tenders
-
నిబంధనలకే ‘టెండర్’
అంగన్వాడీల్లో కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కొత్త నిబంధనలు.. అగ్మార్క్ సర్టీఫికెట్కు రెండేళ్ల సీనియార్టీ, రిప్లికా నంబర్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాకు నిర్దేశించిన టెండర్ ప్రక్రియ పౌల్ట్రీ రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. టెండర్ నిబంధనలు ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు.. అది కూడా గతంలో టెండర్ దక్కించుకున్నవారికే అనుకూలంగా ఉన్నాయని ఇతర పౌల్ట్రీ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోరుకున్నవారికి టెండర్ కట్టబెట్టేందుకే నిబంధనలు మార్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు టెండర్ ప్రక్రియకు తక్కువ గడువు ఇవ్వటంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా 36 కోట్ల గుడ్లు సరఫరా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద ప్రతీరోజు ఒకటి చొప్పున కోడిగుడ్లు అందిస్తారు. వీటిని ఏడాదిపాటు సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచింది. మార్చి 30న టెండర్ ఫారాల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీతో టెండర్ దాఖలు గడువు ముగియనుంది. ఈ క్రమంలో టెండర్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్న పౌల్ట్రీ రైతులు నిబంధనలను చూసి షాకయ్యారు. టెండర్ నిబంధనలన్నీ కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే అనుకూలంగా ఉండడం.. చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులకు సరిపోలే పరిస్థితి లేకపోవటంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 10,34,562 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి ఏటా 36,96,80,897 కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్లు పిలిచింది. పంపిణీ విధానంలో మార్పులు కోడిగుడ్ల సరఫరాకు గతంలో జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా కాంట్రాక్టర్ల ఎంపిక జరిగేది. రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని మార్చి, కొత్తగా ఏర్పాటైన జోన్ పరిధిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ విధానంలో ఏడు జోన్లకు ఏడుగురు కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఏడుగురు కాంట్రాక్టర్లు గుడ్లు సరఫరా చేస్తున్నారు. గత మార్చితో వారి పంపిణీ గడువు పూర్తయింది. కానీ, కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తికాకపోవడంతో నెలరోజులపాటు వారి కాంట్రాక్టును పొడిగించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. నిబంధనలు... మార్చారిలా.. ⇒ కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు విషయంలో 12 రకాల నిబంధనలున్నాయి. ఈ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కాంట్రాక్టర్కే టెండర్ దక్కుతుంది. ఒక జోన్ భౌగోళిక పరిధిలో ఉన్నవారే ఆ జోన్ టెండర్లో పాల్గొనాలి. అది కూడా పౌల్ట్రీ యజమానికి మాత్రమే అర్హత ఉంటుంది. లీజు పద్ధతిలో కొనసాగే రైతుకు అవకాశం లేదు. రాష్ట్రంలో 650 మంది పౌల్ట్రీ రైతులు (లేయర్) ఉన్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ⇒ టెండర్ నిబంధనల్లో ఈసారి రెండు మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిపైనే రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో పౌల్ట్రీ రైతుకు అగ్మార్క్ ధ్రువీకరణ పత్రం ఉండాలనే నిబంధన ఉండేది. తాజా ఈ ధ్రువీకరణ పత్రం టెండర్ తేదీకి కనీసం రెండేళ్ల ముందు నుంచే చెల్లుబాటు అయ్యేలా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో కొత్తగా అగ్మార్క్ ధ్రువీకరణ తీసుకున్న వారికి ఈసారి టెండర్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ నిబంధన గతంలో టెండర్ దక్కించుకున్నవారికే మళ్లీ టెండర్ దక్కేలా ఉందని పౌల్ట్రీ రైతులు ఆరోపిస్తున్నారు. ⇒ అగ్మార్క్ ధ్రువీకరణతోపాటు అగ్మార్క్ రిప్లికా సీరియల్ నంబర్ కూడా కలిగి ఉండాలని తాజా టెండర్లో కొత్త నిబంధన పెట్టారు. ఇది కూడా గత టెండర్లో ఎంపికైన కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉంది. మరోవైపు అగ్మార్క్ రిప్లికా నంబర్ టెండర్ ప్రారంభమైన తేదీ కంటే ముందే ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో కొత్తగా ఈ నంబర్ తీసుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ⇒ అగ్మార్క్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల ప్రామాణిక నాణ్యతను ధ్రువీకరిస్తుంది. అగ్మార్క్ రిప్లికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రామాణికతతోపాట ఆ ఉత్పత్తి గ్రేడు ప్రమాణాలను నిర్ధారిస్తుంది. గడువుపైనా గందరగోళం (బాక్స్) టెండర్ ప్రక్రియ గడువుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియ మార్చి 30న ప్రారంభమై ఏప్రిల్ 10న ముగుస్తుంది. అయితే, మార్చి 30, 31, ఏప్రిల్ 1, 5, 6వ తేదీలు ప్రభుత్వ సెలవుదినాలు. టెండర్ గడువు మొత్తం 12 రోజులు కాగా... ఇందులో ఏకంగా 5 రోజులు సెలవు దినాలే. ఇక మిగిలింది ఏడు రోజులు మాత్రమే. గతంలో 17 రోజులపాటు సమయం ఇవ్వగా.. ఈసారి 12 రోజులకు కుదించారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఈ తేదీలను ఖరారు చేశారని మండిపడుతున్నారు. ఈ టెండర్ విషయంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మళ్లీ టెండర్లు.. మళ్లీ కమీషన్లు
అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టిస్తారా? లేక తొలుత తాత్కాలికంగా ఒక ఇల్లు కట్టించి.. ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టిస్తారా? ఎవరైనా అన్నీ సరిచూసుకుని ఒకేసారి ఇల్లు కట్టిస్తారు. ఘనత వహించిన మన సీఎం చంద్రబాబు మాత్రం రెండు సార్లు కడతానంటున్నారు. తొలుత రూ.353 కోట్లు అప్పు చేసి తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఏకంగా రూ.1,649.33 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమై పోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఈ పెద్దమనిషి నిర్వాకమిది. రేపు ఇదే అమరావతిలో ఆయన సొంతంగా నిర్మించుకునే ఇంటిని కూడా ఇలా రెండు మార్లు కడతారా.. అని మాత్రం అడగొద్దు! సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా సర్కారు పెద్దలు అడుగులు ముందుకు వేస్తున్నారు. 2016–18 మధ్య అప్పుగా తెచ్చిన రూ.353 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి కమీషన్లు దండుకున్న ఇదే చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెస్తున్న అప్పులో రూ.1,649.33 కోట్లతో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పూనుకుంది. ఇలా నిధులు దుబారా చేస్తూ.. నచ్చిన సంస్థలకు ఏకపక్షంగా టెండర్లను కట్టబెడుతూ మళ్లీ కమీషన్లు కొట్టేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా ముందే రూపొందించిన స్కెచ్ మేరకు రెండు టెండర్లలో తనకు నచ్చిన రెండు సంస్థలే పాల్గొని అధిక ధరలకు బిడ్లు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఆపై ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టి అనుకున్న మేరకు నిధులు దోచుకోవడానికి రూట్ క్లియర్ చేసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేశాయి. హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లతో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లతో ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది. తద్వారా హైకోర్టు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు రెండు సంస్థలు కోట్ చేయడంతో ప్రభుత్వ ఖజానాపై రూ.వందల కోట్ల మేర భారం పడింది. మొత్తంగా రెండు భవనాల కాంట్రాక్టు విలువ రూ.1,649.33 కోట్లు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ సమావేశంలో ఈ రెండు టెండర్లను ఆమోదించి, కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో 2015లో వెలగపూడి వద్ద 45.12 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చదరపు అడుగుకు రూ.17,183 చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన ఇప్పుడు చేపట్టిన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చు. 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు » హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం (కాంప్లెక్స్)లోని ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో.. బేస్మెంట్, గ్రౌండ్ ప్లోర్, ఏడు అంతస్తుల్లో (బీ+జీ+7) 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ను రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలనే షరతుతో మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ అంచనా వ్యయం రూ.924.64 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. చేస్తోంది అప్పు.. ఆపై దుబారా ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమేనని.. ఇలా దుబారా చేయడం సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 11,21,975 చదరపు అడుగుల్లో అసెంబ్లీ » అసెంబ్లీ శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం(కాంప్లెక్స్)లో ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తులు(బీ+జీ+3)లో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన డిజైన్ను ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈనెల 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ పనులను రూ.724.69 కోట్లకు ఎల్ అండ్ టీ దక్కించుకుంది. -
అవినీతి నిర్మాణానికి రెట్టింపు ‘అడుగు’
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు. ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లుఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది. బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది. దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.తన రికార్డు తానే బద్దలురాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది. బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది. -
‘భవ్యం'గా టెండరు!
సాక్షి, అమరావతి : వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్నది సామెత. ప్రభుత్వంలోనూ ఇలాంటి కీలక వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటే ఇంక తిరుగే ఉండదు.. అనుకున్న పనులు అనుకున్నట్లు చకచకా జరిగిపోతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది. 108, 104 వాహనాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ టెండర్లలో ఓ అస్మదీయ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ముఖ్యనేతల డైరెక్షన్లో ‘భవ్య’మైన స్కెచ్ వేశారు. ఆ ప్రణాళిక కథాకమామిషు ఇదిగో ఇదే.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంపేద, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా గత ప్రభుత్వంలో అమలైన డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) స్కీంలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించింది. కూటమి పార్టీ నేతల జేబులు నింపే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కార్యక్రమాలనే పక్కాగా అమలుచేస్తోంది. అస్మదీయ సంస్థలకు పనులను కట్టబెట్టడం ద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగు లు వేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలోని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు కట్టబెట్టడానికి ఓ ‘భవ్య’మైన ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. పై మూడింటికీ కలిపి ఏపీఎంఎస్ఐడీసీ ఒకే టెండరును పిలిచింది. ఈ టెండరు నిబంధనలను చూసి ‘నిబంధనలన్నీ ప్రభుత్వ పెద్దలు నిశ్చయించుకున్న సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టేలా ఉన్నాయి. ఆ సంస్థ పేరొక్కటే టెండరు డాక్యుమెంట్లో పొందుపరచలేదు’.. అని వైద్యశాఖలో ఇప్పుడీ అంశాన్ని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నిజానికి.. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో బాధితులకు సత్వర వైద్యసాయం అందజేత, ప్రివెంటివ్ కేర్లో 108, 104 సేవలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ పూర్వ అనుభవం, సామర్థ్యం ఎంతో కీలకం. వీలైనన్ని ఎక్కువ సంస్థలు ఈ టెండరులో పాల్గొనే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ, పెద్దఎత్తున అంబులెన్స్లు, ఎంఎంయూలు నిర్వహించిన, అనుభవం, సామర్థ్యంలేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం ఇష్టమొచ్చినట్లు నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఒకే తరహా సేవలకు వేర్వేరు నిబంధనలు.. రాష్ట్రవ్యాప్తంగా 1,700 అంబులెన్స్లు, ఎంఎంయూలు ఐదేళ్లపాటు నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.రెండు వేల కోట్ల అంచనాతో టెండరు రూపొందించారు. ఇంత విలువైన కాంట్రాక్టులను ఓ చిన్న సంస్థకు కట్టబెట్టడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. సీవీసీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ కనీసం 30 శాతం ఉండాలి. అయితే, ప్రస్తుత టెండరులో వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో 122 ఫీడర్ అంబులెన్స్ నిర్వహణ కోసం ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్కు కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు, కనీసం 33 శాతం (40) ఫీడర్ అంబులెన్సులను గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు. కానీ, 108, 104 టెండరులో మాత్రం బిడ్ దాఖలుచేసే నాటికి 100 వరకూ అంబులెన్స్లు/ఎంఎయూ/వెటర్నరీ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహించి ఉంటే చాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకే తరహా సేవలకు సంబంధించిన టెండర్లలో వేర్వేరు నిబంధనలు విధించడం ఇక్కడ గమనార్హం. ఫీడర్ అంబులెన్స్ల తరహాలో 33 శాతం నిబంధన పెడితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుందని 104, 108 టెండరులో మెలికపెట్టినట్లు తెలిసింది. సదరు సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో వెటర్నరీ అంబులెన్స్లు నిర్వహిస్తుండడంతో ప్రస్తుత టెండర్లలో వెటర్నరీ అంశాన్ని చేర్చినట్లు సమాచారం. మరోవైపు.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈహెచ్ఆర్) సృష్టిలో అనుభవం ఆధారంగా ఐదు మార్కులు కేటాయిస్తామని టెండరులో పేర్కొన్నారు. ఇక సదరు అస్మదీయ సంస్థ పలు రాష్ట్రాల్లో ఈహెచ్ఆర్ ప్రాజెక్టులు చేసిన క్రమంలో దాని ఆధారంగా మార్కులిచ్చి మేలు చేయడానికే ఈ నిబంధన కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు హెల్త్కేర్ ప్రాజెక్టుల్లో ఈ సంస్థ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకు 1.5 చొప్పున 15 మార్కుల వరకూ బోనస్ ఇచ్చేలా నిబంధన పెట్టారు.ఒకే బిడ్ వచ్చినా ఆమోదించేలా.. ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పనులకు టెండర్లు పిలిచినప్పుడు ఒకే సంస్థ బిడ్ వేస్తే ఆ టెండర్ను రద్దుచేసి, మరోసారి పిలవడం ఆనవాయితీ. కానీ, ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం పూర్వ అనుభవం, సామర్థ్యం కలిగిన సంస్థలు పోటీలో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘భవ్య’మైన ప్రణాళికను రచించింది.ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా షరతు విధించింది. దీంతో.. ఒకే సంస్థ పోటీలో ఉండేలా నిబంధనలు పొందుపరిచి, ఆ మేరకు బిడ్ ఆమోదించే వెసులుబాటు కల్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కావని, ఇప్పుడే చేర్చారని ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
‘జన్ ఔషధి’కి అవినీతి ‘సత్యం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓ రేటు మాట్లాడేసుకుని టెండర్లు లేకుండానే ప్రభుత్వ శాఖల్లో పనులను నచ్చిన వారికి కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఓ మంత్రి కమీషన్ల రూపంలో రూ.కోట్లలో కొట్టేయడానికి పన్నాగం పన్నారని వైద్య శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలుకు కేటాయించే బడ్జెట్లో 80 శాతం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడీసీ ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది.మిగిలిన 20 శాతం డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఏటా డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్తో రూ.50 కోట్ల మేర కొనుగోళ్లు చేపడుతుంటారు. వీటితో పాటు, సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందుల కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గతేడాది వైద్య శాఖ ప్రవేశపెట్టింది. జన్ ఔషధిలో సరఫరా చేయని మందులనే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేయాలని షరతులు పెట్టారు. ఏకంగా ఉత్తర్వులు మార్చి గ్రీన్ సిగ్నల్ ఈ నేపథ్యంలో సదరు మంత్రి ఒక మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకున్న క్రమంలోనే జన్ ఔషధి వ్యవహారం తెరమీదకు వచ్చిందని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు చర్చించుకుంటున్నారు. తిరుపతికి చెందిన సదరు సంస్థ ప్రతినిధులు ‘జన్– ఔషధి విధానం ప్రవేశపెట్టిందే మా కోసం.. మాతోనే ఎంవోయూ చేసుకోవాలి’ అని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను సంప్రదించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఫలానా సంస్థతో ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలివ్వాలని మంత్రి కార్యాలయం ఒత్తిళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి.. సదరు సంస్థతోనే సూపరింటెండెంట్లు ఒప్పందం కుదుర్చుకునేలా నిబంధనల్లో మెలికలు పెడుతూ గత నెల (జనవరి) 23న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణలు చేశారు. మంత్రికి చెందిన సరఫరాదారుడికి రాయలసీమతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ జన్ ఔషధి స్టోర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ పీఎంబీజేకే – జన్ఔషధి స్టోర్స్ ఉన్న సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవాలని నిబంధనలు మార్చారు. అదే విధంగా తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీసం ఏడాది ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నిబంధనను సవరించి, రెండేళ్ల కాలనికి పొడిగించారు. హెచ్డీఎస్, ఆరోగ్యశ్రీ మందుల కొనుగోళ్లలోనూ ఇవే నిబంధనలు పాటించాలని మెలిక పెట్టారు.ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను జనవరి 28న ఇచ్చారు. దీంతో ఏటా రూ.50 కోట్లకుపైగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు మేలు జరిగేలా మంత్రి చక్రం తిప్పారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలోనే లబ్ధి పొందాలని మంత్రి ప్రణాళికలు రచించినట్టు స్పష్టమవుతోంది.పెనాల్టీలు కూడా లేవట!పీఎంబీజేకే–జన్ ఔషధి గుర్తింపు పొందిన, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మందులు సరఫరా చేసే సంస్థలతో ఎంవోయూ చేసుకోవాలని డీఎంఈ డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధానంగా సూపరింటెండెంట్లకు సూచించారు. ఎమర్జెన్సీ మందులు అయితే 24 గంటల్లో, తక్కువ మొత్తంలో మందులు అయితే ఇండెంట్ పెట్టిన మూడు రోజుల్లో, పెద్ద ఎత్తున అయితే వారంలో సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు రూపొందించారు. నిర్దేశించిన సమయంలోగా మందులు సరఫరా చేయకుంటే సదరు సంస్థకు పెనాల్టీ విధించేలా ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే ఎంవోయూ రూపొందిస్తున్నట్లు సమాచారం. మందుల సరఫరాలో పదే పదే ఆలస్యం చేసినా చర్యలు తీసుకోలేని విధంగా కాంట్రాక్టర్కు అనుకూలంగా నిబంధనలు తయారు చేశారని తెలిసింది. -
రేట్లు పెంచుకుని.. కమీషన్లు పంచుకునేలా!
