tamannaah
-
తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం: సంపత్ నంది
‘‘రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను. నా మనసులో ఉన్న అవన్నీ ‘ఓదెల 2’ రూపంలో బయటకు వచ్చాయి’’ అని దర్శక– నిర్మాత, రచయిత సంపత్ నంది అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ–‘‘అశోక్ తేజని డైరెక్టర్ చేయాలని ‘ఓదెల రైల్వేస్టేషన్స్ ’ మూవీ తీశాం. ఆహా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ చాలా సక్సెస్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘ఓదెల 2’ చేస్తే బాగుంటుందన్నట్లుగా అశోక్ తేజ చెప్పాడు. ఓ సారి భీమ్స్తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నప్పుడు సీక్వెల్ క్రియేట్ చేయవచ్చనిఅనిపించింది. తొలిపార్టులో రాధ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. సీక్వెల్లో మరో ఫీమేల్ క్యారెక్టర్ అయితే బలంగా ఉంటుందని శివశక్తి పాత్రకు తమన్నాగారిని తీసుకున్నాం. ఆత్మకు, పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమే ‘ఓదెల 2’.ఓ పంచాక్షరి మంత్రంతో నాగసాధువు శివశక్తి.. ఓ ప్రేతాత్మను ఎలా కంట్రోల్ చేసింది? అన్నదే కథాంశం. ‘అరుంధతి’ సినిమాతో మా చిత్రానికి పోలిక లేదు. నిర్మాత రాధామోహన్స్ గారికి ‘ఓదెల 2’ కథ చెప్పాను. ఆ సమయంలో ఆయన హిందీ మూవీతో బిజీగా ఉండటంతో డి.మధుగారు నిర్మించారు. సాంకేతిక నిపుణులకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం. ‘ఓదెల 3’ కి అవకాశం ఉంది. నా దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ రానుంది. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. కానీ.. మరో ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. -
బాలీవుడ్ లో తమన్నాకు వింత పరిస్థితులు హీరోయిన్ గా కెరీర్ ఖతమేనా ?
-
తమన్నా కోసమే ఈ పాత్ర పుట్టింది: సంపత్ నంది
‘‘ఓ పల్లెటూరి కథని ఎగ్జయిటింగ్గా, థ్రిల్లింగ్గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ ‘ఓదెల 2’ని ఓ రేంజ్లో తీశారు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు కొత్త అనుభూతి దక్కాలని కోరుకుంటాను. అలాంటి సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తమన్నా తెలిపారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా ఇతర పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ చూసినప్పుడే పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నందిగారు పార్ట్–2 ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను.నా కెరీర్లో అత్యధిక ఐ షాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ‘ఓదెల 2’’ అన్నారు. ఈ మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నేను ఓదెల అనే ఊర్లో పుట్టి, పెరిగాను. చాలా గౌరవంగా, ప్రేమతో ఈ కథ రాశాను. ఓదెలకు ఒక కష్టం వస్తే... ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనేది ఈ చిత్రకథ. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది’’ అని చెప్పారు. ‘‘కథని నమ్ముకుని తీసిన ‘ఓదెల 2’ని ప్రేక్షకులు థియేటర్స్లో చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డి. మధు. ‘‘ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నందిగారి దగ్గరికి వెళ్లాను... ‘ఓదెల 2’ రూపంలో ఆయన బిర్యానీ తినిపించారు’’ అని అశోక్ తేజ అన్నారు. -
విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్.. అలా అనిపిస్తేనే చెబుతా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్ లైఫ్ను సీక్రెట్గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా. నేను ఎయిర్పోర్ట్లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు. -
సరిగ్గా మ్యారేజ్ కు ముందు తమన్నా బ్రేకప్..?
-
మిల్కీ బ్యూటీ కాదు... పాలరాతి శిల్పంలా... వైట్ డ్రెస్లో తమన్నా ఫోటోలు
-
ఓదెల 2లో తమన్నా శివతాండవం..
-
మహా కుంభమేళాను వదిలిపెట్టని యాంకర్ సుమ! అక్కడ కూడా.. (ఫోటోలు)
-
త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న బ్యూటీస్ విల్లే
-
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
ఏంటి బాబోయ్ ఈ అందం..చూపులతోనే కట్టిపడేస్తున్న తమన్నా (ఫొటోలు)
-
అందుకే మా కెమిస్ట్రీ కుదిరింది!: తమన్నా
‘‘ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు వారి నటన విషయంలో పోలికలు రావొచ్చు. కొందరు పోటీలు పెట్టి మాట్లాడుతుంటారు. నేను ఈ పోటీని ఆహ్లాదకరంగానే తీసుకుంటాను’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. తమన్నా, రాశీ ఖన్నా, సుందర్. సి లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి తమన్నా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఇండస్ట్రీలో పోటీ ఉండొచ్చు. అయితే మనం మనలా పెర్ఫార్మ్ చేయగలిగితే చాలు. ‘అరణ్మణై 4’ సినిమా కోసం నేను, రాశీ ఓ పాట చేశాం. ఇద్దరం ఒకే ఫ్రేమ్లోకి వచ్చాం. అప్పుడు మేం మా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టాం. సాంగ్ బాగా రావడానికి రాశీ ఖన్నా తన వంతు కృషి చేసింది. మేం ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం వల్లే మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓ కో స్టార్గా రాశీ బాగా సపోర్ట్ చేసిందని నాకనిపించింది. ఇలా పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్స్టార్లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
‘‘బాక్’ మూవీ ట్రైలర్ చూస్తే సుందర్గారు ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తుంది. షూటింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అని హీరోయిన్ తమన్నా అన్నారు. సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్మనై 4’. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అవ్ని సినిమాక్స్పై ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో మే 3న రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో నా సినిమా జర్నీ సురేష్ ప్రోడక్షన్ నుంచే మొదలైంది. ‘బాక్’ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్గారికి, జాన్వీకి థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్లో అదరగొడుతుంది’’ అన్నారు. ‘‘బాక్’లో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు రాశీ ఖన్నా. ‘‘ఈ మూవీని థియేటర్స్లో చూడండి.. ఎంజాయ్ చేస్తారు ’’అన్నారు జాన్వీ నారంగ్. ‘‘చాలా కాలం తర్వాత ‘బాక్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ’’ అన్నారు కోవై సరళ. -
చెడుపై గెలుపు
అహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రతి యుగంలో చెడుని ఎలా గెలుస్తాడో చూపించే కథాంశంతో ఈ మూవీ ఉంటుంది.హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుపుతున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
నవ్వు... భయం
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్. -
గ్లామర్కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట!
గ్లామరస్గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్నే నమ్ముకున్నారని చెప్పవచ్చు. నువ్వు కావాలయ్యా.. అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్ క్వీన్గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైండ్సెట్ మారాలి ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్సెట్ మారాలన్నారు. జైలర్ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
తమన్నా బ్యూటీ క్లినిక్లో సందడి చేసిన పేజ్–3 సెలబ్రిటీలు... (ఫొటోలు)
-
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్లలో అదరహో (ఫోటోలు)
-
తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు, ఎక్కడా తగ్గట్లేదుగా!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు తమన్నా భాటియా. రజనీకాంత్ కథానాయకుడిగా నటింన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక్క పాటతో రిలీజ్కు ముందే ఆ చిత్రానికి వీరలెవల్లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. 2005లో వెండితెరపై రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ గత 17 ఏళ్లుగా పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ మూవీ నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత నటించిన కల్లూరి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదన ఆ తర్వాత వరుసగా కోలీవుడ్ ధనుష్, విజయ్, అజిత్.. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా జైలర్ చిత్రంలో ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించినప్పటికీ సినిమా సక్సెస్లో క్రెడిట్ కొట్టేసింది. ఐటమ్ సాంగ్స్లోను నటించడానికి వెనుకాడని తమన్నా కళ్లు చెదిరే ఆస్తులను కూడబెట్టిందంటూ తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఈ మిల్కీబ్యూటీ ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈమె ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఐటెం సాంగ్ కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. సినిమాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమని మెరిసినందుకుగానూ రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్డుమెంట్ ఖరీదు రూ.16 కోట్లు అని సమాచారం. అదేవిధంగా లేడ్రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్యూ సహా నాలుగు ఖరీదైన కార్లను తమన్నా వాడుతోంది. అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాపును నిర్వహిస్తోంది. మొత్తం మీద తమన్నా ప్రస్తుతం రూ.120 కోట్లకు అధిపతి అని ప్రచారం జరుగుతోంది.. చదవండి: చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. బుద్ధుండక్కర్లా? అంటూ ట్రోలింగ్.. -
ఈ సినిమాతో నాకో మంచి ఫ్రెండ్ దొరికారు: కీర్తీ సురేష్
‘‘నాకు ఒక సిస్టర్ ఉంది. బ్రదర్లాంటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ‘భోళా శంకర్’ చేశాక మెహర్ రమేష్లాంటి అన్నయ్య దొరికారు’’ అన్నారు కీర్తీ సురేష్. చిరంజీవి టైటిల్ రోల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేశారు. ఈ నెల11న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘భోళా శంకర్’లో చిరంజీవిగారి చెల్లెలి ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్గారి చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (‘పెద్దన్న’) పూర్తి చేశాను. అందుకే వెంటనే చెల్లెలిగా అంటే ఫర్వాలేదా? అని మెహర్ రమేష్గారితో అన్నాను. అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్గారికి చెల్లెలిగా నటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవిగారి చెల్లెలిగా అంటే ఇంకేం కావాలి? అనిపించింది. దాంతో పాటు చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్లో అయినా డ్యాన్స్ చేయాలనుకున్న నాకు రెండు పాటలు చేసే చాన్స్ స్క్రిప్ట్లో ఉంది. మెహర్ రమేష్గారు నా క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేశారు. ► మా అమ్మ (మేనక) గతంలో చిరంజీవిగారి సరసన ‘పున్నమి నాగు’లో నటించారు. అప్పుడు చిరంజీవిగారు తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సలహాల గురించి అమ్మ ఇప్పుడు నాతో చెప్పారు. అవి చిరూగారితో చెబితే.. ‘ఈ సలహాలు కూడా ఇచ్చాను’ అంటూ అమ్మ చెప్పనివి కూడా చెప్పారు. ఇన్నేళ్లయినా ఆయన గుర్తుంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నా విషయంలోనూ కేర్ తీసుకున్నారు. అయితే ‘మీ అమ్మలా నువ్వు అమ్మాయకురాలివి కాదు... చాలా స్మార్ట్’ అని నవ్వుతూ అన్నారు. ఆయన ఇంటి నుంచే నాకు ఫుడ్ వచ్చేది. ఈ సినిమా రూపంలో నాకో మంచి ఫ్రెండ్ (చిరంజీవిని ఉద్దేశించి) దొరికారు. ► రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో లీడ్గా, చెల్లెలి క్యారెక్టర్లు.. ఇలా పలు వేరియేషన్స్ ఉన్నవి చేస్తున్నాను. ఇలా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇలాంటివిæ చేయలేదే అని ఫీల్ కాకూడదు. అందుకే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను. -
మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా
‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మించారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా... ► ఈ నెల 10న ‘జైలర్’, 11న ‘భోళా శంకర్’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్ అనొచ్చు... విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారు, సూపర్ స్టార్ రజనీకాంత్గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్. ఇలా ఒక్క రోజు గ్యాప్లో ఇద్దరు స్టార్స్తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్. ► చిరంజీవి డ్యాన్స్ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్లో బెస్ట్. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్ చేసే చాన్స్ రాలేదు.. ‘భోళా శంకర్’లో మీ కాంబో డ్యాన్స్ గురించి... ‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మిగతా స్టెప్స్ కూడా గ్రేస్ఫుల్గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్ చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పైగా శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. స్విట్జర్లాండ్లో ఈ పాట షూట్ జరిగింది. పెద్దగా రిహార్సల్స్ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్ జామ్...’ పాట కూడా నాకు చాలా ఇష్టం. ► సీనియర్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా... ఇప్పుడు నా కెరీర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాను. నా కెరీర్లో నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్ వల్ల ఈక్వేషన్ ఏం మారదు. ► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ రేస్లో దూసుకెళ్లడానికి కారణం? అస్సలు నేను ఇది రేస్ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్ వర్క్ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్వర్క్ చేయాలి. ఆ ఫోకస్తోనే వెళుతున్నాను. ► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి? మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్లో ప్రమోషన్ ఉన్నట్లే మా జాబ్ కూడా. ప్రమోషన్ కోసం కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్గా, బెటర్గా ఉంటుంది. ► ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్లో నటించిన అనుభవం గురించి? మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్ ఎగ్జాంపుల్ నటుడు విజయ్ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది... ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను. ► పెళ్లి ప్లాన్ ఏమైనా? ఇప్పటికైతే లేదు. ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను. -
రజినీకాంత్ 'జైలర్' మూవీ స్టిల్స్
-
'భోళా శంకర్'.. అదే అతి పెద్ద సవాల్!
‘‘ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఒరిజినల్ని మ్యాచ్ చేస్తే సరి΄ోదు.. దానికంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు బెటర్గా ఉండాలి.. అది పెద్ద సవాల్. అందుకే ‘భోళా శంకర్’ విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఒరిజినల్ ఫిల్మ్ ‘వేదాలం’ కంటే ‘భోళా శంకర్’ ఇంకా బాగుంటుంది’’ అని కెమెరామేన్ డడ్లీ(రాజేంద్ర) అన్నారు. చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కెమెరామేన్ డడ్లీ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు రాజేంద్ర. డడ్లీ నా ముద్దు పేరు. తమిళనాడులోని ఊటీ నా స్వస్థలం. తమిళనాడులో ఫిలిం టెక్నాలజీ చదువుకున్న తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను. మెహర్ రమేష్, నేను పదేళ్లుగా స్నేహితులం. తనే ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఫుల్ ΄ప్యాకేజ్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చిరంజీవిగారు పెర్ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్. ఈ రెండు విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నాను. ‘భోళా శంకర్’లో ఇంటర్వెల్ సీక్వెన్స్లో వచ్చే పెద్ద యాక్షన్ సీన్ తీయడం చాలా కష్టంగా అనిపించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అన్నీ సమకూర్చారు’’ అన్నారు. -
'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్ విడుదలకానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘భోళాశంకర్’ ట్రైలర్ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్ని రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్ లుక్లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహర్ మూవీస్. -
డబ్బింగ్ డన్
‘భోళా శంకర్’కు సొంత డబ్బింగ్ చెప్పారు తమన్నా. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. కాగా ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ వర్క్ పూర్తయింది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
మిల్కీ బ్యూటీ... నువ్వే నా స్వీటీ
‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడే.. బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే.. కల్లోకి వచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే...’ అంటూ రొమాంటిక్ మోడ్లోకి వెళ్లిపోయారు హీరోయిన్ తమన్నా. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ ఆలపించారు. -
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
చిరంజీవి 'జామ్ జామ్ జజ్జనక' కోసం రెడీగా ఉండండి
‘జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క..’ అంటూ చిందేశారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే రెండో పాట ప్రోమోని ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్గా కనిపిస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భోళా మానియా...’ అనే మొదటి పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే పూర్తి పాటని ఈ నెల 11 విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్. -
నువ్వు కావాలయ్యా అంటూ దుమ్ములేపిన తమన్నా
కొంచెం ఆట కావాలా? కొంచెం పాట కావాలా? అంటూ ఊర మాస్ స్టెప్పులతో తమన్నా అదరగొట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే పాట ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. రజనీకాంత్, తమన్నా మధ్య ఈ పాట సాగుతుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరచిన ఈ పాటకు అరుణ్ రాజా కామరాజ్ సాహిత్యం అందించగా శిల్పా రావు, అనిరుధ్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ‘జైలర్’లో శివ రాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. -
మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి
‘భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారు హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. థియేటర్స్లో కలుద్దాం.. భోళా శంకర్ ఆగస్టు 11’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
విజయ్ మామూలోడు కాదు... లస్ట్ స్టోరీస్ 2 సీన్స్ పై తమన్నా కామెంట్స్
-
నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు
నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడారు. ‘‘కో యాక్టర్తో కలిసి యాక్ట్ చేసినంత మాత్రాన అతనిపై ఆకర్షణ ఏర్పడుతుందంటే నేను నమ్మను. అలా అనుకుంటే నేను చాలామంది యాక్టర్స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఏదైనా మనం వ్యక్తిగతంగా ఫీలవ్వాలి. మన మనసుకు అనిపించాలి. ఇక విజయ్ వర్మతో నా బాండింగ్ చాలా సహజంగా మొదలైంది. ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురు చూశాను. జీవితంలో చాలా సాధించిన నాలాంటి వారికి ప్రతిదానికీ చాలా కష్టపడాలనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి కోసం భారతీయ స్త్రీలు తమ జీవితం మొత్తం మార్చుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్ వర్మను ఉద్దేశించి).. చాలా కేర్ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. దీంతో విజయ్ వర్మతో ప్రేమను తమన్నా పరోక్షంగా కన్ఫార్మ్ చేశారని నెటిజన్లు అంటున్నారు. ఇక తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 2’లో విజయ్ వర్మ నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్ సమయంలోనే విజయ్, తమన్నా ప్రేమలో పడి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. -
సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్
►ఈ రోజు తన మూడ్ ఇలా ఉందంటూ సోఫాపై నవ్వులు చిందుస్తున్న ఫోటోని షేర్ చేసింది సమంత ►యషికా ఆనంద్ తన ఐదు స్టిల్స్ని పోస్ట్ చేసింది. వాటిల్లో ఏది నచ్చిందో చెప్పమని అభిమానులను అడిగింది ►బ్లాక్ కలర్ డ్రెస్లో మృణాల్ ఠాకూర్ ఫోటో షూట్ చేసింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ..‘బ్లాక్ అండ్ బోల్డ్’ అని కాప్షన్ ఇచ్చింది. ఇలా నేడు సోషల్ మీడియాలో తారలు పంచుకున్న మరిన్ని విశేషాలు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
మాస్ డ్యాన్స్ చేసేద్దాం...
శంకర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అందుకే జోరుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఒక్కడే కాదు.. ప్రేయసితో, చెల్లెలితో, ఇంకా చాలామందితో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ రెచ్చిపోతున్నాడు. చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న ‘భోళా శంకర్’లోని పాట గురించే చెబుతున్నాం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, చెల్లెలి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం భారీ సెట్ని రూపొందించారు. చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి. -
ఆవారా సీక్వెల్.. తెరపైకి కార్తీ పేరు
మళ్లీ ఆవారాగా కనిపించనున్నారట కార్తీ. లింగుసామి దర్శకత్వంలో కార్తీ, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన తమిళ చిత్రం ‘పయ్యా’ (తెలుగులో ‘ఆవారా’). 2010లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కొంత కాలంగా లింగుసామి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండో భాగంలో ఆర్య హీరోగా చేస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ కార్తీ పేరే తెరపైకి వచ్చింది. కార్తీ నటించే చాన్స్ ఎక్కువగా ఉందని కోలీవుడ్ అంటోంది. -
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
త్వరలో భోళా మానియా
‘భోళా శంకర్’ ఆగస్ట్ 11న థియేటర్కి రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి ప్రమోషన్స్ ఆరంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముందుగా మ్యూజికల్ జర్నీప్రా రంభిస్తారు. ఆ విషయాన్ని తెలియజేసి, ‘భోళా మానియా త్వరలోప్రా రంభమవుతుంది’ అంటూ, చిత్రకథానాయకుడు చిరంజీవి రెండు చేతులను వెనక జేబులో పెట్టుకొని ఉన్న డ్యాన్స్ మూమెంట్ లుక్ని రిలీజ్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిపొంస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా, ఆయన సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపిస్తారు. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ నెలాఖరకు షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ప్రొడక్షన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
తమన్నా నా చెంప పగలగొడుతుందేమో!: బాలీవుడ్ నటుడు
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? ఈ ప్రశ్నకు ఆవిడే సమాధానం చెప్పాలి. కానీ అంతవరకు ఆగలేని జనాలు సోషల్ మీడియాలో తమన్నా, విజయ్ వర్మతో క్లోజ్గా కనిపించడంతో ఆవిడ లవ్లో మునిగి తేలుతోందని ఫిక్సయ్యారు. ఇంతలో విజయ్ వర్మ స్నేహితుడు గుల్షన్ దేవయ్య.. నా తమన్నాతో తిరుగుతున్నావంటూ విజయ్ను ఆటపట్టించడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. తాజాగా తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చాడు గుల్షన్. బర్త్డేకు గోల్డ్ గిఫ్ట్.. 'ద గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్'తో సినీ కెరీర్ను ప్రారంభించిన గుల్షన్ దేవయ్య ఆదివారం(మే 28) 45వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన గురించి విజయ్-తమన్నాల రహస్య రిలేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'బర్త్డే అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ ఉండదు. హాయిగా రోజంతా నిద్రపోతే బాగుండనిపిస్తుంది. కానీ బోలెడన్ని మెసేజ్లు వస్తుండటంతో వాటన్నింటికీ రిప్లై ఇవ్వాల్సి వస్తోంది. కొందరైతే బంగారు, వజ్రాభరణాలు సైతం పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నా మాజీ భార్య కలిరోయ్ జియాఫెటా నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నన్ను కొడుతుందేమో! విజయ్ వర్మ, తమన్నా రిలేషన్పిల్లో ఉన్నారా? లేదా? అనేది నాకు తెలియదు. వారిద్దరూ కలిసున్న రెండు,మూడు ఫోటోలు చూశాను. ఆమెను నేనెప్పుడూ కలవలేదు, కనీసం తనెవరో కూడా తెలియదు. నేను వాగింది చూసి ఆమె నన్ను కొట్టినా కొడుతుందేమో! నా గురించి నోటికొచ్చింది వాగుతున్నావేంటి? అని నా చెంప చెళ్లుమనిపిస్తుందేమో(నవ్వుతూ)! ఇప్పటికే ఆమె ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారనుకోండి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని తమన్నా అభిమానులు తిట్టారు. సీరియస్గా చెప్పాలంటే వారి మధ్య ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదు. అది వారి పర్సనల్ లైఫ్. విజయ్ను ఏడిపించడానికి ఆ సందర్భాన్ని వాడుకున్నానంతే! ఇకపోతే సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సాయిపల్లవి నా క్రష్' అని చెప్పుకొచ్చాడు గుల్షన్. View this post on Instagram A post shared by : ̶G̶u̶l̶s̶h̶a̶n̶ ̶D̶e̶v̶a̶i̶a̶h̶ (@gulshandevaiah78) చదవండి: పవన్ కల్యాణ్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
స్విస్లో సాంగ్
అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్లో కూల్ కూల్గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీమ్ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యాడు ‘భోళా శంకర్’. అక్కడి కూల్ కూల్ క్లైమేట్లో ప్రేయసితో ఫుల్ స్వింగ్లో స్ప్రింగ్లాంటి స్టెప్పులేస్తున్నాడట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరకర్త. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. -
అటు యాక్షన్.. ఇటు డబ్బింగ్
హీరో చిరంజీవి బరిలోకి దిగి, విలన్లను రఫ్ఫాడిస్తున్నారు. ఇదంతా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసమే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా, నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లోప్రారంభించింది యూనిట్. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. ‘‘భోళా శంకర్’ ‘కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
200 మంది డ్యాన్సర్ల మధ్య చిరు, కీర్తి స్టెప్పులు
అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు శంకర్. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన కోల్కతా బ్యాక్డ్రాప్ సెట్లో చిరంజీవి, కీర్తీ సురేష్లతో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా, ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. -
Movie News: మాలీ కాలింగ్
తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్కు మాలీవుడ్ నుంచి కాల్ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్ టైమ్ ఓ మాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్కి రాణిలా ఎంటర్ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా దిలీప్ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్గా కనిపించనున్నారట. క్యారెక్టర్ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్ ఎంట్రీ మమమ్మాస్ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. -
జమున బయోపిక్లో స్టార్ హీరోయిన్!
దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్స్మిత బయోపిక్ హిందీలో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొందించారు. సిల్క్స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్లో హీరోయిన్ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
తమన్నా- విజయ్ డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు
విజయ్ వర్మ, తమన్నా భాటియా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఏ ఈవెంట్లో చూసినా వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ముద్దు పెడుతున్న వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట ముంబయి ఎయిర్పోర్ట్లోనూ దర్శనమిచ్చింది. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి సందడి చేయడంతో మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. తన రాబోయే ప్రాజెక్ట్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' డైరెక్టర్ సుజోయ్ ఘోష్తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే నా అసలు లంచ్ డేట్ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్, తమన్నా డేటింగ్ వార్తలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. My lunch date🤷🏻♂️@sujoy_g https://t.co/I9jT7gupzV pic.twitter.com/nKKW8S0vkH — Vijay Varma (@MrVijayVarma) January 17, 2023 -
Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు
నటి తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడి పేరే మారుమోగుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు ఆ తర్వాత కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ నటి అయ్యింది. అయితే తెలుగులో కొంచెం ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. అయితే బాహుబలి, సైరా వంటి కొన్ని చిత్రాలు ఈమె నటన సత్తాను చాటిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకు ఉదాహరణ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి వంటి చిత్రాలే. అయితే ఈమె అందాల ఆరబోసిన చిత్రాలు మాత్రం బాగానే సక్సెస్ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్స్లో తమన్నా ఇరగదీసింది. హీరోలతో సన్నిహితంగా నటించడం గురించి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ ఇప్పుడు చిత్రాల్లో అంతరంగిక సన్నివేశాలను ఎవరు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చింది. అయినా నిజం చెప్పాలంటే సన్నిహిత సన్నివేశాల్లో నటించేటప్పుడు హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు గమనించానని పేర్కొంది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామని భావించడమే వారిలో దడకు కారణం కావచ్చునంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్తో పాటు హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఆ మధ్య రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటించనుందనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. కాగా ప్రస్తుతం ఈమె తన బాయ్ఫ్రెండ్ విజయవర్మతో షికార్లు కొడుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. చదవండి: (పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం) -
తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడు విజయ వర్మను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సింగిల్గా ఉంటూ ఇప్పటివరకు రూమర్లకు దూరంగా ఉన్న తమన్నా తాజాగా విజయ్ వర్మతో డేటింగ్ గాసిప్స్తో వార్తల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. ఈ వార్తల్లో నిజమెంతుంది, తమన్నా నిజంగానే విజయ్ వర్మతో రిలేషన్లో ఉందా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. దశాబ్ద కాలంపైనే సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె 2007లో హ్యాపీడేస్ మూవీతో తొలి సక్సెస్ను అందుకుంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఇటివల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి విలువ దాదాపు రూ. 16 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన విషయం తెలిసిందే. పలు శారీ షోరూంలతో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్కాన్ వంటి పలు బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తుంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె ఏడాది మొత్తం రూ. 12 కోట్లు అర్జీస్తుందట. ఈ లెక్కన నెలకు తమన్నా ఒక కోటి సంపాదిస్తుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు తమన్నా సంపాదించిన మొత్తం ఆస్తి విలువ రూ. 110 కోట్లుపైనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఒక్క చిత్రానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక స్పెషల్ సాంగ్స్కు అయితే రూ. 50 లక్షలు నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుందట. ఇదిలా ఉంటే తమన్నా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక డైమండ్ జువెల్లరి బ్రాండ్ను ప్రారంభించింది. అలాగే తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసిన అరుదైన వజ్రం ఉందట. దానిని మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సైరా నరసింహా రెడ్డి మూవీ సమయంలో తమన్నాకు బహుమతిగా ఇచ్చింది. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి. దీని బరువు సుమారుగా 62.4 గ్రాములు ఉంటుందట. వీటితో పాటు ఆమె గ్యారేజిలో విలువైన కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయట. అందులో లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్డబ్య్లూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక తమన్నా వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3 లక్షలు పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా తమన్నా భారీగానే ఆస్తులు వెనకేసుకుంది. చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ -
త్వరలో వివాహబంధంలోకి మిల్కీ బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?
మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తమన్నా. అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ముద్ర వేసిన తమన్నాపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపైనే నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. (చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్గా త్రోబ్యాక్ వీడియో) తమన్నా భాటియా త్వరలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తలను ఆమె ఇప్పటివరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెబుతూ వస్తోంది మిల్క్ బ్యూటీ. ముంబైకి చెందిన తమన్నా భాటియా.. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్లో నటించిన చిత్రాల్లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఆమె కెరీర్లో భారీహిట్గా నిలిచిన చిత్రం 'బాహుబలి'. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా భాటియా పెళ్లికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కాగా.. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ కనిపించనుంది. -
పెళ్లికి వ్యతిరేకిని కాను..!.. త్వరలోనే పిల్లల్ని కనాలనుకుంటున్నా!
పెళ్లెందుకు? మగ తోడు లేకుంటే బతకలేమా? అంతగా కావాలంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇలాంటి మాటలు కొందరు టాప్ హీరోయిన్ల నుంచి వింటునే ఉన్నాం. ఉదాహరణకు నటి శృతిహాసన్ తీసుకుంటే తాను పెళ్లి చేసుకోను అని ఒక సందర్భంలో ఖరాఖండిగా చెప్పారు. ఆ తరువాత బాయ్ఫ్రెండ్తో బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. అయితే అది కూడా జరగలేదు. ఇక నటి తమన్నా విషయానికొస్తే ఈమె కూడా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక నటిగా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందాల ఆరబోతకు కేరాఫ్గా ముద్ర వేసుకున్న తమన్నా ఇటీవల నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈమె అలా నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం బబ్లీ బౌన్సర్. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ హిందీ చిత్రం ఆ మధ్య విడుదలై నిరాశనే మిగిల్చింది. అదే విధంగా తెలుగులోనూ హిట్ చూసి చాలా కాలమే అయ్యింది. ఇక తమిళంలో చాలా గ్యాప్ తరువాత ఓ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఈమెకు ఇక్కడ రీ ఎంట్రీ చిత్రమే అని చెప్పాలి. ఒక పక్క అవకాశాలు తగ్గుముఖం పట్టడం, మరోపక్క పెళ్లి వయస్సు కూడా దాటిపోతోందని గ్రహించినట్లు ఉంది. తాజాగా ఆమె పేర్కొంటూ.. ఇన్నాళ్లూ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం లేకపోయిందని, అంతేగానీ పెళ్లికి వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కాబోయే జీవిత భాగస్వామిని సెట్ చేసుకునే ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా : తమన్నా
తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్. ఈ చిత్రం ద్వారా తన కెరీర్లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
'త్వరగా పూర్తి చేయండి ప్లీజ్'.. తమన్నా రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్
కొన్ని పాటలు కొందరికే యాప్ట్గా ఉంటాయి. అలా గ్లామర్ పాత్రలకైనా పాటలకైనా పర్ఫెక్ట్ నటి అంటే తమన్నానే అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ‘అందం తిన్నానండి.. అందుకే ఇలా ఉన్నానండి’ అంటూ పాడుతూ యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీకి ఇటీవల చిన్న గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. దీంతో ఆమె టైం అయిపోయిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే అలాంటి పసలేని ప్రచారాలను తొక్కేస్తూ తాజాగా మళ్లీ కథానాయికగా పుంజుకుంటున్నారు. హిందీలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు, మలయళంలో ఒక చిత్రం ఇలా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళా శంకర్, తమిళంలో సూపర్స్టార్ రజనీకాంత్తో నటిస్తున్న భారీ చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా మరిన్ని అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో తమన్నా జైలర్ చిత్ర దర్శకుడు నిల్సన్కు ఒక విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతోంది. అదేంటంటే తన పోర్షన్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని కోరిందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు ఆమె నిల్సన్కు వివరించినట్లు సమాచారం. కాగా ఈ బ్యూటీ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్ చిత్రంలో ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రంపై తమన్నా చాలా ఆశలు పెట్టుకున్నట్లు టాక్. ఇది థియేటర్లో విడుదల కాకపోవడంతో నిరాశకు గురైందట. మరి నెట్టింట్లో ఈ చిత్రాన్ని వీక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. చదవండి: (ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సత్యదేవ్, తమన్నా.. ‘గుర్తుందా.. శీతాకాలం’.. కొత్త తేదీ ఖరారు
సత్యదేవ్, తమన్నా జంటగా మేఘా ఆకాష్, కావ్యా శెట్టి, ప్రియదర్శి ముఖ్య తారలుగా నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్తుందా...శీతాకాలం’. ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సింది. అయితే తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లోని టీనేజ్, కాలేజ్ లైఫ్ సంఘటనలను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ విషయాలనే ఈ సినిమాలో చూపించాం. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్టైల్’కు తెలుగు రీమేక్గా ‘గుర్తుందా.. శీతాకాలం’ రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
Tamannaah Bhatia: మాలీవుడ్కు మిల్కీ బ్యూటీ
తమన్నా భాటియా మాలీవుడ్ ఎంట్రీ షురూ అయింది. బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామకు అక్కడ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్పై దృష్టి సారించింది. ఇక్కడ కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం కూడా తమన్నాను నిరాశపరిచింది. అలాంటి సమయంలో తెలుగులో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది. ఆ సినిమా సక్సెస్ ఆమె దశను మార్చేసింది. అదే సమయంలో తమిళ్లో సైతం కల్లూరి చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. ఇలా నాలుగు భాషల్లో కథానాయకగా నటిస్తూ అదే సమయంలో ఐటమ్ సాంగ్లోను ఇరగదీస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. 17 ఏళ్ల సినీ కెరియర్లో తమన్నా ఇన్నాళ్లకి మాలీవుడ్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ మలయాళంలో తొలిసారిగా అరుణ్ గోపి దర్శకత్వంలో దిలీప్ జంటగా నటించబోతున్నట్లు పేర్కొంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం ద్వారా మలయాళ సినీ ప్రేక్షకుల అభినందనలు పొందే ప్రయత్నం చేస్తానని తమన్నా పేర్కొంది. కాగా ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం, చిరంజీవితో భోళాశంకర్, హిందీలో బబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు వెబ్ సిరీస్లోనూ నటిస్తున్న తమన్న తాజాగా తమిళంలో రజినీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది.సిద్ధమవుతోంది. చదవండి: (గ్యాంగ్స్టర్గా విజయ్.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?) -
‘జైలర్’లో తమన్నా పాత్ర అలా ఉంటుంది!
ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్. అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ అయితే తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది. -
Tamannaah: తమన్నా ఆవేదన.. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే..
తమిళసినిమా: సినిమా రంగంలో హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని మిల్కీబ్యూటీ తమన్నా వాపోతోంది. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికగా రాణించిన ఈమెకు ప్రస్తుతం క్రేజ్ తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విశాల్కు జంటగా నటించిన యాక్షన్ చిత్రం తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఇలాంటి నటీమణులను కదిలిస్తే చిత్ర పరిశ్రమలో తమ అనుభవాల గురించి కథలు, కథలుగా చెప్పేస్తారు. వాటిలో చేదు అనుభవాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని కెరీర్ ప్రారంభంలో చెప్పడానికి వెనుకాడే నటీమణులు ఒక స్టేజ్ వచ్చాక అది అవకాశాలు తగ్గిన తరువాత ఏకరువు పెడుతుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ.. చిత్ర పరిశ్రమలో చాలా అసమానతలు జరుగుతుంటాయని తెలిపింది. వీటి గురించి మహిళలు సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పింది. తాను పని చేసిన చిత్రాలల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే దానిని వారు తీసుకునేవారు కాదని పేర్కొంది. ఆ తరువాత తన అభిప్రాయం సరైందేనా? కాదా? అన్న విషయం గురించి తానే పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపింది. చదవండి: (అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం) మహిళలకు సినిమా రంగంలో మర్యాద లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక సమయంలో తాను హీరోలను ప్రేమించే పాత్రలకే పరిమితమయ్యారని చెప్పింది అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోందని, కథా పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. హీరోలకే అధికంగా పారితోషికం ఇస్తున్నారని, హీరోయిన్లకు ఇవ్వడం లేదని అన్నారు. నిర్మాత నుంచి ఎలాగోల పారితోషికాన్ని పొందవచ్చునని, అయితే తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదని వాపోయింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరని, అదే హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం జరుగుతోందని వివరించింది. ప్రస్తుతం తాను రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. -
కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..
తమిళసినిమా: అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఈ మాటను ఎవరైనా చెబుతారు. అయితే తనలో అద్భుతమైన నటి ఉందన్న విషయాన్ని బాహుబలి చిత్రంతో ఈ మిల్కీబ్యూటీ నిరూపించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా నటించిన ఈమె ఇప్పటికీ మోస్ట్ బ్యాచిలర్ నటిగానే కొనసాగుతున్నారు. అయితే పూజా హెగ్డే, రష్మిక వంటి నటీమణులు దూసుకు రావడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. అదే విధంగా నయనతార, అనుష్క, త్రిష, తాప్సీ వంటి నటీమణుల తరహాలో తమన్నా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కాగా తాజాగా ఈమె నటించిన హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ మధు బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్గా నటించారు. ఒక కోటీశ్వరునికి లేడీ డాన్సర్గా నియమితురాలైన యువతి కథ బబ్లీ బౌన్సర్. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సెప్టంబర్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని తెలిపారు. -
ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు..
Tamannaah Bhatia Has Expensive Diamond: 'హ్యపీ డేస్' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తన అందం, అభినయంతో యూత్ను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్ల అవుతున్నా ఈ ముంబై భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'ఎఫ్-3' మూవీతో సూపర్ హిట్ కొట్టింది. త్వరలో 'గుర్తుందా శీతకాలం'తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 50కిపైగా చిత్రాల్లో నటించిన తమన్నా పర్సనల్ లైఫ్ను కూడా లగ్జరీతో ఎంజాయ్ చేస్తోంది. సుమారు రూ. 150 కోట్లకుపైగా ఆస్తిని కూడగట్టిన ఈ మిల్కీ బ్యూటీ వద్ద ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు వంటి తదితర విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అయితే తమన్నా వద్ద ఉన్న ఒక వస్తువు గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండటం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వజ్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని టాక్. రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ. 43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల మిత్సుబిషి పేజర్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని సమాచారం. -
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
హీరో-హీరోయిన్ జోడీ రిపీట్ కావడం కామన్. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి పది జంటలు రిపీట్ అవుతున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. బోలెడన్ని అంచనాలున్న సినిమాలే. ఇక రిపీట్ అవుతున్న జోడీ నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి-తమన్నా మళ్లీ ఆన్స్క్రీన్ లవర్స్గా కనిపించనున్నారు. ‘సైరా’లో ఈ ఇద్దరూ ప్రేమికులుగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బోళా శంకర్’లో జంటగా నటిస్తున్నారు. తమిళ ‘వేదాళం’కి రీమేక్గా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ కథ ప్రకారం ముందు హీరోని చంపాలనుకుంటుంది హీరోయిన్. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. తెలుగు రీమేక్లోనూ ఇలానే ఉంటుందని అనుకోవచ్చు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. ఇక ‘మహర్షి’లో రిషీ కుమార్ (మహేశ్బాబు), పూజ (పూజా హెగ్డే)ల చిన్ని చిన్ని అలకలు, ప్రేమ, దూరం కావడం, మళ్లీ దగ్గరవడం చూశాం. తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం ఇద్దరూ మళ్లీ జత కట్టారు. మహేశ్-పూజ జతకట్టిన రెండో సినిమా ఇది. అయితే త్రివిక్రమ్తో ఈ ఇద్దరికీ మూడో సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేశ్, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్-పూజా హెగ్డే కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. మరోవైపు రామ్ చరణ్-కియారా అద్వానీ కూడా మళ్లీ జతకట్టారు. ‘వినయ విధేయ రామ’లో తొలిసారి ఈ జంట కనిపించింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్గా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సంక్రాంతికి క్యూట్ లవర్స్గా ‘బంగార్రాజు’లో కనిపించిన నాగచైతన్య, కృతీ శెట్టి మరో సినిమాలో హీరో హీరోయిన్గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్కి చైతూ ఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది. కాగా ఆల్రెడీ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ది వారియర్’ ద్వారా కోలీవుడ్కి పరిచయం కానున్నారు కృతి. చైతూ, రాశీ ఖన్నాల జోడీ కూడా మళ్లీ కనిపించనుంది. ‘వెంకీ మామ’లో జంటగా నటించిన నాగచైతన్య-రాశీ ఖన్నా తాజాగా ‘థ్యాంక్యూ’లో హీరో, హీరోయిన్గా నటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని-కీర్తీ సురేష్ జోడీ రిపీట్ కానుంది. ఈ ఇద్దరూ ‘నేను లోకల్’లో తొలిసారి జంటగా నటించారు. తాజాగా ‘దసరా’లో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ఇంకోసారి ఖుషీగా జోడీ కట్టారు విజయ్ దేవరకొండ-సమంత. ‘మహానటి’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లో నటిస్తున్నారు. వీళ్లే కాదు.. రెండోసారి జంటగా కనిపించనున్న హీరో-హీరోయిన్లు ఇంకా ఉన్నారు. -
రామ్ చరణ్, తలపతి విజయ్ సినిమాలపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
-
తమన్నాకి అనిల్ రావిపూడి మధ్య గొడవ?
-
తమన్నా 'కొడ్తే' ఫుల్ సాంగ్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే! 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జాగ్వార్', 'జై లవకుశ', 'కేజీఎఫ్: చాప్టర్ వన్', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గనిలో ఆమె డ్యాన్స్ చేసిన కొడ్తే ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటలో బాక్సింగ్ రింగ్లోకి దిగిన తమన్నా స్టెప్పులతో రఫ్ఫాడిచ్చింది. తమన్ మ్యాజిక్, తమన్నా ఫిజిక్ మామూలుగా లేవంటూ యూట్యూబ్లో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఆలపించింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. చదవండి: అభిమానంతో థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ మోడల్ -
స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్ మూవీస్ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. ప్రొఫెషనల్ బాక్సర్గా.. ఇప్పటివరకూ లవర్ బాయ్గా కనిపించిన విజయ్ దేవరకొండ వెండితెరపై తన పంచ్ పవరేంటో చూపించేందుకు ‘లైగర్’లో బాక్సర్గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్ఫుల్గా చూపించే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్లా కనిపించేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్. టైసన్ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్లను కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్ అటు బాక్సింగ్ లవర్స్ ఈ స్క్రీన్ ప్లేని ఆగస్ట్ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్లో గని పంచ్ వేసవిలో తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ చేసిన వరుణ్ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ‘గని’ పంచ్ పవర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈసారి గోల్పై గురి ‘మజిలీ’లో క్రికెటర్గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది కూడా. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. బౌన్సర్ నుంచి బాక్సర్గా మారే క్యారెక్టర్లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బ్యాడ్మింటన్ నేపథ్యంలో.. సుధీర్బాబు డ్రీమ్ ప్రాజెక్ట్లలో ప్రముఖ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి. సుధీర్–గోపీచంద్ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్. ఇక పుల్లెల బయోపిక్ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్ బ్యాడ్మింటన్ రాకెట్తో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
‘గని’ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చూశారా? అదరగొట్టేసిందిగా..
Tamannaah Special Song Released From Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. కాగా ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో అదరిగొట్టింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా దూపొందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్ -
వెబ్ సిరీస్లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..
Heroines Who Has Entry In Web Series: కరోనా కారణంగా స్టార్స్కి వెబ్ వరల్డ్ మంచి హబ్ అయింది. బిగ్స్క్రీన్పై తారలు కనిపించని లోటుని వెబ్ సిరీస్లు కొంతవరకు తీర్చాయి. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. హబ్బ్బబ్బా.. వెబ్బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్ సిరీస్లే ఓ ఎంటర్టైన్మెంట్. పైగా స్టార్స్ చేయడంవల్ల ఈ సిరీస్లు బోలెడంత క్రేజ్ కూడా తెచ్చుకోగలిగాయి. ఆ క్రేజ్ని స్టార్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు. మరి.. వెబ్ ఉండగానే హౌస్ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా ! కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది సమంత. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్లోనూ మెరిసింది. సిల్వర్ స్క్రీన్ సమంతలోని పాజిటివ్ యాంగిల్ని చూపిస్తే డిజిటల్ వరల్డ్ నెగెటివ్ యాంగిల్ని బయటికి తీసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్లో నెగెటివ్ షేడ్లో కనిపించింది సమంత. వెబ్ ఎంట్రీతోనే ఎల్టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారామె. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారింది. కానీ ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించింది. సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయి. ఇక మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలీక్యాస్ట్’పై అప్పట్లో వెబ్ వ్యూయర్స్ ఆసక్తి కనబరిచారు. కానీ వీరి అంచనాలను ఈ సిరీస్ అందుకోలేకపోయింది. ఇందులో జెన్నీఫర్ మాథ్యూ పాత్రలో కనిపిస్తుంది కాజల్. హారర్ బ్యాక్డ్రాప్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘లైవ్ టెలీకాస్ట్’కు సరైన వ్యూయర్షిప్ లభించలేదు. ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూషన్లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తెలిపింది. మరో స్టార్ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్ సిరీస్లు ‘లెవన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ చేసింది. కేవలం వెబ్ సిరీస్ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్గా కనిపించింది తమన్నా. ఓ ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘మాస్టర్ చెఫ్’ షోకు తమన్నా హోస్ట్గా కనిపించింది. అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’తో ఈ ఏడాది వెబ్లోకి తొంగిచూశారు పాయల్ రాజ్పుత్, పూర్ణ, ఈషా రెబ్బా. ఇదే ఏడాది వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలోనూ ఈషా రెబ్బా మెరిసింది. ఇక ఇదే ‘పిట్టకథలు’లోని ఓ కథలో కనిపించిన అమలా పాల్ ఆ తర్వాత తెలుగు వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’తో ఆకట్టుకుంది. ఇదే ఆంథాలజీలో మెరిసిన టాప్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్కు సైన్ చేసిందట. కాగా మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ‘నవరస’లో ఓ రోల్ చేసింది అంజలి. వీరితోపాటు మరికొందరు హీరోయిన్లు వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టారు. సమంత, కాజల్, తమన్నాల కన్నా కాస్త లేట్గా వెబ్లోకి ఎంటరయింది త్రిష. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రిందా’కు సైన్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆల్రెడీ ఒకేసారి రెండు వెబ్ సిరీస్లను పూర్తి చేసిన మరో హీరోయిన్ రాశీ ఖన్నా. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్లలో తన వంతు షూటింగ్ను రాశీ ఖన్నా పూర్తి చేసింది. హిందీ వెబ్ వరల్డ్లో హీరోయిన్ రెజీనా చేసిన తొలి సిరీస్ ‘రాకెట్ బాయ్స్’. ఇందులో మృణాళినీ సారాభాయ్గా కనిపిస్తుంది రెజీనా. ఇటు ‘సన్నీ’ వెబ్ సిరీస్లోనూ రెజీనా ఓ లీడ్ చేసింది. హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ నటిస్తున్నారు. ఇదీ చదవండి: మాస్ సాంగ్తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్హాసన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్కు ఛాన్స్? -
నేను చేసిన తప్పు అదేనేమో!
