లోపే. మిగతా రూ.10 లక్షలు వారి చేతి నుంచే పెట్టారు. ప్రశ్న : విపక్ష నేతను హత్య చేయడానికి రూపొందించిన ప్రణాళికలో నిందితుడు శ్రీనివాసరావును ‘ఇన్స్ట్రుమెంట్’గా వాడటానికి అప్పుడే ఎంపిక చేసుకున్నారని ‘ఇంటిగుట్టు’ చెప్పకనే చెబుతోంది. నిందితుడి కుటుంబానికి ఉన్నట్లుండి అంత సొమ్ము ఎలా వచ్చిందనే దిశగా ‘సిట్’ దర్యాప్తు ఎందుకు చేయలేదు? 2.నిందితుడి కుటుంబం పక్కా టీడీపీ.. పీఎంఏవై–ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఠానేలంకలో 143 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తే.. అవన్నీ టీడీపీ కార్యకర్తలకు, ఆ పార్టీ సానుభూతిపరులకే దక్కాయి. ఈ పథకంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు వాటిని మంజూరు చేయకపోవడం గమనార్హం. ప్రతిపక్షానికి చెందిన 16 మందికి అన్ని అర్హతలున్నాయని అధికార యంత్రాంగం నిర్ధారించిన తర్వాత కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ‘నిందితుడి కుటుంబం వైఎస్సార్సీపీ అయితే ఇల్లు వచ్చేదా? ఇంటి నిర్మాణంలోనూ నిబంధనలను ఉల్లంఘించినా.. వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబమే అయితే టీడీపీ వాళ్లు చూస్తూ ఊరుకునే వారేనా?’.. అని నిందితుడు శ్రీనివాసరావు బాబాయి, టీడీపీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన జనుపల్లి నాగేశ్వరరావు ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు.. తమకు అన్ని అర్హతలున్నా ఇళ్లు మంజూరు చేయలేదని, నిర్మాణ సామగ్రి సమకూర్చుకున్న తర్వాత మంజూరు జాబితాలో తమ పేర్లు లేకుండా తొలగించారని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెల్లడించారు. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అంటూ ఇటు నిందితుడి బాబాయి నాగేశ్వరరావు చెప్పడం, తమకు అన్ని అర్హతలున్నా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే ఏకైక కారణంతోనే ఇళ్లు ఇవ్వలేదని మిగతా వారంతా చెప్పడం ద్వారా శ్రీనివాసరావు కుటుంబానిది ఏ పార్టీ అనే విషయం స్పష్టమవుతోంది. నిందితుడి స్నేహితులు, ఇరుగుపొరుగు వారూ.. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అని చెప్పారు. వైఎస్సార్సీపీ అయితే రెండు ఇళ్లు ఇస్తారా? మా రోడ్డులో ఇళ్లు కట్టుకునే వాళ్లకు లోన్ ఇవ్వలేదు. పిల్లర్లలోనే ఇళ్లు ఆగిపోయాయి. ఇలాంటి (శ్రీనివాసరావు కుటుంబానికి) వాళ్లకు రెండు లోన్లు ఇచ్చారు. ఒకసారి ఆ పార్టీ, మరోసారి ఈ పార్టీ అంటూ సుబ్బరాజు (శ్రీనివాసరావు సోదరుడు) అంటున్నారు. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారో తెలుసుకోండి. అందరూ బేస్మట్టం వేసుకుని లోన్లు కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ వైఎస్సార్సీపీ అని ఇవ్వలేదు. మరి సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారు? కనుక్కోండి. కాగిత బాబూజీ వైఎస్సార్సీపీ అని లోన్ ఇవ్వలేదు. సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి సుబ్బరాజుకు రెండు ఎలా ఇచ్చారు? ముందేమో టీడీపీ, తర్వాత ఎవరికి పడితే వారికి వేస్తాం. ఇప్పుడు వైఎస్సార్సీపీ అంటున్నారు. ప్రజలకు అంతా అర్థం అవుతోంది. వాళ్లలో పశ్చాత్తాపంలేదు. మేం హడలిపోతున్నాం. వాళ్లేమో డేర్గా మాట్లాడుతున్నారు. మాకేమీ అర్థం కావడంలేదు. – జనుపల్లి నాగేశ్వరరావు (శ్రీనివాసరావు బాబాయి, ఠానేలంకకు ఉప సర్పంచ్గా పనిచేశారు. టీడీపీ నాయకుడు) ఏకగ్రీవంగా ఎన్నికైనా వైఎస్సార్సీపీ అని ఇల్లు ఇవ్వలేదు లోన్ పెట్టుకుంటే పార్టీవల్ల ఇవ్వడంలేదు. మా లోను కాగితాలు పక్కనబెట్టేశారు. ఏకగ్రీవంగా నన్ను ఠానేల్లంక పంచాయితీలో 8వ వార్డు మెంబర్గా ఎన్నుకున్నారు. మూడుసార్లు పంచాయితీకి వెళ్లి అప్లై చేశాను. పంచాయితీలో కనీసం కాగితాలు కూడా లేకుండా చేశారు. ఇల్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నాం. మా వార్డులో అంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు మాత్రం ఇంటి లోను ఇవ్వడం లేదు. నా మరిది రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్గా ఉన్నారని నాకు ఇల్లు ఇవ్వబోమంటున్నారు. అదేమని అడిగితే మీ పార్టీ వాళ్లకు ఇళ్లు ఇవ్వబోమని చెబుతున్నారు. – నక్కా అమృతవల్లి, బలుసుల్లంక, ముమ్మిడివరం ప్రశ్న : ఠానేలంకలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. ఇల్లు మంజూరైన నిందితుడు శ్రీనివాసరావు మాత్రం వైఎస్సార్సీపీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. దీనివెనక ఉన్న అంతరార్థం ఏమిటి? 3.తర్వాత అంకం ‘ఫ్లెక్సీ నాటకం’.. ఇంటి నిర్మాణానికి అన్ని రకాలుగా సహకారం అందించిన తర్వాత నిందితుడు, కుట్ర సూత్రధారుల మధ్య పరస్పరం నమ్మకం ఏర్పడి ఉండవచ్చు. తర్వాత అంకంలో.. నిందితుడిని జగన్ అభిమానిగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో ‘ఫ్లెక్సీ నాటకం’ మొదలుపెట్టారు. కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న జనుపల్లి శ్రీనివాసరావును జగన్ అభిమానిగా చిత్రీకరించడానికి వీలుగా 2018 జనవరి 1న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీని.. సూత్రధారుల సూచనలకు అనుగుణంగా ఠానేలంకలో ఏర్పాటుచేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. ఎక్కడో మారుమూల గ్రామంలో దాదాపు 10 నెలల క్రితం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ సమాచారాన్ని పోలీసులు వెల్లడించడం వెనక.. ‘సూత్రధారుల ప్రణాళిక’ ఉందనేది స్పష్టం. ప్రశ్న : జగన్ మీద హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు జగన్ అభిమాని అని, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ (2018 జనవరి 1న) ఫ్లెక్సీ కూడా వేయించారని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీని పోలీసులు విడుదల చేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. 10 నెలల క్రితం వేయించిన ఫ్లెక్సీ గురించి పోలీసులకు ఎవరు చెప్పారు? పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? దొంగలను పట్టించిన ‘రోజాపూలు’ హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీలో రోజాపూలు లేవు. ‘రోజాపూలు లేకుండా ఫ్లెక్సీ పీడీఎఫ్ను జనుపల్లి శ్రీనివాసరావు ఆమోదం కోసం లేపాక్షి ప్రింటర్స్లో పనిచేస్తున్న చైతన్య స్నేహితుడు 2017 డిసెంబర్ 30న చైతన్య (శ్రీనివాసరావుకు బంధువు)కు మెయిల్ పంపించాడు. అయితే, శ్రీనివాసరావు నేరుగా పి.గన్నవరంలోని లేపాక్షి ప్రింటర్స్కు వచ్చి మెయిల్లో పంపించిన ఫ్లెక్సీ నమూనాకు కొద్దిపాటి మార్పులు చేశాడు. రోజాపూలు ఉండాలని ఫ్లెక్సీలో పెట్టించాడు. రోజాపూలు పెట్టిన తర్వాత ఫ్లెక్సీ నా ప్రింటర్స్లోనే ప్రింట్ చేసి పట్టుకెళ్లాడు’ అని చెప్పారు. –ఫ్లెక్సీని ప్రింట్ చేసిన లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్ప ఫ్లెక్సీ చిరిగిపోతే రోజాపూలు అంటించారు లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్ప చెబుతున్న దానికి, నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు చెబుతున్న విషయానికి పొంతనలేదు. ‘ఫ్లెక్సీ కట్టిన తర్వాత అది చిరిగిపోయింది. ఫ్లెక్సీ చిరిగిపోయిందని శ్రీనివాసరావు బాధపడి.. చినిగిన చోట రోజాపూలు బొమ్మతో ప్యాచ్ అతికించాడు. అందువల్ల పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీలో రోజాపూలు లేవు. పోలీసులకు లభించిన ఫ్లెక్సీలో రోజాపూలున్నాయి’. – సుబ్బరాజు (శ్రీనివాసరావు అన్న) అయ్యప్ప మాటలపైనా అనుమానాలు.. నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా తమ ఆఫీసుకు వచ్చి రోజాపూలు పెట్టించుకుని ఫ్లెక్సీ ప్రింట్ తీసుకెళ్లాడని లేపాక్షీ ప్రింటర్స్ యజమాని అయ్యప్ప చెప్పారు. మరి రోజాపూలతో ఉన్న ఫ్లెక్సీ పీడీఎఫ్ కాపీ చూపించమని అడిగినప్పుడు.. ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం) పోయిందని, అందువల్ల 2017 డిసెంబరు ఫైళ్లు పోయాయని చెప్పారు. నిజానికి.. అయ్యప్ప చెబుతున్న మాటల్లో వాస్తవంలేదు. ‘ఓఎస్ పోతే.. మొత్తం ఫైళ్లు పోతాయి. ఒక నెల, ఒక వారం ఫైళ్లు మాత్రమే పోయే అవకాశం లేదు’ అని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా డిసెంబర్ ఫైళ్లు మాత్రమే పోయాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. ‘ఎస్ఆర్టి ప్రింటర్స్’ కథ ఏమిటి? పోలీసులు బయటపెట్టిన ఫ్లెక్సీ.. ఎస్ఆర్టీ ప్రింటర్స్లో ప్రింట్ చేయించినట్లు ఫ్లెక్సీ కింద ముద్రించారు. ఎస్ఆర్టీ ప్రింటర్స్ అనేది ఎక్కడా లేదు. ఆ ప్రింటర్స్ పేరిట ఫ్లెక్సీలో ఇచ్చిన ఫోన్ నంబర్ లేపాక్షి ప్రింటర్స్ యజమాని అయ్యప్పది. ఇదే విషయాన్ని అయ్యప్పను అడిగితే.. ‘నా దగ్గర పనిచేసే కుర్రాడు తెచ్చుకునే ఆర్డర్స్ (వ్యాపారం)కు ఎస్ఆర్టీ ప్రింటర్స్ అని వేస్తామ’ని సమాధానం ఇచ్చారు. మరి ఫోన్ నంబర్ ఆ కుర్రాడిది కాకుండా.. యజమాని నంబర్ ఎందుకు పెట్టారనే ప్రశ్నకు సమాధానంలేదు. ప్రశ్న : ఫ్లెక్సీ ప్రింట్ చేసిన లేపాక్షి ప్రింటర్స్ యజమాని.. ఫ్లెక్సీలో రోజాపూలున్నాయని చెప్పారు. నిందితుడు సోదరుడు అందుకు భిన్నంగా.. ఫ్లెక్సీలో రోజాపూలు లేవు.. ఫ్లెక్సీ చినిగిపోతే ప్యాచ్లాగా రోజాపూలు బొమ్మ అతికించారని చెప్పారు. పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్లో రోజాపూల బొమ్మ లేదు. పోలీసులు కనుక్కున్నామని చెబుతున్న ఫ్లెక్సీలో మాత్రం రోజాపూల బొమ్మ ఉంది. నిందితుడు కట్టిన ఫ్లెక్సీ ఒకే ఒకటి. ఈ పొంతనలేని సమాధానాలే చెబుతున్నాయి కదా ఇందులో ఏదో మతలబు దాగి ఉందని? ఈ దిశగా ఎందుకు విచారణ చేయలేదు? 4.కుట్ర అమల్లో తదుపరి ఘటం.. విమానాశ్రయ ప్రవేశం కుట్ర అమలుకు విమానాశ్రయాన్ని ఎన్నుకోవడం వెనకా సూత్రధారులు పెద్ద కసరత్తే చేశారు. ప్రజల్లో జగన్ మీద పాశవిక దాడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. పెద్దగా జనంలేని ప్రాంతాన్ని కుట్రదారులు ఎంపిక చేసుకున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతమైతే.. హత్య తర్వాత పరిణామాల్లో తమ చేతులకు మట్టి అంటకుండా బయటపడొచ్చనే ఆలోచన కుట్రదారులకు ఉందని స్పష్టమవుతోంది. విమానాశ్రయంలోకి నిందితుడిని తీసుకెళ్లడానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి మార్గం సుగమం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు మీద ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా.. నిందితుడికి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ వెనక టీడీపీ నేతల ఒత్తిడి ఉందని అనుకోవచ్చు. దరఖాస్తుదారుడికి నేర చరిత్రలేదని నిర్ధారించడానికి మొట్టమొదట చేసే పని.. సొంత ఊరు పోలీస్స్టేషన్లో వాకబు చేయడం. సంబంధిత జిల్లా ఎస్పీకి లేఖ రాసి దరఖాస్తుదారుడి నేర చరిత్ర తెలుసుకుంటారు. దాడి చేయడం, చంపుతానని బెదిరించిన ఘటనలో ముమ్మిడివరంలో శ్రీనివాసరావు మీద కేసు నమోదైంది. నేర చరిత్రను దాచి, నిందితుడికి ఎన్వోసీ తెప్పించి నిందితుడిని విమానాశ్రయ ప్రవేశం చేయించడంలో సూత్రధారులు విజయవంతమయ్యారు. ముమ్మిడివరం పీఎస్లో కేసు 2017 మార్చి 2న ముమ్మిడివరం పోలీసుస్టేషన్లో నిందితుడు శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఓ వివాహ వేడుకలో తనపై దాడిచేసి కొట్టి, చంపుతానని శ్రీనివాసరావు బెదిరించడంతో కాగిత వెంకటేష్ అనే వ్యక్తి కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ 48/2017, సెక్షన్ 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఎ–4గా శ్రీనివాసరావు పేరు ఉంది. 41ఎ సీఆర్పీసీ కింద శ్రీనివాసరావుకు పోలీసులు నోటీసు జారీచేసి విచారించారు. కోర్టులో చార్జిషీటు కూడా పోలీసులు దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ముమ్మిడివరం పీఎస్లో 2017 ఏప్రిల్ నుంచి ఎస్ఐగా పనిచేస్తున్నాను. నేను శ్రీనివాసరావుకు ఎన్ఓసీ ఇవ్వలేదు. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు – ముమ్మడివరం ఎస్ఐ పి. ప్రభాకర్ ప్రశ్న : రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయం(విశాఖ విమానాశ్రయం పౌర విమానయాన శాఖ పరిధిలోది కాదు) లోకి ప్రవేశానికి వీలుగా ఎన్వోసీ జారీచేయడంలో నిందితుడి నేర చరిత్రను పోలీసులు దాచి పెట్టడం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? పోలీసులు ఈ దిశగా ఎందుకు విచారణ చేయడంలేదు? సూత్రధారుల బండారం బయటపడుతుందనే ఎన్వోసీ జారీలో నిబంధనలను పాటించలేదనే విషయాన్ని ‘సిట్’ పట్టించుకోవడంలేదా? 5.నిందితుడిపై హర్షవర్ధన్ చౌదరికి ఎంత ప్రేమ శ్రీనివాసరావు మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అని పోలీసులు పదే పదే చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్కి ఉన్న పార్టీ (టీడీపీ) నేపథ్యం చూస్తే.. పొరపాటున కూడా తన సంస్థల్లో తన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. మరి శ్రీనివాసరావుకు ఎలా ఇచ్చారు? రెస్టారెంట్లో పనిచేస్తున్న అందరికంటే శ్రీనివాసరావుకే ఎక్కువ వేతనం ఇచ్చి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించడానికి కారణమేంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కుట్ర కోణం సులభంగానే అర్థమవుతుంది. తమ కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న శ్రీనివాసరావుకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మిగతా సిబ్బంది కంటే ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని నిందితుడ్ని ‘ప్రత్యేకంగా’ చూశారు. ప్రశ్న : అంత ప్రత్యేకంగా చూడటానికి కారణాలను ‘సిట్’ ఎందుకు అన్వేషించలేదు? అలా అన్వేషిస్తే సూత్రధారులెవరో తేలిపోతుందని పలువురు పోలీసు అధికారులు, విమానశ్రయం ఉన్నతాధికారులు ‘సాక్షి’ బృందానికి చెప్పారు. 6.మట్టుబెట్టేందుకే మాటేశారు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అనధికారికంగా ఓ వ్యక్తి ఒక్కరోజైనా ఉండగలడా?.. ఏమాత్రం సాధ్యం కాదు. కానీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఏకంగా ఏడాదిపాటు ఉన్నాడు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర నివేదిక బహిర్గతం చేసింది. విమానాశ్రయంలో ప్రవేశానికి ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ (ఏఈపీ) తప్పనిసరి. మరి శ్రీనివాసరావుకు ఏఈపీ ఎవరిచ్చారు.. ఎలా ఇచ్చారో తెలియజేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి బీసీఏఎస్ను కోరారు. దీనిపై బీసీఏఎస్ డీజీ ఇచ్చిన సమాధానంతో అసలు కుట్ర కోణం బట్టబయలైంది. అసలు శ్రీనివాసరావుగానీ అతని తరఫున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్గానీ ఏఈపీ కోసం దరఖాస్తు చేయనేలేదని ఆయన వెల్లడించారు. కాబట్టి తాము ఏఈపీ జారీ చేయలేదని చెప్పారు. కాగా, నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయం డి–జోన్లో పనిచేసేందుకు 2018 అక్టోబరు 1 నుంచి 30 వరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తాత్కాలిక ఏఈపీ జారీచేశారని కూడా ఆయన తెలిపారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. వాస్తవం ఏమిటంటే, నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం 2018, అక్టోబరు నెలకు మాత్రమే అనుమతి ఉన్న అతను ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగారు? అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే విమానాశ్రయ భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరికి విమానాశ్రయ ప్రధాన భద్రతా అధికారి వేణుగోపాలరావుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే సాధ్యమైందని సందేహాలు బలపడుతున్నాయి. 