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరుకుల తరలింపునకు సంబంధించిన స్టేజ్–1 టెండర్లలో భారీ అవినీతి బాగోతం నడుస్తోంది. గతంలో ఒకసారి టెండర్లు పిలిచి.. ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన తర్వాత.. వాటిని రద్దుచేసి కొత్తగా టెండర్లు(Tenders) పిలవడం చర్చనీయాంశమైంది. తాజాగా 22 జిల్లాలకు స్టేజ్–1 టెండర్లు ఆహ్వానించగా.. గతంలో కోట్ చేసిన ధరలకంటే ఈసారి ఏకంగా 15 శాతం అధికంగా ధరలు ఉండటం గమనార్హం. కమీషన్ల కోసమే కొత్త టెండర్!గతేడాది అక్టోబర్–నవంబర్లో పౌరసరఫరాల సంస్థ(Civil Supplies Corporation) స్టేజ్–1 టెండర్లు నిర్వహించింది. ఇందులో ఎక్కువగా రాజకీయ సిఫారసులు నడిచాయి. చాలాచోట్ల సింగిల్ టెండర్లు వచ్చాయి. అప్పట్లో కూడా పాత టెండర్లతో పోలిస్తే 10 శాతం వరకు అధిక ధరలు కోట్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు తమను అన్యాయంగా టెండర్ ప్రక్రియ నుంచి తప్పించారంటూ కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకున్నారు. అయితే.. దోపిడీయే పరమావధిగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు పాత టెండర్ల రద్దుకు ప్రణాళిక వేశారు. దీంతో మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ రేట్లు వచ్చాయని సాకుగా చూపించి మొత్తం టెండర్లను రద్దు చేసేశారు. విచిత్రం ఏమంటే.. తాజాగా పిలిచిన టెండర్లలో గతంలో కోట్ చేసిన దానికంటే ఎక్కువ ధరలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కువ టెండర్లనే ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కాంట్రాక్టర్లను చర్చల (నెగోషియేషన్స్) పేరుతో పిలిచి కోట్ చేసిన ధరలో రూపాయి, అర్ధరూపాయి తగ్గించి.. ఏదో భారీగా తగ్గించినట్టు మభ్యపెడు తున్నారు. ఉదాహరణకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో టెండర్ల ధర ఎక్కువ రాగా.. అయినా వీటిని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లలో ఎక్కువ ధరలు వచ్చినట్టు భావిస్తే వాటికి రీ టెండరింగ్కు వెళ్లాల్సిన అంశాన్ని పూర్తిగా విస్మరించారు.టెండర్ అంతా గోల్మాల్తాజాగా పౌరసరఫరాల సంస్థ స్టేజ్–1 టెండర్ల ప్లాట్ఫామ్ ఎంపికమైనా విమర్శలు వెల్లువెత్తు న్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ జమ్ (జీఈఎం) ద్వారా జిల్లాల్లో బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకు రవాణాకు టెండర్లు పిలిచారు. ఇందులో నాలుగు జిల్లాలకు టెండర్ ఖరారు చేశారు. మిగిలిన జిల్లాల్లో టెండర్లు రద్దు చేయగా.. ఈసారి జమ్ పోర్టల్ నుంచి కాకుండా మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోర్టల్ అయిన ఎన్ఈఎంఎల్ ద్వారా టెండర్లు పిలవడం వెనక అసలు గుట్టు ఉందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జమ్ పోర్టల్ తమకు ఎంతో సౌలభ్యంగా ఉందని, ఇందులో ఎటువంటి ప్లాట్ఫామ్ కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా టెండర్లు వేయగా.. ఎన్ఈఎంఎల్ ద్వారా ఒక్కో కాంట్రాక్టర్ సుమారు రూ.2.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పౌరసరఫరాల సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పి టెండర్ ప్లాట్ఫామ్ను మార్చినట్టు సమాచారం. మరోవైపు ఇక్కడ ఖరారైన టెండర్లకు అగ్రిమెంట్ల కోసం ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పంపకాల్లో గొడవలు రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది. -
మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం!
సాక్షి, నంద్యాల: కస్తూర్బా బాలికల వసతి గృహాలు, మోడల్ పాఠశాలలకు నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించిన టెండర్లలో అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మా ప్రభుత్వం.. మా ఇష్టం.. అంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో వారు చెప్పిన వారికే టెండర్లు కట్టబెట్టారు. నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బా బాలికల వసతి గృహాలు, 19 మోడల్ పాఠశాలల(మొత్తం 46)కు కిరాణా సరుకులు (ప్రొవిజన్స్), కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ సరఫరా చేయడం కోసం సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు గత డిసెంబర్ 21న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదికి ప్రొవిజన్స్కు రూ.6.43 కోట్లు, కూరగాయలకు రూ.1.75 కోట్లు, పండ్లకు రూ.96.49 లక్షలు, ఎగ్స్కు రూ.96.49 లక్షలు, చికెన్కు రూ.75.68 లక్షలుగా టెండర్లో పేర్కొన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. టెండర్ వేయొద్దని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగినప్పటికీ తుదకు ఇద్దరు టీడీపీ నేతలు సహా తొమ్మిది మంది టెండర్లో పాల్గొని.. ఒక కేజీబీవీ వసతి గృహం, ఒక మోడల్ స్కూల్కు కలిపి (నెలకు) కోట్ చేశారు. గత నెల 31న టెండర్ ఓపెన్ చేసిన తర్వాత రూ.2,71,731 ధరను కోట్ చేసి శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ ఎల్1గా నిలిచింది. అయితే తమ వారికి ఈ కాంట్రాక్టు రాకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎల్1గా నిలిచిన శ్రీ శ్రీనివాస ట్రేడర్స్కు 16, ఎల్4 శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్కు 15, ఎల్7 కేవీఆర్ ఆగ్రోస్కు 15 పాఠశాలల చొప్పున విభజించి కాంట్రాక్టు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించడం కలకలం రేపింది. జిల్లా పర్చేజింగ్ కమిటీ చైర్మన్ అయిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, టెండర్ ప్రక్రియనే మార్చేశారని టెండర్లో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. చికెన్ టెండర్ను ఓపెన్ చేయకుండానే కేవీఆర్ ఆగ్రోస్కు కట్టబెట్టారని, అసలు ఆ సంస్థకు అర్హతే లేదని చెబుతున్నారు. ఇలా ఏకపక్షంగా కేటాయించాలనుకున్నప్పుడు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ మాత్రమే సరుకుల సరఫరా ప్రారంభించగా, మిగతా రెండు సంస్థలు ఇంకా మొదలు పెట్టలేదు. టెండర్లలో అవకతవకల విషయమై జేసీ విష్ణు చరణ్ను సంప్రదించగా.. ఎల్1 కోట్ చేసిన మొత్తానికే తాము కూడా ప్రొవిజన్స్ సరఫరా చేస్తామని ఎల్4, ఎల్7లు ముందుకు రావడంతో అందరికీ కలిపి కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. చికెన్ టెండర్లో మిగతా వారంతా రింగ్ అయినట్లు తెలియడంతో అలా చేశామన్నారు. -
కిలోమీటర్కు రూ.53.88 కోట్లు!
మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు? సిమెంటు దగ్గర నుంచి స్టీలు, కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బేరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించిన మేస్త్రీకే వాటిని అప్పగిస్తారు. ఎందుకంటే అప్పు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి. తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృథా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి. ఎవరైనా సరే ఇలానే చేస్తారు. కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి.. ‘మీకింత.. మాకింత’ అంటూ కమీషన్లు దండుకునేందుకు రాజధాని రహదారుల పనుల్లో బరితెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతోంది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక కిలోమీటర్ పొడవున ఆరు లేన్ (ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు) జాతీయ రహదారిని సగటున రూ.20–22 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అదీ.. అన్ని రకాల పన్నులు అంటే జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో అదే ఆరు లేన్లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలి పోయిన పనులకు కిలోమీటర్కు గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను.. అదీ మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటర్కు గరిష్టంగా రూ.31.88 కోట్లు, కనిష్టంగా రూ.24.88 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.3,405.57 కోట్ల వ్యయంతో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా ఆ నోటిఫికేషన్లో నిబంధనలు పెట్టారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే సగటున 4 నుంచి 5 శాతం అధిక ధరలకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణం నుంచి కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి, వాటినే కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణాన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి దోచుకుంటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనాల్లో గోల్మాల్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 ప్రధాన రహదారుల పనులను ఏడీసీఎల్ చేపట్టింది. ప్రధాన రహదారుల్లో మిగిలిపోయిన పనులకు ఈ నెల 4, 9న టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించనుంది. ఆరు లేన్లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు(ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులకు అంచనా వ్యయాలను ఖరారు చేయడంలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు వరద నీటిని ఒడిసి పట్టడానికి, తాగునీటి సరఫరాకు, మురుగు నీటిని తరలించడానికి, భూగర్భ విద్యుత్ సరఫరా.. పంపిణీ, ఆర్సీసీ డక్ట్.. 220/33 కేవీ, 415 కేవీ విద్యుత్ తీగల ఏర్పాటుకు హెచ్డీపీఈ పైపు లైన్, ఆఫ్టికల్ పైబర్ కేబుల్కు, హెచ్డీపీ పైపు లైన్, సైకిల్ ట్రాక్, రహదారికి ఇరు వైపులా చెట్లు నాటడం తదితర పనుల్లో ఒక్క విద్యుత్ సరఫరా మినహా తక్కినవన్నీ ఇదే రీతిలో చేపడుతోంది.వాస్తవానికి ఎన్హెచ్ఏఐ.. జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి అన్ని రకాల పన్నులతో కలిపి ఆరు లేన్ జాతీయ రహదారి (సరీ్వసు రోడ్లతో కలిపి) నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.20–22 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ లెక్కన.. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ వ్యయం అంతకన్నా పెరగడానికి వీల్లేదు. ఎందుకంటే జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నులను అదనంగా కాంట్రాక్టు సంస్థకు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ నిబంధన పెట్టింది కాబట్టి. ఆ పన్నుల విలువతో భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థ, సైకిల్ ట్రాక్ తదితరాలను నిరి్మంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ గరిష్టంగా రూ.53.88 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంస్థలకే పనులు! ప్రధాన రహదారుల్లో మిగిలి పోయిన పనులకు సంబంధించి అంచనాల దశలోనే పలు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్య నేతలు బేరసారాలు జరిపారనే చర్చ అప్పట్లో సాగింది. నాలుగు సంస్థలు అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏడీసీఎల్ అధికార వర్గాలకు ముఖ్య నేతలు నిర్దేశించినట్లు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 11 రహదారుల పనుల టెండర్లలో ఒక్కో టెండర్లో నాలుగింటిలో మూడు సంస్థలు షెడ్యూలు దాఖలు చేసేలా.. కనిష్టంగా 4 నుంచి 5 శాతం అధిక ధరకు కోట్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. షెడ్యూలు దాఖలుకు తుది గడువు ముగిశాక, ఆరి్థక బిడ్ను తెరిచి కనిష్టంగా కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకే పనులు అప్పగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. -
బాబు పబ్లిసిటీకి వందల కోట్లు..! కొత్త ఏజెన్సీకి టెండర్లు
సాక్షి,విజయవాడ:చంద్రబాబు పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. దీంతో ప్రచారం తారాస్థాయికి వెళ్లడానికి కొత్త ఏజెన్సీ కావాలని ప్రభుత్వం భావించింది. తాజాగా న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.ఇప్పటికే సమాచార శాఖ ఉండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీ ప్రభుత్వం తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోకపోవడం వల్లే కొత్త ఏజెన్సీని ఆహ్వానించినట్లు ప్రభుత్వం చెబుతోంది.పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చెయ్యాలని డిసైడయ్యారు.ఇక నుంచి పబ్లిసిటీ కంటెంట్,ప్రకటనలు అన్ని పత్రికలు,మీడియా,సోషల్ మీడియాకు ప్రభుత్వం ఏజెన్సీ ద్వారానే ఇవ్వనున్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచారశాఖ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు -
వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం
-
ముందు డిజైన్లు..ఆపై టెండర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులకు చకాచకా అడుగులు పడుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గాలైన మునుగోడు, దేవరకొండకు నీరందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, రిజర్వాయర్ల భూసేకరణ, పరిహారం పూర్తి చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇందుకోసం ఏదుల నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకుంటారు. త్వరలోనే గ్లోబల్ టెండర్లుడిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడి నుంచి ఉల్పర వరకు నీటిని తరలించే పనులను రూ.1,800 కోట్లతో చేపట్టాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి త్వరలోనే గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్చానల్, అక్కడి నుంచి 2.525 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి, తొమ్మిది మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్, ఆ తర్వాత 3.050 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వుతారు. మొత్తంగా ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల తర్వాత నీరు దుందుభి నదిలోకి చేరి, అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్డ్యామ్కు చేరుతుంది. అయితే అక్కడ చెక్డ్యాం స్థానæంలో రబ్బర్ డ్యాం , దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బరాజ్ను నిర్మిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లపై సాగునీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే వాటిని ఖరారు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు పెండింగ్ పర్యావరణ అనుమతులు లేకుండానే చేపట్టిన డిండి పనులను ఆపేయాలని 2022 డిసెంబర్లో జాతీయ గ్రీన్ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు రూ.92.85 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు (ఈపీటీఆర్ఐ) అప్పగించింది. ఇంతవరకు అనుమతుల వ్యవహారం కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితుల సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ పథకానికి డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే వరకు కూడా డీపీఆర్లు ప్రభుత్వానికి అందలేదు. చివరకు 2015లో జూన్ 11వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి ఉత్తర్వులు (జీఓ 107) జారీ చేసింది. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 3.61 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అయితే పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ను ఆమోదించి, నిధులు కేటాయించి పనులను వేగంగా చేయించిన నాటి ప్రభుత్వం డిండి డీపీఆర్ను ఆమోదించలేదు. అయినా కొంత డబ్బు కేటాయించి 2015లో శివన్నగూడెంలో రిజర్వాయర్ల పనులను శంకుస్థాపన చేసి చేపట్టింది. ఉల్పరకు దిగువ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాలువ, డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్రోచ్ చానల్స్, సింగరాజుపల్లి, ఎర్రవల్లి–గోకారం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాలకు సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 12,052 ఎకరాల భూమినే సేకరించారు. భూసేకరణతో నిర్వాసితులు అయ్యే దాదాపు 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో నిర్వాసితుల ఆందోళన చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు సాధిస్తే అన్ని పనులు వేగిరం అవుతాయి. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
కొత్త మెట్రోలకు ఏప్రిల్లో టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్లో టెండర్లు పిలవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చిలోగా డీపీఆర్లు (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) పూర్తి చేసి, కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై సీఎం మంగళవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ), జేబీఎస్–శామీర్పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్–మేడ్చల్ మెట్రో (23 కి.మీ) మార్గాలకు సంబంధించిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్మెంట్ రూపొందించే సమయంలోనే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. మేడ్చల్ మార్గంలో జాతీయ రహదారిపై ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైంతన త్వరగా ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. శామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభం కావాలి శామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోటు నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్ను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్షిష్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. -
రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్ను తెరవనున్నట్లు తెలిపింది. -
ఉత్తర ‘రింగు’ ఇంకాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగానికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత రావటం లేదు. టెండర్లు పిలిచే నాటికే పరిహారం అందిస్తారని ఆశించినా, అందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.పరిహారం అందించిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఆదేశించారు. కానీ, ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్ పరిహారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. జాప్యమెందుకు? ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ చేపడు తున్న విషయం తెలిసిందే. ఈ భాగానికి టెండర్లు పిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంట్ను సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. డిసెంబరు చివరికల్లా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలుస్తారని ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగానికి అటవీ అనుమతులు కూడా వచ్చాయని ఆయన అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు. అవి రాకుండా అవార్డులు పాస్ చేసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు రావాలంటే, ఆ రోడ్డుకు నంబరు కేటాయించాల్సి ఉంటుంది. ట్రిపుల్ఆర్ ఎక్స్ప్రెస్వే కేటగిరీలో నిర్మిస్తున్నందున దానికి ఎక్స్ప్రెస్ వే నంబరు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నంబరు కేటాయించలేదు. ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయితేనే... దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలకు నంబర్లు కేటాయించాలంటే నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అనుమతివ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీ ఇంకా భేటీ కాలేదు. దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న రోడ్లన్నింటికి సంబంధించి ఒకేసారి నంబర్లు కేటాయించే కసరత్తు చేస్తున్నందున, అన్నింటికి కలిపి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నంబరు కేటాయింపులో జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు పరిహారం చెల్లింపులో ఆలస్యానికి కారణమైంది. ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి ప్రాథమిక అనుమతి లభించింది. సేకరించే అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఇది అనుమతిస్తుంది. దీని కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోపు అటవీశాఖకు పరిహారం, ప్రత్యామ్నాయ భూకేటాయింపు, అక్కడ చెట్ల పెంపకానికి అయ్యే వ్యయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కసరత్తు జరిగితేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి. అటవీశాఖ పూర్తి అనుమతులు, పర్యావరణ అనుమతులు రాకుండా కూడా టెండర్లు పిలిచుకునే వీలుంటుంది. కానీ, టెండర్లు తెరవాలంటే మాత్రం ఆ అనుమతులు వచ్చి ఉండాలి. ఇక పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే మాత్రం విధిగా పర్యావరణ అనుమతులు వచ్చి ఉండాలి. దాని విషయంలో జాప్యం పరిహారం అందకుండా చేస్తోంది. ఇప్పటికిప్పుడు రోడ్డు నంబరు కేటాయించినా, ఆ తర్వాత పర్యావరణ అనుమతుల జారీ కసరత్తు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెరసి మరో రెండుమూడు నెలల సమయం పట్టే వీలుందని వారు చెబుతున్నారు. -
విశాఖ–ఖరగ్పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్పూర్కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
రవాణా కాంట్రాక్టుల్లో ‘మనీ ట్రాన్స్ఫర్’!