‘‘ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఈ కారణంగా నా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు తమన్నా. ‘‘కొన్నేళ్ల క్రితం సరైన ఆహారపు అలవాట్లనే ఫాలో అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్ లుక్స్ కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేశాను. దీంతో నాకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేందుకు కేవలం సేంద్రీయ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నాను. వ్యాయామ నిపుణల సలహాల ప్రకారమే వర్కౌట్స్ చేస్తున్నాను. స్లిమ్గా, ఫిట్గా కనిపించేందుకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాను. నా కెరీర్ ఆరంభంలోనే ఓ మంచి డైటీషియన్ను నియమించుకోకపోవడమే నేను చేసిన ఓ తప్పుగా భావిస్తున్నాను’’ అని తమన్నా చెప్పుకొచ్చారని నెటింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో తమన్నా చేస్తున్న ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా..శీతాకాలం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!
‘‘రీమేక్ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫిల్మ్ సోల్ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్’కి రీమేక్గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు. ►‘అంధా ధున్’లోని థ్రిల్లింగ్, డార్క్ హ్యూమర్ అంశాలు నచ్చి, రీమేక్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్స్టోరీని మార్చాం. ఒరిజినల్ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే. ►ఒక స్క్రిప్ట్ అనుకుని డెవలప్ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక ఎగై్జటింగ్గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్ను స్టార్ట్ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్ వస్తోంది. సినిమాలను ఫాస్ట్గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్ రాస్తుంటారు.‘ఏక్ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్లోని ఆడపిల్లలు కిడ్నాప్నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆ కర్రీ అంటే మస్త్ ఇష్టం: తమన్నా
సాక్షి, హైదరాబాద్: మిల్కీబ్యూటీ తమన్నా తళుక్కుమంది. శుక్రవారం మాదాపూర్లోని వెస్టిన్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. తెలుగు వంటకాలంటే తనకెంతో ఇష్టమంది. ప్రత్యేకంగా చేసే రసం, చేపల పులుసును మస్తు లాగిస్తానంది. వంటకాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని చెప్పింది. ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. కార్యక్రమంలో నటుడు అల్లు శిరీష్, ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ ఫౌండర్ శ్రావణ ప్రసాద్, ప్రముఖ చెఫ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
అలా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి..తమన్నా
పన్నెండు గంటల గ్యాప్తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్కి, నెక్ట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్య పన్నెండుగంటల గ్యాప్ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్ టైమింగ్ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్లో తమన్నా చేస్తున్న కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. -
Tamannaah: మీసంతో తమన్నా, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. షూటింగ్ సెట్లో సరదాగా ఖాళీ సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో శనివారం షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతున్న వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి ‘టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం’ అంటూ సరదాగా షేర్ చేసింది ఆమె. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్ తమన్నా ఎంత ముద్దుగా ఉందో’, ‘మీసంతో అచ్చం మిక్కిమౌజ్లా ఉంది’, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తమన్నా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’తో పాటు ‘సత్యదేవ్’,‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో! విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి -
తెలంగాణ యాసలో తమ్మన్నా డబ్బింగ్!
తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్కి థ్యాంక్స్. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. డబ్బింగ్ పూర్తయిందోచ్ అంటూ ఫుల్ జోష్గా ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. -
ఎఫ్3 రిలీజ్ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే
విక్టరీ వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్గా రూపొందుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్2’ లో భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్గా చెప్పేశాడు దర్శకుడు. తాజాగా ఎఫ్ 3 విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. చదవండి: వరుణ్తేజ్ రింగులోకి దిగేది అప్పుడే! గత రెండు మూడు రోజుల నుంచి ముఖ్యంగా ఈరోజు(గురువారం) టాలీవుడ్లో బోలేడు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమా యూనిట్ కూడా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించనుందని పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్లో శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్ -
నవంబర్ కథేంటి?
‘నవంబర్ స్టోరీ’ సిరీస్తో వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తండ్రీ–కూతురు చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రి, అతన్ని కాపాడుకునే కూతురిగా తమన్నా కనిపించనున్నారు. నూతన దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో ప్రసారం కానుంది. ‘‘నేను చేసిన ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్లో ‘నవంబర్ స్టోరీ’ ఒకటి. మీ అందరికీ ఈ సిరీస్ను త్వరగా చూపించాలని ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భంగా తమన్నా అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. -
నవ్వులకు క్లాప్
వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్3’ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే ‘ఎఫ్3’ చిత్రాన్ని రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటినుండి దర్శకుడు అనిల్ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం’’ అన్నారు. అనిల్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్2’కి మరింత వినోదాన్ని జోడించి ‘ఎఫ్3’ని రూపొందిస్తున్నాం. అద్భుతమైన కథ కుదిరింది. మా ఆర్టిస్టులు మరిన్ని నవ్వుల్లో ప్రేక్షకులను ముంచెత్తుతారు. రాజుగారి బ్యానర్లో మరోసారి వర్క్ చేయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి. -
డోస్ డబుల్ అట!
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్లు పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. దీనికి సీక్వెల్గా ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఎఫ్2’లో కనిపించిన స్టార్సే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే డేట్ ఫిక్సయిందని సమాచారం. డిసెంబర్ 14 నుంచి ‘ఎఫ్ 3’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఈ సీక్వెల్లో ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండింతలు ఉంటుందట. కామెడీ డోస్ డబుల్ ఉంటుందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్కి థియేటర్స్లోకి ‘ఎఫ్ 3’ను తీసుకురావాలన్నది చిత్రబృందం ప్లాన్. -
మంచి నటి అనిపించుకుంటాను
‘‘అల్లు అరవింద్గారి సినిమాల వల్ల నేను యాక్టర్ నుండి స్టార్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘లెవెన్త్ అవర్’ సిరీస్ వల్ల ఓ స్టార్ నుండి మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ నటిగా తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. త్వరలో ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ సిరీస్ టైటిల్, పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొన్ని గంటల్లో నడిచే కథ ‘లెవెన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు కథ నచ్చితేనే చేస్తాడు. ఈ సబ్జెక్ట్ బావుందని అన్నారు. ప్రదీప్గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్ సిరీస్ చేయమని అడిగాను’’ అన్నారు. ‘‘8 అవర్స్’ అనే బుక్ నుండి హక్కులు కొని ‘లెవెన్త్ అవర్’ కథ తయారు చేశాను’’ అన్నారు రచయిత, నిర్మాత ప్రదీప్. ‘‘ఓ సిరీస్కు కావాల్సిన అన్ని అంశాలు మా ‘లెవన్త్ అవర్’లో ఉన్నాయి. ఒక రాత్రిలో జరిగే కథ’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
నలభై టు నాలుగు!
తమన్నా ఫిట్నెస్ మీద ఎంత దృష్టిపెడుతుంటారో తెలిసిందే. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఫిట్గా ఉంటారు. షూటింగ్స్తో సంబంధం లేకుండా ఆమె డైలీ రొటీన్లో వర్కౌట్స్ ఓ భాగం. లాక్డౌన్లోనూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని కూడా ఫిట్నెస్ మీద దృష్టిపెట్టమంటూ పోస్ట్స్ చేస్తుండేవారు. అయితే ఇటీవల తమన్నా కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. దాంతో వర్కౌట్స్కి చిన్న బ్రేక్ ఇచ్చారామె. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వర్కౌట్స్ మొదలెట్టారు. అయితే ఆమె గ్రాఫ్ నలభై నుంచి నాలుగుకి పడిపోయిందట. ‘‘కోవిడ్కి ముందు ఈజీగా 40 పుష్ అప్స్ చేసేదాన్ని. కోవిడ్ తర్వాత జస్ట్ నాలుగంటే నాలుగు చేయడం కూడా కష్టంగా అనిపించింది. కానీ మెల్లిగా మళ్లీ పికప్ అయ్యాను. కోవిడ్ వల్ల నీరసించిపోతాం. అయినా మన స్టామినాని మళ్లీ తిరిగి తెచ్చుకోవడం ముఖ్యం’’ అన్నారు తమన్నా. -
మాతృభాష నేర్చుకుంటున్నా!
షూటింగ్స్ లేని ఈ లాక్డౌన్ వేళ తన మాతృభాష సింధీ నేర్చుకుంటున్నానని చెబుతున్నారు హీరోయిన్ తమన్నా. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే– ‘‘ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నందువల్ల తెలుగు, తమిⶠభాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. ఈ లాక్డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నాను. అలాగే మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కాస్త కొత్తగా ఉంది. మా తమ్ముడు (ఆనంద్) న్యూయార్క్లో ఉండిపోయాడు. తను కూడా మాతో ఉండి ఉంటే మరింత బాగుండేదనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
గోపీచంద్ సీటీమార్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్గా తమన్నా నటిస్తున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వేసవి బరిలో.. .
‘గౌతమ్నంద’ చిత్రం తర్వాత గోపీచంద్– సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్లో భాగంగా అజీజ్ నగర్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్కుమార్. -
ఇండియాలోనే తెలియనివారు ఎవరూ లేరు..
సినిమా: నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చింది నటి తమన్నా. తన గురించి తాను అలా చెప్పుకోవడంలో తప్పులేదనుకుంటా. ఎందుకంటే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా తనకుంటూ ఒక గుర్తింపు పొందిన నటి తమన్నా. నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించిన ఈ బ్యూటీ మొదట్లో అందరి మాదిరిగానే అందాలారబోతకే పరిమితం అయినా, బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో నటిస్తోంది. ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని అంది. అన్ని భాషల్లోనూ నటించానని, ఇండియాలోనే తనను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం లేదని అంది. అంతగా పాపులర్ అయ్యానని చెప్పింది. అంతగా పేరు, ప్రఖ్యాతలు లభించడం సంతోషంగా ఉందని అంది. తెలుగులో బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించానని, ఆ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందానని అంది. ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించానని, ప్రస్తుతం మళ్లీ నటిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిక్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పింది. కాగా ప్రేక్షకులు తనను కొత్తగా నటించడానికి వచ్చిన నటిగా చూడాలని, అప్పుడే తానూ ఇంతకు ముందు నటించినదంతా మరచి కొత్తగా పరిచయం అయిన నటిగా నటించగలనని అంది. ఇకపోతే తన సౌందర్య రహస్యం గురించి అడుగుతున్నారని, అందుకు తన ఆహారపు అలావాట్లే కారణం అని చెప్పుకొచ్చింది. తన ఆహార నియమావళి గురించి చెప్పాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతానని చెప్పింది. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పును కొంచెం తింటానని చెప్పింది. ఆ తరువాత ఇడ్లీ, దోశ, ఓట్స్ వంటి వాటిలో ఒక దాన్ని స్పల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. ఇకపోతే మధ్యాహ్నం ఒక కప్పు అన్నంతో ఎక్కువ కాయగూరలు తీసుకుంటానని చెప్పింది. రాత్రికి మాత్రం ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్డు, చికెన్ వంటిని భుజిస్తానని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ యోగా, ఎక్సర్సైజులు క్రమం తప్పకుండా చేస్తానని చెప్పింది. ఇవే తన అందానికి, ఆరోగ్యానికి సూక్తులు అని తమన్నా పేర్కొంది. -
థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు
‘‘చాలామంది హీరోలు మూడురాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు. కానీ, అది కొంతమందికే వస్తుంది. అలా ప్రేక్షకుల అభిమానంతో ఇంతదూరం రాగలిగాను. నాకు థియేటరే గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అని హీరో విశాల్ అన్నారు. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయికగా నటించారు. నిర్మాత శ్రీనివాస్ ఆడెపు ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘యాక్షన్’ 27వ చిత్రం. నా 26 చిత్రాల్లో నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఈ ‘యాక్షన్’లో అన్ని తగిలాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 150 కోట్ల బడ్జెట్ సినిమాలా అనిపిస్తుంది. కానీ, మా బడ్జెట్ 60కోట్లు. నిర్మాతలు బాగుండాలని సినిమాలు తీస్తారు సుందర్గారు. నేను నేల టిక్కెట్ కొని సినిమాలు చూస్తాను. అప్పుడే ప్రేక్షకులు ఏ సీన్స్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారో గమనిస్తాను. ఈ సినిమాలో నా మిత్రుడు హీరో రానా ఒక ర్యాప్ పాడారు. త్వరలోనే మీరు వింటారు. శ్రీను మంచి విజన్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్’’ అన్నారు. ‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించలేదు. డైరెక్టర్ అవుదామని 6–7 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశా. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లోకి వచ్చి ‘ఇస్మార్ట్శంకర్, గద్దలకొండ గణేశ్, రాజుగారి గది 3’ చిత్రాలను పంపిణీ చేశా. ఇప్పుడు ‘యాక్షన్’ సినిమాతో నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉం ది. ప్రిన్స్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు శ్రీనివాస్ ఆడెపు. ‘‘యాక్షన్’ చిత్రం నాకు డ్రీమ్ ప్రాజెక్ట్’’ అన్నారు తమన్నా. నటులు ఆదిత్, ప్రిన్స్, నటీమణులు ఐశ్వర్యా లేక్ష్మి, ఆకాంక్ష, సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మాట్లాడారు. -
డిటెక్టివ్ రిటర్న్స్
విశాల్ మళ్లీ డిటెక్టివ్ అయ్యారు. 2017లో ఓసారి ‘డిటెక్టివ్’గా మనకు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే మలి భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్లోని బ్రిస్టల్లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాతో ఆశ్య హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. విశాల్ ‘యాక్షన్’ సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు. ‘యాక్షన్’ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
యాక్షన్ సీన్స్లో విశాల్, తమన్నా అదుర్స్
విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం ‘యాక్షన్’. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను చిత్ర బృందం దీపావళి సందర్భంగా విడుదల చేసింది. టర్కీ, అజర్బైజాన్లో విశాల్, తమన్నా కలిసి విలన్లను పట్టుకునేందుకు చేస్తున్న సాహసాలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యాక్షన్ సీన్స్లో విశాల్తో సహా తమన్నా కూడా అదరగొట్టిందంటూ యాక్షన్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం టర్కీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలవడం పట్ల విశాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా విశాల్- సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'పక్కింటి అమ్మాయిలా ఉండడానికి ఇష్టపడతా'
‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా’ అంటూ ‘సైరా’లో ఉత్తేజ పరిచింది తమన్నా భాటియా. గ్లామర్ పాత్రలే కాదు కళనే ఆయుధంగా వాడుకున్న ‘లక్ష్మి’లాంటి పాత్రలను కూడా ‘శబ్భాష్’ అనిపించేలా నటించగలనని మరోసారి నిరూపించిన తమన్నా ముచ్చట్లు... పర్సనల్ స్టైల్ నా మానసిక స్థితిని బట్టి నా పర్సనల్ డ్రెస్సింగ్ ఆధారపడి ఉంటుంది. పొరుగింటి అమ్మాయిలా సహజంగా ఉండడానికి ఇష్టపడినట్లే రాణిలా అట్టహాసంగా ఉండడానికీ అంతే ఇష్టపడతాను. ∙నా దృష్టిలో ఫ్యాషన్ అంటే గుడ్డిగా ట్రెండ్ను అనుసరించడం కాదు. అది పూర్తిగా మన అవగాహనకు సంబంధించినది. ∙ఫ్యాషన్ ప్రపంచం చుట్టూ చక్కర్లు కొట్టడానికి ఇష్టపడను. అయితే ఫ్యాషన్కు సంబంధించిన ఆర్టికల్స్ను చదువుతాను. పుట్టకతోనే ‘ఫ్యాషన్ సెన్స్’ ఎవరికీ రాదు. పరిశీలనతో అది మనలో వృద్ధి చెందుతుంది. ఫ్యాషన్ అంటే పడి చావను కాని ఏది చేసినా కొత్తగా కనిపించాలని అనుకుంటాను. ∙ఫ్యాషన్కు సంబంధించి గతంలో కంటే కూడా ఇప్పుడే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. మామూలుగానైతే టీషర్ట్ – జీన్స్ ధరించడం అంటే ఇష్టం. గ్లామర్ గ్లామర్ కోసం సౌందర్యసాధనాల మీద అతిగా అధారపడను. తినే తిండిపై శ్రద్ధ పెడతాను. న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకుంటాను. మెరిసే చర్మానికి కాస్మొటిక్స్ కంటే క్రమశిక్షణ ముఖ్యమని నమ్ముతాను. ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండటం, ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర, సానుకూల దృక్పథం ఉండడం... మొదలైనవి ఆ క్రమశిక్షణలో బాగం.. అలా కుదరదు సినిమా ఫీల్డ్లో కెరీర్ను ప్లాన్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ ‘అస్థిరత’ ఎక్కువ. స్ట్రాటజీ ముఖ్యం. కొత్త ప్రదేశాలు, కొత్త భాష అంటే ఇష్టపడతాను. వాటిని ఎంజాయ్ చేస్తాను. అలా కాకుండా ‘అమ్మో’ అనుకుంటే కొత్తదనాన్ని ఆస్వాదించలేము. కొత్త ప్రదేశం, కొత్త భాషలు మన జ్ఞానాన్ని పెంచుతాయి. మరో కోణం మా ఫాదర్ ఎప్పటి నుంచో నగల వ్యాపారంలో ఉన్నారు. కాబట్టి నగలంటే చిన్నప్పటి నుంచే ప్యాషన్ ఉంది. ఈ కాలనికి సరిపడే, సౌకర్యంగా ఉండే నగలను డిజైన్ చేయడం అంటే ఇష్టం. ‘వసువం సర్వనం ఒన్న పడి చవంగ’ అనే తమిళ సినిమాలో నేను డిజైన్ చేసిన నగలను ఉపయోగించారు. మరొక విషయం ఏమిటంటే... ఖాళీ సమయంలో రచనలు కూడా చేస్తుంటాను. వంటలు చేయడం ఇష్టమే కాని చాలా సందర్భాల్లో ఉప్పు వేయడం మరిచిపోతుంటాను. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఓషో, పాల్ కోయిలో పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను. ఆటలు అంటే ఇష్టం ఉండదు కాని యోగ, రన్నింగ్ చేస్తాను. ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. కంపెనీ ఉండాలి. కబుర్లూ ఉండాలి! -
మోత మోగాల్సిందే
స్పెషల్ సాంగ్స్లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. ఈ స్టెప్స్కు స్క్రీన్పై మహేశ్ బాబు కూడా ఉంటే ఇక అంతే...థియేటర్లో మహేశ్ ఫ్యాన్స్ ఈల వేసి గోల చేయాల్సిందే. ఆ సౌండ్కి థియేటర్ మోత మోగాల్సిందే. మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇంట్రోసాంగ్లో తమన్నా డ్యాన్స్తో అలరించబోతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ–‘‘మహేశ్తో ‘ఆగడు’(2014) సినిమాలో హీరోయిన్గా నటించాను. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మహేశ్ సినిమా ఇంట్రో సాంగ్లో డ్యాన్స్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాట గురించి చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు. ఇంట్రో సాంగ్ చిత్రీకరణను డిసెంబరులో ప్లాన్ చేశారని తెలిసింది. అలాగే మహేశ్ ఇంట్రోసాంగ్లో తమన్నా కనిపిస్తే, స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే చిందేస్తారట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో రష్మికా మండన్నా కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కబడ్డీ.. కబడ్డీ...
ఈ మధ్య తమన్నాకు కాస్త తీరిక చిక్కితే చాలు.. కబడ్డీ కబడ్డీ అని నాన్స్టాప్గా చెబుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్లో ప్రత్యర్థి ఒడిసి పట్టుకుంటే, వదిలించుకుని వెళ్లేవరకూ కబడ్డీ కబడ్డీ అనాలి కదా... కాదు కాదు ప్లేయర్స్తో అనిపించాలి కదా. విషయం ఏంటంటే.. గోపీచంద్ సరసన తమన్నా ఓ సినిమాలో కథానాయికగా నటించబోతున్నారు కదా. ఇందులో ఈ బ్యూటీ కబడ్డీ కోచ్ పాత్ర చేయబోతున్నారట. సినిమాలో కబడ్డీ ప్లేయర్స్కు కోచింగ్ ఇవ్వడానికి ముందు తాను కబడ్డీ గురించి తెలుసుకుంటున్నారట తమన్నా. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే టైటిల్ని అనుకుంటున్నారని సమాచారం. -
ఆటాడిస్తా
వెండితెరపై క్రీడాకారిణిగా కనిపించబోతున్నారు తమన్నా. అయితే ఆమె ఏ ఆట ఆడబోతున్నారు? ప్రత్యర్థులను ఎలా ఆటాడిస్తారు? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని తాజా సమాచారం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశామని మంగళవారం చిత్రబృందం తెలిపింది. సినిమాలోని క్యారెక్టర్ ప్రకారం తమన్నా క్రీడాకారిణిగా కనిపించనున్నారట. ఇదిలా ఉంటే సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ (2012), ‘బెంగాల్ టైగర్’ (2015) సినిమాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
ఆ ఒక్కటి తప్ప..
సినిమా: ఈ తరం హీరోయిన్లు అందాలారబోతకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. లిప్లాక్ సన్నివేశాల్తోనూ నటించడంలో తప్పేంటి అంటున్నారు. ఇక నటి తమన్నా విషయానికి వస్తే, ఈ అమ్మడు పూర్తిగా గ్లామర్నే నమ్ముకుని వచ్చింది. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ల్లోనే అవకాశాలు వరుసకట్టడంతో దక్షిణాది పరిశ్రమనే ఆశాజనకంగా ఉండడంతో ఇక్కడి చిత్రాలపైపే దృష్టి సారించింది. మొదటి నుంచి గ్లామర్నే నమ్ముకున్న ఈ గుజరాతీ బ్యూటీ దానితోనే స్టార్ హీరోయిన్ అంతస్తుకు ఎదిగింది. అలాంటిది బాహుబలి చిత్రంలో వీరనారి అవంతిక పాత్రలో చాలా మంచి అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. అయినాగానీ ఆ తరువాత అలాంటి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడిని వరించలేదు. దీంతో తన గ్లామర్ పంథాలోనే పయనిస్తోంది. అలాంటిది ఇటీవల ఒక భారీ చిత్రంలో లిప్లాక్ సన్నివేశాల్లో నటించాలనే ఆఫర్ వచ్చిందట. అందుకు అదనంగా పారితోషికాన్ని కూడా చెల్లించడానికి నిర్మాతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అందాలారబోతకు ఎంత దాకా అయినా వెళ్లడానికి రెడీ, ఈత దుస్తులు ధరించడానికీ రెడీ, కానీ లిప్లాక్ సన్నివేశాల్లో పారితోషికం ఎంత ఇస్తానన్నా నటించనని ఖరాఖండీగా చెప్పేసిందట. కొందరు నటీమణులు ముద్దు సన్నివేశాలే కాదు, నగ్న సన్నివేశాల్లోనూ నటించడానికి రెడీ అని గేట్లెత్తేస్తుంటే తమన్నా మాత్రం ఆ ఒక్కటీ తప్ప అనడం సినీ వర్గాలను విస్మయం పరుస్తున్నా, ఆమె అభిమానులు మాత్రం ప్రశంసిస్తున్నారట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో చిరంజీవికి జంటగా నయనతార నటిస్తున్నా, తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రపై మిల్కీబ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత కూడా గ్లామర్ పాత్రల్లోనే నటించాల్సి వస్తున్న తమన్నాకు సైరా చిత్రంలో మరోసారి నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. దీంతో బాహుబలి చిత్రంలో ఎంత పేరు వచ్చిందో, సైరారోనూ అంత మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉంది. ఈ చిత్రం తనకు రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని, సైరాలో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించడం సంతోషం అయితే నయనతారతో కలిసి నటించడం రెట్టింపు సంతోషం అని తమన్నా పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో విశాల్కు జంటగా నటిస్తోంది. -
విలక్షణ నటుడి సరికొత్త అవతారం!
ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బోలే చుడియాన్’. నవాజ్ సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మిల్క్ బ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. గాజులు అమ్మే వ్యక్తికి, పల్లెటూరి అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథగా ‘బోలే చుడియాన్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు మూవీ యూనిట్. సినిమాకు హైప్ క్రియేట్ చేసే క్రమంలో నవాజుద్దీన్ రాపర్గా అవతారమెత్తాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఓ పాట పాడాడు. ఈ పాట టీజర్ను సోమవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. తమన్నాతో కలిసి తన మార్కు స్టైల్లో స్వాగే చూడియాన్ అంటూ పాట పాడిన నవాజ్.. ‘మొదటిసారి పాడిన ర్యాప్ సాంగ్ టీజర్ను విడుదల చేస్తుంన్నందుకు సంతోషంగా ఉందంటూ వీడియోను షేర్ చేశాడు. కాగా ఈ పాట గురించి షమాస్ మాట్లాడుతూ..‘మొదట నవాజ్ను రాప్ పాడమని అడిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని, కానీ సంగీత దర్శకుడితో కలిసి సాధన చేసిన తర్వాత గాడిలో పడ్డాడు. ఇప్పటికే చాలామంది నటులు తమ సినిమాల కోసం పాటలు పాడుతున్నారు. అందుకే నవాజ్తో ఒక పాట పాడిస్తే బాగుంటుందని అనిపించి ఇలా చేశామని చెప్పాడు. ఇక సినిమా గురించి తమన్నా మట్లాడుతూ..బాహుబలి సినిమా తన కెరీర్లో పెద్ద సినిమానే అయినప్పిటికీ, బోలే చూడియాన్’ సినిమా తనకెంతో ముఖ్యమని తెలిపారు. ఈ సినిమాలో భాగమవడం తన అదృష్టమని, ఇందులో ప్రేక్షకులకు కొత్తగా కనిపించనునట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరో నవాజ్ నటన చూసి ఆశ్యర్యపోయానని, సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే సరికి నవాజ్ నటన రహస్యం తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు మిల్క్ బ్యూటీ. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా భావోద్వేగమైన క్యారెక్టర్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. View this post on Instagram Excited to share the teaser of my first ever Rap song #Swaggychudiyan with @tamannaahspeaks for #BoleChudiyan directed by @shamasnawabsiddiqui . thank u team @woodpeckermv @zaverikiran9 #rajeshbhatia, @zeemusiccompany @kumaarofficial @anuragbedi A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on Jul 14, 2019 at 11:33pm PDT -
అందుకోసం ఆశగా ఎదురుచూస్తున్నా!
నటుడు రజనీకాంత్ విలన్తో మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ అమ్మడికి ఇటీవల సరైన హిట్స్ లేవనే చెప్పాలి. తెలుగులో వెంకటేష్తో జతకట్టిన ఎఫ్ 2 చిత్రమే ఈ తమన్నాకు చివరి సక్సెస్ఫుల్ చిత్రం. ఆ తరువాత కోలీవుడ్లో ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్లో ఈ బ్యూటీ సరైన సక్సెస్ను చూసి చాలా కాలమైంది. ఆ మధ్య ఉదయ*నిధి స్టాలిన్తో నటించిన కన్నె కలైమానే చిత్రం నటిగా ప్రశంసలను అందించిందిగానీ చిత్రం ఆడలేదు. ప్రస్తుతం కోలీవుడ్లో విశాల్కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు హిందీలో నటించిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం ఖామోషి డిజాస్టర్గా నిలిచింది. అయినా లక్కీగా బాలీవుడ్లో మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా వార్త. అవును హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నా ఇంటి తలుపుతట్టింది. నవాజుద్దీన్ సిద్ధిక్ తమిళంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో విలన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా హిందీలో హీరోగా నటించనున్న చిత్రంలో నటి తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మూవీకి బోలే చుడియాన్ అనే టైటిల్ను నిర్ణయించారు. దీనికి కొత్త దర్శకుడు శ్యామ్స్ నవాబ్ సిద్ధిక్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్కు సోదరుడు ఈ దర్శకుడే తన చిత్రంలో నటి తమన్నా హీరోయిన్గా నటించనున్న విషయాన్ని సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీనికి స్పందించిన తమన్నా తాను బోలే చుడియన్ చిత్రంలో ఒక భాగం కానుండడం చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ అమ్మడికి బాలీవుడ్లో ఇప్పటి వరకూ సరైన హిట్ తగల్లేదు. ఈ కొత్త చిత్రం అయినా మంచి సక్సెస్ను అందిస్తుందేమో చూడాలి. -
బెంబేలెత్తిపోయిన తమన్నా
అందాలభామ తమన్నా తన గురించి వైరల్ అవుతున్న ఒక వార్త గురిం చి కలవరపడిపోయింది. అది తన ఇమేజ్కు సంబంధించిన వార్త కావడమే ఈ అమ్మడికి గుబులు పుట్టించడానికి కారణం. తమన్నాకంటూ ఒక ఇమేజ్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దంన్నరకు పైగా హీరోయిన్గా తన ఇమేజ్ను కాపాడుకుంటూ వస్తోంది. ఇన్నేళ్లుగా అందాన్నే గట్టిగా నమ్ముకున్న ఈ మిల్కీబ్యూటీ బాహుబలి చిత్రంతో తన నటనాప్రతిభను చాటు కుంది. ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో సైరా నరసింహారెడ్డి ఒకటి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో నటి తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెది ప్రతినాయకి పాత్ర అనే ప్రచారం చోరందుకుంది. దీనికి నటి తమన్నా వెంటనే స్పందించింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో తన పాత్ర గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ అమ్మడు కంగారు పడిపోయి వెంటనే స్పందించడానికి కారణం ఉంది. ఇటీవల ఒక ప్రముఖ నటి వైవిధ్యం పేరుతో నెగెటీవ్ ఛాయలున్న పాత్రలో నటించి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి తనకు రాకూడదనే తమన్నా సైరా నరసింహారెడ్డి చిత్రంలో తన పాత్ర నెగటీవ్ పాత్రగా ఉండదని, చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని చెప్పుకొచ్చింది. తాను నెగిటీవ్ పాత్రలో నటిస్తున్నట్లు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదని, ఏం ఆశించి ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. హిందిలో నటించిన ఖామోషీ చిత్రం ఇటీవల విడుదలై ఆమెను నిరాశ పరిచింది. అలా బాలీవుడ్లో హిట్ కొట్టాలన్న కల ఇంకా నెరవేరలేదు. అయితే దక్షిణాదిలో మాత్రం తమన్నా మార్కెట్కు డోకా లేదు. -
మళ్లీ మళ్లీ భయపెడతా
మిల్కీ బ్యూటీ తమన్నా హారర్ సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే ప్రేక్షకులను భయపెట్టే హారర్ మూడ్లోనే తమన్నా ఉన్నట్టు అనిపిస్తోంది. గత వారంలో ‘దేవి 2’ చిత్రంతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఆమె వచ్చే వారం ‘కామోషి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులనూ భయపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మరో తమిళ సినిమా కూడా హారర్ చిత్రమే. విశేషమేటంటే ఆ సినిమా తాప్సీ నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి రీమేక్ అని తెలిసింది. రోహన్ వెంకటేశన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట. -
ఫుల్ నెగెటివ్
బోరెత్తినట్టుంది... రాముడు మంచి బాలుడిలాగా ఉండి ఉండి విసుగొచ్చినట్టుంది.కాస్త బ్యాడ్గా ఉంటే కిక్ వస్తుంది అని అనిపించినట్టుంది.హీరోలు హీరోయిన్లూ క్రీనీడల్లో కనుబొమ్మలెత్తి కోరగా చూసే నెగెటివ్ కేరక్టర్లలోకి దిగిపోతున్నారు. కొత్త సీసాలో కొత్త పెర్ఫార్మెన్స్. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా ఎన్టీర్ రెడీ. హీరోగా ఆయన ఎప్పుడో నిరూపించుకున్నారు. విలన్ పాత్రను ఇంకెంత బాగా చేయగలరో 2017లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రంలో చూశాం. ‘అసుర.. అసుర.. రావణాసుర’ అంటూ ‘జై’ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘బాహుబలి’ సినిమాలో రానా చేసిన ప్రతి నాయకుడి పాత్రను ఆడియన్స్ తెగ మెచ్చుకున్నారు. హీరోగా చేస్తూ విలన్గా రాణిస్తున్నవాళ్లల్లో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సరైనోడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో విలనిజమ్ పండించారు ఆది పినిశెట్టి. అలాగే కోలీవుడ్లో మాధవన్ ఎంత పెద్ద హీరోనే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమాలో విలన్ పాత్రతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు మాధవన్. సుధీర్బాబు బాలీవుడ్ ‘భాగీ’ చిత్రంలో విలన్గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రంలో నవదీప్ది విలన్ వర్గమే. 2017లో వచ్చిన ‘గృహం’ సినిమాలో కూడా సిద్దార్థ్ క్యారెక్టర్లో నెగటీవ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇలా మరి కొంతమంది హీరోలు కూడా వీలైనప్పుడల్లా విలన్లు అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు. విలన్ అంటే.. ఇప్పుడు గుర్తొచ్చే పేరు జగపతిబాబు. ‘లెజెండ్’ నుంచి జగపతిబాబు విలన్గా చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ‘యుద్ధం శరణం’లో విలన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో నటుడు సాయికుమార్ ‘ఎవడు’లో విలన్గా చేశారు. ప్రస్తుతం మహేశ్బాబు ‘మహర్షి’లో సాయికుమార్ విలన్గా చేస్తున్నారని సమాచారం. నితిన్ ‘లై’, విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాల్లో విలనిజం చూపించారు అర్జున్. ఇక పక్క ఇండస్ట్రీ హీరోలు ఇక్కడ విలన్లుగా నటిస్తున్నారు. రాజమౌళి ‘ఈగ’ సినిమాలో విలన్గా సుదీప్ అదుర్స్. రానా ‘అరణ్య’ సినిమాలో తమిళ హీరో విష్ణువిశాల్ విలన్గా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారని తెలిసింది. ఇలా మరికొందరు హీరోలు విలన్ పాత్రల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. నిజానికి ప్రతినాయకుడిగా చేయడం అనేది సవాల్ లాంటిదే. అందుకే అప్పుడప్పుడూ హీరోలు హీరోయిన్లు ఆ సవాల్కి సై అంటారు. అప్పటివరకూ వెండితెరపై మంచివాళ్లుగా కనిపించిన తారలు ఆ మంచితనానికి మటాష్ చెప్పి, చెడ్డవారిగా కనిపించడానికి రెడీ అవుతుంటారు. ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఈ ఏడాది కొందరు నాయకానాయికలు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. వారి గురించి తెలుసుకుందాం. హీరోనా? విలనా? హీరో ఆర్ విలన్?! నాని హీరోగా నటించిన ‘జెంటిల్మన్’ సినిమా ట్యాగ్లైన్ ఇది. నానితో ‘అష్టా చమ్మా’ తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో నాని డ్యూయెల్ రోల్ చేశారు. ‘జెంటిల్మన్’ సినిమాలో ప్రీ క్లైమాక్స్ వరకు నానిలో నెగటివ్ షేడ్స్ ఉన్నట్లే కనిపిస్తాయి. క్లైమాక్స్లో కథ టర్న్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను టచ్ చేయాలని చూస్తున్నారట నాని. అది కూడా మళ్లీ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే కావడం విశేషం. నాని, సుధీర్ బాబులు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. సుధీర్ బాబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్. మరి.. ఈ సినిమాలో నాని హీరోనా? విలనా? ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరుకుతుంది. అవును.. ప్రతినాయకుడే! గతేడాది ఉగాదికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఇది తమిళ మూవీ ‘జిగర్తండా’కి తెలుగు రీమేక్. ఒరిజినల్ చిత్రంలో బాబీ సింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఒరిజినల్లో బాబీ సింహా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సో.. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉంటాయనుకోవచ్చు. బైక్ జోరు బాగుంది టాలీవుడ్ రహదారిపై ‘ఆర్ఎక్స్ 100’ బైక్తో వెండితెరపైకి వచ్చిన హీరో కార్తికేయ మంచి స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా కార్తికేయనే హీరోగా కనిపిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల ‘ఇష్క్, మనం, 24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర చేయనున్నట్లు కార్తికేయ తెలిపారు. ఇది కచ్చితంగా విలన్ పాత్ర అని ఫిల్మ్నగర్ టాక్. అదే నిజమైతే కెరీర్ పీక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు కార్తికేయ ఇలా ప్రయోగాలు చేయాలనుకోవడం అభినందనీయమే. గయ్యాళి అత్త పాత్రల్లో విజృంభించిన సూర్యకాంతంని మంచి ప్రతినాయకురాలితో పోల్చవచ్చు. ఇక.. కథానాయికలుగా చేస్తూ, నెగటివ్ షేడ్లో రెచ్చిపోయినవారిలో రమ్యకృష్ణ ముందువరుసలో ఉంటారు. ‘నరసింహా’ చిత్రంలో ఆమె చేసిన నీలాంబరి అందుకు మంచి ఉదాహరణ. ఏ కథానాయికను అడిగినా రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి పాత్రకు అవకాశం వస్తే చేయాలనుంది అంటుంటారు. అలా కాజల్ అగర్వాల్ చాలాసార్లు చెప్పారు. ఆమె ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. కెరీర్లో 50 చిత్రాల మైలురాయిని చేరుకున్న తర్వాత కాజల్ ప్రయోగాలపై కన్నేశారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీత’ అనే సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కాజల్. అలాగే తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’లో సమంత క్యారెక్టర్లో విలనిజం ఛాయలు ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటివరకు మిల్కీబ్యూటీ తమన్నాను గ్లామనస్ పాత్రల్లో చూశాం. రీసెంట్గా ఆమె కాస్త ట్రాక్ మార్చారు. ‘దేవి 2, రాజుగారిగది 3’ చిత్రాలతో పాటు ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్లో నటిస్తున్నారు. ఇందులో తమన్నా క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. మైండ్గేమ్ ఆడే క్యారెక్టర్లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో విశాల్ హీరో. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపై సంచలనం సృష్టించారు పాయల్ రాజ్పుత్. తొలి చిత్రంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇందులో పాయల్ నటన ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే... మరో ఏడాది వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవట. అలాగే సమంత నటించిన ‘యు–టర్న్’ సినిమాలో భూమిక, శివ కార్తికేయన్ హీరోగా చేసిన ‘సీమరాజా’ చిత్రంలో సిమ్రాన్, ధనుష్ తమిళ ‘కొడి’ (తెలుగులో ధర్మయోగి) సినిమాలో త్రిష విలన్ పాత్రలు చేశారు. ఇక వరలక్ష్మీ శరత్కుమార్ అయితే ఇటీవల విలన్ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ‘పందెంకోడి 2, సర్కార్’ సినిమాల్లో ఆమె పూర్తిస్థాయి విలన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. హీరోలు విలన్లుగా చేయొచ్చు. ఫర్ ఎ చేంజ్ విలన్ హీరో అయితే బాగానే ఉంటుంది. ఈ తరం విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ హీరో అయ్యారు. ‘సింగమ్ 3, విన్నర్, రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో ఆయన విలన్గా నటించారు. ఇప్పుడు సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం‘ఉద్ఘర్ష’ కోసం ఆయన లీడ్ యాక్టర్గా మారారు. ఇందులో సాయి ధన్సిక, శ్రద్ధాదాస్, తాన్యాహోప్ కీలక పాత్రలు చేశారు. హీరోలు విలన్లుగా చేస్తే వెరైటీగా ఉంటుంది. కమెడియన్లు చేస్తే ఇంకా వెరైటీగా ఉంటుంది. గతంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటి హాస్యనటులు విలన్లు విజృంభించిన విషయం తెలిసిందే. కామెడీ విలన్గా బ్రహ్మానందం కూడా కనిపించారు. ఇప్పుడు కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ ‘గూఢచారి’లో హీరోయిన్ని హత్య చేయడానికి ప్లాన్ గీశారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ సమీరారావు అలియాస్ సమీరా షేక్ పాత్రధారి శోభితాను శ్యామ్ పాత్ర చేసిన వెన్నెల కిశోర్నే చంపాడన్న విషయం తెలిసిందే. ఫప్ట్ పార్ట్ క్లైమాక్స్లో శ్యామ్ పాత్ర చనిపోయింది. ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ను ఇటీవల షూరూ చేశారు. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఉంటుందా? వెయింట్ అండ్ సీ. – ముసిమి శివాంజనేయులు -
తమన్నాకు తాళి కడతా!
హెడ్డింగ్ చదివి ఈ మాట అన్నది తమన్నా అంటే బాగా ఇష్టపడే అబ్బాయి అనుకునేరు. అయితే ఈ మాట అన్నది కథానాయిక శ్రుతీహాసన్. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా! ఏం లేదండీ. ఇటీవల ఓ చాట్ షోలో శ్రుతి పాల్గొన్నారు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఎవర్ని డేట్కు తీసుకెళ్లేవారు? అన్న ప్రశ్నను శ్రుతీహాసన్ ముందు ఉంచితే... ‘‘నేను అబ్బాయిని అయితే తమన్నాను డేట్కు తీసుకెళ్లేదాన్ని. ఆమెను పెళ్లి చేసుకునేదాన్ని’’ అని చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ లవ్లో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలను కుంటున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం గురించి శ్రుతీహాసన్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ‘మైఖేల్ నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్’ అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. -
స్మైలీ మిల్కీ బ్యూటీ
-
నేరం చేయాలనుకుంటే ఆమెతో కలిసి చేస్తా!
సినిమా: ఒక వేళ నేను నేరం చేయాలనుకుంటే అందుకు భాగస్వామిగా ఎవరిని చేర్చుకుంటానో తెలుసా? అని అంటోంది నటి తమన్నా. ఒకప్పుడు హీరోయిన్ల మధ్య ఈర్షా్యద్వేషాలు అధికంగా ఉండేవంటారు. అంటే స్నేహితులుగా ఉన్న వారు లేరా? అంటే ఉండేవారు కానీ, తక్కువ అనే సమాధానమే వస్తోంది. అలాంటిది ఈ తరం హీరోయిన్లు అంతరంగంలో ఎలా ఉన్నా, బాహ్యప్రపంచంలో మాత్రం స్నేహాంగానే ఉంటున్నారు. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా, సహజ నటి శ్రుతిహాసన్పై స్నేహాన్ని తెగ పంచేస్తోంది. చాలా కాలం తరువాత ఈమె నటించిన తమిళ చిత్రం కన్నే కలైమానే శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా విభిన్నంగా, చాలా బలమైనదిగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నటి తమన్నా ఇంకా పలు విషయాలను పంచుకుంది. తాను తెలుగు, కన్నడం భాషల్లో పలు చిత్రాలు చేస్తున్న కారణంగా తమిళంలో ఎక్కువ చిత్రాలను అంగీకరించలేని పరిస్థితి అని చెప్పింది. అయితే ఇకపై తమిళ చిత్రాలపై అధిక దృష్టి పెడతానని పేర్కొంది. అదే విధంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పింది. ఇకపోతే నటి శ్రుతిహాసన్ అంటే తనకు చాలా ఇష్టం అని, తాను ఒక వేళ ఏదైనా నేరం చేయాలనుకుంటే దాన్ని శ్రుతిహాసన్ను భాగస్వామిగా చేసుకుని చేస్తానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను శ్రుతిహాసన్తో కలిసి నటించాలని కోరుకుంటున్నానని, దర్శక, రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ కోసం మంచి కథను సిద్ధం చేస్తారని ఆశిస్తున్నానని అంది. తమ కాంబినేషన్లో ఒక చిత్రం చేయాలని ఆశగా ఉందని తమన్న పేర్కొంది. చాలా గ్యాప్ తరువాత నటి శ్రుతిహాసన్ ఇటీవలే మళ్లీ నటనపై దృష్టి పెట్టింది. తమన్నా ఆకాంక్షలకు ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో. -
ఎవరైనా ఉంటే చెప్పండి
సినిమా: మీ ఊళ్లో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి పెళ్లి చేసుకుంటానని అంటోంది నటి తమన్నా. నటిగా ఈ అమ్మడి వయసు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కాలంలో హింది, తెలుగు, తమిళం, కన్నడం అంటూ పలు భాషల్లో నటించేసి భారతీయ సినీ నటిగా పేరు తెచ్చుకుంది. ఇంకా కథానాయకిగానే నటిస్తున్న ఈ మీల్కీబ్యూటీ అవకాశాలు తగ్గాయేమోగానీ, క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అయితే కోలీవుడ్లో తమన్నా నటించిన చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో ఇటీవల నటించిన నెక్టŠస్ ఏంటీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ విషయాన్ని ఈ అమ్మడు అంగీకరించడం లేదన్నది వేరే విషయం. నెక్ట్స్ఏంటీ చిత్రం చాలా మందికి నచ్చిందని, అందువల్ల అది సూపర్హిట్ చిత్రం అని నమ్మబలుకుతోంది. ఈ విషయాన్ని పక్కన పేడితే ఈ బ్యూటీ నటించిన తమిళ చిత్రం కన్నె కలైమానే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ చిత్ర విడుదల తేదీని నటి తమన్నా తాజాగా వెల్లడించింది. ఇటీవల చెన్నైలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తమన్నా మాట్లాడుతూ కన్నె కలైమానే అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, చిత్రం ఫిబ్రవరి 1వ తేదీన విడుదల కానుందని తెలిపింది. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటావన్న ప్రశ్నకు మీ ఊరిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి. పెళ్లి చేసుకుంటాను అని బదులిచ్చింది. ఇటీవల కన్నె కలైమానే చిత్ర ప్రచారం కోసం చెన్నైకి వచ్చిన తమన్నాను ఒక అభిమాని మీరంటే చాలా ఇష్టం మీమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను. అది సాధ్యం అవుతుందా? అని అడిగాడు. దీంతో పక్కనున్న నటుడు ఉదయనిధిస్టాలిన్ కలగచేసుకుని అస్సలు సాధ్యం కాదు. తమన్నాకు అమెరికాలో బాయ్ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? అని అన్నారు. దీంతో ఆయన చెప్పింది నిజమో, కాదో తెలియక అభిమానులు అయోమయానికి గురయ్యారు. అన్నట్టు ఈ భామ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ, చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో ముఖ్య భూమికను పోషిస్తోంది. అదే విధంగా హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. ఇక తమిళంలో నటిస్తున్న దేవి–2 చిత్రం నిర్మాణంలో ఉంది. -
తమ.. మన..