7.తాత్కాలిక ఏఈపీ కట్టుకథేనా!? శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వరకు ఇచ్చామని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ కూడా సందేహాస్పదమే. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేటు వ్యక్తులకు ఒక రోజు నుంచి 3 రోజులకు ఒక కేటగిరీ, 4 రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ అన్నది ఏఏఐ మార్గదర్శకాల్లో లేదు. మరి నిందితుడికి అక్టోబరు నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ ఎలా జారీచేశారు? అంటే.. వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన తరువాత కేసును తప్పుదారి పట్టించేందుకే అప్పటికప్పుడు తాత్కాలిక ఏఈపీ అన్నది సృష్టించారని తేటతెల్లమవుతోంది. అనామకుడైన శ్రీనివాసరావుకు అంతటి పరపతి ఉండదు కదా. మరి దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? మొదటి నుంచి శ్రీనివాసరావుది రెస్టారెంట్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండే బీ షిఫ్ట్ డ్యూటీ. జగన్గారిపై దాడి చేసిన రోజు మాత్రం ఉదయమే విధుల్లోకి వచ్చినా.. రెస్టారెంట్లోనే ఉన్న హర్షవర్ధన్ చౌదరి నిందితుడు శ్రీనివాస్ను ఎందుకు ప్రశ్నించలేదు? శ్రీనివాసరావు ఉద్యోగం అసిస్టెంట్ కుక్ అయితే సర్వీస్ అసిస్టెంట్ చేసే పని అతను చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? వీఐపీ లాంజ్లోకి సర్వీస్ అసిస్టెంట్గా వెళ్లడానికి ఎవరు అనుమతించారు? జగన్తో సెల్ఫీ కోసం అని శ్రీనివాసరావు చెప్పాడనుకున్నా.. అతని వద్ద కెమెరా ఫోన్ లేదని రెస్టారెంట్లో ఉన్న వారందరికీ తెలుసు. అప్పుడైనా కెమెరా ఫోన్ లేకుండా సెల్ఫీ ఏమిటని అడగాలి? కనీసం అప్పటివరకు అక్కడే ఉన్న హర్షవర్ధన్ చౌదరిని అయినా ప్రశ్నించాలి. కానీ, సిట్ ప్రశ్నించలేదు? ఎందుకు? గత రెండున్నర నెలలుగా జగన్గారు ఎయిర్పోర్ట్కు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ స్థానిక వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన నేరుగా విమానం దిగి బయటకు వచ్చి పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్లిపోతారు. హైదరాబాద్కు వెళ్లేటప్పుడు కాస్త సమయముంటే వీవీఐపీ లాంజ్కు వెళ్లి పార్టీ నేతలతో భేటీ అవుతారు. అయితే, ఘటన జరిగే వారం ముందే జగన్గారికి బయటి నుంచి కాఫీ తీసుకురావడం కుదరదని ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో) వేణుగోపాల్ అడ్డుకున్నారు. కాఫీ ఫ్లాస్క్ స్వాధీనం చేసుకుని సీరియస్ అయ్యారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచే తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇలా అన్న రెండో వారమే ఆ రెస్టారెంట్ నుంచి శ్రీనివాసరావు వచ్చి కత్తి దూశాడు. రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని తెలుస్తున్నా ఈ దిశగా కనీస విచారణ ఎందుకు జరగలేదు? అక్టోబరు 25న వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందే హర్షవర్ధన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లడం, ఘటన తర్వాత.. ‘శ్రీనివాసరావు చాలా మంచోడండీ.. అమాయకుడండీ, ఏదో అభిమానంతో పిచ్చి పనిచేసుంటాడు’.. అని హర్షవర్ధన్ చౌదరి వకాల్తా పుచ్చుకోవడం వెనక ఉద్దేశం ఏమిటి? హర్షవర్ధన్ను సిట్ కనీసం ప్రశ్నించడానికి కూడా ఎందుకు సాహసించలేకపోయింది? సీఎస్వో వేణుగోపాల్ మొదటి నుంచి టీడీపీ తొత్తుగా ఉంటూ వైఎస్సార్సీపీ నేతలపై వ్యతిరేకత ప్రదర్శిస్తుంటాడనేది ఎయిర్పోర్ట్లో అందరికీ తెలుసు. గతంలో ఓసారి ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల కూడా ఒకింత దురుసుగా ప్రవర్తించిన దాఖలాలున్నాయి. టీడీపీ నేతలతో అంటకాగే వేణుగోపాల్.. హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరికి కుట్రకోణంలో సహకరించాడన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. మరి ఈ ఇద్దరిని నిందితులుగా సిట్ ఎందుకు చేర్చలేదు? అలా చేస్తే కుట్ర మొత్తం బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలకు భయమా? హర్షవర్ధన్ చౌదరినిగానీ, సీఎస్వో వేణుగోపాల్నుగానీ ఇంతవరకు ప్రశ్నించలేదు. అనుమానపు వేళ్లన్నీ వారిద్దరినీ చూపిస్తుంటే పోలీసులు వారిని ఎందుకు పిలిచి విచారించలేదు? జగన్పై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్లో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ, ఫ్యూజన్ ఫుడ్స్ మొత్తం సీసీ టీవీ నిఘాలోనే ఉంది. నిందితుడు ఉపయోగించిన కత్తిని వాటర్ బాటిల్, నాప్కిన్ చాటుగా తెచ్చాడని చెబుతున్నారు. మరి రెస్టారెంట్లోనే భద్రపరిచిన కత్తిని అక్కడే నాప్కిన్లో పెట్టి తీసుకువచ్చినప్పుడు సీసీ ఫుటేజీ ఉంటుంది. కానీ, పోలీసులు ఎందుకు ఫ్యూజన్ రెస్టారెంట్ జోలికి వెళ్లలేదు? 8.ఎన్వోసీ పోలీసుల సృష్టేనా? విమానాశ్రయంలో పనిచేసే వ్యక్తులకు ఎలాంటి నేరచరిత్ర లేదని నిర్ధారిస్తూ ఇచ్చిన ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. దాని ఆధారంగానే విమానాశ్రయంలో ప్రవేశానికి ఏఈపీ జారీచేస్తారు. నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్పై హత్యాయత్నం చేసిన వెంటనే అందరి మదిలో మెదిలిన ప్రశ్న. ‘అతనికి ఎన్వోసీ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు’? అని. అందులోనూ శ్రీనివాసరావుపై అతని స్వస్థలంలో ఓ క్రిమినల్ కేసు నమోదై ఉంది. మరి అతనికి ఎన్వోసీ ఎలా ఇచ్చారన్నది కీలకంగా మారింది. హత్యయత్నం కేసులో కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసుల ద్వారా కట్టుకథకు తెరతీశారు. మొదట శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులే ఎన్వోసీ ఇచ్చారని విశాఖ పోలీసులు చెప్పారు. తాము ఎన్వోసీ ఇవ్వలేదని ముమ్మడివరం ప్రస్తుత ఎస్సై, గతంలో పనిచేసిన ఎస్సై కూడా తెలిపారు. దాంతో విశాఖ పోలీసులు మరో కథ వినిపించారు. శ్రీనివాసరావు విశాఖలో నివసిస్తున్నందున ఆ పరిధిలోని విమానాశ్రయ పోలీస్స్టేషన్ నుంచి ఎన్వోసీ తీసుకున్నాడని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్చంద్ర లడ్హా చెప్పారు. కాగా, ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ కుమార్ రాజేష్ చంద్ర వెల్లడించిన సమాచారంతో అసలు వాస్తవం బట్టబయలైంది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో.. అసలు శ్రీనివాసరావు పేరిట తమకు ఎన్వోసీ రాలేదని ఆయన వెల్లడించడం గమనార్హం. విమానాశ్రయంలో ప్రవేశానికి అవసరమైన ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ కోసం శ్రీనివాసరావుగానీ, రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిగానీ దరఖాస్తు చేయనేలేదని తెలిపారు. ఏఈపీ కోసం దరఖాస్తు చేయనప్పుడు ఎన్వోసీ సమర్పించాల్సిన అవసరమే ఉత్పన్నం కాదని కుండబద్దలు కొ ట్టారు. అంటే శ్రీనివాసరావు పేరిట (బీసీఏఎస్)కి ఎలాంటి ఎన్వోసీ సమర్పించలేదని స్పష్టమవుతోంది. మరి శ్రీనివాసరావు పేరిట విశాఖ పోలీసులు ఎన్వోసీ ఇచ్చారని పోలీస్ కమిషనర్ చెప్పడం వెనుక లోగుట్టు ఏమిటి? ఈ హత్యాయత్నం వెనుక ఎవరి పాత్రను కప్పిపుచ్చేందుకు పోలీసులు ఈ కట్టుకథ వినిపించారు? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పకపోవడం వైఎస్ జగన్పై హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్రను చెప్పకనే చెబుతోంది. 9.సీసీ కెమెరాలు ఆఫ్.. కుట్ర ఆన్.