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్పోర్టు టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల టెక్నికల్ బిడ్లో క్వాలిఫై అయినట్టు ప్రకటించిన కాంట్రాక్టర్లను మళ్లీ డిస్క్వాలిఫై చేయడం పెను దుమారం రేపింది. ఓ మహిళా మేనేజర్ నేతృత్వంలో ఈ కాంట్రాక్టులను అధికార కూటమి నేతల అనుంగులకు అప్పజెప్పేందుకు నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ బఫర్ గోడౌన్ల నుంచి మండల గోడౌన్లకు నిత్యావసరాలు రవాణా చేసేందుకు పిలిచిన ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ మేనేజర్, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కలిసి టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టించి, వీలైనన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్తోనే అనుకూలమైన వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత క్వాలిఫై చేసిన ట్రాన్స్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీని తర్వాత డిస్క్వాలిఫై చేసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ట్రాన్స్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురంలో స్టేజ్–1 ట్రాన్స్పోర్టు టెండర్లు వేసింది. రోజులు గడిచినా టెక్నికల్ బిడ్లో ఎటువంటి రిమార్క్ చూపించని అధికారులు ఫైనాన్షియల్ బిడ్కు వచ్చేసరికి సంస్థ నిర్వహకులపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఊహాజనిత సాకును చూపించి తొలుత కర్నూలు జిల్లాలో డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి, టెండర్లలో పాల్గొనేలా ఆర్డరు తెచ్చుకొంది.రీ టెండర్కు ఎందుకు వెళ్లట్లేదు?నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ వస్తే రీ టెండర్కు వెళ్లాలి. టెండర్లలో టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్కు వెళ్తాయి. సరైన పత్రాలు, అర్హతలు లేని టెండర్లు డిస్క్వాలిఫై అవుతాయి. ఇక్కడే అధికారులు చాకచక్యంగా చాలా జిల్లాల్లో ఫైనాన్షియల్ బిడ్కు అర్హత పొందిన టెండర్లు ఒక్కటే (సింగిల్) ఉండేలా చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటెండర్కు వెళ్లకుండా టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అయిన టెండర్లను కూడా కలిపి చూపించి, ఎక్కువ టెండర్లు వచ్చినట్టు మాయ చేస్తున్నారు. పోటీ ఉంటే షెడ్యూల్ ఆఫ్ రేట్ల (ఎస్వోఆర్) కంటే తక్కువ రేట్లకు కోట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బిడ్లో సింగిల్ టెండర్ ఉంటే అసలు పోటీనే ఉండదు. ఫలితంగా కాంట్రాక్టరు అధిక రేట్లను కోట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్–1 టెండర్లలోనూ ఎస్ఓఆర్కు మించి 20 నుంచి 25 శాతం అధికంగా రేట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సింగిల్ టెండర్లు ఖరారైతే పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని పట్టించుకోని ఆ మేనేజర్.. సింగిల్ టెండర్లను ఒకే చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో ట్రాన్స్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ టెండర్లు దాఖలు చేసిన నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, వైఎస్సార్లో జిల్లాల టెండర్లను టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్కు అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రాన్స్పోర్టు సంస్థకు సరైన ఫర్మ్ అంటూ లేదు. అసలు యజమాని పేరుపై ఒక్క వాహనం కూడా లేదు.ఆమెదంతా క్విడ్ ప్రోకోనే..ఈ టెండర్ల ప్రక్రియలో మహిళా మేనేజర్తో పాటు ఇటీవల బదిలీపై ప్రధాన కార్యాలయానికి వచ్చిన గ్రేడ్–1 ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆ ఉద్యోగికి టెండర్లతో సంబంధం లేకపోయినా, మేనేజర్కు సహకరిస్తూ ముడుపులు మూటగడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇలా సింగిల్ టెండర్లను ఖరారు చేయించేందుకు రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి తోడు ఆ మహిళా మేనేజర్ కోనసీమ జిల్లాకు డీఎంగా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో.. తూర్పుగోదావరి జిల్లాకు డీఎంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో మునుపటి స్టేజ్–1 టెండర్ కాంట్రాక్టర్, తాడేపల్లిగూడేనికి చెందిన కూటమి నాయకుడొకరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిగా ఆయనకు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సింగిల్ టెండర్ ద్వారా రవాణా కాంట్రాక్టును అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ సింగిల్ టెండర్లనే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. -
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
ఇసుకపై మాయోపాయం
సాక్షి, అమరావతి: ఇసుక ఉచితం అంటూనే డబ్బు వసూలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వకాలు అప్పగించే విషయంలోనూ నాటకాలకు తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సోమవారం జరిగిన గనుల శాఖ సమీక్షలో సూచించారు. కానీ ఇప్పటికే 80కిపైగా ఇసుక రీచ్లను ప్రైవేటు ఏజెన్సీల ముసుగులో తమ పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేశారు. రాష్ట్రంలోని 108 ఇసుక రీచ్లను దసరా పండుగ సమయంలో ప్రైవేటు వారికి అప్పగించేందుకు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలవారీగా ఇసుక కమిటీ ద్వారా షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఇచ్చి, తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైన వారికే ఇసుక కాంట్రాక్టులు అప్పగించేలా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు బెదిరించి వెనక్కు పంపారు. దాదాపు 80 రీచ్లను ఎమ్మెల్యేలకు చెప్పిన వారికి అప్పగించేయగా, మిగిలిన రీచ్లకు సైతం అనుకూలమైన వారిని ఖరారు చేశారు. అప్పగించిన రీచ్ల్లో ఈ నెల 16వ తేదీ నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 రీచ్ల్లో ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉల్లంఘనలు కప్పిపుచ్చేందుకే.. ప్రైవేటు వారికి అప్పగించే టెండర్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకేనని స్పష్టమవుతోంది. మరో వైపు ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా సూక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టేసి, వాటిల్లో తవ్వకాలు కూడా మొదలు పెట్టి.. బయటకు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇసుక రీచ్లను ప్రైవేటు వారికి అప్పగించే విషయం ఇంకా చర్చల దశలో ఉందని సీఎం చెబుతుండటం చూస్తుంటే, గ్రీన్ ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించేందుకేనని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్లో ఇసుక రీచ్లలో తవ్వకాలు చేపట్టకూడదు. సాధారణంగా నవంబర్ నెలాఖరు వరకు రీచ్లు ప్రారంభించకూడదు. కానీ అక్టోబర్ 7వ తేదీనే పలు జిల్లాల్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టులను ఖరారు చేశారు. 16వ తేదీ నుంచి తవ్వకాలు కూడా ప్రారంభించారు. కానీ ఇదంతా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధం కావడంతో, పైకి మాత్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క రీచ్ల్లో ఇసుక తవ్వకాలు సాగించి అడ్డగోలుగా అమ్ముకుంటూ.. పైకి మాత్రం అదేమీ లేదనేలా సీఎం స్థాయి వ్యక్తి నమ్మబలుకుతుండడం విస్తుగొలుపుతోంది. రీచ్లు ఇంకా ప్రారంభం కాలేదని చిత్రీకరించే క్రమంలోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని తేటతెల్లమవుతోంది. -
తమకు దక్కలేదని.. ఇసుక టెండర్లే రద్దు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు. జరిగింది ఇలా.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్లు కేటాయించారు. రీచ్లను పంచుకునేందుకు.. నాలుగు ఓపెన్ రీచ్లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు. అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు. నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా.. లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
వీళ్ళ దోపిడీకి నిదర్శనం.. లిక్కర్ టెండర్లపై వైఎస్ జగన్ సంచలన నిజాలు
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
ఉచిత ఇసుకకు ‘టెండర్’!
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి : ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్ చేసి రీచ్లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు. తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్ లోపలికి సైతం వెళ్లనీయలేదు. మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్ చేసే సమయంలో వారిని కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్కు టెండర్ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది. కర్నూలులో నోటిఫికేషన్ ఇవ్వకుండానేకర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వకుండానే టెండర్ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్ శాఖ వెబ్సైట్లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. ఒకే టెండర్ దాఖలైతే టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్ సిస్టం (డివైస్) బాగా లేదని, టెండర్ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు. పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది. 2, 3 రోజులే సమయం.. అంతా రహస్యంసరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్ ఇసుక రీచ్ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్ టెండర్లు పిలిచింది. ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్ టెండర్కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. -
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నక్క జిత్తులు.. కొత్త ఎత్తులు!
సాక్షి, అమరావతి : వంద రోజుల పాలనలో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు వ్యాఖ్యలు చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తాను అపవిత్రం చేశానన్నది సుప్రీంకోర్టు సాక్షిగా ప్రజలకు తేటతెల్లమవడంతో.. దాన్నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబునాయుడు మరోమారు టాపిక్ డైవర్షన్పై దృష్టి సారించారు. లడ్డూ గురించి మాట్లాడటం మానేసి.. దానికి సంబంధించిన టెండర్లు, డెయిరీలు, ధరలు, గతంలో జరిగిన సంఘటనలంటూ ఎల్లో మీడియాతో సరికొత్త కథనాలు వండివారి్పస్తున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఎలా మాట్లాడతారంటూ సుప్రీంకోర్టు నిలదీయడంతో బాబు అండ్ గ్యాంగ్కు ముచ్చెమటలు పట్టాయి. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది.ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై సీఎం ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు?’ అని గత నెల 30వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆ తరువాత సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాను ప్రజల్లో మరింత చులకన కాకూడదని ఓ వైపు పవన్ కళ్యాణ్, మంత్రులు.. మరో వైపు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ట్రాక్ మార్చేశారు. లడ్డూ పోయి టెండర్లొచ్చె.. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో చెబుతున్నా వినిపించుకోకుండా దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు ఆ నెయ్యి గురించి కాకుండా టెండర్లపై వివాదం సృష్టిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచే ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించింది. ఆ డెయిరీ జూలై 6, 12న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలడంతో.. వాటిని వెనక్కి పంపేసి, బ్లాక్ లిస్ట్లో పెడుతూ షోకాజ్ నోటీలిచ్చామని టీటీడీ ఈవో జూలై 23న ప్రకటించారు. ఆ వెంటనే టెండర్ల సమయంలో ఏఆర్ డెయిరీని పరిశీలించి.. పది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉందని నివేదిక ఇచ్చిన ఘీ నిపుణుల కమిటీ సభ్యులను టీటీడీగానీ ప్రభుత్వంగానీ విచారించి చర్యలు తీసుకోలేదు. అప్పుడే ఈ వ్యవహారంపై విచారించి.. చర్యలు తీసుకోకుండా టీటీడీ, ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా.. ఉత్తరాఖండ్ రూర్కిలోని బోలేబాబా డెయిరీ, తిరుపతికి సమీపంలోని వైష్ణవి డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసిందని కొత్త పల్లవి అందుకుంది. ఈ విషయమై ఎల్లో మీడియాతో కథనాలను వండివార్పిస్తోండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ ఒక్కటే కాదని.. గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన ఘటనలపై తాను పశ్చాత్తాప దీక్ష చేశానని ప్లేటు ఫిరాయించారు. సనాతన ధర్మం అంటూ.. కోర్టులు అంటూ ఇటు నుంచి ఎటో తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి లడ్డూను వివాదం చేసి.. వంద రోజుల పాలన, ఎన్నికల్లో ఇచి్చన హామీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లిద్దామనుకున్న చంద్రబాబుకు చేతులు కాలడంతో ఇప్పుడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని దారి మళ్లించాలని ఎత్తులు వేస్తున్నారు. -
హా‘హాకా’రాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది. ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు. పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు. మూలాలను మరిచిన ‘హాకా’.. రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబం భారీ అవినీతి
-
‘అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి’: KTR
హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు.‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.SCAM Alert - AMRUT Tenders I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tendersContracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024చదవండి: కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ -
అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్: అమృత్ టెండర్ల అంశంలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహల్లాల్ కట్టర్. టోచన్ సాహూలకు కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత బావమరిది సృజన్రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న సీఎం కుటుంబీకుల వ్యవహారంపైన నిజాలు నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ ేశారు. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని ఆరోపించారు. అమృత్ పథకంలో జరిగిన ప్రతీ టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ టెండర్ను సమీక్షించి, ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే టెండర్ల తాలూకా ప్రతీ సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైనా ఎంక్వయిరీ వేయాలన్నారు కేటీఆర్. ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా, స్పష్టత ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కేంద్రానికి కూడా భాగస్వామ్మం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు. -
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
మరమ్మతులకు తక్షణమే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్లైన్లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వట్టెం పంప్హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్హౌస్తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏది నిజం?: కూటమి ‘స్మార్ట్’ నాటకం!
‘అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేయలేక కుప్పిగంతులు వేస్తోంది. ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాలు, మోసాలతో మాయా నాటకాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తమకు గిట్టని అధికారులపై కక్ష సాధిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది.హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ విభాగాల్లో డబ్బులు లేవంటూ శ్వేతపత్రాల పేరుతో కాలం వెళ్లదీస్తోంది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఖజానా ఖాళీగా ఉందంటూ బేలతనాన్ని ప్రదర్శిస్తోంది. తాను అమలు చేయాల్సిన పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ మీటర్ల టెండర్లపై ఎల్లో మీడియాతో కలిసి విషం చిమ్ముతోంది’’సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చెల్లింపులు జరిగాయంటూ ‘స్మార్ట్ దోపిడీపై ఆడిట్’ శీర్షికన ఓ అసత్య కథనాన్ని సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు సోమవారం ప్రచురించింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా, న్యాయ సమీక్ష ద్వారా అనుమతి పొందిన టెండర్లపై అడ్డగోలుగా అసత్యాలు అచ్చేసింది. జరగని దోపిడీపై ఆడిట్కు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ చెప్పుకొచ్చింది.నిజానికి వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే టెండర్లు, ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థకు బిల్లులు చెల్లింపుల్లో గత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాయి. ఇందులో ఎలాంటి దాపరికం, నిబంధనల ఉల్లంఘన జరగలేదు. రైతులకు ఎప్పటికీ పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను హక్కుగా ఇచ్చేందుకు జరుగుతున్న యత్నాన్ని టీడీపీ మొదటి నుంచీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.స్మార్ట్ మీటర్లకు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, అన్నీ నిబంధన మేరకే జరిగాయని ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు గత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తప్పేముంది? అసలు ఈనాడు, చంద్రబాబు బాధేమిటో అర్ధం కాదు. బిల్లులు చెల్లిస్తే చెల్లించేశారంటూ ఏడుపు..! చెల్లించకపోతే ఇంకా చెల్లించలేదంటూ గగ్గోలు పెట్టడం ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.ఇంత పెద్ద వ్యవస్థలో తనిఖీ కష్టమా?నిర్ణీత సమయంలో ఎంత సామగ్రినైనా తనిఖీ చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ వ్యవస్ధకు ఉంది. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉద్యోగులున్నారు. ఇలాంటి తనిఖీల కోసమే ప్రతి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లో కన్స్ట్రక్షన్ విభాగం ఉంటుంది.అందులోని అధికారులు స్టోర్స్కి మెటీరియల్ రాగానే స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి పరికరం నాణ్యత ప్రకారం ఉందోలేదో తనిఖీ చేస్తారు. పరికరాల సంఖ్య కూడా లెక్కిస్తారు. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న తరువాత మాత్రమే బిల్లులను అకౌంట్స్ విభాగానికి సమర్పిస్తారు. కన్స్ట్రక్షన్ విభాగం నుంచి వచ్చిన బిల్లుల ఆధారంగా టెండర్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా అకౌంట్స్ విభాగం అధికారులు బిల్లులు మంజూరు చేస్తారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా, సక్రమంగా జరిగింది. అందువల్లే డిస్కంలు బిల్లులు చెల్లించాయి. న్యాయ సమీక్షకు టెండర్లు..ఏ సంస్థ అయినా స్మార్ట్ మీటర్ల బిడ్లలో పాల్గొనేలా నిబంధనలున్నాయి. స్మార్ట్ మీటర్ల టెండర్లను ఆహ్వానిస్తూ డిస్కంలు తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశాయి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టెండర్లలో అక్రమాలను అరికట్టడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్, న్యాయ సమీక్ష అనే విధానాలను ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేశారు. ఈ వినూత్న నిర్ణయాలతో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ న్యాయ సమీక్షకు వెళుతుంది. అక్కడ వెబ్సైట్లో 14 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో టెండర్ డాక్యుమెంట్లను ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలను తీసుకుంటారు.అదంతా ముగిసిన తరువాతే అనుమతి లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల టెండరు ప్రక్రియ ఏపీ–ఈ–ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా జరిగింది. ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగింది. అందువల్ల ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే దానికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చేశారనడంలో అర్ధం లేదు. ఒకసారి టెండర్ ఖరారయిన తరువాత అందులోని నిబంధనలు మార్చకూడదు. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. గతేడాది పిలిచిన టెండర్ నిబంధనలే ఈ ఏడాదీఉండాలని, ఒక టెండర్లో ఉన్నట్లుగానే మరో టెండర్లో నిబంధనలు పెట్టాలని ఏ చట్టం చెబుతుందో ఈనాడుకే తెలియాలి.రివర్స్ టెండరింగ్తో 15.75 శాతం తగ్గిన ధరవ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, మీటర్లు కాలిపోకుండా, రైతులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడటంతోపాటు మోటార్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ మీటర్లను రక్షణ పరికరాలతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కంలు టెండర్లను పిలిచాయి. ఎల్ 1గా నిలిచిన కాంట్రాక్టర్కు టెండర్ను అప్పగించాయి. అయితే టెండర్ ధర అధికంగా రావటాన్ని గమనించిన గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో తొలి టెండర్ రద్దు అయింది. అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్ల ధర మొదటిసారి కంటే 15.75 శాతం తగ్గింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశారు. ఇక మీటర్ గ్యారంటీ సమయం 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెంచడం వల్ల డిస్కంలకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. అంటే డిస్కంలకు ఆర్ధికంగా కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. అదీగాక ప్రతి టెండర్ నిబంధన న్యాయ సమీక్షకు వెళ్లింది. ఆ తరువాతే ఖరారైంది. అంతేకాకుండా ఏపీఈఆర్సీ అనుమతి కూడా పొందింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనగానీ, ఒకరికి ఉద్దేశపూర్వకంగా మేలు చేయడంగానీ లేదు.నిబంధన మేరకే బిల్లులు..గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యం డిస్కంలు చకచకా రూ.1,828 కోట్లు చెల్లించాయని సమాచారమంటూ ఈనాడు చెప్పుకొచ్చింది. వ్యవసాయ స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చులో ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘జి.ఓ.ఎం.ఎస్. 22, తేదీ:01.09.2020’ ద్వారా స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే డిస్కంలు టెండర్లు పిలిచాయి. తాము కాంట్రాక్టు సంస్థకు చెల్లించిన డబ్బును తిరిగి తమకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు గత ప్రభుత్వం అంగీకరించింది.ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. కూటమి ప్రభుత్వంగానీ ఈనాడుగానీ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. కాంట్రాక్టర్తో పని చేయించుకుని బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా డిస్కంలదే. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఇందులో ఏ తప్పూ లేదు. ఇదేమీ కొత్తగా జరిగిందీ కాదు. సంక్షేమ పథకాల ద్వారా వివిధ వర్గాలకు విద్యుత్ రాయితీలు అందించే ప్రభుత్వం ఆ మొత్తాన్నీ ముందుగా డిస్కంలు భరిస్తే, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేస్తుంటుంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన ఖర్చును డిస్కంలు ముందుగా భరించాయి. ఆ బకాయిలు రూ.8,845 కోట్లు కాగా వాటిని ఇవ్వకుండా నాడు చంద్రబాబు ఎగవేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తం బకాయిలను చెల్లించింది.రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థపై ఎందుకీ కక్ష?మూడు డిస్కమ్ల పరిధిలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు పొందిన షిర్డీ సాయి సంస్థ చిన్న సంస్థ ఏమీ కాదు. 25 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తూ సుదీర్ఘ అనుభవం, సామర్థ్యం ఉన్న కంపెనీగా పేరు పొందింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో 2022కిగానూ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా దక్కించుకుంది. ఎనర్జీ కన్జర్వేషన్ (ఇంధన పొదుపు) అవార్డును కేంద్రం నుంచి రెండు సార్లు అందుకుంది. అండర్ స్టాండింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్కు కూడా ఈ సంస్థ అర్హత సాధించింది.స్మార్ట్ మీటర్లతో జవాబుదారీతనంఒకప్పుడు వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్ల ద్వారా వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. విద్యుత్ సంస్థలు కెపాసిటర్లను విడతలవారీగా వినియోగదారులకు అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా ప్రభుత్వం జమ చేసేలా రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించింది. రైతులే ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని భావించింది.నాణ్యమైన విద్యుత్స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. వీటివల్ల ఆ ఖర్చు తప్పుతుంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు.కేంద్రమే చెప్పిందికేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డిఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్మీటర్ల ఏర్పాటు దేశంలోని అనేక రాష్ట్రాలతో జరుగుతోంది. ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకూ పూర్తవుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని, సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్కు అవకాశం ఉంటుందని తెలిపింది. -