హిందీలో తమన్నా అంటే కోరిక.కోరికలు తీరాలి.తాము కోరిన కోరికలు తీరాలి.తమ కోరికలు తీరాలి.మన కోరికలు తీరాలి.తమన్నా అంటున్నది కూడా అదే.ఆశ నుంచి కాకుండా విలువలతో కూడిన కోరిక ఎవరిదైనా తీరాల్సిందే.కొత్త సంవత్సరం వస్తోంది.ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి కోరిక నిండే సమయం వస్తోంది.కోరికలు విరబూసే వేళ ఒక విరబూసిన కోరికతో స్పెషల్ ఇంటర్వ్యూ. డైరెక్షన్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? నాకు డైరెక్షన్ చేసే ఆలోచనే లేదు. డైరెక్షన్ అనేది డిఫరెంట్ టాస్క్. డైరెక్టర్ సీట్లో కూర్చోవాలంటే చాలా మందిని ఒకే క్రమంలో పెట్టి వాళ్ల నుంచి కావల్సింది తీసుకోగలగాలి. సినిమాకు ఏది బావుంటుందో ఊహించగలగాలి. డైరెక్టర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు పర్సనల్గా ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. నేను చేసే సినిమాలు ఎడిటింగ్ ఎలా చేస్తున్నారో గమనిస్తుంటాను. త్వరలోనే ఏదైనా మంచి స్కూల్లో జాయిన్ అయి ఎడిటింగ్ నేర్చుకుంటా (నవ్వుతూ). ప్రస్తుతం హీరోయిన్స్లో చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నారు. దాని మీద అభిప్రాయం? ఒక సినిమా కోసం నిర్మాత ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఒక ప్రాజెక్ట్లో చాలా మంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాంటి సమయంలో కేవలం ఇలాంటి అవకాశం తీసుకొని హీరోయిన్స్ని ఫేవర్ అడుగుతారని నేను అనుకోను.అంటే మీకు అలాంటì ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవంటారు?లేదు. అంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తూ ఇలాంటి పనులు చేస్తారు అనుకోను. కెరీర్వైజ్గా చేతినిండా సినిమాలున్నాయి. పర్సనల్గా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా?(నవ్వేస్తూ). అమ్మానాన్న, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉంటే ఆ న్యూస్ని నేనే హ్యాపీగా అందరితో షేర్ చేసుకుంటాను. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందా? అరేంజ్డా? లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. చూద్దాం. ఏం జరుగుతుందో. ‘హ్యాపీడేస్’ సినిమా తర్వాత ఎంత బిజీ అయ్యారో ఇప్పుడూ అంతే బిజీగా ఉన్నారు? తమన్నా: అవును. ఈ సంవత్సరం ఎక్కువ షూటింగ్స్ చేశాను. ‘నెక్స్›్ట ఏంటి?’ రిలీజైంది. ఎఫ్ 2, సైరా, తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. హిందీ సినిమా ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ రిలీజ్కు రెడీగా ఉంది. విశాల్తో ఓ సినిమా ఒప్పుకున్నాను. ఇక వరుసగా నా సినిమాలు విడుదలవుతాయి. ఇప్పుడున్న యాక్టర్స్ అందరికీ కాంపిటీటివ్ స్పిరిట్, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. ఇవి లేకుండా సక్సెస్ ఉండదు. సక్సెస్కు లాంగ్విటీ ఉండాలంటే కచ్చితంగా క్రమశిక్షణ ముఖ్యం. అందుకే ఒకేసారి ఎన్ని సినిమాలు చేసినా ఏ షూటింగ్కీ ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాను. సో.. వచ్చే ఏడాది 2, 3 నెలలకోసారి థియేటర్స్లో కనిపించి మీ ఫ్యాన్స్ని ఖుషీ చేస్తారన్న మాట? అవును. ఇది నాక్కూడా ఖుషీగానే ఉంది. కానీ ఇన్ని సినిమాలు కమిట్ అవ్వడం వల్ల తీరిక లేకుండా పని చేస్తున్నాను. అది గుడ్, బ్యాడ్ కూడా. కెరీర్ వైజ్గా మంచిదే. కానీ రెస్ట్ లేకుండా ఒళ్ళు హూనం చేసుకొని పని చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదేమో కదా. అందుకే వచ్చే సంవత్సరం షూటింగ్స్కి మధ్యలో చిన్ని చిన్ని బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. ఇన్ని సినిమాలు చేస్తుంటే ఇంటిని మిస్సవుతున్న ఫీలింగ్ చాలా ఉంటుందేమో? చాలా అంటే చాలా. సినిమాలు చేయడం, ప్రమోషనల్ యాక్టివిటీస్.. ఇలా ఫుల్ బిజీ. అందుకే ఏమాత్రం వీలు దొరికినా రెస్ట్ తీసుకోకుండా ముంబై వెళ్లిపోతున్నాను. అమ్మానాన్నలను చూసి, వెంటనే షూటింగ్కి అటెండ్ అయిపోతున్నాను. అమ్మానాన్న ఇంకా మీతోపాటు షూటింగ్స్కు వస్తున్నారా? లేదు. కెరీర్ స్టార్టింగ్లో చాలా కాలం వచ్చారు. ఇప్పుడు నాతో పాటు ఎక్కడికి పడితే అక్కడికి ట్రావెల్ చేయాలంటే వాళ్ల ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఇప్పటికే ఇద్దరూ నాకోసం చాలా చేశారు. ఇంకా ఎంతకాలం చేస్తారు? అందుకే నేను మ్యానేజ్ చేసుకుంటా.. మీరు ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోండని చెప్పేశా. హీరోయిన్ అయి పదేళ్లకు పైనే అయినా ఇంకా అదే ఫామ్లో ఉన్నారు. ఒక రీజన్ క్రమశిక్షణ అన్నారు. వేరే సీక్రెట్స్? నన్ను నేను ఎప్పుడూ స్టార్గా, హీరోయిన్గా చూసుకోలేదు. నేనో యాక్టర్గానే ఫీల్ అవుతాను. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాల్లో కనిపించాలని అందుకు తగ్గట్టుగా సెలక్ట్ చేసుకుంటున్నా. సరికొత్త పాత్రలు చేయాలని తాపత్రయపడుతుంటాను. ‘బాహుబలి’ సినిమాలో చేసిన అవంతిక పాత్ర కొత్త కొత్త పాత్రలు వచ్చేలా చేసింది. ఇంకా డిఫరెంట్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. నా కెరీర్కి ఓ కొత్త పుష్లా అనిపించింది అవంతిక పాత్ర. డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ సరిగ్గా సమాధానం చెప్పలేదనుకుంటాను. కానీ నాకో ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ మూవీ చేయాలనుంది. ప్రభుదేవాగారు చేసిన హిందీ సినిమా ‘ఏబీసీడీ’ లాంటిది. ఆ సినిమాలా స్టార్ట్ టు ఎండ్ డ్యాన్స్ బేస్డ్ మూవీకి అవకాశం వస్తే చాలా ఆనందపడతాను. పెళ్లి కాని హీరోయిన్ల గురించి కొంతమంది ‘పెళ్లయితే కెరీర్ ఎండ్ అవుతుంది కాబట్టే పెళ్లి చేసుకోవడంలేదు’ అంటున్నారు. మీరేమంటారు? ఈ జనరేషన్లో కొందరు మాత్రమే అలా ఆలోచిస్తున్నారని నా అభిప్రాయం. సమంతనే చూడండి. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉంది. అలాగే హిందీ వైపు వెళదాం. కరీనా కపూర్కి పెళ్లయింది, బాబు ఉన్నాడు. అయినా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిని ‘కెరీర్ వదిలేస్తావా?’ అని అడగం. మరి.. అమ్మాయిలకు మాత్రం రూల్స్ ఎందుకో? పెళ్లయితే కెరీర్ని వదిలేయాలి? పిల్లల కోసం కెరీర్ని వదిలేయాలి.. ఇలాంటివి విన్నప్పుడు వింతగా ఉంటుంది. కెరీర్ని వదిలేయడం అనేది ఆ అమ్మాయి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ‘మ్యారేజ్ అనేది ఎండ్ ఆఫ్ ది కెరీర్’ అనే ఆలోచన తీసేయాలి ముందు. అలాగే హీరోయిన్ అనగానే ఈజీగా కామెంట్ చేసేస్తారు. ఆ మధ్య తమిళ దర్శకుడు సురాజ్ ‘నా సినిమాల్లో హీరోయిన్స్ని షార్ట్ డ్రెసుల్లోనే చూపిస్తాను. వాళ్లను అలా చూడ్డానికే ఆడియన్స్ వస్తారు’ అని ఓపెన్గా అన్నారు.. ఆయనతో సినిమా చేశాను నేను. ఇప్పటి వరకూ నా కెరీర్లో ఏ డ్రెస్ వేసుకున్నా నాకు కంఫర్ట్గా ఉంటేనే వేసుకున్నాను. అంతేకానీ వాళ్లు అన్నారనో వీళ్లు అన్నారనో అలాంటి డ్రెస్సులు వేసుకోలేదు. సురాజ్ అన్న దానికి నేను అప్పుడే సమాధానం ఇచ్చాను. అది కచ్చితంగా తప్పు స్టేట్మెంటే. ఆ తర్వాత ఆయన మాట్లాడినదాంట్లో తప్పు తెలుసుకొని వెంటనే అపాలజీ కూడా కోరారు. కొంతమంది తాము ఏం మాట్లాడుతున్నామో, అది ఎటు దారి తీస్తుందో ఆలోచించకుండా మాట్లాడుతుంటారు. వాళ్ల ఉద్దేశం కూడా అది కాకపోవచ్చు. ఎవరైనా స్త్రీ సక్సెస్ సాధిస్తుంటే ఎలాగైనా కిందకి లాగాలని ప్రయత్నిస్తుంటారు. మిమ్మల్ని అలా ఎవరైనా? లేదు. అటువంటి అనుభవాలేవీ ఎదురవ్వలేదు. నా 15 ఏళ్ల వయసు నుంచే వర్క్ చేయడం మొదలుపెట్టాను. షూటింగ్ లొకేషన్లో ముగ్గురు నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉంటాం. మిగతా అందరూ అబ్బాయిలే. నా అదృష్టమో ఏమో కానీ ఇప్పటివరకూ నాతో కలిసి వర్క్ చేసిన అబ్బాయిలెవరికీ ఇన్సెక్యూర్టీ లేదు. అందరూ రియల్లీ స్ట్రాంగ్ పీపుల్. అభద్రతాభావంతో ఉన్నవాళ్లే స్త్రీ ఎదుగుదలను ఓరవలేరని నా ఫీలింగ్. ఓకే.. ‘సైరా’లో చిరంజీవిగారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? చిరంజీవిగారు ఎప్పుడూ ఎంకరేజింగ్గా ఉంటారు. చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. రామ్చరణ్తో ‘రచ్చ’ సినిమా చేస్తున్నప్పుడు ‘వానా వానా వెల్లువాయే..’ సాంగ్ షూట్ సమయంలో ఆయన లొకేషన్లోనే ఉన్నారు. చిరంజీవిగారు చాలా సపోర్ట్ చేస్తారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఎగై్జటింగ్గా ఉంది. ఒకవైపు చిన్న హీరోలతో చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోల సరసన సినిమాలు చేయడం ఎలా ఉంది? మేమంతా యాక్టర్స్. ఆ సినిమాల్లో ఆ పాత్రలను పోషిస్తున్నాం. ఏజ్ గురించి మా మైండ్లో ఉండదు. ఈ పాత్రను ఎంత బాగా చేయాలా? అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. మీ కెరీర్లో చాలా కష్టంగా అనిపించిన పాత్ర? ప్రతి సినిమా ఓ చాలెంజ్లానే ఉంటుంది. కానీ ‘దటీజ్ మహాలక్షీ’ సినిమాకి కష్టపడ్డాను. ఎందుకంటే స్ట్రయిట్ సినిమా చేసేయడం ఈజీ. రీమేక్ చేసేటప్పుడు ఇంకా చాలెంజింగ్గా ఉంటుంది. పోల్చి చూస్తారు. ‘క్వీన్’లో కంగనా చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. కానీ మళ్లీ తనలా యాక్ట్ చేయకుండా నా స్టైల్లో చేయాలి. లేకపోతే కంగనాలా చేసింది అంటారు. అందుకే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని నా స్టయిల్లో ‘దటీజ్ మహాలక్ష్మీ’ చేశాను. ‘100% లవ్’ సినిమాలో ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటుంటారు.. ఈ సినిమా టైటిల్కి అదేమైనా కారణమా? నిజానికి ‘100% లవ్’ సినిమాకు ఫస్ట్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే టైటిలే అనుకున్నాం. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు యాప్ట్ అవుతుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ఎందుకంటే ఇందులో హీరోయిన్ చాలా స్ట్రాంగ్గా, బోల్డ్గా జీవితంతో పోరాడుతుంది. ప్రస్తుతం సమాజంలో ఉమెన్ కూడా బోల్డ్గా ఉండాలంటారా? ఆ విషయం గురించి నేను చెప్పను. ఎందుకంటే ‘నువ్విలా ఉండాలి.. అలా ఉండాలి’ అని ఒకళ్ల తీరుని మార్చాలనుకోవడం సరి కాదని నా అభిప్రాయం. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లుండాలి. స్ట్రాంగ్గా ఉన్నా, సెన్సిటివ్గా ఉన్నా.. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలని చెబుతాను. డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. అమ్మాయిలు అమ్మాయిలను సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు అమ్మాయిలను ఎవరూ ఆపలేరు. అలా కాకుండా మనల్ని మనమే హేళన చేసుకుంటే వేరేవాళ్లకు తేలికైపోతాం. సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తుంటారు కాబట్టి మీ లైఫ్ కూడా గ్లామరస్గా ఉంటుందని కొందరి ఊహ.. అస్సలు ఉండదు. మీరు పని చేసి వచ్చి ఇంట్లో ఎలా ఉంటారో మేమూ అంతే. కానీ, మాకు కొత్త కొత్త పాత్రలు, కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ఉంటాయి. కంటిన్యూస్గా ఒకేచోట ఉండం. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటాం. అయితే షూటింగ్ అయిపోయాక అంతా మామూలే. నార్మల్గానే ఉంటాం. అందరిలానే తింటాం. ఇంట్లోవాళ్లతో కష్టసుఖాలు చెప్పుకుంటాం. మంచి విషయం జరిగితే ఆనందపడతాం. జరగకూడనిది జరిగితే బాధపడతాం. మేం కూడా మనుషులమే. మీ ప్రొఫెషన్ టైమింగ్స్ రోజూ ఒకేలా ఉండవు కాబట్టి ఎప్పుడైనా ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాం అనుకున్నారా? అలా అనుకోలేదు. 24 గంటలు బదులు 26 గంటలు ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి అనుకుంటున్నాను. బాక్సాఫీస్ సక్సెస్ నా చేతిలో ఉండదు. నా చేతిలోఉండేది ఏంటి? కష్టపడి పని చేయడం. ఇంకా బాగా యాక్ట్ చేయగలగడం. ఫ్రైడే రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే రిజల్ట్ మనతోఎక్కువ సేపు ఉండదు. కానీ ఆ ప్రాసెస్ (వర్కింగ్ ఎక్స్పీరియన్స్) లో ఎక్కువ సేపు ఉంటాం. అందుకే ఎవ్వరైనా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలని చెబుతాను. కెరీర్ స్టార్టింగ్ నుంచి సేమ్ ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఎలా? దానికి ఒకటే సూత్రం. దేన్నీ అతిగా చేయకూడదు. అది వ్యాయామం అయినా, డైట్ అయినా సరే. నార్మల్గా, బ్యాలెన్స్›్డ లైఫ్ లీడ్ చేస్తాను. డైట్ కూడా మామూలుగా చేస్తా. అలాగే ఎక్సర్సైజ్ల విషయానికొస్తే.. ఈ రోజు వంద పుషప్స్ చేయాలి అని లెక్క పెట్టి చేయను. చాలామంది తమన్నా లాగా ఉండాలి అంటుంటారు. తమన్నా లాగా ఉండాలంటే ఏం చేయాలి? అయినా నాలాగా ఎందుకు ఉండాలి? ఎవరిలా వాళ్లు ఉండాలి. వాళ్ల శరీరతత్వాన్ని అర్థం చేసుకుని డైట్, ఎక్సర్సైజులు ప్లాన్ చేసుకోవాలి. దేనికీ షార్ట్ కట్ ఉండదు. అది బాడీ విషయంలో అయినా పని విషయంలో అయినా సరే. అతిగా చేసేయడం ప్రకృతి విరుద్ధం. చేసే పనిలో బ్యాలెన్స్ ఉండాలి. యోగా మన సంప్రదాయాల్లో ఉంది. నేను యోగా ఎక్కువగా చేస్తాను. ఆయుర్వేదం కూడా ఫాలో అవుతున్నాను. ఇంట్లో చేసే ఫేస్ ప్యాక్లు వాడతాను. యోగా మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందని తెలుసుకున్నాను. యోగాలో ఎన్ని సూర్య నమస్కారాలు చేయగలరు? ఇన్ని చేయాలని లెక్క పెట్టుకోను. ‘బాహుబలి’ కెమెరామేన్ సెంథిల్ వాళ్ల భార్య నా యోగా గురువు. తనే నేర్పిస్తుంది. చాలా బాగా చేయిస్తుంది. యోగా అనేది మన కల్చర్లోనే ఉంది. రీసెంట్గా వెజిటేరియన్గా మారారని కూడా విన్నాం. ఎందుకు? నా బుజ్జి కుక్కపిల్ల అనారోగ్యం పాలైంది. అది త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను. అప్పటివరకూ మాంసాహారం తినకూడదనుకున్నాను. వెంటనే కోలుకుంది. వెజిటేరియన్గా ఉండటం బాగానే ఉంది. నాన్వెజ్ తిని 9 నెలలు అవుతోంది. ఫుల్టైమ్ వెజిటేరియన్గా మారిపోదాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటుని సడెన్గా మానేయడమంటే కష్టమే కదా? అవును కష్టమే. కానీ మనసులో బలంగా అనుకుంటే కష్టం కాదు. ఆహారం అయినా పనైనా.. ఈ ప్రకారం ఫాలో అవ్వాలి అనుకుంటే అయిపోవాలి. అలా అవ్వాలంటే మనల్ని మనం కరెక్ట్గా పుష్ చేసుకోవాలి. ఫైనల్లీ.. 2019 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? 2018 బిజీ బిజీగా గడిచింది. 2019 కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. రోజుకు 24 బదులు 36 గంటలు ఉండే సూపర్ పవర్ ఏదైనా ఉంటే బావుండూ అనుకుంటున్నాను. ఆడియన్స్ను ఇంకా ఎంటర్టైన్ చేయాలి. – డి.జి. భవాని -
పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత!