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే సూత్రదారులు, పాత్రధారులు తమ కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. ఆయన హత్యకు కార్యస్థలిగా ఎంపిక చేసుకున్న విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేశారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు హైకోర్టులో విచారణ సందర్భంగా విమానాశ్రయంలో మూణ్ణెళ్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలేదని సిట్ పోలీసులే చెప్పారు. అంటే ఆగస్టు నుంచి సీసీ కెమెరాలు పనిచేయడంలేదని స్పష్టమైంది. వైఎస్ జగన్ పాదయాత్ర 2018, ఆగస్టు 14న విశాఖ జిల్లాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతివారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్కు రాకపోకలు సాగించాలి. దాంతో ఆయన్ని విమానాశ్రయంలో అంతమొందించాలన్న కుట్రకు ముందస్తు వ్యూహంలో భాగంగానే సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే జగన్పై హత్యాయత్నం కుట్ర ఆధారసహితంగా బట్టబయలయ్యేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. హత్యాయత్నం చేసిన అక్టోబరు 25న నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశం, అతనికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్ వద్ద నిందితుడి ప్రవర్తన.. అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే అతనికి సహకరించిన వారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యేవి. ఈ కుట్రకు సహకరించిన వారేవరో తెలిసేది. వారిని విచారిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఇది ఊహించే ప్రభుత్వ పెద్దలు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని పోలీసు ఉన్నతాధికారి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశ్న : పక్కా పన్నాగంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం ఎవరికి సాధ్యం? సీసీ కెమెరాలు 3 నెలలుగా పనిచేయకున్నా భద్రతా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? దీని వెనుకున్న పెద్దలెవరు? సహకరించిన అధికారులెవరు? రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్తో విమానాశ్రయ భద్రతా అధికారి వేణుగోపాల్కు ఉన్న సాన్నిహిత్యం ప్రభావమెంత? 10.హత్యాయత్నం గురితప్పింది.. ‘సిట్’ విచారణ దారి తప్పింది కుట్ర పన్ని ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పటి లాగే ఆ గురువారం (అక్టోబరు 25న) కూడా విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్.. వీఐపీ లాంజ్లో ఉన్నప్పుడు శ్రీనివాసరావు వచ్చి పదునైన కత్తిని జగన్ గొంతులోకి దించే లక్ష్యంతో పాశవిక దాడికి పాల్పడ్డారు. కత్తి గొంతులో దిగి ఉంటే.. ప్రాణం దక్కడం అనుమానమే. అదృష్టవశాత్తూ..జగన్ పక్కకు వంగడంతో గొంతులో దిగాల్సిన కత్తి గురితప్పి భుజంలో దిగింది. దీంతో జగన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కత్తిపోటు గురితప్పడంతో.. కుట్ర సూత్రధారుల బండారం బయటకు రాకుండా ‘సిట్’ దర్యాప్తును ప్రభుత్వ పెద్దలు దారి తప్పించారు. ఈ విచారణ దారి తప్పడంతో ఎన్నో అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు, విమానాశ్రయ అధికారులకూ ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి. వారికి ఉన్న అనుమానాలను ‘సాక్షి’ బృందంతో పంచుకున్నారు. వారి అనుమానాలు ఇవీ.. డీజీపీ, మంత్రులు, సీఎం మాటలకు అర్థాలే వేరులే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబరు 25 గురువారం మధ్యాహ్నం 12.45–12.48 మధ్య హత్యాయత్నం జరిగింది. ప్రతిపక్ష నేతను హతమార్చడానికి పాశవిక దాడి జరిగితే తక్షణ విచారణ చేపట్టి నిగ్గుతేల్చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుడిని సీఐఎస్ఎఫ్ తన కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్న–1: వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగిన 40 నిమిషాల్లోనే (అప్పటికి నిందితుడు సీఐఎస్ఎఫ్ కస్టడీలో ఉన్నాడు. సీఎస్ఐఎఫ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. నిందితుడిని విచారించలేదు) మధ్యాహ్నం 1.30కు డీజీపీ మీడియాతో మాట్లాడారు. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, జగన్ అభిమాని అని చెబుతూ అతని పేరు, ఊరు ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. పోలీసుల కస్టడీలోకి రాకముందే నిందితుడి వివరాలు ఎలా వెల్లడించగలిగారు? విచారణ మొదలుపెట్టకముందే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా చెప్పారు? డీజీపీ ప్రెస్మీట్లో చెప్పిన విషయాలకు ఆధారమేమిటి? ప్రశ్న–2: డజీపీ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. మ.2 గంటలకు ముగ్గురు మంత్రులు లైవ్లోకి వచ్చారు. నిందితుడి వివరాలతో పాటు జగన్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని మొబైల్లో చూపించారు. హత్యాయత్నానికి 10 నెలల ముందు ఎక్కడో మారుమూల గ్రామంలో వేసినట్లుగా చెబుతున్న ఫ్లెక్సీ మంత్రులకు ఎలా వచ్చింది? నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకోకముందే.. విచారణ ప్రారంభం కాకముందే నిందితుడి పేరు తప్ప మరే వివరాలు వెల్లడించకముందే నిందితుడి గ్రామం, ఫ్లెక్సీ, ఏ పార్టీ అనే విషయాలు మంత్రులు ఎలా చెప్పగలిగారు? నిందితుడు వెల్లడించకముందే ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసిపోవడం ఎలా సాధ్యం? మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణరెడ్డి, నక్కా ఆనందబాబు తదితరులు మీడియా ముందుకు వచ్చారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతం కాని, హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంగాని ఆ మంత్రులకు చెందిన జిల్లాల్లో లేవు. వారి శాఖలకూ సంబంధంలేదు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? వారికి సమాచారం ఎవరు చెప్పారు? ప్రశ్న–3: సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఆర్పీసీ–156 ప్రకారం.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 గంటల వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని ఆయనే చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు? ప్రశ్న–4: సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చేసిన ఫిర్యాదులో నిందితుడిది ఏ ఊరనే విషయంలేదు. వారి కస్టడీలో ఉన్న నిందితుడి వివరాలు సీఐఎస్ఎఫ్కు తెలియలేదు. మరి ప్రభుత్వ పెద్దలకు ఎలా తెలిశాయి? హత్యాయత్నంపై టీడీపీ నేతలకు ముందే సమాచారం? వైఎస్ జగన్పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే ఠానేలంకలోని నిందితుడి ఇంటి ముంగిట స్థానిక టీడీపీ నేతలు వచ్చి వాలిపోయారు. హత్యాయత్నం జరిగిన (అక్టోబరు 25వ తేదీ, గురువారం) వెంటనే టీవీల్లో చూసి అదే గ్రామానికి చెందిన జనుపల్లి ఇంటిపేరు ఉన్న వారిలో చాలామంది.. ఈ శ్రీనివాస్ ఎవరు అని బంధువులకు ఫోన్లుచేసి ఆరా తీస్తుండగానే తమకు ముందుగానే తెలిసినట్లుగా టీడీపీ నేతలు నిందితుడు ఇంటి వద్ద వాలడం.. నిందితుడికి అధికార పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాలను స్పష్టంచేస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్దకు చేరిన టీడీపీ నాయకులు (ఫైల్) మీడియా కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు.. శ్రీనివాసరావు జగన్ అభిమాని అంటూ వారే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. స్థానికులు ఎవరైనా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగానే.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, కేశవస్వామి దేవస్థానం చైర్మన్ నడింపల్లి శ్రీనివాసరాజు, ఠానేలంక గ్రామ టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, జన్మభూమి కమిటీ సభ్యుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు ఇసుకపట్ల ఈశ్వర్కుమార్లు ముందుకు వచ్చారు. వీరితో పాటు టీడీపీ నేత ఇసుకపట్ల వెంకటేశ్వరావుతో పాటు పలువురు కార్యకర్తలు మీడియా ముందు నిలబడి వారే ఇరుగుపొరుగు వ్యక్తుల్లా మాట్లాడారు. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు జగన్ అభిమాని అంటూ పదేపదే చెప్పడం కనిపించింది. శ్రీనివాసరావు కుటుంబీకుల కంటే టీడీపీ నేతలే మీడియా ముందుండటం కొసమెరుపు. వారన్నట్టుగానే శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ మనిషి అయితే టీడీపీ నేతలు భుజాలు తడుముకొంటున్నట్లుగా అక్కడకు ఎందుకు వచ్చారు? జగన్ మీద హత్యాయత్నానికి తెగబడింది వైఎస్సార్సీపీ అభిమాని అని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరి నిందితుడి ఇంటికి అంత వేగంగా టీడీపీ నేతలు వచ్చి వాలడం ఎందుకు? వారికేం సంబంధం ఉందని వచ్చారు? ప్రచారం కోసమే వైఎస్సార్సీపీ అభిమాని జగన్ మీద దాడిచేశారని డీజీపీ ప్రకటించారు. దాన్ని నిజమని భావిస్తే.. టీడీపీ నేతలు నిందితుడి ఇంటికి వెళ్లరు. వెళ్లాల్సిన అవసరమూలేదు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతలు అక్కడకు వెళ్లడం, నిందితుడి కుటుంబం వైఎస్సార్సీపీ అని పదేపదే మీడియాకు చెప్పడానికి ప్రయత్నించడం వెనక ఉద్దేశాలను వెలికి తీయడానికి సిట్ బృందం ఎందుకు ప్రయత్నించలేదు? నిందితుడు ఇంటికి వెళ్లమని వారికి ఎవరి నుంచి ఆదేశాలు అందాయి? టీడీపీ పెద్దల్లో ఎవరు వారికి సూచించారు? ఈ అంశాన్ని నిగ్గు తేల్చడానికి వారి కాల్డేటా పరిశీలిస్తే ఇట్టే తేలిపోతుంది. కానీ, సిట్ ఈ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదు? వాళ్ల కుటుంబం టీడీపీ అని అంటుంటారు జగన్ పార్టీ వాళ్లకు ఇంటి లోన్లు మంజూరు చేయలేదు. మా బంధువుకు ఇవ్వలేదు. ‘జనుపల్లి’ వాళ్లలో టీడీపీ వాళ్లు ఉన్నారు. వాళ్లకు లోన్లు వచ్చాయి. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు. వాళ్ల చిన్నాన్న నాగేశ్వరరావు టీడీపీయే. మా అబ్బాయి వెంకటేష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లిలో మా అబ్బాయి వెంకటేష్ను శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి కొట్టారు. అంతకు పదిహేను రోజుల క్రితం మా అబ్బాయి పడిపోతే చెయ్యి విరిగిపోయింది. రాజేష్ అన్న కుర్రాడు వచ్చి మీ అబ్బాయిని కొట్టిపడేశామని చెప్పాడు. పెద్దల్లో పెట్టినా కూడా ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్స్టేషన్లో కేసు పెట్టాం. గోపాలం, జనుపల్లి నాగేశ్వరరావు అనేవాళ్లు వచ్చి కేసు రాజీ చేసుకోవాలని కోరారు. కానీ, కేసు వెనక్కి తీసుకోలేదు. వాళ్ల చిన్నాన్న గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్. టీడీపీ నేత. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు. – కాగిత వెంకటేష్ తల్లి సీతారత్నం, శ్రీనివాసరావుపై గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి కేస్ క్లోజ్ అంటున్నారు కేసులు కొట్టేశారని చెప్పుకుంటున్నారు. ప్లీడర్లు వస్తున్నారు. బెయిల్ ఇప్పిస్తామని వీళ్లని అడుగుతున్నారట. విమానాశ్రయంలో ఉద్యోగం కోసం ఎలా వెళ్లాడో మాకు తేలీదు. ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడని టీవీలో చూసిన తర్వాతే మాకు తెలిసింది. సర్వశిక్షాభియాన్లో ఔట్ సోర్సింగ్ టీచర్ పోస్టు కోసం కాకినాడ వెళ్తే.. నా రెజ్యూమ్లో ఇంటి పేరు జనుపల్లి అని చూసి ఆ అబ్బాయి (శ్రీనివాస్) మీకు ఏమవుతాడు అని అడుగుతున్నారు. మీకు ఉద్యోగాలు రావు అంటున్నారు. –టీడీపీ ఉపసర్పంచ్ నాగేశ్వరరావు (నిందితుడు బాబాయి) కుమార్తె నాగమణి వాడివల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయి ఆ దుర్మార్గుడు మమ్మల్ని ఇరికించాడు. మా కూతురు వాళ్ల ఇంటిలో సెల్ఫోన్ చార్జింగ్ పెడితే దానితో ఎవరికో చేశాడు. పోలీసులు నా కూతురుకు ఫోన్చేసి రావాలన్నారు. ఆ ఫోన్లోని సిమ్ పోలీసులు తీసుకున్నారు. వాడు ఫోన్ వాడటంవల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయని బాధపడుతున్నాం. ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ, వీడివల్ల అంతా ఏడుస్తున్నాం. నా కొడుకైనా.. ప్రాణం తీసేసినా తప్పులేదు. సామాన్యమైన పని చేయలేదు. – శ్రీనివాస్ పిన్ని (పక్క ఇల్లు) నిందితుడు స్నేహితుడు ఉన్నట్లుండి ధనవంతుడయ్యారు నిందితుడు శ్రీనివాసరావు నాలుగో అన్నకు తోడల్లుడు, తనకు స్నేహితుడు అయిన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో లక్షాధికారి అయ్యాడు. ట్రాక్టర్, టాటా ఏస్, ఇండికా కారు, పల్సర్ బైక్ కొనుగోలు చేయడంతో పాటు శానపల్లిలంక (ఈశ్వరరావు సొంత గ్రామం)లో హైస్కూల్ ప్రహరీ గోడ కాంట్రాక్టును స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులో సొంతం చేసుకున్నాడు. ఈ కాంట్రాక్టు విలువ రూ.14 లక్షలు. ఊర్లో బెల్ట్షాప్ నడుపుతూ పొట్టపోసుకునే వ్యక్తి హఠాత్తుగా అన్ని వాహనాలు కొనగడం, పి.గన్నవరం ఎమ్మెల్యే పులిపర్తి నారాయణమూర్తి సిఫార్సుతో రూ.14 లక్షల విలువైన కాంట్రాక్టు పొందడం సాధారణ విషయం కాదు. నిందితుడికి టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలే అందుకు కారణం అని గ్రామస్తుల అనుమానం. శ్రీనివాసరావు బినామీగా ఈశ్వరరావు వ్యవహరించాడని అంటున్నారు. శ్రీనివాస్ అన్న సుబ్బరాజుది టీడీపీ అంటారు ‘జనుపల్లి శ్రీనివాస్ అన్నయ్య సుబ్బరాజుది టీడీపీ అంటారు. నాతో పాటు మరో ముగ్గురు స్నేహితులు ప్రభాకర్, చిట్టి, వెంకట దుర్గాప్రసాద్లను సిట్ అధికారులు ముమ్మిడివరం పిలిచి విచారించారు. స్నేహితులమని మమ్మల్ని పిలిచారు. శ్రీనివాస్ ఎటువంటి వాడు, అతని మనస్తత్వం ఎటువంటిది. ఎలా ఉండేవాడని అడిగారు. ఊళ్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. రెండు నెలల క్రితం కనిపించాడు. ఒరేయ్ అంటే ఒరేయ్ అనుకునే వాళ్లం. రావడం, వెళ్లిపోవడం తప్ప ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవాడు కాదు. – మెల్లం రాజు, సిట్ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాసరావు స్నేహితుడు పిల్లల్ని వీధిలో పెట్టాడు.. అభిమానైతే పొడిచేస్తాడా? ఇంట్లో పిల్లలందరినీ వీధిలో పెట్టాడు. అభిమానైతే కత్తితో పొడిచేస్తాడా? ఏదో జరిగింది? వెనకెవరో ఉండి ఉంటారు. ఫ్లెక్సీలు ఎవరు బాగా వేస్తారని మా అబ్బాయి గిడ్డి చైతన్యను అడిగినప్పుడు పి.గన్నవరంలో తనకు తెలిసిన ఫ్లెక్సీలు తయారుచేసే షాపు ఒకటి ఉందని.. దాని అడ్రసు ఇచ్చాడు. పి.గన్నవరంలోని ఫ్లెక్సీల షాపు అతనికి మా అబ్బాయి ఫోన్చేసి శ్రీనివాసరావు వస్తాడు.. ఫ్లెక్సీ వేసిపెట్టు అని మాత్రమే చెప్పాడు. శ్రీనివాసరావుకు, మా అబ్బాయికి అంత స్నేహం లేదు. ఫ్లెక్సీ షాపు గురించి వివరాలు అడగడం.. అది శ్రీనివాసరావుకు చెప్పడం.. ఫ్లెక్సీ షాపు వాడు ‘ఫ్రూఫ్ ఫ్లెక్సీ’ని మా అబ్బాయి సెల్కు పంపించడంతో మా వాడు పోలీసుల విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. – సిట్ విచారణ ఎదుర్కొన్న గిడ్డి చైతన్య తల్లి శ్రీనివాస్ ఫోన్లో నెంబర్లున్న యువకులను విచారించారు జగన్గారిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు ఇంటి పేరుతో ఉన్న తామంతా బంధువులేమే. అయితే, శ్రీనివాసరావు ఫోన్లో ఫీడ్ అయిన నెంబర్ల ఆధారంగా వాడి వయస్సుతో సమానంగా ఉన్న తమ ఊరు ముఖ్యంగా పెదపేట యువకులను సిట్ పోలీసులు విచారించారు. – జనుపల్లి సతీష్, సిట్ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్ స్నేహితుడు -
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు.. ఎన్ఐఏకు అప్పగింత
సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానా శ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈనెల 1వతేదీన ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ శుక్రవారం ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు.. పిటిషనర్లు కోరిన విధంగా కేంద్రం ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై ఇక విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. కేంద్రం సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఎన్ఐఏ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జగన్పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ తదితరుల అభ్యర్థనలివీ... తనపై జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకే వస్తుందని, పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధ నల ప్రకారం ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికార పరిధి ఎన్ఐఏకు ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం ఇదే అభ్యర్థనతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా అటు ముఖ్యమంత్రి, ఇటు డీజీపీ ఇద్దరూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశించాలంటూ వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి హైకోర్టు ఆదేశమిదీ... ఈ వ్యాజ్యాలన్నింటిపై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పౌర విమానయాన భద్రతా చట్టం, ఎన్ఐఏ చట్ట నిబంధనలను పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం.. వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనఎన్ఐఏ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో వెల్లడించాలని డిసెంబర్ 14న కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో కేంద్ర ప్రభుత్వమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో నిర్ణయం తీసుకుంటే ఆ వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేయడం తెలిసిందే. విభజనతో ఏపీకి బదిలీ అయిన వ్యాజ్యాలు.. ఈలోపు ఉమ్మడి హైకోర్టు విభజన జరగడంతో ఈ వ్యాజ్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. శుక్రవారం వీటిపై జస్టిస్ ఎస్.వి.భట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఎస్జీ లక్ష్మణ్ వాదనలు వినిపిస్తూ వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు జరపాలని ఎన్ఐఏను ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వీటి ఆధారంగా ఎన్ఐఏ జనవరి 1వతేదీన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిందని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు, ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆయన ధర్మాసనం ముందుంచారు. కేంద్రం అధికార పరిధి దాటి ఉత్తర్వులిచ్చింది... ఈ సమయంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధిని దాటి ఈ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వును సవాలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేసే విషయంలో ఉన్న హక్కులను ఉపయోగించుకోవాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఈ వ్యాజ్యాలన్నింటిలో ప్రధాన అభ్యర్థన దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించాలనే. ఇప్పుడు కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. కేంద్రం ఉత్తర్వుల మేరకు ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. కాబట్టి ఈ వ్యాజ్యాల్లో ఇకపై విచారించేందుకు ఏమీ ఉండదు. అందువల్ల వాటిని మూసేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. సెక్షన్ 6లో స్పష్టంగా ఉంది.. ఈ సమయంలో వైఎస్ జగన్ తరఫు న్యాయవాది నవీన్కుమార్ స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో ఇకపై దర్యాప్తు చేయకుండా స్థానిక పోలీసులను నియంత్రిస్తూ, ఎన్ఐఏకి దర్యాప్తును అప్పగించేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ.. ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6ని ఒకసారి చదవాలని నవీన్కు సూచించింది. ఈ సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ పోలీసు అధికారి కూడా దర్యాప్తు విషయంలో ముందుకెళ్లడానికి వీల్లేదని, వెంటనే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను ఎన్ఐఏకు అప్పగించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ విషయంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. ఉత్తర్వుల్లో అన్ని విషయాలను ప్రస్తావించిన ధర్మాసనం... ఆ వెంటనే హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను వెలువరిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు, అందుకు అనుగుణంగా ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించింది. కేంద్రం ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అంతేకాకుండా అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాలు, జగన్ తరపు న్యాయవాది నవీన్ ప్రస్తావించిన అంశాలను కూడా అందులో పొందుపరిచింది. పిటిషనర్ల అభ్యర్థన మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణ అవసరం లేదని, అందువల్ల వాటిని మూసివేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. శిక్షార్హమైన నేరమే సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ పరిధిలోని కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ డివిజన్ (సీటీసీఆర్) డిసెంబరు 31న ఉత్తర్వులు జారీ చేసింది. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి విశాఖ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన ఐపీసీ 307 సెక్షన్ కింద నమోదైన ఎఫ్ఐఆర్పై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ ఘటన పౌర విమానయాన చట్టం 1982 సెక్షన్ 3 ఏ (1)(ఏ) ప్రకారం శిక్షార్హమైన నేరం. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008 షెడ్యూల్ ప్రకారం కూడా నేరమే. ఘటన తీవ్రత దృష్ట్యా దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏ చట్టం 2008 సెక్షన్–6 (సెక్షన్–8తోపాటు చదివినప్పుడు)లోని ఉప సెక్షన్ (5) ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశిస్తున్నాం’అని కేంద్ర హోంశాఖ తరపున ధర్మేందర్కుమార్ పేరుతో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సెక్షన్ 3 ఏ (1)(ఏ) ఏం చెబుతోంది? సెక్షన్ 3 ఏ: ఎయిర్పోర్టు వద్ద నేరానికి పాల్పడటం. (1): ఎవరైనా, ఏ ఎయిర్ పోర్టు వద్ద అయినా చట్ట వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా, ఏదైనా సాధనాన్ని, ఆయుధాన్ని, పదార్థాన్ని వినియోగించడం. (ఏ): హింసాత్మక చర్యకు పాల్పడడం ద్వారా తీవ్రంగా బాధించడం లేదా వ్యక్తి మృతి చెందేందుకు కారణం కావడం. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ గణతంత్ర వేడుకలకు సరిగ్గా నెల రోజుల ముందు దేశంలో ఉలికిపాటు. దేశంలో భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ – నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చాకచక్యంగా పట్టుకుని వారి కుట్రను భగ్నం చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్న, హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను ఎన్ఐఏ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలే వీరి లక్ష్యమనీ, సంస్థలోని సభ్యులంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వెల్లడించింది. అరెస్టయిన వారంతా ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్రా లేని వారేననీ, ఉత్తరప్రదేశ్లోని ఆమ్రోహాకు చెందిన ఓ ముఫ్తీ (ముస్లిం మతాచారాలపై తీర్పులిచ్చే న్యాయ నిపుణుడు) కూడా వీరిలో ఉన్నాడనీ, ఇతనే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అని ఎన్ఏఐ ఐజీ అలోక్ మిత్తల్ చెప్పారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్, ఆమ్రోహ, లక్నోల్లో సోదాలు జరిపి, స్థానికంగా తయారు చేసుకున్న రాకెట్ లాంచర్ సహా పలు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సోదాల అనంతరం హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాంకు చెందిన మొత్తం 16 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిని విచారించి 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసింది. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని అలోక్ మిత్తల్ చెప్పారు. సమాచారంతో ముందస్తుగానే నిఘా సోదాల్లో చేతితో తయారు చేసిన ఆయుధాలు, ఇంకా పరీక్షించాల్సి ఉన్న రాకెట్ లాంచర్, ఆత్మాహుతి జాకెట్ల తయారీకి ఉపయోగించే పదార్థాలు, వంద అలారం గడియారాలు, 12 నాటు తుపాకీలు, వందలకొద్దీ బుల్లెట్లు, వంద మొబైల్ ఫోన్లు, 135 సిమ్కార్డులు, ఏడున్నర లక్షల రూపాయల డబ్బు, బాంబు తయారీలో వాడే పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితరాలను భారీ మొత్తాల్లో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఏయే ప్రభుత్వ సంస్థలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయాలో ఇప్పటికే వారు రెక్కీ నిర్వహించారనీ, మరికొన్ని రోజుల్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారని అలోక్ చెప్పారు. హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం ప్రణాళికల గురించి తమకు ముందుగానే సమాచారం వచ్చిందనీ, అప్పటి నుంచి వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టిందన్నారు. అనుమానిత ఉగ్రవాదులు చాలా వేగంగా బాంబులు తయారు చేస్తూ పోతుండటంతో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలోని ఉగ్రవాద వ్యతిరేక దళంతో కలిసి ఎన్ఐఏ వారి కుట్రను బుధవారం భగ్నం చేశామని అలోక్ తెలిపారు. వీరి హిట్ లిస్ట్లో ఢిల్లీ పోలీస్, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఇతర దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ ‘ఇతర సంస్థలు వారికి ఇష్టమొచ్చింది ఏదైనా చెప్తాయి. ఈ కేసును దర్యా ప్తు చేస్తున్నది మేము. ఆధారాల్లేకుండా మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అన్నారు. నెట్లో చూసి నేర్చుకున్నారు! ఎన్ఐఏ ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను ఆమ్రోహాలో, మరో పది మందిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన నిధులను హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం సభ్యులు సొంతంగానే సమకూర్చుకున్నారంది. ‘పేలుడు పదార్థాల తయారీలో వీరు ఇప్పటికే చాలా పురో గతి సాధించారు. బాంబులను ఇక జతపరచడమే తరువాయి. ఆ తర్వాత రిమోట్ కంట్రో ల్ బాంబులతో, ఆత్మాహుతి దాడులతో, పైప్ బాంబులతో దేశంలో భయోత్పాతం సృష్టించాలనేది వీరి ప్రణాళిక’ అని అలోక్ మిత్తల్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముఫ్తీ మహ్మద్ సుహైల్ (29)తోపాటు నోయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, హ్యుమానిటీస్లో గ్రాడ్యుయేషన్ మూడో ఏడాది చదువుతున్న మరో విద్యార్థి కూడా ఉన్నారని అలోక్ చెప్పారు. మరో ఇద్దరు వెల్డింగ్ పని చేసుకుని జీవనం సాగించేవారన్నారు. ‘దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం హర్కత్ సంస్థను మూడు, నాలుగు నెలల క్రితం సుహైల్ స్థాపించి, వివిధ వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నాడు. వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్ల ద్వారా వారు సంభా షించుకున్నారు. బాంబులు ఎలా చేయాలో వీరికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదనీ, ఇంటర్నెట్లో చూసి సొంతంగానే నేర్చుకున్నట్లు ప్రాథమి కంగా తెలుస్తోంది’ అని అలోక్ వివరించారు. సోదాల్లో తమకు ఓ వీడియో లభించిందనీ, బాంబులు ఎలా తయారు చేయాలో సుహైల్ ఇతరులకు సూచనలిస్తూ రూపొందించిన వీడియో అది అని తెలిపారు. విద్యార్థులు.. వెల్డర్లు.. ఇమామ్లు న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర ముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారందరి వయసు 20–35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా, మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహ్మద్ సుహైల్ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. వారి వ్యక్తిగత వివరాలిలా ఉన్నాయి. 1. ముఫ్తీ మహ్మద్ సుహైల్ అలియాస్ హజ్రత్ (29): ఈ బృందం వ్యవస్థాపకుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన హజ్రత్ స్థానిక మదరసాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3–4 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించి ఆన్లైన్లో ఐసిస్ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారుచేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. 2.అనాస్ యూనస్ (24): జఫ్రాబాద్కు చెందిన యూనస్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాంబులు తయారుచేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు. 3.రషీద్ జాఫర్ రఖ్ అలియాస్ జాఫర్ (23): జఫ్రాబాద్కు చెందిన ఇతడు బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 4.సయీద్ (28): అమ్రోహాలోని సైదాపూర్ ఇమ్మాకు చెందినవాడు. వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న ఇతడు పిస్టల్స్, రాకెట్ లాంచర్లను తయారుచేశాడు. 5.రాయీస్ అహ్మద్: సయీద్కు సోదరుడు. ఇతనికి కూడా వెల్డింగ్ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారుచేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్పౌడర్ను సేకరించారు. 6.జుబైర్ మాలిక్ (20): జఫ్రాబాద్కు చెందిన మాలిక్ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 7.జైద్ (22): జుబైర్ సోదరుడు. నకిలీ పత్రాలతో సోదరులిద్దరూ సిమ్ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగిలించి డబ్బు సమకూర్చుకున్నారు. 8.సాకిబ్ ఇఫ్తికార్ (26): ఉత్తరప్రదేశ్లోని హాపూర్కు చెందినవాడు. బక్సార్లోని మదరసాలో ఇమామ్గా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్కు సాయం చేశాడు. 9.మహ్మద్ ఇర్షాద్ (28): ఆటోరిక్షా నడిపే ఇర్షాద్ అమ్రోహా నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్కు సాయం చేశాడు. 10. మహ్మద్ ఆజామ్ (35): ఢిల్లీలోని చౌహాన్ బజార్ నివాసి. మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్కు సాయం చేశాడు. బుధవారం జఫ్రాబాద్లో తనిఖీల్లో పాల్గొన్న ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు -
మళ్లీ ఐసిస్ కలకలం.. రంగంలోకి ఎన్ఐఏ, 5గురు అరెస్టు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కలకలం రేపుతోంది. ఐసిస్కు అనుకూలంగా "హర్కత్ ఉల్ అరబ్ ఏ ఇస్లాం" పేరిట ఓ ఉగ్ర విభాగం పనిచేస్తోందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్)తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. అమ్రోహ ప్రాంతంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో ఒకరిని స్థానిక మదర్సా నుంచి అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. కొత్త పేరుతో దేశంలో వీరు ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. వీరు దేశంలో విధ్వంసాలకు ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందా? రాదా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్న ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుపట్టింది. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో తేల్చకుండా ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో తాము ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్పై జరిగిన హత్యాయత్న ఘటన ఎన్ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఆ మేర కేంద్ర హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్పై హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ సీల్డ్ కవర్లో ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, ఇందులో తాము కోరిన వివరాలు లేవంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘జగన్పై హత్యాయత్నం ఘటన ఎన్ఐఏ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందా?రాదా? తేల్చేందుకు మూడు మార్గాలున్నాయి. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవడం ఒకటి. ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం రెండోది. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా సమాచారం తెప్పించుకోవడం మూడోది. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా సమాచారం అందినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే’ అని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం తీసుకోకుండా దానిని ఇతరులపైకి నెట్టడం సరికాదంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ స్పందిస్తూ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఏం చేయాలో చెప్పేందుకు తామేమీ సలహాదారులం కాదంది. ఎన్ఐఏ చట్ట ప్రకారం ఈ మొత్తం వ్యవహారంపై నిర్ణయం తీసుకుని దానిని సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంది. -
మాలెగావ్ కేసు : సాధ్వి ప్రాగ్య, పురోహిత్లపై అభియోగాలు
సాక్షి, ముంబై : 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్య, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్లపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. వీరిద్దరితో సహా ఏడుగురిపై కుట్ర, హత్యాయత్నం సహా పలు అభియోగాలు మోపింది. అయితే తామెలాంటి నేరానికి పాల్పడలేదని నిందితులు వాదించగా కేసు విచారణను నవంబర్ రెండుకు న్యాయస్ధానం వాయిదా వేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్లోని మసీదు సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయాలయ్యాయి. ఈ కేసులో పురోహిత్, ప్రగ్యా సింగ్లతో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిలపై ఎన్ఐఏ ఇతర నిందితులుగా పేర్కొంది. కాగా ఈ కేసు నుంచి తమను తప్పించాలని కోరుతూ సాధ్వి ప్రగ్యా, పురోహిత్ సహా ఇతర నిందితుల వినతిని గత ఏడాది డిసెంబర్ 27న ఎన్ఐఏ న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
నకిలీ నోట్ల కేసు నిందితుడు అక్బర్ అలీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : 2015 విశాఖ నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అక్బర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా అజ్ఞాతంలో ఉన్న అక్బర్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన మహ్మద్ అక్బర్ అలీ 2007లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డాడు. పువ్వుల అమ్మే షాపులో పనిచేసుకునే అక్బర్! హకీమ్ అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల దందాలోకి దిగాడు. ఆ తర్వాత సొంతంగా ఒక గ్రూపును తయారుచేసుకుని దంగా చేసేవాడు. 2015 సంవత్సరంలో ఈ ముఠాకు చెందిన సద్దాం హశ్సేన్ అనే వ్యక్తి దొంగ నోట్లు తరలిస్తుండగా విశాఖపట్నంలో పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి 5లక్షల నకిలీ నోట్లు స్వాధీనపరుచుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో అక్బర్ ప్రధాన నిందితుడని తేలింది. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్బర్ కోసం శ్రమించిన పోలీసులు అతని కదలికను పసిగట్టి పట్టుకున్నారు. -
భారీ విధ్వంసానికి స్కెచ్ గీశారు..
హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11మంది అనుమానిత ఉగ్రవాదుల నుంచి ఎన్ఐఏ అధికారులు పలు వస్తువులను సీజ్ చేశారు. ఎన్ఐఏ హైదరాబాద్లోని పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. అదుపులోకి తీసుకున్న పదకొండుమంది అనుమానితుల నుంచి రెండు పిస్తోళ్లు, ఒక ఎయిర్గన్, బుల్లెట్స్,15 లక్షల నగదు, యూరియాతోపాటు కొన్ని రసాయనాలు, 23 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్, ఒక సీపీయూ, 7 పెన్డ్రైవ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక డోంగిల్తోపాటు రెండు టార్గెట్ బోర్డులు, రెండు గ్యాస్ స్టవ్లు, కండెన్సర్, ప్రెషర్ మీటర్, మాస్క్లు, గ్లౌజులు కూడా వారి వద్ద లభ్యం అయ్యాయి. వీటన్నింటిని గమనిస్తే పెద్ద విధ్వంసానికే కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానిత ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు ఎక్కడ నుంచి సరఫరా అవుతోంది, షెల్టర్ ఎవరిచ్చారు, కుట్రతో ఇంకెవరికి సంబంధం ఉంది... అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో మహమద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, అబ్దుల్లా బిన్ మహ్మద్, సయ్యద్ నయిమత్ ఉల్లా హుస్సేన్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, మహ్మద్ అతాహుల్లా రెహ్మాన్, అబ్దుల్ ఆల్ జిలానీ, ఏఎం అజార్, మహ్మద్ అర్భాజ్ అహ్మద్ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా హైదరాబాద్-ఆపరేషన్లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదులు కూడా సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్లో చేసుకుంటున్న ఛాటింగ్పై అనుమానం వ్యక్తం చేసిన ఐబీ వారి కదలికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉగ్రముఠా గుట్టు బయటపడింది. ప్రముఖ వ్యక్తులు, ప్రసిద్ధి ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసిన తీరు కూడా వెలుగు చూసింది. ఐబీ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అనుమానితులను అరెస్ట్ చేసి మిగతా వివరాలు రాబడుతోంది. -
హైదరాబాద్లో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ కుట్ర
ఒకవైపు టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాద దాడి కలకలం రేపితే.. మరోవైపు హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 13 మందిని ఎన్ఐఏ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసినట్లయింది. బుధవారం తెల్లవారుజామున ఏక కాలంలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి, ఈ 13 మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు నిక్కీ జోసెఫ్ తో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల విచారణ సమయంలో బయటపడిన వివరాల ఆధారంగానే తాజాగా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొంతమంది ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు అరెస్టయిన ప్రాంతాల్లోనే వీళ్లు కూడా దొరికారని అంటున్నారు. దీంతో హైదరాబాద్లో కూడా ఐఎస్ఐఎస్ నెట్వర్క్ పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఈ అరెస్టులను నిర్ధారించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు కూడా తెలిపారు. ఈ ప్రాతంలో మరింతమంది ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.