ధరలు పెరిగేలోపే ‘దక్షిణం’ పనులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనుల టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికొచ్చాయి. టెండర్లు కాగానే ఉత్తరభాగం పనులు మొదలవుతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం దక్షిణ భాగంపై కూడా పడుతుంది. అక్కడా భూముల ధరలు పెరుగుతాయి. అప్పుడు, దక్షిణభాగంలో తమకు ఇచ్చే పరిహారం చాలదని, దానిని పెంచాలంటూ భూనిర్వాసితుల నుంచి డిమాండ్ వస్తుందన్న సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో దక్షిణభాగంలో జరుగుతున్న జాప్యాన్ని నిలవరించి..అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తాజాగా కేంద్రం కూడా సమ్మతించినట్టు తెలిసింది. పనులకు అడ్డంకిగా మారుతుందని.. ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేస్తారు. దీంతో భూనిర్వాసితుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురుకాగా, మిగతా ప్రాంతాల్లో సాఫీగానే సాగుతోంది. ఉత్తర భాగానికి సంబంధించి రూ.5200 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున భరించాల్సి ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే, దక్షిణ భాగంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దాని నిడివి మాత్రం ఎక్కువ. దీంతో అక్కడ దాదాపు రూ.6000 కోట్ల వరకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మరో రెండు మూడునెలల్లో ఉత్తర భాగం టెండర్ల దశకు చేరుకుంటుంది. కానీ, దక్షిణభాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. ఉత్తర భాగం టెండర్లు పూర్తయ్యేనాటికి స్థానికంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఉంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా.. దక్షిణ భాగంలో కూడా రింగ్ నిర్మాణం ఎలాగూ ఖరారైనందున, స్థానికంగా కూడా భూముల ధరలు అప్పటికి భారీగా పెరుగుతాయి. దీంతో అప్పటి భూముల ధరలకు తగ్గట్టుగా పరిహారం మొత్తం పెంచాలని దక్షిణ భాగం నిర్వాసితులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఉత్తర భాగంలో భూముల ధరలు పెరిగేలోపు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. భూ పరిహార భారం పెరిగితే, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రూ.17 వేల కోట్లతో రెండు భాగాలు పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లకు చేరేలా కనిపిస్తోంది. పరిహారం మరింత పెంచాల్సి వస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. దీంతో మరో మూడు నెలల్లోగా దక్షిణభాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
‘రింగు’ చెరిసగం!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు పనుల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చూసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెండర్ల దశకు చేరువలో ఉన్న ఉత్తరభాగాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇక అలై న్మెంట్ దశలోనే ఆగిపోయిన దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్న అంశాన్ని కేంద్రం పరిశీ లిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో నిర్వహించిన భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత్మాల పరియోజనలో చోటు దక్కకపోవటంతో..రీజినల్రింగ్ రోడ్డులో 162.4 కి.మీ నిడివి ఉండే ఉత్తరభాగాన్ని, 189.2 కి.మీ. నిడివి ఉండే దక్షిణభాగాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డులు పాస్ చేసే దశలో ఉంది. మరో రెండుమూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ జరగనుంది. కానీ, దక్షిణభాగానికి ఏడాది క్రితం అలైన్మెంట్ పూర్తయినా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ భాగానికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరగటం లేదు. నిజానికి ఈ రెండు భాగాలను భారత్మాల పరియోజన కార్యక్రమంలో చేర్చాల్సి ఉంది. ఉత్తర భాగాన్ని గతంలోనే ఆ జాబితాలో చేర్చారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించటం, భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో అగాధం ఏర్పడటంతో రోడ్డు ప్రక్రియలో జాప్యం జరిగింది. భారత్మాల పరియోజనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో రీజినల్ రింగురోడ్డును దాని నుంచి మినహాయించారు. దీంతో మిగిలిపోయిన 7500 కి.మీ. నిడివి గల ఎక్స్ప్రెస్వే పనులతోపాటు మరో 5000 కి.మీ. ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులను చేరుస్తూ 2047 సంవత్సరం లక్ష్యంతో కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.భారత్మాల పరియోజనలో చోటు దక్కిన వాటిని ముందు నిర్వహించి, రెండో ప్రోగ్రామ్లో ఉన్న వాటిని తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే నిధుల కేటాయింపు ఉంటుంది. రింగు ఉత్తరభాగాన్ని తొలుత భారత్మాలలో చేర్చినందున, దానిని అలాగే కొనసాగిస్తూ దక్షిణభాగాన్ని రెండో ప్రోగ్రామ్లో చేర్చారు. ఫలితంగా దక్షిణ భాగం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలే లేవు. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రమంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భాగాన్ని మరో రకంగానైనా చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించిన మీదట, పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్)ను పీడబ్ల్యూడీకి స్థానిక ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నది. ఈ విభాగం ద్వారా నిర్వహించే రోడ్డు పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నా, పనుల నిర్వహణ మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. భారత్మాల పరియోజన కింద కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం, రాష్ట్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్హెచ్ విభాగం ఆధ్వర్యంలో దక్షిణభాగం పనుల నిర్వహణ ఉంటుందన్నమాట. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. అదే జరిగితే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం పనులు ప్రారంభమైన వెంటనే ఎన్హెచ్ ఆధ్వర్యంలో దక్షిణభాగం పనులు పట్టాలెక్కుతాయి. ఆ విభాగానికి పెద్ద టాస్కే..రింగురోడ్డు దక్షిణ విభాగం పనుల అంచనా దాదాపు రూ.19 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్హెచ్ విభాగం ఇంత పెద్ద పనులు చేపట్టలేదు. దాదాపు 2500 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తక్కువ నిడివి ఉండే జాతీయ రహదారులను ఆ విభాగం చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు బాధ్యత వస్తే ప్రత్యేకంగా అంతర్గతంగా కొన్ని విభాగాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. -
HMDA: ఆమ్రపాలికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు! -
APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు. అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్లు పిలిచిన బస్ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్–2, నాన్ ఏసీ స్లీపర్–9, సూపర్ డీలక్స్–22, అల్ట్రా డీలక్స్–33, ఎక్స్ప్రెస్–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్ప్రెస్లు–3, సిటీ ఆర్డినరీ–5. -
2,002 ఎకరాల్లో బల్క్డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2,001.8 ఎకరాల్లో బల్్కడ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్్కడ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రూ.1,234.75 కోట్లతో బల్్కడ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో.. 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసిన పార్కులో 1,009.85 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595.4 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414.1 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్, 150 ఎకరాలు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. మార్చి 18 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించనున్నారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్్కడ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే.. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత కాకినాడ వద్ద నిర్మించడానికి ప్రయత్నం చేయగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు నక్కపల్లి వద్ద పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఫార్మాహబ్గా ఏపీ ఈ బల్్కడ్రగ్ పార్కుతో రాష్ట్రం ఫార్మాహబ్గా ఎదగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే 100కు పైగా ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిద్వారా 27,360 మందికి ప్రత్యక్షంగా ఉపాధికి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం 16 శాతం వాటాతో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.41,500 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వస్తుండగా.. అందులో రూ.8,300 కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. వైఎస్ రాజశేఖర్రెడ్డి 2,400 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ బల్్కడ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మంగంపేట గనులపై దొంగరాతలా?
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా రామోజీరావు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన చంద్రబాబుకు మేలు చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపైనా అడ్డగోలు రాతలు రాశారు. ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాన్ని శుక్రవారం ఈనాడులో అచ్చేశారు. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని నింపేశారు. అన్నమయ్య జిల్లా మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్ కాగా, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ – డబ్ల్యూ (వేస్ట్)’ గ్రేడ్లుగా ఉంటుంది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడవకుండా ఉండిపోయింది. దాని విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు పిలిచినా సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ వాస్తవం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ మతి లేని కథనాన్ని ఈనాడు ప్రచురించింది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వు ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టు రేటును పెట్టారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే. టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించడం విడ్డూరం. న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహనారాహిత్యాన్ని ఆ కథనంలో చూపించింది. రూ.100 కోట్లకుపైగా వ్యయం అయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఆ కథనాన్ని ప్రచురించినట్లు స్పష్టమవుతోంది. దుర్బుద్ధితోనే ఈ కథనం రాసినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం నాణ్యమైన బెరైటీస్తో పాటు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దోపిడీగా చిత్రీకరించడం దారుణం. ఈ తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ -
TS: ప్రజాభవన్లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
టీడీపీ హయాంలో చంద్రబాబు ఇంటి దగ్గరే అక్రమ తవ్వకాలు
-
Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్ టెండరింగ్ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్మీటర్లు బిగించే టెండర్ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది. ఇందులో భాగంగానే ‘స్మార్ట్గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్లు.. పూర్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది. దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాలను తగ్గించవచ్చు.. అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. మహారాష్ట్రతో పోలికేంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఇడీసీఎల్) సంస్థ పరిధిలో హెచ్వీడీఎస్ పథకం కింద వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు వాల్ మౌంటెడ్ ఎస్ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్ మీటర్ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్ మీటర్లను పోల్చడం సరికాదు. మీటర్లతో అందరికీ మేలు.. మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది. అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎండీలు వివరించారు. తెలియకపోతే తెలుసుకోండి.. విద్యుత్ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. ♦ స్మార్ట్ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విక్రాంత్ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. ♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్ డేటా ఆన్లైన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. ♦ ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసులకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ♦ మీటర్ రీడింగ్లో సర్వే, జీఎస్ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్కార్డ్ రెంటల్, నెట్వర్క్ కాస్ట్, ఆపరేషన్–మెయింటినెన్స్ వంటి సేవలను పొందుపరిచారు. ♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్వర్క్ హెచ్చుతగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. ∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం. -
సాంకేతిక నిపుణుల సూచనలతో పోలవరం పనులు
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దిశానిర్దేశం చేశారు. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని పది రోజుల్లోగా ఖరారు చేసి, పనులకు నిధుల సమస్య లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయడానికి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులను ఖరారు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్యామ్ డిజైర్ రివ్యూ ప్యానల్ (డీడీర్పి) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందర్ సింగ్ వోరా, పీపీఏ చైర్మన్ శివ్నందన్కుమార్, సభ్య కార్యదర్శి రఘురాంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల కమిటీ కోసం పీపీఏ టెండర్లు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చేందుకు చేస్తున్న పనులను వివరించారు. ఒక స్టోన్ కాలమ్ 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 2.30 గంటలు పడుతోందని, దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. స్టోన్ కాలమ్స్ వేయడంలో సహకరించేందుకు, డిజైన్లను రూపొందించేందుకు వేస్తామన్న నిపుణుల కమిటీని ఇప్పటిదాకా నియమించలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్లో జాయింట్లను అతికించడంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్ వేయడంలో దేశంలో నిపుణుల కొరత ఉన్నందున, టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పీపీఏ ఛైర్మన్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కమిటీగా ఏర్పడి ఈ టెండర్లో పాల్గొంటారన్నారు. ఆ టెండర్ను ఖరారు చేసి నిపుణుల కమిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆలోగా డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సహా హెడ్ వర్క్స్లో చేయాల్సిన పరీక్షలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో చేయించి, నివేదిక సిద్ధంగా ఉంచాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ పరీక్షల కోసం స్వీడన్కు చెందిన ఆఫ్రిన్ అనే సంస్థతో కాంట్రాక్టు సంస్థ మేఘా ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహాతోనే డయాఫ్రమ్ వాల్ ఆఫ్రిన్ సంస్థ పరీక్షల నివేదిక ఆధారంగా పీపీఏ ఖరారు చేసే నిపుణుల కమిటీ స్టోన్ కాలమ్స్ను వేగంగా వేయడంపై సలహాలు ఇస్తుంది. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దానికే మరమ్మతలు చేయాలా లేదంటే సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలా అనే అంశంపై సూచనలు చేయనుంది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
నిమ్స్కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
కిక్కే కిక్కు.. తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి.. అత్యల్పంగా నిర్మల్ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా.. రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి. టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది. -
పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. మీటర్ల ధర ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా కొందరికి టెండర్లు కట్టబెట్టారని, ఈ ఖర్చంతా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తారని పచ్చ పత్రికలు, విపక్షాలు చేస్తున్న తప్పు డు ప్రచారంపై వారు స్పందించారు. వారు శని వా రం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టెండర్లలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అనుమతి తీసుకొన్న తరువాత ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ పో ర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. దే శంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనేలా టెండర్ల ప్రక్రి య పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశా రు. వారు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే.. స్మార్ట్ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదానీ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. ఒక్కో వ్యవసాయ సర్వీసుకు, అనుబంధ పరికరాలతో కలిపి రూ.11,191.64 మాత్రమే. పన్నులతో కలిపి మొత్తం రూ.13,334.88 ఖర్చవుతుంది. స్మార్ట్ మీటర్ల ధరను మాత్రమే కేంద్రం రూ.6 వేలతో అంచనా వేసింది. ఒక్కో మీటరు వ్యయం రూ.36,700కు కొంటుందనడంలో వాస్తవం లేదు. ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్స్ కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లను దాఖలు చేశారు. మీటరు బాక్స్తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు యథాతథంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఏ విధమైన ట్రూ అప్ చార్జీలు వసూలు చేయరు. ఉత్తరప్రదేశ్లోని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ మీటరుకు రూ.10 వేలు చొప్పున సింగిల్ ఫేజ్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తోంది. వీటికి ఎటువంటి అనుబంధ పరికరాలూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం అన్ని పంపుసెట్లకు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్మార్ట్ మీటరుకు ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా ధర ఖరారు కాగా వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్వే. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్ మీటర్లే. అయినప్పటికీ ఇక్కడ 93 నెలలకు నెలకు రూ.194 మాత్రమే చెల్లిస్తారు. -
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ
-
ఒక ఎంపీ అడిగితే వివరాలివ్వకపోవడమేంటి..?: హైకోర్టు
-
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2 వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు. చదవండి: లిక్కర్ స్కాం: కల్వకుంట్ల కవిత పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం
పాఠశాలలు ప్రారంభించి 15 రోజులవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే కొన్ని చాప్టర్లకుసంబంధించిన పాఠాలు పూర్తయ్యాయి. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క పాఠం కూడా ఉపాధ్యాయులు బోధించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే... ఇప్పటికీ 15 వేలకు పైగా స్కూళ్ళలో ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో జూలై నెల ప్రారంభమైనా ఇంకా పునఃశ్చరణకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ హెచ్ఎంలకు బిల్లులు ఇవ్వకపోవడంతో.. వాస్తవానికి స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే పుస్తకాల ముద్రణపైనా దృష్టి పెట్టారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను స్కూళ్ళు తెరిచేలోగానే జిల్లా కేంద్రాలకు పంపారు. కానీ వాటిని వేసవి సెలవులు ముగిసేలోగా స్కూళ్ళకు చేరవేయడంలో సర్కారు విఫలమయ్యింది. ప్రతి ఏటా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్ళకు పుస్తకాలు చేరవేసే వాళ్ళు. ఇందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేది. అయితే గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో హెచ్ఎంలు ఈ ఏడాది మొండికేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం వరకు పుస్తకాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో రవాణా కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని విద్యాశాఖ ఆదేశించినా, ఈ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అయ్యింది. టెండర్ల ఖరారులో ఆలస్యం.. పుస్తకాలను స్కూళ్లకు రవాణా చేసేందుకు ప్రతి జిల్లా డీఈవో పరిధిలో టెండర్లు పిలిచారు. అయితే స్కూళ్ళు తెరిచిన తర్వాత టెండర్లు పిలవడంతో వాటిని ఖరారు చేసేవరకే జూన్ నెలాఖరు అయ్యింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. పుస్తకాల రవాణా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని టెండర్లు దక్కించుకున్న సంస్థలు చెబుతున్నాయి. పంపిణీ పూర్తయినా కొరతే.. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, 1,57,48,270 పుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించి, జిల్లా కేంద్రాలకు కూడా చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వాటి పంపిణీ పూర్తి చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత తప్పేట్టు లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చే నెలాఖరు వరకూ కూడా పుస్తకాలు అందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలి.. పుస్తకాల పంపిణీ ఆలస్యమై ఇప్పుడిప్పుడే పాఠశాలలకు చేరుతుండటంతో.. ప్రస్తుతం చాలావరకు ప్రాథమిక పాఠశాలల్లో గతేడాది మొదలు పెట్టిన తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలు, హైస్కూల్స్లో పునఃశ్చరణ చేస్తున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన అభ్యసన నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రక్రియ అనివార్యమని విద్యాశాఖ భావించింది. అయితే దీన్ని అదనపు గంటల్లో చేపట్టి, రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?