‘‘చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. అదే ఓ మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత’’ అంటున్నారు వెంకటేశ్. పెళ్లి చేసుకున్న వాళ్ల కష్టాల మీద సెటైరికల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. వెంకటేశ్, వరుణ్తేజ్ హీరోలుగా ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎఫ్ 2’ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్ చెప్పేసింది. ‘సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. ‘అంతేగా.. అంతేగా..’ అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్. -
‘నెక్ట్స్ ఏంటి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
మన ఇంటి మహాలక్ష్మి
బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘క్వీన్’కు తెలుగు రీమేక్గా వస్తున్న ‘దటీజ్ మహాలక్ష్మి’తో మరోసారి సత్తా చాటుకోబోతుంది తమన్నా భాటియా. తమన్నా కెరీర్లో ‘మహాలక్ష్మి’ మరువలేని పాత్ర. ‘సిల్క్చీర కట్టుకున్న సాఫ్ట్వేర్రో..పోనీటెయిల్ కట్టుకున్న ఫస్ట్ర్యాంకురో.... దటీజ్ మహాలక్ష్మి దటీజ్ మహాలక్ష్మి’ అని హాయిగా పాడుకునే పాత్ర. తనకు అచ్చొచ్చిన పేరుతో ముందుకు వస్తున్న కలలరాణి తమన్నాభాటియా గురించి కొన్ని ముచ్చట్లు... నచ్చేసింది ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సినిమాలు తెగ చూస్తుంది. ‘మొఘల్–ఏ–ఆజామ్’ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలు చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదు. తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన పాత్ర ‘మహాలక్ష్మి’. ‘100%›లవ్’ సినిమాలో మహాలక్ష్మి పాత్ర నటనపరంగా తమన్నాను మరో మెట్టు పైకి ఎక్కించింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. పాటల కోసమే అన్నట్లు ఉండే పాత్రల్లో నటించడం కంటే శక్తిమంతమైన, స్వాభిమానం ఉన్న పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది. ఎలా అంటే ఇలా... ప్రొఫెషన్లో భాగంగా ప్రపంచంలో ఎన్నెన్నో నగరాలు తిరిగినా...హైదరాబాద్ అంటే ప్రత్యేక ఇష్టం అని చెబుతుంది తమన్నా. ఈ నగరం తనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుందట. ఇక్కడి బిర్యానీ, చేపలపులుసు అంటే మహాఇష్టం అని చెబుతుంది మహాలక్ష్మి.తమన్నా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ‘హౌ?’ అనే క్వశ్చన్ ఆశ్చర్యంగా పైకి వచ్చినప్పుడు తాను చెప్పే సమాధానం ఇది: ‘నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటాను. ఇలా అనుకోవడం వల్లే కావచ్చు తెలుగు పరాయిభాష అనిపించదు. అసిస్టెంట్లతో కావచ్చు ఇతరులతో కావచ్చు...తెలుగులోనే మాట్లాడడం వల్ల భాష సులభమైపోయింది. సై సినిమా అనేది డైరెక్టర్ మీడియం, విజన్ కాబట్టి స్క్రిప్ట్తో పాటు డైరెక్టర్ ఎవరనేదానికి కూడా ప్రాధాన్యత ఇస్తానంటుంది. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు డిమాండ్ను బట్టి డీగ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సై అంటుంది. ‘ఊసరవెల్లి’ రెండవభాగంలో డీగ్లామర్డ్గా నటించింది. కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ చేయడంలో బెరుకు కంటే ఉత్సాహమే తన ముందుంటుంది. ‘ఆనందతాండవం’లో మధుమిత సవాలు విసిరే పాత్ర. బాడీలాంగ్వేజ్ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకొని మరీ ఈ పాత్రలో నటించి భేష్ అనిపించుకుంది తమన్నా. తత్వం బోధపడింది వృథా ఖర్చుకు దూరంగా ఉంటుంది. అవసరమైన వాటినే కొంటుంది. ఆర్థిక క్రమశిక్షణ గురించి మాత్రమే కాదు...కాస్తో కూస్తో ఫిలాసఫీ మాట్లాడుతుంటుంది ఈ అమ్మడు. మచ్చుకు... ‘జీవితం శాశ్వతమేమీ కాదు. జీవితంలో ఏదో ఒకరోజు చివరిరోజు కాక తప్పదు. కాబట్టి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి’ -
నమ్మకం పెరిగింది
ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్పై వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. వరం జయంత్ కుమార్ మాట్లాడుతూ – ‘‘లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ మా చిత్రంలో ఉన్నాయి. ఆర్య హీరోగా నటిస్తూ, స్వయంగా తమిళ్లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డి. ఇమాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటలు, ట్రైలర్ సినిమాపై క్రేజ్ని పెంచాయి. ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకూడదనే చాలా క్వాలిటీగా డబ్బింగ్ చేయించాం. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, సినిమా బావుందంటూ ప్రశంసించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
పవర్ఫుల్ మహాలక్ష్మీ
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం ‘100% లవ్’ గుర్తుందా? ఆ సినిమాలో తమన్నా పాత్ర పేరు ‘మహాలక్ష్మీ’ అని తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో తన గొప్పను తాను చెప్పుకునే ప్రతిసారీ ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటుంది తమన్నా. సరిగ్గా అదే టైటిల్తో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేశారు తమన్నా. హిందీ మూవీ ‘క్వీన్’కి ఇది రీమేక్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. మను కుమరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సంఘటనలను ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో తమన్నా పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చిత్రం టీజర్ను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తైజాన్ ఖొరాకువాలా, సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: మైకేల్ టబూరియస్. -
‘దటీజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్కు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. లంగా వోణీలో ఉన్న తమన్నా పారిస్లోని ఐఫిల్ టవర్ ముందు డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్లుక్ పోస్టర్సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. -
వీళ్లు హీరోల్రా బుజ్జీ
సినిమా అనగానే హీరో ఎవరు అని అడుగుతారు.వాల్పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్.టైటిల్స్లో ఫస్ట్ కార్డ్ హీరోదే.అవన్నీ వదిలేయండి అంటున్నారు హీరోయిన్లు. వియ్ కెన్ అని నిరూపిస్తున్నారు.పూర్వం కెరీర్ దాదాపు ముగిసే దశలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు.ఇప్పుడు పీక్ కెరీర్లో కూడా హీరో క్యాన్సిల్ అంటున్నారు.తెర మీద హీరో రహిత కథను భుజాన వేసుకుని పండిస్తున్నారు.హీరోల్రా బుజ్జీ అనిపిస్తున్నారు.నవ రాత్రుల వేళ షేర్ చేసుకోవాల్సిన స్త్రీ శక్తి ఇది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు కథల తీరు మారింది. హీరోలకు మాత్రమే కథలు రాసే స్థితి నుంచి హీరోయిన్ల కోసమే కథలు రాసే పరిస్థితికి సినీ పరిశ్రమ ఎదిగింది. హీరోయిన్లు కూడా నాలుగు డ్యాన్సులు వేసి క్లయిమాక్స్లో తాళ్లతో చేతులను కట్టివేస్తే హీరో కోసం వెయిట్ చేస్తూ చూసే పాత్రల కంటే సొంత ప్రతిభను ప్రదర్శించగలిగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2018లో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ప్రేక్షకులు కూడా హీరో లేకపోయినా పర్లేదు అనుకుని సినిమాలు చూస్తున్నారు. హీరోయిన్లనే హీరోలుగా భావిస్తున్నారు. హిట్ హిట్ హుర్రే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో ఈ సంవత్సరం ‘భాగమతి’ బోణి కొట్టింది. ఆ పాత్రను పోషించిన అనుష్క తన ఖాతాలో మరో హిట్ వేసుకుని కథల ఎంపికలో తన మతిని క్షితిని నిరూపించుకున్నారు. ఆ తర్వాత కాజల్ ‘అ!’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్త్రీ పాత్రల ప్రాముఖ్యంతో వచ్చిన ఈ సినిమా మారిన తెలుగు సినీ ధోరణులకు ఒక ఉదాహరణ. ఇక ఆంధ్రుల అభిమాన తార సావిత్రి బయోపిక్ ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన అభిమానులను తన పెర్ఫార్మెన్స్తో చతికులను చేసి హీరోయిన్ కేంద్రంగా చేయగలిగే సినిమా ఏ రేంజ్కు వెళ్లగలదో చూపించారు కీర్తీ సురేశ్. మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ చేశారు. మరో వైపు హిందీలో దీపికా పదుకోన్ ‘పద్మావత్’గా, అనుష్కా శర్మ ‘పరీ’గా, రాణి ముఖర్జీ ‘హిచ్కీ’తో బాక్సాఫీస్ దగ్గర చప్పట్లు కొట్టించారు. ‘వీరే ది వెడ్డింగ్’తో న్యూ ఏజ్కు వెల్కమ్ చెప్పారు కరీనాకపూర్, సోనమ్ కపూర్లు. తమిళంలో నయనతార ‘ఆరమ్’, ‘కోకోకోకిల’ సినిమాలు చేశారు. ఇక సమంత ‘యూ టర్న్’ సినిమా చేసి మూస సినిమాలను యూ టర్న్ కొట్టేలా చేయగలిగారు. ఇవి ఇప్పటి దాకా రిలీజ్ అయిన సినిమాలు. రాబోతున్న సినిమాల విషయానికి వస్తే... రేడియో జాకీ విజయలక్ష్మి జ్యోతిక కేవలం గృహిణిగా, నటుడు సూర్య భార్యగా ఉండిపోదలచుకోలేదు. నటిగా తన ప్రతిభను, మార్కెట్ను కొనసాగించదలిచారు. ఈ సంవతర్సం ‘నాచ్చియార్’లో ఆమె పవర్ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించారు. ఇప్పుడు హిందీలో హిట్ అయిన ‘తుమ్హారీ సులూ’ సినిమా తమిళ వెర్షన్లో నటిస్తున్నారు. దర్శకుడు రాధా మోహన్ సౌత్ ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టుగా కథను మార్చి తెరకెక్కించారట. తమిళంలో ‘కాట్రిన్ మొళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం నవంబర్లో రిలీజ్ కానుంది. అదిగో ఆ పక్షిలా... హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఫైట్లు చేయగలరు అని యాక్షన్ సినిమా చేస్తున్నారు అమలా పాల్. స్క్రిప్ట్కి కట్టుబడి యాక్షన్ సీక్వెన్స్లో రిస్కులు చేసి, కొన్ని కట్లు కూడా కట్టించుకున్నారు. ఆమె ముఖ్య పాత్రలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘అదో అంద పరవై పోల’ (అదిగో ఆ పక్షిలా). కథ అంతా అడువుల్లో జరగనుందట. వినోథ్ కేఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్లో ఉండగానే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమలాపాల్. ‘మేయాద మాన్’ వంటి కామెడీ జానర్ మూవీతో బ్లాక్బస్టర్ సాధించిన దర్శకుడు రత్నకుమార్ అమలాపాల్తో ‘ఆడై’ అనే సినిమాను తీయనున్నాడు. ‘ఆడై’ అంటే దుస్తులు అని అర్థం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసి ‘బోల్డ్’గా ఉందని చాలామంది అన్నారు. గ్రామీణ యువతి కనా క్రికెట్ మగవాళ్ల క్రీడ. ఆడవాళ్ల క్రికెట్కు పెద్ద గిరాకీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా క్రికెట్ నేపథ్యంగా సినిమా రావడం విశేషం. తెలుగు మూలాలున్న తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఆడాలని తాపత్రయపడే గ్రామీణ యువతి కలలు కథాంశం. సినిమా పేరు ‘కనా’. అంటే కల అని అర్థం. ఈ సినిమాను తమిళ నటుడు శివకార్తికేయ నిర్మించి, ఓ చిన్న గెస్ట్ రోల్ కూడా చేయడం విశేషం. ‘కనా’ రిలీజ్కి రెడీ అవుతోంది. సౌత్లో క్వీన్స్ మూడు భాషల్లో ముగ్గురు కథానాయికలతో ఏక కాలంలో హిందీ ‘క్వీన్’ సినిమా సౌత్లో రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటూ తమన్నా, ‘ప్యారిస్ ప్యారిస్’ అంటూ తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో ‘జామ్ జామ్’ అంటూ మంజిమా మోహన్ నటిస్తున్నారు. పెళ్లి ఆగిపోవడంతో తన గురించి తాను తెలుసుకోవడం కోసం ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన అమ్మాయి కథే ఈ క్వీన్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. తెలుగు వెర్షన్ను దర్శకుడు నీలకంఠ మధ్యలో తప్పుకోవడంతో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ మిగతా పనిని పూర్తి చేశారు. ఒకే పాత్రతో ఒక్కటంటే ఒకే పాత్ర తో నాలుగు భాషల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వికే ప్రకాశ్. ఈ సాహసానికి రెడీ అయ్యారు నిత్యా మీనన్. తెలుగు, తమిళం. కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాత్ర తీరు తెన్నులు నచ్చకపోతే మేకప్ కిట్ కూడా ముట్టుకోని నిత్యా ఈ సినిమా చాలా స్పెషల్గా ఉండబోతోంది అంటున్నారు. ఇందులో రచయిత్రి పాత్ర పోషించారామె. రిలీజ్కి రెడీ అయింది. మళ్లీ భయపెడతాం! ‘గీతాంజలి’తో ఆడియన్స్ను ఏకకాలంలో భయపెట్టి, నవ్వించారు అంజలి. హారర్ కామెడీ సినిమాల్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ‘గీతాంజలి’. ఆ మ్యాజిక్ని మళ్లీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. అందుకే సీక్వెల్ ప్లాన్ చేశారు. అమెరికా, ఇండియా బ్యాక్డ్రాప్లో ఈ కొత్త చిత్రం ఉండబోతోందట. కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రాకెట్ స్టోరీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ కథ యువతకు స్ఫూర్తినిచ్చే కథావస్తువు. అది గ్రహించిన బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తే ఆమె బయోపిక్ రూపొందించే పనిలోపడ్డారు. సైనాగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. సైనాలా రాకెట్ తిప్పడం కోసం శ్రద్ధా కపూర్ రోజూ 4,5 గంటలు శ్రద్ధగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేశారట. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాప్సీ ‘గేమ్ ఓవర్’ 2018 తాప్సీకి బ్లాక్బస్టర్ సంవత్సరం. అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండస్ట్రీల్లో సక్సెస్ టేస్ట్ చేశారు. ఇప్పుడు ‘గేమ్ ఓవర్’ అంటూ సింగిల్ స్టార్గా వస్తున్నారు. సినిమా ఇటీవలే స్టార్ట్ అయింది. వీల్ చైర్లో ఉన్న తాప్సీ ఫొటోను ఫస్ట్ లుక్ పోస్టర్గా విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. అశ్విన్ శర్వానణ్ దర్శకుడు. సో.. హీరోయిన్లందరూ ‘హీరో’లవుతున్నారు. అంతేకదా.. సినిమాని నడిపించేవాళ్లను ‘హీరో’ అనే అంటారు కదా. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
స్త్రీలోక సంచారం
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37), ఆమె మూడో భర్త, అమెరికన్ పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్(41)ల ముద్దుల కుమార్తె నార్త్ వెస్ట్(5).. లాజ్ ఏంజిల్ సమీపంలోని పసిఫిక్ పాలిసైడ్లో జరిగిన ఫ్యాషన్ షో ర్యాంప్పై మోడల్గా అరంగేట్రం చేసింది. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్ లెదర్ జాకెట్, మ్యాచింగ్ మినీ స్కర్ట్, జిప్–అప్ బ్లాక్ క్రాప్ టాప్, వైట్ సాక్స్, బ్లాక్ షూజ్, బ్లాక్ పర్స్, రెడ్ లిప్స్టిక్ ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్ కర్దేషియాన్ మనసు ఉప్పొంగిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్.లో మొదలైన ‘పింక్ రిబ్బన్ క్యాంపైన్’లో భాగంగా హైదరాబాద్లో సోమవారం 10 ఎడిషన్ క్యాంపైన్ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్ రిబ్బన్ క్యాంపైన్ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సీఈవో, డైరెక్టర్ తమ ప్రసంగంలో తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్, హోమ్శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్ విల్లెన్బ్రింగ్ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్ మర్చంట్తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్ మర్చెంట్పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్, సెల్ఫ్ హార్మ్, బుల్లీయింగ్లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్ పాప్ సింగర్ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్ 21న మళ్లీ డిప్రెషన్ బారిన పడి, ఓవర్డోస్ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టి.ఎం.జడ్. (థర్టీ మైల్ జోన్) వెబ్సైట్ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ మహిళ ఉజ్రా జేయా తన పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. హాలీవుడ్లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛలో యూరప్
మిల్కీ బ్యూటీ తమన్నా యూరప్ వెళ్లడానికి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. హాలిడే ట్రిప్ ప్లానింగ్ కాదు. ‘ఎఫ్ 2’ మూవీ షెడ్యూల్ షూటింగ్ కోసం వెళ్లారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. తాజా షెడ్యూల్ యూరప్లోని ప్రాగ్లో మొదలు కానుంది. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికే తమన్నా యూరప్ వెళ్తున్నారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు. తోడి అల్లుళ్లగా వెంకీ, వరుణ్ నటిస్తుండగా, అక్కాచెల్లెళ్లుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
అనుకున్నవన్నీ జరగవు
సాక్షి, సినిమా: అనుకున్నవి జరగవు, ఊహించనివి జరుగుతాయి ఇది జీవితానికే కాదు, సినీరంగానికి వర్తిస్తుంది అంటోంది మిల్కీబ్యూటి తమన్న. ఈమె సినీ జీవితం బాహుబలికి ముందు, ఆ తరువాత అన్నట్లుగా విభజించవచ్చు. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే ఆమె ఉదయనిధి స్టాలిన్తో నటించిన కన్నె కలమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆ చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేదు. ఈ సందర్భంగా తమన్న ఏమంటుందో చూద్దాం. ‘‘నేను సినీరంగప్రవేశం చేసి 12 ఏళ్లు అయ్యింది. ఆరంభంలో సినిమా గురించి పెద్దగా అర్థం కాకపోయినా ఇప్పుడు చాలా అనుభవం పొందా. చిత్ర పరిశ్రమ గురించి అర్థం అయ్యింది. ఇంకా చెప్పాలంటే నా నిజజీవితానికి, సినీ జీవితానికి అనుబంధం ఉందనిపిస్తోంది. ఆదిలో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించాను. అందులో కొన్ని చిత్రాలు అనూహ్యంగా విజయం సాధించి నా కెరీర్కు ఉపయోగ పడ్డాయి. బాహుబలి చిత్రం తరువాతే ఉత్తమ నటి అనిపించుకున్నాను. అంతకు ముందు హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడా నాకు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం బాహుబలినే. హిందీలో డబ్బింగ్ చేసిన బాహుబలి చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందీ? విజయం సాధిస్తుందా. అపజయం చెందుతుందా? అన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి చిత్రాన్ని ముఖ్యంగానే భావించి నటిస్తాం. కొన్ని చిత్రాలే సంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని చిత్రాలు విజయం సాధిస్తాయని భావించినా ప్లాప్ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే కొన్ని చిత్రాల్లో ఎలాంటి నమ్మకం లేకుండా నటిస్తాం. అవి అనుకోకుండా సక్సెస్ అవుతుంటాయి. ఇక్కడ ఊహించినవి జరగవు, అనుకోనివీ జరుగుతుంటాయి. సినిమా పేరు, డబ్బు అన్నీ ఇస్తుంది. అద్భుత చిత్రాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. అనూహ్యంగా వస్తాయి. ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి’’ అని తమన్న పేర్కొంది. -
స్పెషల్ గాళ్
స్వింగ్ జర స్వింగ్ జర... స్వింగ్ స్వింగ్ అంటూ తమన్నా ఆ మధ్య ‘జై లవ కుశ’లో చేసిన ఐటమ్ సాంగ్ గుర్తుండే ఉంటుంది. థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోయారు. తమన్నా అంత బాగా డ్యాన్స్ చేశారు. అంతకుముందు ‘అల్లుడు శీను’లో ‘లబ్బర్ బొమ్మ..’, ‘స్పీడున్నోడు’లో ‘బ్యాచిలర్ బాబు..’ అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్కూ మంచి స్పందన వచ్చింది. ఇంతేనా కన్నడ ‘జాగ్వార్’లోనూ ఓ ఐటమ్ సాంగ్కి కాలు కదిపి, శాండిల్వుడ్నీ తన ఆటతో కట్టిపడేశారు. ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకులకు ఐ–ఫీస్ట్ లాంటి ఐటమ్ సాంగ్లో కనిపించనున్నారు తమన్నా. అన్నట్లు.. రీసెంట్గా నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’లో నర్తించడానికి ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలంటే.. నవీన్ కుమార్, శ్రీనిధి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహి స్తున్నారు. ఇందులో తమన్నా చేయబోయే స్పెషల్ సాంగ్కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రముఖ నటుడు రాజ్కుమార్ 1970లో నటించిన కన్నడ చిత్రం ‘పరోపకారి’ సినిమాలోని ‘జోకే నన్ను బలియా మించు’ సాంగ్ రీమిక్స్లో తమన్నా నటించబోతున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. అదండీ సంగతి. తమన్నాకి ఇక్కడ కూడా క్రేజ్ ఉంది కదా అందుకే.. స్పెషల్ సాంగ్ చేయించి ఉంటారు. మొత్తంగా హీరోయిన్గా, స్పెషల్గాళ్గా తమన్నా కెరీర్ ఫుల్ స్వీంగ్లో ఉంది. -
ప్రేమలో ఉన్నమాట నిజమే..!
అవును నేను రొమాన్స్ చేస్తున్నాను. అయితే ఎవరితో అన్నది చెప్పనా? అంటోంది నటి తమన్నా. ఇంతకీ ఈ మిల్కీబ్యూటీ తాజాగా ఏం చెప్పదలచుకుంటోందంటే, అమ్మడు మరోసారి లవ్లో పడిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. అమెరికాకు చెందిన ఓ వైద్యుడితో రొమాన్స్ చేస్తున్నట్లు మీడియా రచ్చ చేస్తోంది. నటిగా అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో త్వరలోనే పీపీపీ..డుండుండుంకు సిద్ధం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. అంతే తమన్నాకు కోపం కట్టలు తెంచుకొచ్చేసింది. దీంతో తన ట్విట్టర్ ద్వారా వదంతులపై స్పందిస్తూ తనకు ఎందరితో ప్రేమను అంటగడతారు అంటూ ప్రశ్నించింది. ఆ మధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టాల్ అన్నారు. ఆ తరువాత పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో లవ్ అన్నారు. ఇప్పుడు అమెరికా డాక్టర్తో ప్రేమ కలాపాలు అంటూ వదంతులు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సారి క్రికెటర్, మరోసారి డాక్టర్ అంటూ ప్రచారం చేస్తుండడంతో తాను వరుడి వేటలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, నిజం చెప్పాలంటే తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, అయితే ప్రేమ అనేది తన వ్యక్తిగతం అని అంది. అలాంటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి వదంతులు ప్రచారం చేయడాన్ని ఒప్పుకోనని అంటోంది. ప్రస్తుతానికి తాను సింగిల్గానే ఉన్నానని, తన తల్లిదండ్రులు వరుడి వేటలో లేరని స్పష్టం చేసింది. అయితే ‘నేను ప్రేమలో ఉన్న మాట నిజమే, కానీ ప్రేమిస్తుంది సినిమాను మాత్రమే’ అన్నారు. తనకు అవకాశాలు తగ్గాయనడం సరి కాదని అంది. ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. త్వరలో ప్రభుదేవాకు జంటగా విజయ్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నట్లు చెప్పింది. ఇలా ఖాళీ లేకుండా షూటింగ్లో పాల్గొంటుంటే ప్రేమ, పెళ్లి అంటూ వదంతులు ప్రచారం చేయడం తగదని అంది. తాను వివాహం చేసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే అందరికీ తెలియజేస్తానని, అయితే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. ప్రేమ, పెళ్లి అంటూ ఎవరో అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్నారని, వారు ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని అంటున్న తమన్నా నటజీవితమే దశాబ్దంన్నరకు చేరుకుంటోందన్నది గమనార్హం. -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: దేవి చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని చవిచూసింది. అందులో జంటగా నటించిన ప్రభుదేవా, తమన్నా మరోసారి జతకట్టనున్నారన్నది తాజా వార్త. అవును ఈ హిట్ పెయిర్తో నటుడు, దర్శకుడు పార్థిబన్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వైవిధ్య కళా చిత్రాల దర్శకుడైన ఈయన కొడిట్ట ఇడంగళ్ విరంబుగా చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. దీని గురించి ఆయనే వెల్లడించారు. తాను ప్రభుదేవా హీరోగా చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుదేవాకు కథ వివరించానని తామిద్దం కలసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటించనున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించేది నిర్ణయం కాలేదన్నారు. ఆ విషయాలన్ని ఒక కొలిక్కి వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇందులో పార్థిబన్ కూడా నటిస్తారా? అన్నది వెల్లడించలేదు. అయితే ఇంతకుముందు ప్రభుదేవా, పార్థిబన్ కలిసి జేమ్స్బాండ్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. మొత్తం మీద ఈ సంచలన కాంబినేషన్ ఒక భారీ చిత్రం రాబోతుందన్నమాట. -
మానసిక వేదనకు మందు అదే!
తమిళసినిమా: మానసిక వేదనకు మందిదే అంటోంది నటి తమన్నా. నటిగా పుష్కరం దాటినా నేటికీ నవనవలాడే అందాలతో మెరిసిపోతోంది మిల్కీబ్యూటీ. మొదట్లో అందాలారబోతకే పరిమితం అయిన ఈ గుజరాతీ భామ తరువాత నటనకు కూడా ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటోంది. తెలుగు, తమిళం అంటూ మారి మారి నటించేస్తున్న తమన్నా కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్తో నటించిన కన్నెకలైమానే చిత్రం విడుదల కావలసి ఉంది.ఈ చిత్రంలో తమన్నా నటన గురించి దర్శక, హీరోలు కాస్త ఎక్కువగానే పొగిడేస్తున్నారు. ఇక మీ సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ అందం, ప్రశాంతత, మానసికవేదన లేకుండడం అన్నది ప్రతి మనిషికీ చాలా ముఖ్యం అని చెప్పింది. అందుకు తాను నమ్మేది మోగానేనని పేర్కొంది. తన దినచర్య ప్రతిరోజూ యోగాతో ముడిపడి ఉంటుందంది. గోరు వెచ్చని నీటిలో బాదంను నానబెట్టి తిన్న తరువాతే ఇతర కార్యక్రమాలకు ఉపక్రమిస్తానని చెప్పింది. రోజూ గంట సేపు వ్యాయామం చేస్తానని, అందులో అరగంట కసరత్తులు చేసి మరో అరగంట యోగాకు కేటాయిస్తానని తెలిపింది. ఇవన్నీ జిమ్లోనే జరిగిపోతాయని అంది. మానసిక వేదనకు ఇదే మందు అని పేర్కొంది. ఎవరన్నా యోగా గురించి ప్రస్తావిస్తే వారితో గంటల తరబడి మాట్లాడతానని చెప్పింది.యోగాతో శరీరంలోని విష క్రిములు బయటకు పోతాయని అంది. శ్రమకు ఉపశమనం కలుగుతుందని, ఆశాంతి, మానసిక వేదన సమసిపోతాయని చెప్పింది. మనసులో నెగిటివ్ ఆలోచనలు కలగవని అంది. సినిమా అన్నది సమస్యలు, సవాళ్లతో కూడుకున్న రంగం అని సరిగ్గా నిద్ర ఉండదు, ఆహార నియమాలను ఆటంకం అన్నది తరచూ జరుగుతుంటుందని చెప్పింది. శారీరకంగానూ, మానసికంగానూ నలిగిపోతుంటామని తెలిపింది. ఇలాంటి వాటి నుంచి బయట పడడానికి ఒకే మార్గం యోగా అని పేర్కొంది. తాను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, మేను సున్నితంగా ఉండడానికి పెరుగు, మంచినీళ్లు, కొబ్బరినీరు తీసుకుంటానని చెప్పింది. చెడు కలిగించే వాటిని ముట్టుకోనని, తీపిని విరోధిగా చూస్తానని తమన్నా చెప్పింది. -
ఇకపై అన్నిటికీ ఓకే చెప్పను..