టీమిండియా క్రికెట్కు త్వరలోనే కొత్త స్పాన్సర్షిప్ రానుంది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా లీడ్ స్పాన్సర్స్ హక్కుల కోసం రూ. 350 కోట్ల బేస్ప్రైస్తో టెండర్లకు ఆహ్వానించింది. బీసీసీఐ జూన్ 14న టెండర్లను రిలీజ్ చేసింది. పోటీకి వచ్చే సంస్థలకు జూన్ 26 వరకు టెండర్లను దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే రూ. 350 కోట్లను బేస్ప్రైస్గా బీసీసీఐ నిర్ణయించడం ఆసక్తి కలిగించింది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియాకు స్పాన్సర్స్గా వ్యవహరించినప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి. కాగా టీమిండియా ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ తక్కువ ధరకే స్పాన్సర్షిప్ కోసం టెండర్లను పిలవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు సమాచారం. ఖర్చును తగ్గించుకునే పనిలోనే బీసీసీఐ స్పాన్సర్షిప్ కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. ''లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు'' అంటూ అభిప్రాయపడ్డారు. చదవండి: హరారే స్పోర్ట్స్క్లబ్లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన -
టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి
నారాయణపేట: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి రెండు సార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అధికారులు ఎటూ తేల్చలేక ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. మత్య్సకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్ దిశానిర్దేశంతో జిల్లా మత్య్సశాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధంచేసి టెండర్లకు పిలుపునిచ్చింది. కానీ ఎవరూ చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఽనిర్ణయించిన ధరలకు వ్యాపారస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష నియమించిన టెండర్ల కమిటీ చైర్మన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మెంబర్, కం కన్వీనర్గా జిల్లా మత్య్సశాఖ అధికారి రానాప్రతాప్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను ఈ ప్రొక్య్రూట్మెంట్ను ఈనెల 12న ఓపెన్ చేసి చూడగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా మత్య్స శాఖ అధికారులు పంపించినట్లు తెలుస్తోంది. గడువు పెంచినా.. చేపపిల్లలను సరఫరా చేసేందుకు గతనెల 5న బిడ్ కాలింగ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్ డాక్యుమెంట్ను గతనెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు తొలిసారిగా మే 30 గడువు విధించారు. అప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో మరోసారి గడువును జూన్ 12వరకు పెంచింది. అయినప్పటికి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం టెండర్లను ఓపెన్ చేయడంతో స్పష్టమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చేప పిల్లలను పంపిణీ చేయలేమని బహిరంగంగానే కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధరకు గిట్టుబాటు కాదనే ముందుకు రావడంలేదని సమాచారం. ధరలు పెరిగేనా.. టెండర్లు అయ్యేనా? ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాక కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ధరలు పెరుగుతాయనేది కష్టమే అనిపిస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ట్రాన్స్ఫోర్ట్ ఖర్చులతో పాటు విత్తనోత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపపిల్లల వ్యాపారస్థులు ఏకమై ఎక్కడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచకపోతే సకాలంలో టెండర్లు అయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది. రూ.1.78 కోట్లతో ఆహ్వానం.. ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. పెద్దసైజు చేపపిల్లలు (80–100 ఎంఎం) 81.03 లక్షల చేపలకు గాను రూ.1.22 కోట్లు నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న వారు బొచ్చ40 శాతం, రోహు 50 శాతం, మ్రిగాల 10శాతం చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చేపపిల్లలకు (45–40 ఎంఎం) ధర రూ.56.17 లక్షలు నిర్ణయించి టెండర్లకు పిలిచింది. అయితే టెండర్లు వేసే వ్యాపారస్తులు 106.29 లక్షల చేపపిల్లలను (బొచ్చ 35శాతం, రోహు 35శాతం, బంగారుతీగ 30శాతం చొప్పున) సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేయలేదు.. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో టెండర్లు వేసేందుకు ఈనెల 12తో గడువు ముగిసింది. అయితే టెండర్లు ఎవరూ వేయలేదు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – రానాప్రతాప్, జిల్లా మత్య్సశాఖ అధికారి, నారాయణపేట 2020 నుంచి చేప పిల్లల ధరలు ఇలా.. చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో జిల్లాలోని 590 చెరువులు, మూడు రిజార్వాయర్లో వదిలేందుకు కావాల్సిన 1.60 కోట్ల చేపపిల్లల(సీడ్స్)ను రూ. 96.10 లక్షలతో కై కలూరి నుంచి కోనుగోలు చేసింది. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ. 1.04,000 చొప్పున 40లక్షలు కొనుగోలు చేయగా, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు 45,786 చొప్పున 1.20 కోట్లు కొనుగోలు చేసింది. ● 2021లో సంవత్సరంలో 1.84 కోట్ల చేప పిల్లలను చేసేందుకు టెండర్లు పిలువగా వనపర్తి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి రూ.1.49 కోట్లకు టెండర్లు వేసి సరఫరా చేశారు. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ.1.58,000 చొప్పున 43లక్షల చేప పిల్లలకు గాను రూ.67,46,600లు, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు.. లక్ష పిల్లలకు 58వేల చొప్పున రూ1.41 కోట్ల చేప పిల్లలకుగాను రూ. 82,24,980లకు సరఫరా చేశారు. ● 2022 లో టెండర్లు వేసిన వారిలో ఎల్–1 తప్పుకోవడంతో మిగతా నలుగురు కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. చేపపిల్లలను పంపిణీ చేసిన వారిలో పద్మనాగ భూని నాగ వెంకటసూర్య సతిస్ రాజ్కుమార్ కై కలూరు (ఏపి) 35–40 ఎంఎం రూ.43,800, 80–100 ఎంఎంకు రూ.1,33,650కు ఎల్2గా టెండర్ దక్కించుకున్నారు. అయితే టెండర్లలో పాల్గొన్న మరో ముగ్గురు సైతం రాజ్కుమార్తో కలసి (అక్వా స్పార్క్ హచారీ నర్వ మండలం ఉందేకోడ్కు చెందిన వ్యాపారి, డి.శివకుమార్ ఆత్మకూర్ మండలం అరెపల్లికి చెందిన వ్యాపారి) చేప పిల్లలను పంపిణీ చేశారు. -
అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. ఈనాడు తీరిదే! ఖరారుకాని టెండర్లపై కట్టుకథ
సాక్షి, అమరావతి: అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్నట్లుంది ఈనాడు తీరు. అసలు టెండర్లే ఖరారు కాని స్మార్ట్ మీటర్లపై అప్పుడే ప్రజలపై భారం మోపేసినట్లు ఇష్టారాజ్యంగా కట్టుకథలు అల్లేస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో దాదాపు 1.96 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలకు, ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల మీటర్లకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో తొలివిడతలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,04,864 స్మార్ట్ మీటర్లు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 9,77,288 స్మార్ట్ మీటర్లు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 9,85,894 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. అవికూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఈనాడు మాత్రం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల సర్వీసులన్నింటికీ స్మార్ట్మీటర్లు పెట్టి, ప్రతినెలా గృహ వినియోగదారులపై నెలకు రూ.153.40 భారం మోపనున్నారని అదానీ ‘స్మార్ట్’ షాక్ అంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఈనాడు రాసిన అబద్ధాల వెనుక అసలు నిజాలు ఇవీ.. ఆరోపణ: స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.29 వేల కోట్ల భారంవేసి, భారీగా బాదేసేందుకు సిద్ధమైంది. వాస్తవం: ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. పదేళ్ల పాటు స్మార్ట్మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అంచనా వేశాయి. అది వదిలేసి రూ.29వేల కోట్లని కాకిలెక్కలతో పచ్చపత్రిక పిచ్చిరాతలు రాసింది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలలో భాగంగా డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా 2025 నాటికి ప్రతి విద్యుత్ సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు స్మార్ట్మీటర్స్ అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు నిబంధన విధించాయి. ఈ ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డిస్కంలు ఈ పనులు చేపట్టాయి. ఏదో ఏపీ మాత్రమే చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఇది. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారంలేకుండా స్మార్ట్మీటర్ల ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది. దానితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఖరారుచేసిన రేట్లను దృష్టిలో పెట్టుకుని, నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకున్న తరువాతే టెండర్లు ఖరారుచేస్తారు. ఈ విషయాన్ని దాచి, టెండరు ఖరారు కాకుండానే ప్రతినెలా రూ.153.40 భారం అని ప్రచురించటం పూర్తిగా అవాస్తవం. ఆరోపణ: టెండర్ల వివరాలను డిస్కంలు అత్యంత రహస్యంగా ఉంచాయి. వాస్తవం : ప్రస్తుత టెండర్లను 42 లక్షల మీటర్లకు మాత్రమే డిస్కంలు పిలిచాయి. ఇందులో వినియోగదారుల మీటర్లతో పాటు ఫీడర్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్) మీటర్లు, ఎల్టీ, సీటీ మీటర్లు, సీటీ, పీటీ మీటర్లు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించిన తరువాతే ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలిచింది. ఇందులో టెండర్ల వ్యవహారం గుట్టుగా జరిగిందేమీలేదు. ఆరోపణ : ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాస్తవం : స్మార్ట్మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగం, ఇతర సర్వీస్ వినియోగ వివరాలను ఆన్లైన్ ద్వారా రియల్ టైం డేటాను పొందే సౌలభ్యం ఉంటుంది. అందువల్ల మీటర్ రీడింగ్ లను మనుషుల అవసరం లేకుండా తీసుకోవచ్చు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం ద్వారా విద్యుత్ నష్టాల తగ్గింపు, బిల్ తీసేందుకు అయ్యే ఖర్చులో మిగులు, ముందుస్తు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా మిగిలిన దాని నుంచే గుత్తేదారు సంస్థకు డిస్కం నేరుగా ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వినియోగదారులు ఆఫ్ పీక్ సమయాలలో విద్యుత్ను ఉపయోగించినప్పుడు అదనపు రాయితీని పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకుని అవసరమైన మేర రీచార్జ్ చేసుకోవటం ద్వారా పొదుపును పాటించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారునికీ స్మార్ట్మీటర్ అమర్చాలని నిబంధనలున్నా, రాష్ట్రంలో మన డిస్కంలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఆర్డీఏ మీటర్ల ద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉండడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాటిని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుంచి మినహాయించాయి. ఇవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే. -
Hyderabad Metro: ‘ఎయిర్పోర్టు మెట్రో’కు గ్లోబల్ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్ఏఎంఎల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టు అంచనా రూ 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వియస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్లను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. భూసామర్థ్య పరీక్షల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కొత్త సర్వే ప్రకారం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టేషన్ వరకు దూరం 31 కి.మీ. ఉంది. ఇందులో 29.3 కి.మీ. ఆకాశమార్గం (ఎలివేటెడ్) కాగా. అండర్గ్రౌండ్లో 1.7 కి.మీ పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్కు ఆనుకొని ఒక భూగర్భ మెట్రో స్టేషన్తో కలిపి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. ఆఖరు తేదీ జూలై 5 ఎయిర్పోర్టు మెట్రో రైలు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సంస్థలు జూలై 5లోగా టెండర్ పత్రాలను తెలంగాణ ప్రభుత్వ ఇ–పోర్టల్ https://tender. telangana.gov.in లో అప్లోడ్ చేయాలి. విమానాశ్రయ మెట్రో కారిడార్కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. శివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ విలువ, ప్రాజెక్టు వ్యయం వేర్వేరు ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6,250 కోట్లు కాగా, ప్రస్తుతం రూ,5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. దీనిపై ఎన్విఎస్ రెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ భిన్నమైనవని చెప్పారు. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టిమోడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయన్నారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడా ఉన్నట్లు స్పష్టం చేశారు. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
సీనరేజి వసూళ్లపై వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే ‘ఖనిజాల సీనరేజి వసూళ్లు ప్రైవేటుపరం’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచేలా పూర్తి అవాస్తవాలతో అందులోని రాతలు ఉన్నాయంటూ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి, అలసత్వాన్ని పూర్తిగా తొలగించాలనే మంచి ఉద్దేశంతో పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనుల శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలు పెరిగాయన్నారు. తద్వారా అటు ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ, ఇటు పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల లభ్యత, పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఆ ప్రకటనలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. అధ్యయనం తరువాతే.. ఇతర రాష్ట్రాలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా మైనింగ్ రెవెన్యూలో స్థిరత్వం, పురోగతి సాధిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలతో గనుల శాఖకు చెందిన మైనింగ్ అధికారులు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని నివేదించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనరేజి వసూళ్ల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మైనింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్–2017కు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వు ధర, సరళమైన నిబంధనలను అమలులోకి తెస్తూ టెండర్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలతో నిర్వహించిన టెండర్లలో 5 జిల్లాలకు టెండర్లు ఖరారయ్యాయి. మొదట సాంకేతిక బిడ్ను పరిశీలించి అందులో అర్హులైన వారిని మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. కోట్ చేసిన వాటిలో అధిక మొత్తం నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ ఎవరైతే కోట్ చేస్తారో వారికే టెండర్ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుంటే ‘ఈనాడు’ పనిగట్టుకుని అబద్ధాలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్లలో ‘ఈనాడు’ పాల్గొనవచ్చు టెండర్లలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల అర్హతలను మాత్రమే గనుల శాఖ పరిశీలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈనాడు పత్రికకు కనీసం ఈ విషయం తెలియకపోవడం బాధాకరం. ఆసక్తి ఉంటే ఈ టెండర్లలో ఈనాడు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం . రాష్ట్రంలో ఖనిజాలను రవాణా చేసే వాహనాలను ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సీనరేజి వసూళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ పెరుగుతుంది. మైనింగ్పై పటిష్ట పర్యవేక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ బృందాన్ని నియమించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇంత మంచి విధానాన్ని అమలు చేస్తుంటే అవగాహన లేకుండా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలను ప్రచురించడం సరికాదు. -
ఫేమ్ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్టును అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం సకాలంలో బస్సులు రోడ్డెక్కకుండా చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికల్లా 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విషయం కోర్టుకు చేరటంతో బస్సులు రావటానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తాజాగా ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద 10 వేల బస్సులను రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణకు 300 బస్సులు మంజూరయ్యాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో ఎల్–1(తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీ)గా వచ్చిన కంపెనీకి ఎక్కువ బస్సులు సరఫరా ఉన్న రాష్ట్రాల బాధ్యత అప్పగించింది. ఎల్–2గా ఉన్న కంపెనీ జాబితాలో తెలంగాణ ఉంది. కాగా ఎల్–2గా ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో వివాదం తలెత్తింది. ఆ కంపెనీ కోర్టుకు వెళ్లటంతో.. తొలుత టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు ఓ కంపెనీ బిడ్కు అర్హమైంది కాదని భావించిన అధికారులు దాన్ని తిరస్కరించారు. నిజానికి ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ప్రకారం ఎల్–2 స్థానంలో అదే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారించారు. దీనికి తెలంగాణకు బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఇంతలో అన ర్హమైందిగా అధికారులు తేల్చిన కంపెనీ కోర్టును ఆశ్రయించిందని, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత ఎల్–2గా నిర్ధారించిన కంపెనీకే బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆ కంపెనీతో చర్చించే సమయంలో, కేంద్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావద్దని, తాము కోర్టు తీర్పును సవాల్ చేయబోతున్నామని చెప్పినట్టు సమాచారం. త్వరలో 500 అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.. ఫేమ్–2 పథకం బస్సుల పరిస్థితి ఇలావుండగా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టెండర్లలో రెండు బడా కంపెనీలు పాల్గొన్నాయి. టెక్నికల్ బిడ్ ఓకే అయింది. ఫైనాన్షియల్ బిడ్లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇవ్వనున్నారు. మరో నెలరోజుల్లో ఈ బస్సుల రాక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న ఆర్థిక బిడ్ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు. గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు. -
స్మార్ట్ మీటర్లపై ‘పచ్చ’ పత్రిక అసత్య కథనాలు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ‘విద్యుత్ వినియోగంపై ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లపై అసత్య కథనాలు వల్లించి, విష ప్రచారం చేసి, టెండర్లకు ఎవరినీ రానీయకుండా చేయడమే ఈనాడు యాజమాన్యం లక్ష్యమా? ఆరోపణలు చేసే వారు టెండర్లు దాఖలు చేయండి.. ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది’ అంటూ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనాడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు మండలం కురప్పల్లెలో గురువారం తొలిరోజు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్టీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈనాడులో రాసిన మేరకు షిరిడీసాయి ఎలక్ట్రికల్ వర్క్స్వారికి పనులు అప్పగించామని, సాధారణ మీటర్ల ధరతో పోల్చితే అధికంగా ఉందనడం బాధాకరమన్నారు. ఈనాడు పత్రిక తనకు నచ్చిన వారితో టెండర్లు వేసుకోవాలన్నారు. టెండర్లు జరగకుండా పనులు కేటాయించే ప్రసక్తే లేదని చెప్పారు. తెలిసీతెలియకుండా రాయడం మంచిదికాదని, ఇలాంటి విషయాల్లో తగిన సమాచారం సేకరించి వార్తలు రాస్తే బాగుంటుందని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
Fact Check: స్మార్ట్గా ‘పచ్చ’ అబద్ధాలు! ‘ఈనాడు’ రాసిన మరో దిగజారుడు కథనం
సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఇంధన శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? మరి ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఆపటమేంటి? అసలు ఇలాంటి కథనానికి అర్థమేమైనా ఉందా? ‘స్మార్ట్ మేతకు ఎత్తు’ అంటూ గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే, ‘ఇంధన, ఆర్థిక శాఖలు తీవ్ర అభ్యంతరం’ వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఫలించలేదన్నది వార్త సారాంశం. స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తగిన వివరణ ఇవ్వాలంటూ డిస్కంలకు ఇంధనశాఖ కార్యదర్శి మూడు నెలల క్రితం రాసిన లేఖల అర్థ్ధాన్నే మార్చేసి... ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా కథనాన్ని వండేసింది. విచిత్రమేంటంటే టెండర్లను పిలిచింది ప్రభుత్వమే. శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన మీదట... అక్కడ దాదాపు 20 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. పైపెచ్చు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) చంద్రబాబునాయుడు ఏకంగా రూ.21,000 కోట్ల అప్పుల్లో ముంచి దిగిపోవటంతో వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. వాటిని గాడిలో పెట్టాలంటే వాటికీ కాస్త జవాబుదారీ తనం పెరగాలి. మరోవంక మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్లకు చెల్లిస్తారు. వారికి నాణ్యమైన విద్యుత్తును అడిగే హక్కుంటుంది. ఈ కారణాలతో స్మార్ట్ మీటర్లకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే కోవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని... ప్రతి వస్తువు ధరా దారుణంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అప్పట్లో పిలిచిన టెండర్లు కావటంతో.. ముందుకొచ్చిన కంపెనీలు అప్పటికి తగ్గట్టు రేట్లు కోట్ చేశాయి. రకరకాల కారణాలతో టెండర్లు ఆలస్యం కావా? చివరకు కోవిడ్ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గుముఖం పట్టాయి. ఇది గమనించబట్టే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి... ప్రస్తుత ధరలతో పిలిస్తే కొంత ఆదా అవుతుందని భావించింది. అందుకే ప్రభుత్వమే టెండర్లను రద్దు చేసింది. మరి దీన్లో కుంభకోణమేంటో.. ప్రభుత్వమే స్కామ్ చెయ్యబోతే దాన్ని ఇంధన శాఖ ఆపేయటమేంటో... రామోజీరావే చెప్పాలి. ఇప్పుడైనా మీరు టెండర్లు వేయొచ్చు కదా? ప్రతిసారీ ప్రభుత్వం చెబుదున్నదొకటే. పనికిమాలిన ఆరోపణలు చేసే బదులు... అలాంటి టెండర్లలో మీరూ పాల్గొనవచ్చు కదా... అని!!. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దాన్లో ఎవరైనా పాల్గొనవచ్చు.ఎవరు తక్కువకు కోట్చేస్తే... వారికే పని దక్కుతుంది. రకరకాల రాష్ట్రాల పేర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎంత తక్కువో చెబుతున్న రామోజీరావు... వారితో ఒప్పందం చేసుకుని తానే టెండర్లు వేయొచ్చు కదా? లేకపోతే రామోజీకి తందానతాన పలికే చంద్రబాబునాయుడే టెండర్లు వేయొచ్చు కదా? మీరు తక్కువ కోట్ చేస్తే మీకే వస్తుంది కదా? ఎందుకీ పనికిమాలిన ఆరోపణలు?. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ... వీటి ఏర్పాటుకు రకరకాల నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలకు లోబడే ఎవరైనా చెయ్యాలి. అలాంటి వాస్తవాలు రాయనే రాయరు. ఇంకా ‘ఈనాడు’ రాసిన ఈ దిగజారుడు కథనంలో అసలు నిజాలేంటంటే... ఆరోపణ: ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్ (3 ఫేజ్)కు రూ.3,500 వ్యయం వాస్తవం: ఇది పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ మీటర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనికితోడు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటం కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే నిర్వహణ వ్యయంలో మాత్రం 40 శాతాన్ని కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని ఏడేళ్ల వ్యవధిలో చెల్లిస్తుంది. కానీ మొత్తం 100 శాతాన్నీ కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటాన్ని ఏమనుకోవాలి? అయినా టెండర్ల ప్రక్రియే పూర్తికాకుండా... దానికి ఎక్కువ పెట్టేశారని ఒకసారి... ఇంధన శాఖ అడ్డుకోవటంతోనే రద్దు చేశారని మరోసారి... ఇలాంటి రాతలను ఏమనుకోవాలి రామోజీరావు గారూ? ఈనాడు’ ఆరోపణ: మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్లో మూడు రెట్లు ఎక్కువ వాస్తవం: రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.581.16 పైసలు అవుతుందనడం అబద్ధం. అసలు టెండర్లే ఖరారు కానపుడు రేట్లెలా నిర్ధారిస్తారు? ఇంకా విచిత్రమేంటంటే మహారాష్ట్రలోని మీటర్లతో వీటిని పోల్చటం. మహారాష్ట్రలో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్లను అమర్చింది ప్రధానంగా అర్బన్ ప్రాంతంలోని ఇళ్లకు. 80 శాతం సింగిల్ ఫేజ్, 20 శాతం త్రీఫేజ్ మీటర్లు. నిర్వహణ కాల వ్యవధి ఏడున్నరేళ్లు. ఈ వ్యవధిలో కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తం మీటరుకు రూ.18,690. కానీ మన రాష్ట్రంలో అమరుస్తున్నది గ్రామాల్లో.. అది కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు. అన్నీ త్రీఫేజ్ మీటర్లే. మరి వాటికీ వీటికీ పోలిక ఎక్కడ? పైపెచ్చు మన రాష్ట్రంలో టెండర్లు పిలిచే నాటికి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమర్చిన సందర్భాల్లేనందున దీనికి బెంచ్మార్క్ ధరంటూ లేదు. అయినా సరే.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర ఎక్కువని ప్రభుత్వమే భావించినందున ప్రభుత్వమే రద్దుచేసి మళ్లీ పిలుస్తోంది. కానీ ‘ఈనాడు’ వంకర రాతలే పనిగా పెట్టుకుంది. ‘ఆరోపణ: స్మార్ట్ మీటర్లలో ఫీచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రన అంత ధరలా? వాస్తవం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాలి. వేర్వేరు ప్రాంతాల్లోని ఈ వ్యవసాయ సర్వీసులన్నింటికీ రీడింగ్ తీయడం కష్టమైది. మీటరు బోర్డుకు ఎటువంటి అనుబంధ, భద్రతా పరికరాలను అమర్చలేదు. వ్యవసాయ పంపుసెట్లకు దగ్గరగా బహిరంగ ప్రదేశంలో వీటిని అమర్చడంతో ఎండ, వర్షాలకు పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంతో మీటర్లను మార్చాల్సిన పరిస్థితొస్తోది. రీడింగ్ తీయడానికి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బందితోనే ప్రస్తుతం రీడింగ్ తీస్తుండటంతో సాదారణ విధులకు ఆటంకమేర్పడుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ప్రస్తుతం అనుబంధ, భద్రత పరికరాలు ఏమీ లేవు. దీంతో భద్రతా పరికరాలైన కెపాసిటర్లు (నాణ్యమైన ఓల్టేజ్, పంపిణీ నష్టాలు తగ్గింపునకు), సర్వీసు వైరు, పీవీసీ వైరు, ఎర్తింగ్, ఎంసీబీ(ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, విద్యుత్ భద్రతా చర్యల బలోపేతానికి) కూడా చేర్చారు. ఈ ఎస్ఎంసీ బాక్స్లో మీటర్లను ఏర్పాటు చేస్తారు కనక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటికి భద్రత ఉంటుంది. రైతులకి విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణా ఉంటుంది. యంసీబీ ద్వారా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యుర్నూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్లు భరించాల్సి వస్తోంది. అందుకే ఈ పరికరాలన్నిటినీ చేరిస్తే... ఇవన్నీ అనవసరమైనవంటూ తేల్చేశారు ఘనత వహించిన రామోజీరావు!!. అదీ ‘ఈనాడు’ పాఠకుల దౌర్భాగ్యం. -
3 పెద్దాసుపత్రుల టెండర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రూ. వెయ్యి కోట్ల చొప్పున నిర్మించబోయే మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సోమవారం టెండర్లు ఖరారయ్యాయి. ఎల్బీ నగర్ సమీపంలోని గడ్డిఅన్నారం మార్కెట్ ప్రాంతంలో, సనత్నగర్లోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో, అల్వాల్ వద్ద నిర్మించబోయే ఈ మూడు ఆసుపత్రుల టెండర్లను మేఘా, ఎల్అండ్టీ, డీఈసీ వంటి ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆసుపత్రుల డిజైన్పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో వాటిని తిరిగి డిజైన్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాయి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గనిర్దేశంలో రోడ్లు, భవనాలశాఖ సహకారంతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెండర్లు ఖరారైనందున డిజైన్పై తుది నిర్ణయం తీసుకున్నాక ఆసుపత్రుల నిర్మాణం మొదలవనుంది. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. హెలికాప్టర్ కూడా దిగేలా ఆసుపత్రులను తీర్చిదిద్దే అవకాశముంది. అవయవ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయాల్సిన సందర్భాల్లో అవయవాలను తరలించేందుకు వీలుగా లేదా రోగులను అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు హెలికాప్టర్ సేవలను ఈ ఆస్పత్రుల నుంచి వినియోగించేలా వాటిని నిర్మించనున్నారు. వెయ్యి పడకలతో... ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రుల కారణంగా హెల్త్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలోనూ పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ఆ ఘనతను సాధించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ వైద్యాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయనుంది. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కనీసం 30 మంది నిష్ణాతులైన డాక్టర్లను నియమించనుంది. వీటిల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు, 200 ఐసీయూ పడకలు ఉంటాయి. వీటిల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులూ అందుబాటులోకి తెస్తారు. ఏడాదిన్నరలోగా పూర్తిచేయాలన్నది సర్కారు సంకల్పం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవసరమైన క్వార్టర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ బ్లూప్రింట్ తయారు చేసింది. -
కాజీపేట రైల్వే యూనిట్కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్హాలింగ్ చేయనున్నారు. 2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. -
కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవబోతోంది. నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది. అక్కడ ఎందుకు..? తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి రూ.1,082 కోట్ల వ్యయం అంచనా వేశారు. నదిలోనే నడుస్తున్నట్టుగా..! దుర్గం చెరువు, మానేరు మీద ఉన్న సస్పెన్షన్ వంతెనల తరహాలో ఇప్పుడు సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి (స్తంభాలు లేని వంతెన) నిర్మించనున్నారు. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్లను నిర్మిస్తారు. ఒక్కో పైలాన్కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటిì ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఈ వంతెన పైనుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువన కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. -
క్రిస్ సిటీ నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ(క్రిస్ సిటీ) నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. తొలి దశలో సుమారు 2,006 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ పనులు చేజిక్కించుకునేందుకు ఎన్సీసీ, నవయుగ, షాపూర్జీపల్లోంజీ సంస్థలు వేసిన బిడ్లు సాంకేతికార్హత సాధించాయి. ఈ మధ్యనే జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో సాంకేతిక అర్హత సాధించిన ఈ మూడు బిడ్లు ఆమోదం పొందాయి. త్వరలోనే ఆర్థిక అంశాలను పరిశీలించాక రివర్స్ టెండరింగ్ విధానంలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్టు ఏపీఐఐసీకి చెందిన ఉన్నతాధికారి చెప్పారు. చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా మొత్తం 11,095.9 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మాణాన్ని చేపడుతుండగా.. అందులో తొలి దశలో 2,000 ఎకరాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిక్డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీఐఐసీ నిక్డిక్ట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటికే పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులూ మంజూరయ్యాయి. ఈ పారిశ్రామికవాడకు కండలేరు నుంచి నీటిని సరఫరా చేస్తారు. తుది బిడ్ ఎంపిక కాగానే త్వరలోనే పనులు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 2.96 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
అవిగో..! ఆహారశుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్ కల్పించడం ద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో అందుబాటులోకి తెస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచి్చన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిబ్డీ) మంగళవారం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో పనులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మేరకు.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా రూ.3,726.16 కోట్ల అంచనా వ్యయంతో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. తొలిదశలో రూ.1,148.11 కోట్లతో పది పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, రూ.66.92 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. రెండో దశలో రూ.2,511.13 కోట్లతో 16 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పంటలను శుద్ధిచేసి అదనపు విలువను జోడించడం, వృథాను తగ్గించడం, ఎగుమతి సామర్థ్యంతో పాటు బేరసారాల శక్తిని పెంపొందించడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. అవసరమైన ముడి సరుకును రైతులు, రైతు ఉత్పాదకత సంఘాలు, మార్క్ఫెడ్, ఆర్బీకేల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయగా రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీ యూఐఎఎంఎల్)తో పాటు నాబ్కాన్స్ సంస్థలు డీపీఆర్ రూపొందించాయి. 24 యూనిట్లకు భూసేకరణ పూర్తి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 24 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 325.39 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తైంది. 23 చోట్ల 295.39 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి ఇప్పటికే అప్పగించారు. 13 మిల్లెట్ యూనిట్ల కోసం 13 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. అంచనా వ్యయంలో 90% రుణంగా సేకరించనుండగా మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. వీటి నిర్వహణకు 118 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు రూ.1,000 కోట్ల రుణం అందించేందుకు సిబ్డీ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె.ఆదినారాయణ సమక్షంలో ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో శ్రీధర్రెడ్డి, సిబ్డీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.రాజేంద్రప్రసాద్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీయూఐ ఎఎంఎల్ సీనియర్ ఆఫీసర్లు రాహుల్రెడ్డి, సుదీష్ పాల్గొన్నారు. 3.25 శాతం స్వల్ప వడ్డీతో రుణం ఈ ఒప్పందం ప్రకారం 3.25 శాతం వడ్డీతో రూ.1,000 కోట్లను సిబ్డీ రుణంగా అందించనుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.215 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చనుంది. తొలిదశ యూనిట్ల కోసం నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్లో భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మార్చి కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ ఆర్థిక సాయం కోసం నాబార్డు, అప్కాబ్తో పాటు పలు వాణిజ్య బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జన సేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. -
659 అద్దెబస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన 659 బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వాటిలో ఏసీ స్లీపర్ 9, నాన్ ఏసీ స్లీపర్ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్ లగ్జరీ 46, అల్ట్రా డీలక్స్ 22, ఎక్స్ప్రెస్ 70, అల్ట్రా పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్ప్రెస్ 39, సిటీ ఆర్డినరీ బస్సులు 9 ఉన్నాయి. ‘ఎంఎస్టీసీ’ ఇ–పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి ఆగస్టు 6 సాయంత్రం 4గంటల వరకు రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అద్దె బస్సుల టెండర్లను ఖరారు చేస్తారు. బస్సు రూట్ల వివరాలు, బస్సు ప్రమాణాలు, టెండర్ల నిబంధనలు, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్: http://apsrtc.ap. gov. in టెండర్లు పిలిచిన అద్దె బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి శ్రీకాకుళం–39, పార్వతీపురం మన్యం–32, విజయనగరం–14, విశాఖపట్నం–61, అనకాపల్లి–22, కాకినాడ–41, తూర్పు గోదావరి–27, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – 39, పశ్చిమ గోదావరి–52, ఏలూరు – 21, కృష్ణా – 28, ఎన్టీఆర్ – 12, గుంటూరు – 26, పల్నాడు – 30, బాపట్ల– 6, ప్రకాశం– 10, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 39, తిరుపతి– 35, చిత్తూరు – 2, అన్నమయ్య – 10, వైఎస్సార్ – 6, నంద్యాల – 29, కర్నూలు – 14, అనంతపురం – 31, శ్రీసత్యసాయి – 33. -
234 ఖనిజ లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి లీజు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ–వేలం కొనసాగుతోంది. తొలి దశలో 234 ఖనిజాలకు క్వారీ లీజులు ఇచ్చేందుకు గనుల శాఖ జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్వే. మిగిలినవి క్వార్ట్ట్జ, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికా శాండ్, ప్రొఫలైట్ ఖనిజ లీజులు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 70 క్వారీ లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 35, వైఎస్సార్ జిల్లాలో 31, కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 8 లీజులకు వేలం నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేశారు. మరికొన్నింటికి త్వరలో మంజూరు చేయనున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేసేవారు. అలాంటివి 2,162 లీజులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతిచ్చిన ఈ క్వారీల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వెయ్యి క్వారీలను తిరిగి ఆపరేషన్లోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 234 లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో అనుమతి పొందిన వారికి రెవెన్యూ శాఖ నుంచి త్వరితగిన నిరభ్యంతర పత్రాలు ఇప్పించంతోపాటు ఇతర అనుమతులూ త్వరగా వచ్చేలా చూస్తున్నారు. -
అత్యవసర మందుల కొరతకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు అత్యవసర మందుల సరఫరాలో కొత్త విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మెడికల్ ఏజెన్సీలు, చెయిన్ ఫార్మసీల నుంచి ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలో డీఎంఈ పరిధిలో 32, వైద్య విధాన పరిషత్ పరిధిలో 13 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో చికిత్సకు సాధారణంగా వినియోగించే మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ చికిత్సల్లో వినియోగించే మందులు స్థానికంగా కొనుగోలు చేయడానికి మొత్తం మందుల బడ్జెట్లో డీఎంఈ ఆస్పత్రులకు 20 శాతం, జిల్లా ఆస్పత్రులకు 10 శాతం బడ్జెట్ను ఆయా ఆస్పత్రుల ఖాతాల్లో ఏపీఎంఎస్ఐడీసీ వేస్తుంది. ఈ నిధులతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను ఆస్పత్రులు స్థానికంగానే కొనుగోలు చేస్తాయి. అయితే ఈ విధానంలో కొన్ని చోట్ల అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడం, మందుల సరఫరాలో ఆలస్యం సహా పలు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ, చెయిన్ ఫార్మసీల ద్వారా డీ–సెంట్రలైజ్డ్ విధానంలో అత్యవసర మందుల సరఫరా చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బోధనా, జిల్లా ఆస్పత్రికి సమీపంలో మందుల దుకాణాలున్న వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. ఎమ్మార్పీపై ఎక్కువ డిస్కౌంట్తో మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసి కాంట్రాక్ట్ అప్పజెప్పనున్నారు. నేరుగా చెల్లింపులు.. ఆస్పత్రి సూపరింటెండెంట్లు ఇండెంట్ పెట్టిన ఎంత సమయంలోగా మందులు సరఫరా చేయాలన్నదానిపై నిబంధనలు రూపొందించారు. చాలా అత్యవసరమైన మందులను ఆరు గంటల్లోగా ఫార్మసీ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ మెడిసిన్ అయితే 24 గంటల్లో, బల్క్ మెడిసిన్ను వారంలోగా సరఫరా చేయాలని గడువు విధించారు. సరఫరా చేసిన మందులకు బిల్లులను ఏపీఎంఎస్ఐడీసీనే నేరుగా చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల మందుల సరఫరాలో కాలయాపన తగ్గడంతో పాటు, వినియోగంపై స్పష్టత రావడంతో పాటు, ఆడిటింగ్కు ఆస్కారం ఉంటుంది. కొరతకు తావివ్వకూడదనే.. అత్యవసర మందుల సరఫరాకు టెండర్లు పిలిచాం. వచ్చే వారంలో ఫైనల్ చేస్తాం. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్లను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. ఆర్డర్ ఇచ్చిన వెంటనే మందులు ఆస్పత్రులకు సరఫరా అవుతాయి. మందుల కొరతకు తావుండకూడదని నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. – మురళీధర్రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, వైస్ చైర్మన్ -
5 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం)లలో నిర్మించే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచింది. అతి తక్కువ ధర కోట్ చేసిన విశ్వ సముద్ర టెండర్లు దక్కించుకున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి దశ కింద రూ.1,204 కోట్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్టా జిల్లా మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్ హర్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ పనులను ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేగంగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఏర్పడుతుంది. -
ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట.. గేర్ మార్చిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: డొక్కు బస్సులతో నత్తనడకన సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ గేర్ మార్చింది. కొత్త బస్సులు కొనే దిశగా వేగం పెంచింది. 1,016 కొత్త బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. తయారీదారులకు ఆ బస్సుల గురించిన వివరాలు అందించి కొటేషన్లు ఆహ్వానించింది. అవి విడతలవారీగా మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీ చెంతకు చేరనున్నాయి. కాలం చెల్లిన వాటితోపాటు డొక్కుగా మారిన బస్సులతోనే ఆర్టీసీ ఇంతకాలం నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కండీషన్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు పెరగడంతో వాటిని తొలగించడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వరసగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అద్దె బస్సులే ఉంటున్నాయి. కొన్ని సొంత బస్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతుండటాన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. పది రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో కొత్త బస్సులు కొనే అంశాన్ని చర్చించారు. ఆ వెంటనే బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కొత్త బస్సులను కొత్త ప్రాంతాలతోపాటు కొరత ఉన్న చోట తిప్పనున్నారు. కాగా, ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనబోతోంది. ఇప్పుడు కొనేవాటిల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నట్టు ప్రకటించింది. (చదవండి: పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