తమిళసినిమా: నటి తమన్నా భాటియా. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. నాజూకైన నడుము, పాలవన్నె శరీరం, ఆకర్షణీయమైన నగుమోము ఈ అమ్మడికే సొంతం. మొదట్లో హిందీ చిత్రంతో రంగప్రవేశం చేసినా, ఆపై దక్షిణాదికే పరిమితమైంది. 2005లో శ్రీ చిత్రంతో టాలీవుడ్కు దిగుమతి అయిన తమన్నా కోలీవుడ్లో కేడీ చిత్రంతో దూసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్ను అందించకపోయినా, తమిళంలో కల్లూరి చిత్రం పేరును, తెలుగులో హ్యాపీడేస్ చిత్రం విజయాన్ని అందించాయి. ఆ తరువాత అమ్మడికి ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. బాలీవుడ్లో కలిసి రాకపోయినా, తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరునే తెచ్చుకుంది. మొదట్లో తన అందానే నమ్ముకుని కమర్శియల్ చిత్రాల్లో నటించి గ్లామరస్ కథానాయకిగా గుర్తింపు పొందినా, బాహుబలి చిత్రంలో అవంతికగా నటిగా తానేమిటో నిరూపించుకుంది. అలా వచ్చిన అవకాశాలన్నీ ఎడాపెడా ఒప్పేసుకుని నటించేస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల స్పీడ్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్లో గత ఏడాది స్కెచ్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్తో నటిస్తున్న కన్నే కలైమానే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. కల్యాణ్ రామ్తో నటించిన నా నువ్వే గురువారం తెరపైకి రానుంది.ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో గెస్ట్ రోల్లో మెరవనుంది. సో మొత్తం మీద ఈ మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. తమన్నా జోరు తగ్గిందా? అన్న ప్రశ్నకు ఆమె మాత్రం అంగీకరించడంలేదు. తమన్నా ఏమంటుందో చూద్దాం. కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నానని చెప్పింది. కొంచెం విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని నిర్ణయించుకున్నానంది. -
మైసూర్లో ముగ్గురు రాణులు
మైసూర్ వెళ్లారు మహాలక్ష్మి. అక్కడ ఏవో వర్క్స్ని కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తారు. ఎవరో మహాలక్ష్మి గురించి ఈ డీటైల్స్ ఎందుకు? అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే.. మైసూర్ వెళ్లింది మన టాలీవుడ్ మహాలక్ష్మినే. అదేనండీ.. తమన్నా అని చెప్తున్నాం. ఇంతకీ మహాలక్ష్మి మైసూర్ ప్రయాణం విశేషం ఏంటంటే... తమన్నా లీడ్ రోల్లో ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మనుకుమారన్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది స్వరకర్త. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో శరవేగంగా జరుగుతోంది. తమ్మూపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టైటిల్ని బట్టి ఇప్పుడు మహాలక్ష్మి క్యారెక్టర్లో తమన్నా నటిస్తున్నారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ చిత్రం ‘క్వీన్’ తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ రీమేక్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటిస్తున్నారు. కన్నడ, తమిళ వెర్షన్స్కు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. సెట్లో మంగళవారం పరుల్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. తమన్నా, కాజల్ పాల్గొన్నారు. ‘‘ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు పరుల్. ఇలా మైసూర్లో ముగ్గురు రాణులు కలుసుకున్నారన్నమాట. మలయాళం ‘క్వీన్’ రీమేక్లో నటిస్తోన్న మంజిమా మోహన్ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు. సోషల్ మీడియా ద్వారా పరుల్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారామె. -
‘లవ్వా.. చేస్తే తప్పేంటి’
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ గతంలో ఎన్నాడూ కనిపించనంత సాఫ్ట్ అండ్ రొమాంటిక్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. షరత్ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో మంచి రెస్సాన్స్ వస్తోంది. -
కళ్యాణ్రామ్ `నా నువ్వే' ట్రైలర్ రిలీజ్
-
మాటలు వద్దోయ్... సైగలు చాలోయ్!
అవును... హీరోయిన్ తమన్నా ఏమీ మాట్లాడరు. మీరు ఏం మాట్లాడినా వినిపించుకోరు. ఓన్లీ సైగలే. అయ్యో... తమన్నాకి ఏమైంది? ఎందుకీ కోపం అనుకుంటున్నారా? ఓ క్యారెక్టర్ కోసం కెమెరా ముందు ఇలా చేస్తున్నారామె. చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, భూమిక ముఖ్య తారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘కామోషీ’. ఈ సినిమాలో మూగ–చెవిటి అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారని టాక్. హిందీలో తమన్నా అయితే.. తమిళ్లో నయనతార ఈ పాత్ర చేశారు. ‘కొలైయుదిర్ కాలమ్’ పేరుతో తమిళంలో ఈ సినిమా రూపొందింది. తమిళ వెర్షన్ రిలీజ్కి రెడీగా ఉంది. ఈలోపు హిందీ రీమేక్ మొదలైంది. హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపించే తమన్నా.. ఈ మూవీ రిలీజ్ తర్వాత బోలెడన్ని చాన్స్లు చేజిక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘బాహుబలి’లో నటనకుగానూ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు తమన్నాకు దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’లోను, బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్లోనూ నటిస్తున్నారు తమన్నా. -
భలే ఛాన్సులే
‘వానా వానా వెల్లువాయె’ అంటూ ‘రచ్చ’ సినిమాలో చిరంజీవి రీమిక్స్ సాంగ్లో డ్యాన్స్ చేసిన తమన్నా ఇప్పుడు డైరెక్ట్గా చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసే ఛాన్స్ కొట్టేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్రెడ్డి దర్శకత్వంలో సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయిక. ఈ చిత్రంలో మరో హీరోయిన్కు స్కోప్ ఉండటంతో మిల్కీబ్యూటీ తమన్నాను సెలెక్ట్ చేశారు చిత్రబృందం. చిరంజీవితో నటించే చాన్స్ తమన్నాకి రావడంతో ‘భలే చాన్సులే’ అంటూ సంబరపడిపోతున్నారు తమన్నా ఫ్యాన్స్. ‘సైరా’ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఏడు రోజులు జరిగే ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
ఐపీఎల్కు అందాల ఆరంభం
తమిళసినిమా: ఐపీఎల్ సందడికి టైమ్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ మొదలు కానుంది. 51 రోజులు ఐపీఎల్ క్రికెట్ క్రీడాభిమానుల్ని ఎంటర్టెయిన్ చేయనుంది. ఈ క్రీడా వేదిక ఆరంబమే అదుర్స్ అనేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. శనివారం ముంబైలో ఈ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలో మీల్కీబ్యూటీ తమన్నా ఆకర్షణ కానున్నారు. అవును ఈ బ్యూటీ తన ఆటా పాటతో క్రీడా ప్రియుల్ని మైమరపించనున్నారు. ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్పై ఆడి పాడి అందాలు కుమ్మరించిన తమన్నా ఇప్పుడు బహిరంగ వేదికపై స్టెప్స్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఈ అమ్మడు భారీ మొత్తంలోనే పారితోషికాన్ని అందుకుందని సమాచారం. సాధారణంగా ఈ ప్రారంభోత్సవ వేడుకకు పోటీల్లో పాల్గొనే అన్ని జట్ల కెప్టెన్లకు ఆహ్వానం ఉంటుంది. అలాంటిది ఈ సారి ముంబై, చెన్నై జట్టు కెప్టెన్లకే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది క్రికెట్ బోర్డు నిర్వాహకులకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీసుకున్న నిర్ణయం అట. ఈ వేదికపై నటి తమన్నాతో పాటు మరికొందరు బాలీవుడ్ బ్యూటీస్ ఆకర్షణగా నిలవనున్నారు. వారి అందాలతో చిందేసి ఆహూతులకు కనువిందు చేయనున్నారు. ఐపీఎల్ వేడుకలో మీల్కీబ్యూటీ సందడి చేయనుండడం ఇదే మొదటిసారి. -
విజయతీరానికి అవంతిక
అది విజయనగరం లోయర్ ట్యాంక్బండ్ రోడ్... శనివారం ఉదయం సరిగ్గా పదిన్నర గంటలైంది. ఓ మెరుపు మెరిసినట్టు... పాలవెలుగు విరజిమ్మినట్టు... అచ్చమైన అందం నడిచొచ్చినట్టు... సినీనటి తమన్నా వచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన బిన్యూ స్మార్ట్ ఫోన్ షోరూం ప్రారంభించారు. ఆమెను చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. విజయనగరం టౌన్: తమ అభిమాన హీరోయిన్ తమన్నాను చూసేందుకు అభిమాన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లోయర్ ట్యాంక్ బండ్రోడ్ జనసంద్రమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు సినీనటి తమన్నా హోటల్ మయూరా ఎదురుగా ఉన్న బి న్యూ స్మార్ట్ మొబైల్ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా స్టోర్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్పైకి ఎక్కి అభిమానులను పలుకరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ను ప్రారంభించారు. లోపల జ్యోతి వెలిగించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉందన్నారు. బి న్యూ మొబైల్స్ స్టోర్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మొబైల్స్ లభిస్తాయన్నారు. కొత్తగా కల్యాణ్రామ్తో సినిమా పూర్తయిందని, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ తమ 50వ షోరూమ్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వినియోగదారుల అపారమైన విశ్వాసం, ఆదరణ తమ విజయప్రస్థానానికి ప్రధాన కారణమని తెలిపారు. రూ.499 నుంచి లక్ష వరకూ విలువ చేసే మొబైల్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వంద షోరూమ్లు స్థాపించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఆఫర్ల ద్వారా అధునాతన ఫీచర్ల గల మొబైల్స్ లభిస్తాయని, ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆ నంబర్ నాకు అన్లక్కీ
నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి? అంటే, ‘వన్ నుంచి టెన్ వరకు’ ఏ నంబర్ అయినా చెబుతారు కానీ, పొరపాటున ఆ నంబర్ మాత్రం చెప్పరు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీకీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఏడు చాక్లెట్స్ ఇచ్చి, ఇంకోటి ఇస్తానంటే ఒప్పుకోరు. పోనీ తొమ్మిదికి ఒకటి తగ్గిస్తానన్నా ‘ఊహూ’ అంటారు. ఎందుకంటే ఏడుకి, తొమ్మిదికి మధ్య ఉన్న ‘ఎనిమిది’ తమన్నా అన్లక్కీ నంబర్. చాక్లెట్స్కి కూడా లక్కీ నంబర్ చూడాలా అనుకుంటున్నారా? ఎనిమిది అంటే తమన్నాకు ఇష్టం ఉండదని చెప్పడానికి ఓ ఉదాహరణ అంతే. ఎనిమిదిని ఎందుకు అన్లక్కీ నంబర్గా భావిస్తారో తమన్నా స్పష్టం చేయలేదు. సో.. ఈ బ్యూటీని ఆరాధించేవారు పండ్లూ, పూలూ, వేరే ఏదైనా తీసుకెళ్లేటప్పుడు టోటల్గా నంబర్ ఎనిమిది లేకుండా చూసుకుంటే చాలు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన అన్లక్కీ నంబర్ని బయటపెట్టారు. ఇంకా తను ఫుడ్ లవర్ని అని, షూటింగ్కి పేకప్ చెప్పాక అందరి అమ్మాయిల్లా మామూలుగా ఉంటానని, తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ సినిమా ఇండస్ట్రీ బయటివారే అని చెప్పారు. -
మీనాక్షి అమ్మవారి సేవలో తమన్న
చెన్నై : డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నా మనిషికి జీవితంలో ముఖ్యంగా కావలసింది ఒకటుంది. అదే మనశాంతి. అందుకు దైవానుగ్రహం ఉండాలి. వీలున్నప్పుడు దైవ దర్శనం చేసుకుంటే భారం అంతా దిగిపోతుంది. నటి నయనతార ఇటీవల అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించారు. తాజాగా హీరోయిన్ తమన్న ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అలౌకిక ఆనందాన్ని పొందా రు. దశాబ్దం దాటినా కథానాయకిగా తన స్థానా న్ని పదిలపరచుకుంటూ, తమిళం, తెలుగు, హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది తమన్న. కోలీవుడ్లో ఇటీవల విక్రమ్తో జత కట్టిన తమన్నకు స్కెచ్ చిత్ర విజయం నూతనోత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో శీనూరామసామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఆమె ఇంతకు ముందు ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించిన ధర్మదురై మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. తాజా చిత్రంలో ఉదయనిధి స్టాలిన్తో నటిస్తున్నారు. ఈ చిత్రం మధురై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న తమన్న సోమవారం ఉదయం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఇతర భక్తులతో పాటు వరుసలో నిలబడి అమ్మవారి, సుందరేశ్వరుడు సన్నిధిని దర్శించుకున్నారు. ఈ సంగతి స్థానికులకు తెలియడంతో తమన్నను చూసేందుకు ఆలయం ముందు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త కలకలం చెలరేగింది. దైవ దర్శనం అనంతరం వెలపలికి వచ్చిన ఆమెను పోలీసుల భద్రత నడుమ సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లారు. -
హైదరాబాద్: తమన్నాకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్నగర్లో ఆదివారం మలబార్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు. నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు కొంతదూరంలో పడింది. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సాయంత్రం కొండాపూర్లో మరో మలబార్ నగల దుకాణాన్ని తమన్నా ప్రారంభించనుంది. కాగా, ఇటీవల ఖమ్మంలో పర్యటించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పైనా చెప్పు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. -
వెంకీలా ఉండాలని అప్పుడే అనుకున్నా – విక్రమ్
‘‘విక్రమ్ నాకు మంచి స్నేహితుడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్టార్గా ఎదిగారు. 25 ఏళ్ల క్రితం తనని కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి సినిమాలు అవసరం. మంచి చిత్రాలు రాకుంటే ప్రేక్షకులు థియేటర్స్కు రారు. ‘స్కెచ్’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నిర్మాత డి.సురేశ్బాబు. విక్రమ్, తమన్నా జంటగా విజయ్చందర్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘స్కెచ్’. తమిళంలో హిట్ టాక్తో దూసుకెళుతున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్బాబు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సినిమా ప్రచార చిత్రాలు రిలీజ్ చేశారు. విక్రమ్ మాట్లాడుతూ –‘‘బంగారు కుటుంబం’ షూటింగ్లో నేను ఓ పక్కన నిలబడి ఉంటే, వెంకటేశ్గారు పిలిచి మరీ నాతో బాగా మాట్లాడారు. నేను పెద్ద హీరో అయినా ఆయనలా ఉండాలని ఆ రోజే అనుకున్నా. ఇక ‘స్కెచ్’ విషయానికొస్తే.. కథ వినగానే థ్రిల్ అయ్యాను. కమర్షియల్ టైప్లో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. వరుసగా విభిన్నమైన సినిమాలు చేస్తున్న నేను దాదాపు పదిహేనేళ్ల తర్వాత కమర్షియల్ మూవీ చేశా. ఇందులో పాత విక్రమ్ని చూస్తారు’’ అన్నారు. ‘‘విక్రమ్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా ’’ అన్నారు తమన్నా. ‘‘తమిళంలోలానే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు విజయ్చందర్. -
భక్తితో తమన్నా
ప్రముఖ నటి తమన్నా సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీనటి తమన్నా సోమవారం దర్శించుకున్నారు. తల్లితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. తిరిగి వెళ్తున్న తమన్నాతో ఫొటోలు దిగేందుకు భక్తులతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పోటీపడ్డారు. తమన్నాను చూసిన భక్తులు ‘అవంతిక.. అవంతిక’ అంటూ కేకలు వేశారు. -
జాన్తో జోడీగా
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో జత కట్టనున్నారని బాలీవుడ్ టాక్. జాన్ అబ్రహాం, మనోజ్ భాజ్పాయి ముఖ్య పాత్రల్లో మిలాప్ జావేరి దర్శకత్వం వహించనున్న ఓ యాక్షన్ మూవీలో తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట చిత్రబృందం. ఈ రోల్ ఆమెకు బాగా సూట్ అవుతుందని, స్క్రిప్ట్ తమన్నాకు కూడా బాగా నచ్చిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాలో తమ్మూ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వాని నిర్మించనున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు తమన్నా నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. సో.. ఈ సినిమాతో అయినా సూపర్ సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. తమన్నా ప్రస్తుతం ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘క్వీన్ వన్స్ ఎగైన్’, కల్యాణ్ రామ్ సరసన ఒక సినిమా చేస్తున్నారు. -
రియల్లీ గ్రేట్
మన తారలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. అదేంటి? ప్రోగ్రెస్ కార్డ్ రావడానికి వాళ్లేమైనా బడికి వెళ్తున్నారా! అనుకోకండి. ప్రతి ఏడాది చివర్లో ఐ.యం.డి.బి (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ ఆన్లైన్లో సర్వే జరిపి, ఆ సంవత్సరంలో పాపులర్ అయిన అన్ని భాషల నటీనటుల లిస్ట్ను విడుదల చేస్తుంది. ఇదే ఆ ప్రోగ్రెస్ కార్డ్ అనట్టు. అలా ఈ సంవత్సరం కూడా సర్వే లిస్ట్ను విడుదల చేసింది ఐ.యం.డి.బి. దేశవ్యాప్తంగా కలñ క్షన్లతో మోత మోగించిన ‘బాహుబలి’ ఈ సర్వేలో కుడా సత్తా చాటింది. ఈ సంవత్సరం ఆ లిస్ట్లోకి మన బాహుబలి ‘ప్రభాస్’ చేరారు. ‘బాహుబలి’తో ఈ యంగ్ రెబల్ స్టార్ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు అభిమానులను కూడా పొందారనటంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ ఖాన్స్తో పోటీగా నిలిచి, మన బాహుబలి 5వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో సౌత్ హీరోల్లో ప్రభాస్ ఒక్కరే ఉండటం గమనార్హం. అలాగే కథానాయికల్లో తమన్నా 4వ స్థానం, అనుష్క 8వ స్థానం దక్కించుకున్నారు. లిస్ట్ చూస్తుంటే ‘బాహుబలి’లో ఉన్న స్టార్స్కి ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఆల్రెడీ మనోళ్లకు పాపులార్టీ ఉంది. అయితే ఈ సిన్మా వరల్డ్ వైడ్గా మనోళ్లను పాపులర్ చేసింది. భళా బాహుబలి. -
షేడ్స్ ఆఫ్ తమన్నా
మూతి 36 వంకరలు తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎవరైనా అమ్మాయి ముఖాన్ని అదోలా పెడితే... ‘మూతిని 36 వంకరలు తిప్పుతుందండీ బాబూ!’ అంటుంటారు. మరి, ఎప్పుడు ఏ వంకర పెడితే బాగుంటుంది? తమన్నా టిప్స్ ఇచ్చారండోయ్! 36 వంకరలు కాదు గానీ... జస్ట్, ఓ ఐదు వంకరలు తిప్పారు. పాతకాలం సామెత తమన్నాకు తెలుసో? లేదో? కానీ... కొత్తకాలంలో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువత (అనుకోవాలేమో!) తమకు ఎదురయ్యే సందర్భాల్లో ఏయే వంకరలు తిప్పితే బాగుంటుందనేది చూపించారు. తమన్నాలో షేడ్స్ని అందరూ చూడండి!! జనాలు స్పీడుగా, ఏదో పిచ్చి పట్టినట్టు పరుగుల మీద వెళ్లినా సరే... సేమ్ రెడ్ లైట్ (సిగ్నల్) దగ్గర మనతో పాటు ఆగాల్సిందే! అటువంటి సంఘటన ఎదురైనప్పుడు తమన్నా ఇటువంటి లుక్ ఇస్తారట! లాంగ్ వీకెండ్ వస్తుందని మీరు ఊహించినప్పుడు... ఒక్కసారి మీరు వేసుకున్న బట్టలు చూసుకోండి! అప్పుడు పెదాలు ఇలా విచ్చుకుంటాయట! మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు... ‘జస్ట్ పౌట్’ అంటున్నారు తమన్నా! (పౌట్ అంటే... మూతిని సున్నాలా చుట్టడమే! సెల్ఫీలు తీసుకునేటప్పుడు పౌట్ చేయడమంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టమని పలు సర్వేలు స్పష్టం చేశాయి). రేపు సోమవారం అని అర్థమైనప్పుడు? చిరునవ్వు మాయం!! ఆదివారం బిర్యానీ ఉంటుందని (ఇంట్లో!) ఊహించారు. కానీ, పప్పన్నం ఉందని తెలిస్తే... అప్పుడు తమన్నా ఎక్స్ప్రెషన్ ఇదిగో ఇలా ఉంటుందట! -
ప్యారిస్లో నలుగురు అందగత్తెలు..!
ప్యారిస్లో మన బ్యూటీస్ సందడి చేస్తున్నారు. వేర్వేరు భాషల్లో రూపొందుతున్న ఒకే చిత్రం రీమేక్లో నటిస్తున్న ఈ నలుగురు సౌందర్యరాశులు ఎవరా అంటే? మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. సాధారణంగా ఒక చిత్రం నాలుగు భాషల్లో ఏకకాలంలో రీమేక్ అవడం అన్నది అరుదు. ఆ నాలుగు భాషల్లోనూ షూటింగ్ ఒకేసారి ఒకేచోట జరగడం మరింత విశేషమే. హిందీలో కంగనా రనౌత్ నటించి జాతీయ అవార్డును అందుకున్న 'క్వీన్' చిత్రం ఇప్పుడు తాజాగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో ఏక కాలంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కంగనా పాత్ర తమిళంలో కాజల్ అగర్వాల్, తెలుగులో తమన్నా, కన్నడంలో ఫరూల్ యాదవ్, మలయాళంలో మంజిమామోహన్ చేస్తున్నారు. తమిళ, కన్నడ భాషా చిత్రాలకు నటుడు రమేష్ అరవింద్, తెలుగు చిత్రానికి నీలకంఠ, మలయాళంలో డిజో జోస్ అంటోని దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకులు వేరైనా, కథానాయికలు వేరైనా చిత్రీకరణ మాత్రం షాట్ ఒన్, టేక్స్ ఫోర్ అంటూ ఏకకాలంలో, ఒకేచోట జరుపుకుంటున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మలు షూటింగ్లో భాగంగా ఇప్పుడు ప్యారిస్లో మకాం పెట్టారు. -
ఇక్కడే కాదు.. అక్కడా సమస్య లేదు!
రాధికా ఆప్టే, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా... ఇలా కొంతమంది కథానాయికలు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. సినిమా రంగంలో తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ పై బాలీవుడ్ బ్యూటీలందరూ నిర్మొహమాటంగా చెప్పి, చర్చకు తెర తీశారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? అనేది చాలామందికితెలియకపోవచ్చు. కథానాయికలకు చాన్స్ కావాలంటే కొంచెం పట్టూ విడుపుగా ఉండాలంటారు. ఈ వ్యవహారంపై ఇటీవల తమన్నా కూడా స్పందించారు. కాస్టింగ్ కౌచ్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ – ‘‘చిత్రపరిశ్రమలో ఈ సమస్య ఉంది. అది కూడా వేరేవాళ్లు చెబితే తెలిసిందే. కానీ, నేనెప్పుడూ ఏ సమస్యా ఎదుర్కోలేదు. ఏదైనా మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్లో చేసిన ‘శ్రీ’ నుంచి ఇప్పటివరకూ నాకెలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేవు. ఇక్కడే (దక్షిణాదిలో) కాదు... బాలీవుడ్ (హిందీ)లో కూడా నాకు ఇబ్బందులు ఎదురు కాలేదు’’ అని స్పష్టం చేశారు. -
ప్రతి అమ్మాయి ఓ క్వీనే – తమన్నా
‘‘ప్రతి అమ్మాయిలోనూ ఓ క్వీన్ ఉంటుంది. ఆ క్వీన్ని చూపించడానికి ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు తమన్నా. హిందీ హిట్ ‘క్వీన్’ని తమన్నా ముఖ్యతారగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. నీలకంఠ దర్శకత్వంలో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓ అమ్మాయిని అమ్మాయిగా, మహిళగా కాకుండా ఓ హ్యూమన్ బీయింగ్గా చూపించిన చిత్రం ‘క్వీన్’. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్స్ గురించి మాట్లాడిందీ సినిమా. నాకది నచ్చింది. 2014లో ఈ సినిమా విడుదలైనప్పుడు కచ్చితంగా దక్షిణాది భాషల్లో రీమేక్ కావాలని కోరుకున్నా. తెలుగు రీమేక్లో ‘క్వీన్’గా నటించే ఛాన్స్ నాకు దక్కడం హ్యాపీ! తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ చేస్తున్నారు. మా అందరికీ ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో సినిమా, సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కథ పరంగా హిందీకి, తెలుగుకి 90 శాతం మార్పులు లేవు. ‘క్వీన్’ అంటే కంగానా రనౌతే. నేను ఆమెకు పెద్ద ఫ్యాన్. రీమేక్ చేస్తున్నప్పుడు కంపేరిజన్స్ వస్తాయని తెలుసు. వాటిని పక్కన పెట్టి మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. తెలుగులో హీరోయిన్స్ కమర్షియల్ సినిమాలే చేస్తారనీ, నాలుగు పాటలకు, సన్నివేశాలకు పరిమితమవుతారనీ అందరూ అంటుంటారు. నాకు విభిన్న పాత్రలు చేసే అవకాశం లభించింది. సో, నా దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. నీలకంఠ మాట్లాడుతూ– ‘‘హిందీ ‘క్వీన్’ చూసినప్పుడు సినిమా చూస్తునట్టు కాకుండా ఓ జీవితాన్ని చూసినట్టనిపించింది. కథలో, కథనంలో, సిన్మా తీసిన విధానంలో ఓ నిజాయితీ ఉంది. అదే వందకోట్ల వసూళ్లను, జాతీయ అవార్డులను తెచ్చింది. లైఫ్లో తనకు జరిగిన విషాదాన్ని పక్కనపెట్టి రాణి అనే ఓ అమ్మాయి ఎలా ముందుకు వెళ్లిందనేది చిత్రకథ. తెలుగు రీమేక్కి తమన్నా తప్ప మరొకరు మాకు రాణిగా కనిపించలేదు. ఈ సినిమాతో నేను మలయాళంలో దర్శకుడిగా పరిచయమవుతున్నా’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేస్తామని చిత్రనిర్మాత మనుకుమారన్ తెలిపారు. -
జై లవ కుశలో తమన్నా...?
ఎన్టీఆర్, బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జై లవ కుశ. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ కూడా సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జై లవ కుశలో కూడా ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే తమన్నాను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన మిల్కీ బ్యూటి.. మరోసారి ఆకట్టుకుంటుదేమో చూడాలి. -
ఇక నుంచి డాక్టర్ తమన్నా...
చెన్నై: సినిమా నటులను కదిలిస్తే ఎక్కువ మంది డాక్టర్ కాబోయి యాక్టర్ను అయ్యానంటూ చెప్తారు. ఇందులో ఆశ్చర్యమేముంది..? నటన రంగంలో ఉంటూనే కొందరు ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవుతున్నారు. మరికొందరు తమ వృత్తిలో సాధించి గౌరవ డాక్టరేట్లు అందుకుంటున్నారు. ఇక హీరోయిన్ తమన్నా విషయానికొస్తే పైన చెప్పిన వాటిలో రెండో కోవకు వస్తారు. ఈ బ్యూటీ 2006లో కేడీ చిత్రం ద్వారా కోలీవుడ్కు హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం నిరాశపరచినా, బాలాజీశక్తివేల్ దర్శకత్వం వహించిన కల్లూరి చిత్రం తమన్నకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత తమిళం, తెలుగు అంటూ కేరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం తమన్నాకు లేకపోయింది. తెలుగు, తమిళంలోని స్టార్ హీరోలందరితోనూ జత కట్టారు. ఇక బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్కు జంటగా స్కెచ్ సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా గౌతంమీనన్ నిర్మాతగా తెరకెక్కనున్న తెలుగు చిత్రం పెళ్లిచూపులు రీమేక్లో నటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్లోనూ తమన్నా హీరోయిన్గా మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇలా పలు భాషా చిత్రాలతో నటిగా పుష్కర కాలంలోకి అడుగు పెట్టిన తమన్న కళాసేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ కమిషన్ అనే గుజరాత్కు చెందిన ప్రైవేట్ సంస్థ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్లో జరిగింది. ఈ విషయాన్ని నటి తమన్న తన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచినట్లు భావిస్తున్నాననీ, ఆ గౌరవాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
కంగ్రాట్స్ హీరో.. థాంక్యూ రకుల్!
హైదరాబాద్: తన లేటెస్ట్ మూవీలో తమన్నా భాటియా, కునాల్ కోహ్లీ లాంటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ తో వర్క్ చేయబోతున్నానని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని యంగ్ హీరో సందీప్ కిషన్ అంటున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ లండన్ లో ప్రారంభం కానుంది. తమన్నా, కునాల్ కోహ్లీలతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో సందీప్ ట్వీట్ చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీలో సందీప్ తో జతకట్టి తొలి సక్సెస్ అందుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మూవీ యూనిట్ తమన్నా, సందీప్, కునాల్ కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు రకుల్. ఆ వెంటనే థ్యాంక్యూ రకుల్ అంటూ హీరో సందీప్ కిషన్ రీట్వీట్ చేశారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరోగా ఫనా, సైఫ్ అలీఖాన్ తో హమ్ తుమ్, తేరీ మేరి కహాని సినిమాలను రూపొందించిన కునాల్ కోహ్లి తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తోంది తమన్నా. మూవీ యూనిట్ సహా సందీప్ కిషన్ జూన్ మొదటి వారంలో లండన్ వెళ్లనున్నాడు. Glad to be teaming up with fab talents like @tamannaahspeaks & @kunalkohli ,A new age wacky RomCom by the Dir of #HumTum & #Fanaa :)#Telugu — Sundeep Kishan (@sundeepkishan) 28 May 2017 @Rakulpreet @tamannaahspeaks @kunalkohli thank you bps :) — Sundeep Kishan (@sundeepkishan) 28 May 2017 -
సందీప్ కిషన్కు జోడిగా స్టార్ హీరోయిన్
బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ తమన్నా. సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించినా.. వరుస అవకాశాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్న ఈ బ్యూటీ త్వరలో ఓ యంగ్ హీరోతో జత కట్టేందుకు అంగీకరించింది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తోంది తమన్నా. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరో ఫనా, సైఫ్ అలీఖాన్ తో హమ్ తుమ్, తేరీ మేరి కహాని సినిమాలను రూపొందించిన కునాల్ కోహ్లి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూర్తిగా లండన్ లో తెరకెక్కించనున్నారు. ముందుగా తమన్నా షూటింగ్ కు హాజరు కానుండగా సందీప్ కిషన్ జూన్ మొదటి వారంలో లండన్ వెళ్లనున్నాడు. -
అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?
బాహుబలి 2 సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా, ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. రెండో భాగంలో కొద్ది క్షణాల పాటే కనిపించినా.. బాహుబలి స్టార్గా తమన్నాకు నేషనల్ లెవల్లో మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న బాలీవుడ్ కలను సాకారం చేసుకునేందుకు ఇదే సరైన టైం అని భావిస్తుంది మిల్కీ బ్యూటి. అందుకే సౌత్లో ఇప్పటికే అంగీకరించిన సినిమాలకు కూడా నో చెప్తుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవ స్వయంగా నిర్మించి నటించిన అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా, ఆ తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించింది. అయితే ఆ ప్రాజెక్ట్పై ఎనౌన్స్మెంట్ కూడా వచ్చిన తరువాత ఇప్పుడు తమన్నా నో చెప్పేసిందట. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిన మిల్కీ బ్యూటి, బాలీవుడ్ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. -
తమన్నా వల్లే ఆగిపోయింది..!
బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది. క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు. -
తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!
బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి సినిమాతో ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన క్వీన్ రీమేక్ లో నటించే అవకాశం రావటంతో తెగ సంబరపడిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ రేవతి దర్శకత్వంలో సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. అయితే తాజాగా క్వీన్ రీమేక్ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కారణలేంటో సరిగా తెలియకపోయినా.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని యూనిట్ సభ్యులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వీన్ రీమేక్ తో నటిగానూ ప్రూవ్ చేసుకోవాలని భావించిన తమన్నాకు ఆ కోరిక తీరేలా కనిపించటం లేదు. -
రీల్ లైఫ్లోనే అలా ఉంటా!
నటి తమన్నా పేరు వినగానే దర్శక నిర్మాతలకు ముందు గుర్తుకొచ్చేది గ్లామరేనట. మొదట వేరే నటిని అనుకుని ఆ తరువాత నటి తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఆమెను దృష్టిలో పెట్టుకుని అదనంగా కొన్ని గ్లామర్ సన్నివేశాలను చిత్రంలో చేర్చుతున్నారట. ఈ విషయాన్ని తమన్నా తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారట. ఇటీవల దర్శకుడు సురాజ్ హీరోయిన్లకు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేది అందాలారబోత కోసమేనని నటి తమన్నాను దృష్టిలో పెట్టుకునే అన్నారన్నది గమనార్హం. ఇమాజినేషన్ పేరుతో దర్శక నిర్మాతలు తమన్నాను పాటల్లో కురచ దుస్తుల్లో చూపించడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తుంటారు. ఆమె కూడా అలాంటి పాత్రలకు న్యాయం చేయడానికి ఏమాత్రం సంకోచించరంటున్నారు సినీ వర్గాలు. తమన్నా కథానాయకి అయితే ఆ చిత్రంలో గ్లామర్కు కొరత ఉండదు అని యువత అనుకుంటున్నారంటే ఆమె ఎక్స్పోజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాను రీల్ లైఫ్లోనే అలా గ్లామర్గా కనిపిస్తానని, రియల్ లైఫ్లో సంసార పక్ష దుస్తులనే ధరిస్తానని తమన్నా అంటున్నారు. ఒక్కోసారి మోడరన్ దుస్తులు ధరించినా చూసేవాళ్లు గౌరవించే విధంగానే అవి ఉంటాయంటున్న తమన్నా సినిమాల్లోనే కురుచ దుస్తులతో తన ఇమేజ్కు భంగం కలిగేలా చేస్తున్నారని వాపోతున్నారట. అయితే బాహుబలి చిత్రంలో అందాలతోపాటు అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తమన్నా భవిష్యత్తులోనైనా ఆ తరహా శక్తివంతమైన పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారట. అంతే కాదు తనకు ఇష్టమైన దర్శకులను వైవిధ్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి తన కోరికను ఆ దర్శకులు ఏపాటి నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు శింబుకు జంటగా అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. -
హిట్ కోసం ఐదోసారి!
తమన్నాకు హిట్స్ కొత్త కాదు. సౌత్లో పలు హిట్, సూపర్హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ, హిందీలో హిట్ అనేది ఇప్పటివరకూ అందని ద్రాక్షలా ఆమెను ఊరిస్తోంది. ‘హమ్షకల్స్’, ‘హిమ్మత్వాలా’, ‘ఎంటర్టైన్మెంట్’... తమన్నా చేసిన మూడు స్ట్రయిట్ హిందీ సినిమాలు నిరాశను మిగిల్చాయి. గతేడాది నటించిన త్రిభాషా సినిమా ‘అభినేత్రి’ కూడా ఫ్లాప్ జాబితాలో చేరింది. అయినా... పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తమన్నా హిందీ తెరపై హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా... జాన్ అబ్రహాం హీరోగా నటించనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఛోర్ నికల్ కే భాగ్’లో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. అయితే... హీరోయిన్గా కాదు, హీరోకు ధీటుగా అతనితో మైండ్ గేమ్స్ ప్లే చేసే కీలక పాత్ర. ఇందులో తమన్నా ఎయిర్హోస్టెస్గా కనిపించనున్నారు. ఈసారి హిట్ కన్ఫర్మ్ అని తమన్నా ధీమాగా ఉన్నారట! హిందీ సినిమాల సంగతి పక్కన పెడితే... తెలుగులో ఆమె నటించిన ‘బాహుబలి–2’ ఏప్రిల్లో విడుదల కానుంది. తమిళంలో ఆమె రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. -
మరీ... ఇంత అలుసా?
‘‘కథానాయికలు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు’’... ఇలా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి, తమిళ దర్శకుడు సురాజ్ ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఒక్కసారిగా ఇప్పుడు తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు అందరూ ఈ దర్శకుడిపై విరుచుకు పడ్డారు. ‘అమ్మాయిలంటే, అంత అలుసా?’ అని విశాల్ సహా హీరోలూ గొంతు కలిపారు. చినికి చినికి గాలివానగా మారిన ఈ లేటెస్ట్ కాంట్రవర్సీపై కథనం... విశాల్, తమన్నా జంటగా సురాజ్∙దర్శకత్వం వహించిన ‘ఒక్కడొచ్చాడు’ (తమిళ మాతృక ‘కత్తి సండై’) ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా గ్లామరస్గా కనిపించారు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సురాజ్ను తమన్నా గ్లామర్ గురించి ఓ విలేకరి ఓ ప్రశ్న వేశారు. అప్పుడు సురాజ్... ‘కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?’ అని నోరు పారేసుకున్నారు. అలా అనడం ఆయనను వివాదాలపాలు చేసింది. ‘‘లోయర్ క్లాస్ ఆడియన్స్ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి. ఒకవేళ కాస్ట్యూమ్ డిజైనర్ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్ చేసేలా డిజైన్ చేస్తే... ‘లెంగ్త్ తగ్గించండి’ అని నిర్మొహమాటంగా చెబుతా. హీరోయిన్కి అసౌకర్యంగా అనిపించినా నాకు సంబంధం లేదు. ఆ డ్రెస్ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా’’ అని కూడా సురాజ్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి, ‘ప్రేక్షకులు అసలు థియేటర్కి వచ్చేదే కథానాయికలను ‘అలా’ చూడ్డానికే’ అని స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్ కొనేది హీరోయిన్లను అలాంటి దుస్తుల్లో చూడ్డానికే’’ అని సురాజ్ అనడం చర్చనీయాంశమైంది. సురాజ్ ఆ రోజున అసలు ఏ మూడ్లో ఉన్నారో, ఏమో కానీ, ‘ఒకవేళ కథానాయికలు తమ అందచందాల్ని కాకుండా, యాక్టింగ్ టాలెంట్ని మాత్రమే చూపించుకోవాలంటే టీవీ సీరియల్స్లో చూపించుకోమనండి’ అని కూడా నోరేసుకొని పడ్డారు. ‘‘అసలు కమర్షియల్ సినిమాలు చేసే నాయికలకు పారితోషికం ఇచ్చేది... ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బుకి తగ్గవి ఇవ్వడం కోసమే’’ అని కూడా సురాజ్ తనదైన విశ్లేషణ చేసేశారు. గది దాటి బయటికొస్తే వివాదమే! జనరల్గా సినిమా పరిశ్రమలో కథానాయికల గురించి ఎక్కువగా ఇలా మాట్లాడుతుంటారు. అందరూ కాకపోయినా ఎక్కువ మందికి మాత్రం హీరోయిన్ల పట్ల ఇలాంటి చులకన భావమే ఉంటుంది. అయితే ఏం మాట్లాడినా నాలుగు గోడల మధ్య మాట్లాడేస్తారు కాబట్టి, అవి వెలుగులోకి రావు. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడితే, నాయికల మనోభావాలను దెబ్బ తీసినట్లే. ప్రముఖ తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ అయితే గతంలో కథానాయికలను వేశ్యలతో పోల్చి, పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సీనియర్ నటి ఖుష్బూ సదరు దర్శకుడిపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టి మరీ, చివరకు విజయం సాధించారు. ఇప్పుడు డైరెక్టర్ సురాజ్ మాటలతో హీరోయిన్ తమన్నా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సురాజ్ దర్శకత్వంలోని ‘ఒక్కడొచ్చాడు’ చిత్ర హీరోయిన్ అయిన తమన్నా ఆయన మాటల్ని ఖండిస్తూ, స్పందించారు. కానీ, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఆ దర్శకుడి సినిమాలో నటించిన కథానాయిక ఒక్కరూ స్పందిస్తే.. సరిపోతుందా? వాస్తవానికి ‘కమర్షియల్ సినిమా’ల్లో నటించే ప్రతి నాయికకూ సురాజ్ మాటలు వర్తిస్తాయి. అందుకే ఒక గొంతుకి ఇంకో గొంతు తోడైతే విషయం బలపడుతుంది. తమన్నా ఇలా స్పందించారో, లేదో.. మరో స్టార్ హీరోయిన్ నయనతార నుంచి కూడా గట్టి స్పందనే వచ్చింది, జనరల్గా మీడియాతో మాట్లాడని నయనతార... కథానాయికల గురించి సురాజ్ చేసిన వ్యాఖ్యలకు ఓ ‘వెబ్సైట్’ ద్వారా చాలా ఘాటుగానే స్పందించారు. శ్రుతీహాసన్, తదితర హీరోయిన్లు పలువురు కూడా వీరి మాటలకు సంఘీభావం ప్రకటిస్తూ, ట్విట్టర్లో ట్వీట్లు, రీ–ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర సీమలో సురాజ్ మాటలు, అతనిపై విమర్శలే... పెద్ద హాట్ టాపిక్. చివరకు సురాజ్ వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అవును మరి... స్త్రీలను గౌరవించక పోగా, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిప్పలు తప్పవని సురాజ్ లాంటి వాళ్ళకు తెలియాల్సిందే! ఇంట్లోవాళ్ళనీ.. ఇలాగే అంటాడా? – నయనతార ‘‘అసలు కథానాయికలపై ఇంత నీచమైన, అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన ఈ సురాజ్ ఎవరు? కథానాయికలకు డబ్బులు ఇస్తున్నారు కనుక... కెమేరా ముందుకొచ్చిన తర్వాత బట్టలు విప్పేస్తారని అతడు అనుకుంటున్నాడా? అతడి కుటుంబంలో పనిచేస్తున్న మహిళలపై ఈ కామెంట్ చేసే దమ్ముందా?’’ అని కథానాయిక నయనతార, సురాజ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అతడు ఏ కాలంలో ఉన్నాడంటూ ప్రశ్నించారు. ‘‘ఈ సంవత్సరం వచ్చిన ‘పింక్’, ‘దంగల్’ వంటి సినిమాలు మహిళల సాధికారత, గౌరవం గురించి మాట్లాడుతుంటే... సురాజ్ ఎక్కడ ఉన్నాడో? కమర్షియల్ సినిమాల్లో కథానుగుణంగానో, తమకు సౌకర్యవంతంగా అనిపిస్తేనో కథానాయికలు గ్లామరస్గా కనిపించే దుస్తులను ధరిస్తారు. అయినా... సురాజ్ ఏ ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాడో? కథానాయికలను చిట్టిపొట్టి బట్టల్లో చూడడానికి ప్రేక్షకులు టికెట్లు కొని సినిమాలకు వస్తున్నారా! లేదు. సురాజ్ కన్నా ప్రేక్షకులే సినీ తారలను ఎక్కువ గౌరవిస్తున్నారు. ‘ఎక్కువ డబ్బులు తీసుకుని కథానాయికలు చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటున్నారు’ అనడం ద్వారా అతడు యువతరాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నేనూ కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్గా నటించాను. అయితే, ‘లో క్లాస్’ ప్రేక్షకుల కోసం అలా నటించమని నా దర్శకులు బతిమాలారనో, ఎక్కువ డబ్బులు ఇచ్చారనో గ్లామరస్గా నటించలేదు. నేను అలాంటి సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కథానాయికలను అలుసుగా తీసుకునే హక్కు ఎవరికీ లేదు’’ అని ఘాటుగా స్పందించారు నయనతార. అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే! – తమన్నా ‘‘తప్పు... నా దర్శకుడు (సురాజ్) చేసిన కామెంట్స్ నన్ను బాధించాయి. కోపమూ తెప్పించాయి. తప్పకుండా అతను క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. నాకు మాత్రమే క్షమాపణ చెబితే చాలదు. చిత్ర పరిశ్రమలో మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి’’ అని తమన్నా సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సురాజ్ని నిలదీశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘నటీనటులుగా ప్రేక్షకులను అలరించడం మా బాధ్యత. అంతేగానీ... మమ్మల్ని వస్తువులుగా వర్ణించడం ఏ మాత్రం బాగోలేదు. నేను దక్షిణాది చిత్రాల్లో 11 ఏళ్లుగా నటిస్తున్నా. ఇన్నేళ్లుగా నాకు సౌకర్యవంతంగా అనిపించిన దుస్తులే వేసుకున్నా. మన దేశంలో మహిళల గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రేక్షకులకు నేను చెప్పేదొక్కటే.... ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఆధారంగా చిత్ర పరిశ్రమ అంతటినీ అదే దృష్టిలో చూడొద్దు’’ అన్నారు తమన్నా. సారీ! నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా – దర్శకుడు సురాజ్ కథానాయికల గురించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతాయని మాట్లాడుతున్న సమయంలో బహుశా సురాజ్ ఊహించినట్లు లేరు. అనుకోని విధంగా తమన్నా, నయనతార సహా పలువురు తారలు స్పందించడంతో... సురాజ్ దిమ్మెరపోయారు. దాంతో, సోమవారం సాయంత్రం ఆయన హీరోయిన్ల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ‘‘మిస్ తమన్నా సహా కథానాయికలందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. ఒకరి గురించి తప్పుగా మాట్లాడి, వాళ్ల మనసు బాధపెట్టాలనే ఆలోచన నాకు లేదు. నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. మరొక్కసారి క్షమాపణలు చెప్పుకుంటున్నా’’ అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బొత్తిగా అనవసరమైన కామెంట్స్ అవి! – హీరో విశాల్ ‘ఒక్కడొచ్చాడు’లో హీరోగా నటించిన విశాల్ ఈ వివాదం గురించి సోమవారం సాయంత్రం స్పందించారు. దర్శకుడు సురాజ్ క్షమాపణ చెప్పడం ఆనందం అన్నారు. ఇంకా విశాల్ మాట్లాడుతూ – ‘‘సురాజ్ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నడిగర సంగం’ జనరల్ సెక్రటరీగా కాదు, ఓ నటుడిగా ఈ మాట అంటున్నా. కథానాయికలు తమ నట ప్రతిభను కనబరుస్తున్నారు తప్ప శరీరాన్ని ప్రదర్శించడం లేదు’’ అన్నారు. ‘‘ఇలా జరిగినందుకు సారీ’’ అని తమన్నాను ఉద్దేశించి హీరో విశాల్ పేర్కొనడం విశేషం. -
తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు
రెమ్యూనరేషన్ కోసమే గ్లామర్ పాత్రలంటూ హీరోయిన్లపై నోరు పారేసుకున్న 'ఒక్కడొచ్చాడు' దర్శకుడు సురాజ్ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు క్షమాపణలు చెప్పాడు. తమన్నాతోపాటు, సిరీ పరిశ్రమలో్ని మిగిలిన హీరోయిన్లందరిపై చేసిన సెక్సిస్ట్ కామెంట్లకు సారీ చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు. సోమవారం మీడియాకు విడుదల ఒక ప్రకటనలో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. తన ఉద్దేశం అదికాదని, వారిని నొప్పించి ఉంటే క్షమించాలంటూ తమన్నా సహా అందరి కథానాయికలకు సారీ చెప్పాడు. ఇటీవల ఒక స్వతంత్ర యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సురాజ్ కధానాయికలుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రెమ్యూనరేషన్ కోసమే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారని వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆయన పైత్యం చల్లారలేదు.. బి, సి సెంటర్లను 'సంతృప్తి' పరచడానికే పొట్టి బట్టలు ధరిస్తారన్నాడు. ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో దిగివచ్చిన దర్శకుడు చివరికిలా క్షమాపణలు తెలిపాడు. కాగా విశాల్ తాజా చిత్రం 'కత్తి సాందాయ్' తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్ తో . సూరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.