రూ.10 వేల కోట్లతో హైవేల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. మరో 1,586 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా మొత్తం రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను జాతీయ రహదారులశాఖ ఖరారు చేసింది. గత వార్షిక ప్రణాళికలో మిగులు పనులతోపాటు రాష్ట్రంలో పోర్టులు, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను అనుసంధానించే రహదారులను 12 మీటర్ల వెడల్పుతో (టూ లేన్స్ విత్ పావ్డ్ సోల్టర్స్)గా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. సూత్రప్రాయంగా ఆమోదించిన ఈ ప్రణాళికలకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఖరారు చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నారు. అభివృద్ధి చేయనున్న కొన్ని ప్రధాన రోడ్లు కల్వకుర్తి–నంద్యాల 250 కిలోమీటర్లు, నంద్యాల–జమ్మలమడుగు 82 కి.మీ., డోన్–సోమయాజులపల్లి 78 కి.మీ., గోరంట్ల–హిందూపురం 50 కి.మీ., పెడన–హనుమాన్జంక్షన్ 51 కి.మీ., అమలాపురం–బొబ్బర్లంక 55 కి.మీ., ఆకివీడు–దిగుమర్రు 45 కి.మీ., నరసాపురం రింగ్రోడ్డు 40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఇవేగాక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించే పలు రోడ్లను 12 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. -
రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్ క్లస్టర్లను ట్రాంచ్–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా.. ► నక్కపల్లి క్లస్టర్లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్ ఏరియాలో కూడా రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► చిత్తూరు సౌత్ జోన్లోని శ్రీకాళహస్తి క్లస్టర్లో 2,770 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్ ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది. -
ఒకేచోట.. నచ్చిన ఆట
సాక్షి, అమరావతి: యువతలో క్రీడాసక్తిని పెంపొందించడంతో పాటు.. అన్ని వర్గాల ప్రజలు ఆడుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధునిక ఆట స్థలాలను అభివృద్ధి చేస్తోంది. ‘స్పోర్ట్స్ అరేనా’ ప్రాజెక్టు పేరుతో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరులో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు టెండర్లు సైతం ఆహ్వానించింది. అన్ని జిల్లాల్లో డీఎస్ఏ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) ప్రాంగణాలు, మునిసిపాలిటీల నుంచి స్థలాలను సేకరించి నిర్మాణాలు చేపట్టనుంది. ఏ ఆటైనా ఆడేందుకు అనువుగా.. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆట స్థలాలను మర్చిపోతున్నారు. ఎవరైనా ఆడుకుందామన్నా అనువైన ప్రదేశాలు లేక అభిరుచిని చంపేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రైవేట్ రంగంలో స్పోర్ట్స్ అరేనాలు వెలిశాయి. గంటల లెక్కన అద్దె వసూలు చేస్తూ ఆడుకోవాలనే అభిలాష ఉన్నవారికి క్రీడా వేదికను కల్పిస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చక్కటి వాతావరణం, రాత్రి వేళ ఫ్లడ్లైట్ల వెలుతురులోనూ ఆటలను ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రీడా ప్రమాణాలను పాటిస్తూ శాప్ స్వయంగా అరేనాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఔత్సాహికులకు ఆడుకునే స్వేచ్ఛను కల్పిస్తూనే ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు రచిస్తోంది. సాధారణ క్రీడా మైదానాలతో పోలిస్తే అరేనా ప్రాంగణాలు విభిన్నంగా ఉంటాయి. కొద్దిపాటి స్థలంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటలు ఆడుకునేందుకు వీలుంటుంది. మట్టి కనిపించకుండా ఆట స్థలం మొత్తం నెట్స్లో ఉండి.. టర్ఫ్తో కప్పి ఉంటుంది. ఒకే ప్రదేశం.. అనేక రకాల ఆటలకు నెలవుగా వీటిని రూపొందిస్తారు. ఈ స్పోర్ట్స్ అరేనాల్లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, వాలీబాల్, యోగా ఇలా.. నచ్చిన క్రీడలను ఆడి ఆస్వాదించవచ్చు. ఆధునికతకు అనుగుణంగా.. ప్రస్తుత కాలానికి తగిన విధంగా ఆట స్థలాలు ఉండాలి. అందరూ మట్టి క్రీడా ప్రాంగణాల్లో ఆడేందుకు ఆసక్తి చూపరు. కానీ వారికి ఆడుకోవాలనే కోరిక ఉంటుంది. అటువంటి ఔత్సాహిక క్రీడాకారుల కోసమే స్పోర్ట్స్ అరేనాలను తీసుకొస్తున్నాం. ఒకేచోట తమకు నచ్చిన క్రీడను ఎంజాయ్ చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అన్ని వయసుల వారు ఇందులో ఆడుకునేందుకు ఇష్టపడతారు. – ఎన్.ప్రభాకరరెడ్డి, ఎండీ, శాప్ -
వేగంగా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. దీంతో కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అదనంగా మూడులక్షల టన్నుల మత్స్యసంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్లు అండుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే సామర్థ్యం లభిస్తుంది. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, ఓడరేవుల్లో హార్బర్ల నిర్మాణాలకు రూ.1,496.85 కోట్ల విలువైన పనులకు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. -
సొంత నిధులతోనే రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచినా.. ఆశించిన స్పందన రాకపోవడంతో సొంత నిధులతోనే పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50కుపైగా రైల్వే స్టేషన్లను పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు 90 ఏళ్ల పాటు అప్పగించాలని సూత్రప్రాయంగా గతంలో నిర్ణయించారు. ఆ జాబితాలో ఏపీలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో మల్టీప్లెక్స్లు, మాల్స్, రెస్టారెంట్లు, పలు రకాల ఇండోర్ గేమ్స్ అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే శాఖ పట్టించు కోలేదు. మొదటగా నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కానీ రైల్వే శాఖ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి రెండు అంతస్తులు రైల్వే శాఖకు అప్పగించి మిగిలిన అంతస్తుల్లో వాణిజ్య సముదాయాల నిర్వహణ లాభసాటి కాదని ప్రైవేటు సంస్థలు భావించాయి. పైగా రైల్వే శాఖ కనీస బిడ్ ధర కూడా చాలా ఎక్కువుగా నిర్ణయించడంతోపాటు ఇతర షరతులు కూడా సానుకూలంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని బడా కార్పొరేట్ సంస్థలతో రైల్వే శాఖ సంప్రదింపులు కూడా జరిపినా ఫలితం దక్కలేదు. నగరాల్లో ప్రధాన కూడళ్లలో కాకుండా కొంచెం దూరంగా ఉండే రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల నిర్మాణం లాభసాటి కాదని కూడా ఆ ప్రైవేటు సంస్థలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దాంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. రైల్వే స్టేషన్లను తమ నిధులతోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ నిధులతోనే అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికను తాజాగా ఆమోదించారు. దాదాపు రూ. 300 కోట్లతో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు సంస్థలతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు గతంలో రూపొందించిన ప్రణాళిక దీనికి వర్తించదని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాల కోణంలోనే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించమని రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. డీపీఆర్ ఖరారైన తరువాత రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రణాళిక ఓ కొలిక్కి వస్తుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.2,205 కోట్లు ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఏ ప్రభుత్వమూ ఇంత డబ్బులు ఇవ్వలేదని, ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. గత సర్కారు ఐదేళ్ల పాటు రహదారుల నిర్వహణను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లుగా వర్షాలు జోరుగా కురవడంతో రోడ్లు మరింత దెబ్బతిన్నాయన్నారు. గత సర్కారు ఐదేళ్లలో రోడ్లకు ఇచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈ ప్రభుత్వ పాలనలోనే హఠాత్తుగా ఇప్పటికిప్పుడే రోడ్లన్నీ పాడైపోయినట్లు వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్ల పనులకు టెండర్లు పూర్తి చేశామని, నెలాఖరు నాటికి 100 శాతం పూర్తవుతాయని సమీక్షలో అధికారులు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల టౌన్ అప్రోచ్ రోడ్డు , తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ–వాడపల్లి రహదారి టూరిజం ప్రాజెక్టుల రాకతో పెరిగిన ప్రాధాన్యం విశాఖ బీచ్ కారిడార్ రోడ్డుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి– భోగాపురం– తిరిగి ఎన్హెచ్–16కు అనుసంధానమయ్యే బీచ్ కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోడ్డు నిర్మాణ డిజైన్పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, ఈ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రహదారిని ఆనుకుని టూరిజం ప్రాజెక్టులు రానుండటంతో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు, రాత్రి పూట ల్యాండింగ్కు నేవీ ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బీచ్ కారిడార్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 33 ఆర్వోబీల పూర్తికి రూ.571.3 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులను మే చివరి నాటికి దాదాపుగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 33 ఆర్వోబీలు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలోనే ఇవి పూర్తి కాలేదనే రీతిలో కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత సర్కారు హయాం నుంచే ఇవి పెండింగ్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు ఇప్పుడు సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. -
ఆయిల్ కంపెనీల టెండర్ల కోసమే అక్రమ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్ కంపెనీలను బురిడీ కొట్టించి టెండర్లు దక్కించుకునేందుకే రాష్ట్రంలో కొందరు సిండికేట్ సభ్యులు ట్యాంకర్ల ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా సాగించినట్టు రవాణాశాఖ నిర్ధారించింది. ట్యాంకర్లు లేకపోయినా ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక మతలబు ఇదేనని ప్రాథమికంగా తేల్చింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం పోలీసుశాఖ సమాయత్తమవుతోంది. ఆయిల్ కార్పొరేషన్లు ఏటా ట్యాంకర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తాయి. టెండర్లలో పాల్గొనేందుకు నిర్ణీత సంఖ్యలో ట్యాంకర్లు ఉండాలనే నిబంధన విధిస్తాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్లు లేనప్పటికీ ఉన్నట్టుగా చూపించి అర్హత సాధించేందుకు ఓ ముఠా ఈ ఎత్తుగడ వేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు రవాణాశాఖ గుర్తించింది. ఇప్పటికే కృష్ణాజిల్లాలో కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ అధికారుల పూర్తి సహకారంతోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సాగించారు. నిబంధనల ప్రకారం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాహనాలను పరిశీలించి సంబంధిత పత్రాలను ఆమోదించాలి. అనంతరం ఆర్టీవో స్థాయి అధికారి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఏకంగా 110 ట్యాంకర్లు లేకుండానే ఎంవీఐ బి.గోపీనాయక్ ఉన్నట్టుగా పత్రాల్లో పేర్కొన్నారు. గూడూరు వంటి చిన్న పట్టణంలో అంత భారీసంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు ఒకేసారి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారో అని ఆర్టీవో సి.మల్లికార్జునరెడ్డి సందేహించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక కృష్ణాజిల్లాలో అయితే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కాకుండా కేవలం విఠల్ అనే సీనియర్ అసిస్టెంటే అక్రమ రిజిస్ట్రేషన్ల తతంగాన్ని నడిపించడం విస్మయపరుస్తోంది. కృష్ణాజిల్లాలో 11 ట్యాంకర్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. రికార్డుల పరిశీలన కొనసాగుతుండటంతో మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రవాణాశాఖ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆయిల్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. రవాణాశాఖ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు కోసం బృందాన్ని ఈశాన్య రాష్ట్రాలకు పంపించనున్నారు. కేవలం ఆయిల్ కంపెనీల టెండర్లు దక్కించుకునేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారా.. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు అధికారులు దృష్టిసారించనున్నారు. -
ఇక రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు ప్రస్తుతం ఎక్కడికక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎక్కడా గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం రోడ్ల రూపురేఖలు మార్చేస్తోంది. రూ.2,205 కోట్లతో 1,147 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు దశల్లో కార్యాచరణను వేగవంతం చేసింది. విజయనగరం జిల్లాలో భీమసింగి–కొత్తవలస, విశాఖ జిల్లాలో పాడేరు ఏజెన్సీ రోడ్డు, సుజనకోట బీచ్ రోడ్డు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు– బేస్తవారిపేట రోడ్డు, చిత్తూరు జిల్లాలో దామలచెరువు– పులిచెర్ల రోడ్డు, వైఎస్సార్ జిల్లాలో కడప–రేణిగుంట రోడ్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో నిర్వహణ నిధులను దారి మళ్లించడంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ బాధ్యతను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. గత రెండేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. నేరుగా బ్యాంకుల నుంచే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం ద్వారా సానుకూల వాతావరణం సృష్టించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పనులు ఊపందుకున్నాయి. మొదటి దశలో 328 రోడ్ల పునరుద్ధరణ రాష్ట్రంలో మొదటి దశలో రూ.603.68కోట్లతో రోడ్ల పునరుద్ధరణ కోసం 328 పనులకు ఆర్ అండ్ బి శాఖ టెండర్లు ఖరారు చేసింది. వర్షాకాలం ముగియడంతో నవంబరులో ఆ పనులు చేపట్టారు. వాటిలో ఇప్పటికే రూ.41.15 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు. వాటిలో 12 రాష్ట్ర రహదారులు, 15 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బిల్లులను కూడా అప్లోడ్ చేశారు. దాంతో బ్యాంకులు నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనున్నాయి. మరో రూ.32.46 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. వాటిలో 16 రాష్ట్ర రహదారులు, 19 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వెరసి రూ.73.61 కోట్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన రూ.530.07 కోట్ల పనులను ఈ వారంలో ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో మొత్తం రూ.603 కోట్ల పనులు ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశ టెండర్లు త్వరలో ఖరారు రెండో దశ కింద 819 రోడ్ల పునరుద్ధరణకు ఆర్ అండ్ బి శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. అందుకోసం రూ.1,601.32 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ టెండర్లను 2022 జనవరి రెండో వారంలోగా ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించి మే మొదటి వారానికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేశామని ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు. పూర్తి నాణ్యతతో రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని త్వరలో రెండో దశ టెండర్లను కూడా ఖరారు చేసి వేసవి నాటికి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. -
ఐదు రోడ్లు.. రెండు ఆర్వోబీలు.. ఓ వంతెన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యాచరణ ఊపందుకుంది. 2021–22 వార్షిక ప్రణాళికలో పనులను ఆర్అండ్బీ శాఖలోని జాతీయరహదారుల విభాగం వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం గతంలో ఎన్నడూలేని రీతిలో ఆమోదించిన రూ.6,421కోట్ల వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమయ్యింది. అందులో భాగంగా రూ.1,048.50 కోట్లతో ఐదు రోడ్లు, రెండు ఆర్వోబీలు, పెన్నా నదిపై ఓ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ టెండర్లు పిలిచింది. ఆ పనుల వివరాలిలా ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు రూ.140కోట్లతో నిర్మిస్తారు. జాతీయ రహదారి–40 వద్ద, జాతీయ రహదారి–71 వద్ద ఒక్కోటి రూ.70కోట్లతో నిర్మిస్తారు. ► రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారి–67 మార్గంలో పెన్నా నదిపై కొత్త వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం పెన్నా నదిపై ఉన్న వంతెన 6.70మీటర్ల వెడల్పే ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పెన్నా నదిపై 2.68 కి.మీ. మేర కొత్త వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తెలంగాణ సరిహద్దులోని ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు రహదారిలో భాగంగా 43 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) అభివృద్ధి చేస్తారు. వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు రూ.300కోట్లతో రహదారి నిర్మిస్తారు. రోజుకు 4,500 వరకు పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో ప్రయాణం మరింత సౌలభ్యంగా మారుతుంది. ► రూ.318.50 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారి 167బి మార్గంలో సీఎస్ పురం నుంచి మాలకొండ వరకు రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు)తో అభివృద్ధి చేస్తారు. 44 కి.మీ.రహదారి నిర్మాణం వల్ల రోజుకు 6,900 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ మార్గంలో రాకపోకలు మరింత సౌలభ్యంగా మారతాయి. ► రూ.90కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు నగర పరిధిలో జాతీయ రహదారి–40, జాతీయ రహదారి–69ని అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 6.80కి.మీ. మేర ఈ రహదారిపై రోజుకు12,500 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఆ నాలుగు లేన్ల రహదారితో మన రాష్ట్రం నుంచి అటు చెన్నై ఇటు బెంగళూరుకు రాకపోకలకు సౌలభ్యంగా ఉంటుంది. ► చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నుంచి ఉత్తుకొట్టై వరకు రహదారిని అభివృద్ధి చేస్తారు. 40 కి.మీ. మేర ఈ రహదారి పనుల కోసం రూ.50కోట్లు కేటాయించారు. ► రూ.50కోట్ల అంచనా వ్యయంతో చిలమత్తూరు–హిందూపూర్–పరిగి మార్గంలో 23.20 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) విధానంలో అభివృద్ధి చేస్తారు. -
AP: వజ్రాల వేటకు ఓకే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది. వాస్తవానికి మైనింగ్ శాఖ గతంలోనే ఈ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. కేంద్రం ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడం, భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో దానిపై అంతగా దృష్టి సారించలేదు. మరింత లోతుగా సర్వే తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతోపాటు వజ్రాల వెలికితీతకు అవకాశాలు మెరుగు పడడంతో మరింత లోతుగా అన్వేషణ కోసం టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. జీ–4 సర్వే ఆధారంగా ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజు ఇవ్వనున్నారు. ఈ లీజు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె గ్రామంలో వజ్రాల నిక్షేపాలు ఉన్న భూములు ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్లలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. లీజు పొందిన సంస్థ పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తే, వజ్రాల లభ్యత గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే టెండర్లు పిలవనున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. -
సవరించిన రేట్ల ప్రకారమే రోడ్ల పనులు
సాక్షి, అమరావతి: కొత్తగా టెండర్లు నిర్వహించనున్న రోడ్ల పునరుద్ధరణ పనులకు తాజాగా సవరించిన రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన రేట్లను అధికారికంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.40 లక్షలు పైబడిన పనులన్నీంటికీ ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ సహాయంతో చేపట్టనున్న రెండో దశ రోడ్ల పునరుద్ధరణ పనులకు ఈ నిర్ణయం సానుకూలంగా మారింది. రాష్ట్రంలో రెండో దశ పనుల కోసం రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్(ఆర్డీసీ) టెండర్ల ప్రక్రియ చేపట్టింది. రూ.1,601.32 కోట్లతో దాదాపు 819 రోడ్ల పనులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఆర్డీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టిన దశలోనే ప్రభుత్వం రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకోవడం సానుకూలంగా మారింది. కాంట్రాక్టర్లు మరింత ఆసక్తితో టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. బిల్లుల చెల్లింపునకు ప్రత్యేక ఖాతా! ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల రుణ సేకరణకు రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం వెచ్చించనుంది. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ నిధులను జమ చేయనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు తీసుకువచ్చిన రూ.3 వేల కోట్లను ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించింది. దీంతో రోడ్ల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ పరిస్థితి పునరావృతం కాకూడదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈనెల రెండోవారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వర్షాలు తగ్గగానే నెలాఖరులోగా పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా.. శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. -
పారిశుధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మునిసిపాలిటీల్లో 256 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జీటీఎస్)లు నిర్మిస్తోంది. ప్రస్తుతం మునిసి పాలిటీల్లోని వార్డుల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఓ ప్రాంతంలో పోగు చేస్తున్నారు. తర్వాత టిప్పర్ల ద్వారా డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశంలో పోగేయడం వల్ల అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం మెరుగు, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పోగు చేయకుండా 8 నుంచి 10 లేదా స్థానిక పరిస్థితులను బట్టి మరికొన్ని వార్డులను కలిపి ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పోగు చేయడానికి జీటీఎస్లు నిర్మించాలని నిశ్చయించింది. రూ.213 కోట్లతో 256 జీటీఎస్ల నిర్మాణం రాష్ట్రంలో 123 మునిసిపాలిటీల్లో రూ.213.39 కోట్లతో 256 జీటీఎస్ల నిర్మాణానికి ఆ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 104 మునిసిపాలిటీల్లో 210 జీటీఎస్ల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. 92 మునిసిపాలిటీల్లో 189 జీటీఎస్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. 72 మునిసిపాలిటీల్లో 136 జీటీఎస్లకు టెండర్లు పూర్తయ్యాయి. 68 మునిసిపాలిటీల్లో 124 జీటీఎస్ల నిర్మాణానికి వర్క్ ఆర్డర్లు చేయడం ముగిసింది. శ్రీకాకుళం, మచిలీపట్నం, ఒంగోలు కార్పొరేషన్లు, హిందూపురం, వినుకొండ, నంద్యాల, పుంగనూరు, నగరి సహా 30 మునిసిపాలిటీల్లో 46 జీటీఎస్ల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన జీటీఎస్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 30 సెంట్ల నుంచి అర ఎకరం, ఎకరం, మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కూడా పలు మునిసిపాలిటీల్లో జీటీఎస్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా ఇక్కడికి తరలిస్తారు. అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలిస్తారు. -
జిల్లేడుబండ రిజర్వాయర్కు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 2.41 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.609.14 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్–ఓపెన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూళ్లు దాఖలుకు అక్టోబర్ 7ను తుది గడువుగా నిర్ణయించింది. అదే రోజున నిర్వహించే ప్రీ–బిడ్ సమావేశంలో షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూపంలో రూ.6.09 కోట్ల చొప్పున తీసిన డీడీలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎస్ఈ–2కు అందించాలి. అక్టోబర్ 11న ఆర్థిక బిడ్ను తెరుస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థ కోట్చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదేరోజు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో అతి తక్కువ ధరకు కోట్చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ)కి ప్రతిపాదనలు పంపుతారు. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా.. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా జిల్లేడుబండ రిజర్వాయర్ను ప్రభుత్వం చేపట్టింది. హంద్రీ– నీవా ప్రధాన కాలువ 377.1 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి.. అక్కడి నుంచి తవ్వే కాలువ ద్వారా కొత్తగా నిర్మించే జిల్లేడుబండ రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద తవ్వే పిల్ల కాలువల ద్వారా బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
‘మోనో’ ఆవరణల్లో ప్రకటనలు
సాక్షి, ముంబై: ప్రారంభమైన నాటి నుంచి నష్టాల్లోనే నడుస్తున్న మోనో రైలు ప్రాజెక్టు కరోనా మహమ్మా రి ప్రభావంతో మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. కరోనా, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులెవరూ మోనో రైళ్లలో ప్రయాణించేందుకు సుముఖత చూపలేదు. దీంతో మోనో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతీరోజు రూ. లక్షల్లో నష్టం వస్తోంది. ఇలా ఆర్థికంగా నష్టాల బాట పట్టిన మోనో ప్రాజెక్టును లాభాల దిశగా నడపాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీ యే) భావించింది. ఈ మేరకు ఆదాయం పెంచుకు నే మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగానే మోనో రైల్వే స్టేషన్ల ఆవరణలు, ప్లాట్ఫారాలు, మోనో రైలు మార్గం వెంబడి ఉన్న పిల్లర్లు, ప్రహరీ గోడలు, ఇతర స్థలాలను ప్రకటనల కోసం అద్దెకు ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి గల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ప్రస్తు తం నగరంలోని చెంబూర్–సాత్రాస్తా ప్రాంతాల మధ్య మోనో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతీరోజు నష్టం వస్తున్నా కూడా సంస్థకు వీటి ట్రిప్పులను నడపక తప్పడం లేదు. దీంతో టికెట్ల ద్వారా ఆదాయం రాకపోయినప్పటికీ, ప్రకటనల ద్వారానైనా ఆదా యం రాబట్టుకోవాలని సంస్థ భావించింది. ఈ మేరకు ప్రకటనల ద్వారా ఏటా రూ. 40–50 కోట్ల మేర ఆదాయం సంపాదించేందుకు ఎమ్మెమ్మార్డీయే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే అధికారులు కొన్ని కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ, అవి సఫలం కాలేదు. దీంతో టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలని గడువు విధించింది. దాఖలైన టెండర్లను 12వ తేదీన తెరవనున్నారు. ఈ టెండర్లలో ఎవరు ఎక్కువ చెల్లించడానికి ముందుకు వస్తారో వారి ప్రకటనలను మోనో రైల్ ఆవరణల్లో ఏర్పాటు చేయనున్నారు. -
దిగొచ్చిన మాస్కుల ధరలు
సాక్షి, అమరావతి: మాస్క్లు, పీపీఈ కిట్ల ధరలు దిగొచ్చాయి. కరోనా వచ్చిన తొలి రోజుల్లో వీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఒక దశలో సర్జికల్ మాస్క్ను రూ.13 పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. ఇప్పుడది అక్షరాలా రూపాయి పావలా కంటే తక్కువకు దిగొచ్చిందంటే.. మాస్క్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏ స్థాయిలో వచ్చాయో అంచనా వేయొచ్చు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మాస్క్లు, పీపీఈ కిట్లు తదితర వాటికి ఏపీఎంఎస్ఐడీసీ(రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ధరలు భారీగా దిగొచ్చాయి. ఎప్పటికప్పుడు రేట్లు తగ్గుతున్న కొద్దీ కొత్తగా టెండర్లు పిలవడం, తగ్గిన ధరలకు కొనడంతో ప్రభుత్వానికి వ్యయం భారీగా తగ్గుతోంది. పీపీఈ రూ.600 నుంచి రూ.222కు కరోనా మొదటి వేవ్లో ఒక్కో పీపీఈ కిట్ను రూ.600కు కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడది కేవలం రూ.222కే దొరుకుతోంది. దీనికంటే ముందు పిలిచిన టెండర్లో రూ.291గా ఉండేది. పీపీఈ కిట్ల టెండర్లో ఏడు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్–1(లోయెస్ట్–1) రూ.222 కాగా, ఎల్–7 రూ.261కి వేశారు. అలాగే ఎన్–95 మాస్క్లకు ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. ఒక్కో మాస్క్ రూ.140కి కూడా కొనాల్సి వచ్చింది. తాజా టెండర్కు ముందు వరకూ ఇదే ఎన్–95 మాస్క్ ధర రూ.19.37గా ఉంది. తాజాగా టెండర్లో మొత్తం 8 సంస్థలు పాల్గొనగా.. ఎల్–1 రూ.5.91కి వేసింది. కోవిడ్ వచ్చిన కొత్తలో మూడు పొరల సర్జికల్ మాస్క్ను రూ.13కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అప్పట్లో తయారీ కంపెనీలు లేకపోవడం, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజా టెండర్లో 20 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో ఎల్–1 కేవలం రూ.1.22కే వేసింది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో ఏడీ(ఆటో డిసబుల్) సిరంజిలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తాజాగా కోటి సిరంజిల కోసం టెండర్ పిలవగా ఒక్కో సిరంజి రూ.3.90కే వచ్చింది. -
త్వరలో భావనపాడు పోర్టు టెండర్లు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 4 ఫిషింగ్ హార్బర్లు, రెండు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో పోర్టు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధంచేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద సుమారు రూ.3,670 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారైందని, ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ కే మురళీధరన్ తెలిపారు. అదే విధంగా మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని, అవి రాగానే పోర్టు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ఆగస్టులో టెండర్లు పిలవనున్నామన్నారు. ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో జువ్వలదిన్నె(నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు బుడగట్లపాలెం (శ్రీకాకుళం జిల్లా), పూడిమడక (విశాఖ), కొత్తపట్నం (ప్రకాశం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు పనులను సెప్టెంబర్ నుంచి శ్రీకారం చుట్టేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఈలోగా పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 28న రామాయపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్, అరబిందో రియాల్టీ కలిసి దక్కించుకున్న సంగతి తెలిసిందే. పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను ఏపీ మారిటైమ్ బోర్డు రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. సెప్టెంబర్లో పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు మురళీధరన్ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు టెండర్లు ఖరారయ్యేలోగా పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ఏపీ: మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లపై సింగిల్ బెంచ్ ఆదేశాలు సస్పెండ్
సాక్షి, అమరావతి: మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం.. టెండర్లకు సంబంధించి ఒప్పందాలు చేయొద్దని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని టాటా పవర్ ఎనర్జీ, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 16కు కోర్టు వాయిదా వేసింది. కాగా, 400 మెగావాట్ల సోలార్ విద్యుత్ను వ్యవసాయానికి ఇవ్వడానికి గతేడాది నవంబర్లో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. -
‘సముద్ర’ ఆదాయంపై సర్కార్ దృష్టి
సాక్షి, అమరావతి: ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 4 పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఇతర వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. రాష్ట్రంలో 974 కి.మీ సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ.. ఎలా అభివృద్ధి చేయొచ్చో మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను పిలిచింది. వాణిజ్య పోర్టులు, కంపెనీల సొంత పోర్టులు–జెట్టీలు, ఓడల నిర్మాణం, రీసైక్లింగ్, డ్రైపోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ కేంద్రాలు, పోర్టు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లు, మెరైన్ టూరిజం, డీశాలినేషన్ ప్లాంట్లు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో కన్సల్టెంట్ను నియమించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్ నోటీసులో పేర్కొంది. జూలై 6న ప్రారంభమయ్యే టెండర్లు.. 12న మధ్యాహ్నం ముగుస్తాయి. టెండర్ దక్కించుకున్న తేదీ నుంచి నెల రోజుల్లో మాస్టర్ ప్లాన్ నివేదిక ఇవ్వాలని నిబంధన విధించారు. -
ఎలక్ట్రికల్ బస్సు టెండర్లపై ఎల్లో మీడియా తప్ప్పుడు ప్రచారం : పేర్ని నాని
-
Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ విధానం, స్మార్ట్ మీటర్లు అమర్చడం ద్వారా కనిపిస్తున్న ఫలితాలపై రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రతి నెలా నేరుగా రైతుల ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. తమ చేతుల మీదుగా విద్యుత్తు సంస్థలకు బిల్లులు చెల్లిస్తూ ధీమాగా నాణ్యమైన కరెంట్ ఉచితంగా పొందుతున్నారు. తమ ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వం నుంచి విద్యుత్తు సబ్సిడీ మొత్తం జమ అవుతుండటం, వారే నేరుగా బిల్లులు చెల్లిస్తుండటంతో నాణ్యమైన విద్యుత్తు సేవల కోసం ప్రశ్నించే హక్కు లభించిందని రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులున్నా, ఎక్కడైనా లో వోల్టేజీ సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే నిలదీసే వీలుంది. మరోవైపు విద్యుత్తు సంస్థల్లోనూ జవాబుదారీతనం పెరిగింది. డిజిటల్ మీటర్లు అమర్చడం వల్ల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పర్యవేక్షించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతున్నారు. 26 వేల పంపుసెట్లకు మీటర్లు.. వైఎస్సార్ వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత జవాబుదారీతనంతో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసే విధానాన్ని ఖరీఫ్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడాదిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం మంచి ఫలితాలనిచ్చింది. ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్మును జమ చేసింది. ఆ తర్వాత ఈ మొత్తం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఖాతాకు అందింది. ఈ విధానంలో మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా జరిగినట్టు పరిశీలనలో తేలింది. జిల్లాలో మొత్తం 26 వేల పంపుసెట్లకు మీటర్లు అమర్చారు. శ్రీకాకుళం డివిజనలో 10, టెక్కలి, పాలకొండ డివిజన్లలో 8 వేల చొప్పున పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. నాణ్యమైన మీటర్లు.. విద్యుత్ వినియోగాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన డివైజ్ లాంగ్వేజ్ మెసేజ్ స్పెసిఫికేషన్ (డీఎల్ఎంఎస్) మీటర్ల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్తు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. దేశీయంగా తయారైన ఈ మీటర్లను టెండర్ ప్రక్రియ ద్వారా ముందే సమకూర్చుకున్నారు. టెస్టింగ్ లేబొరేటరీల్లో వీటిని పరీక్షించారు. నాణ్యమైన పాలీ కార్బొనేట్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకున్నాయి. వర్షాకాలంలోనూ ఎలాంటి విద్యుత్ షాక్లు, షార్క్ సర్క్యూట్ లాంటివి నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇక స్మార్ట్ మీటర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు డిస్కమ్లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచాయి. జూలైలో ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకునే వీలుంది. ఈ మీటర్ల ద్వారా లోడ్ తెలుసుకుని తగిన సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం స్మార్ట్ మీటర్ ద్వారా ప్రధాన కార్యాలయం పర్యవేక్షించే వీలుంటుంది. దీంతో జవాబుదారీ తనం పెరుగుతుంది. 32 యాంప్స్ సామర్థ్యం గల ఫ్యూజ్లను అమరుస్తారు. వీటి ద్వారా 20 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్పీ) విద్యుత్ లోడ్ వాడుకోవచ్చు. అంటే రైతు 20 హెచ్పీ మోటార్ అమర్చుకున్నా అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే ఉండదు. స్మార్ట్ మీటర్ వీలుకాని చోట ఇన్ఫ్రారెడ్ రీడింగ్ (ఐఆర్ పోర్ట్) పద్ధతిలో రీడింగ్ తీస్తారు. ఈ క్రమంలో డీఎల్ఎంఎస్ మీటర్ విద్యుత్ ప్రసరణ తీరుతెన్నులను అర్థమయ్యే భాషలోకి మార్చి ఐఆర్ విధానానికి తెలియచేస్తుంది. లో వోల్టేజీ ఉంటే పసిగట్టి హెచ్చరిస్తుంది. 300 ఎంఎం వెడల్పు, 700 ఎంఎం పొడవుతో మైల్డ్ స్టీల్తో తయారయ్యే మీటర్కు గాల్వనైజ్డ్ ఎర్త్ కూడా ఇస్తారు. అందువల్ల ఎలాంటి షాక్లకు అవకాశం లేకుండా పూర్తి భద్రతతో ఉంటుందని అధికారులు వివరించారు. -
గోదాముల టెండర్లకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ గోదాములు, డ్రైయింగ్ యార్డుల నిర్మాణానికి ఉద్దేశించిన టెండర్లకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మొదటి దశ పనులకు టెండర్లు ఆహ్వానించగా, తాజాగా రెండో దశ పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.420.30 కోట్ల అంచనా వ్యయంతో 500 టన్నులు, 1,000 టన్నుల సామర్థ్యం కలిగిన 1,255 గోదాములు, డ్రైయింగ్ యార్డులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చే సమయానికి వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో ప్యాకేజీ–1 కింద రూ.28.5 కోట్ల అంచనా వ్యయంతో 92 పనులకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–3 కింద రూ.69.3 కోట్ల అంచనా వ్యయంతో 219 పనులకు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణకు ఈ నెల 29ని గడువుగా నిర్ధారించారు. ఈ గడువులోగా వచ్చిన వాటిని టెక్నికల్ కమిటీకి పంపి.. జూన్ మొదటి వారంలోగా అనుమతులిచ్చి పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేస్తారు. ప్యాకేజీ–2, 4లకు ఈ నెల 25న టెండర్లు.. ఇక ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ప్యాకేజీ–2 కింద రూ.139.5 కోట్ల అంచనా వ్యయంతో 430 పనులకు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–4 కింద రూ.183 కోట్ల అంచనా వ్యయంతో 514 పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.100 కోట్లు దాటడంతో ప్రభుత్వాదేశాల మేరకు టెండర్ ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీకి పంపారు. మే 17 వరకు వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ కొన్ని సూచనలు, సలహాలతో టెండర్లు పిలిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గోదాముల చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 25న టెండర్లు పిలిచేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశ టెండర్ ప్రక్రియను జూన్ 20కల్లా పూర్తి చేసి..ఆ వెంటనే వారం రోజుల్లో పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏదేమైనా వచ్చే ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి గోదాములను సిద్ధం చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. -
గ్రామీణ గోదాముల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రైతులు పండించే పంటకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల (బహుళ ప్రయోజన కేంద్రాల) నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. వీటిలోనే డ్రైయింగ్ యార్డ్స్ (ఆరబోత కళ్లాలు) సహా 500 నుంచి 1,000 మెట్రిక్ టన్నుల మేర పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంతో తొలి దశలో 1,255 గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. పంటలను ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్ఫామ్తో కలిపి ఒక్కో గోదామును ఆర ఎకరం విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,700 కోట్లతో గ్రామీణ గోదాముల నిర్మాణాలను నాలుగు దశల్లో చేపట్టాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. వీటిలోనే అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా వర్గీకరించి తొలి దశలో రూ.579.33 కోట్లతో 1,255 గోదాములను నిర్మిస్తారు. ఇప్పటికే ఒక ప్యాకేజీ కింద గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 219 గ్రామాల్లో రూ.67.40 కోట్ల వీటిని నిర్మించేలా టెండర్లు ఆహ్వానించారు. మరో ప్యాకేజీగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగం జిల్లాల్లోని 92 గ్రామాల్లో రూ.27.98 కోట్లతో గోదాములు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. ఈ రెండు ప్యాకేజీలకు వచ్చే నెల 18న సాంకేతిక బిడ్స్ తెరుస్తారు. వచ్చే నెల 21వ తేదీన ప్రైస్ బిడ్ తెరిచి అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఈ ప్యాకేజీల విలువ రూ.వంద కోట్ల లోపే ఉండటంతో ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లను ఆహ్వానించారు. వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక ప్యాకేజీ కింద రూ.208.80 కోట్లతో 514 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ డాక్యుమెంట్ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. అదేవిధంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో ప్యాకేజీ కింద రూ.161.15 కోట్లతో 430 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ల డాక్యుమెంట్ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. ఈ రెండు ప్యాకేజీల టెండర్ల విలువ రూ.వంద కోట్లకు పైబడి ఉండటంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. పరికరాల సరఫరాకూ.. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో రైతులకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచేందుకు కూడా మార్కెటింగ్ శాఖ రూ.114 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించింది. రూ.70 కోట్లను మల్టీ గ్రెయిన్న్ డీ–స్టోనర్ కమ్ క్లీనర్, పీటీవో ఆపరేటెడ్ మొబైల్ ప్యాడీ డ్రైయర్స్ సరఫరా కోసం వెచ్చిస్తారు. రూ.44 కోట్లను అసైయింగ్ యూనిట్లు, ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్ పరికరాల సరఫరాకు వినియోగిస్తారు. ఈ పరికరాల సరఫరాకు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. నాలుగు దశల్లో నిర్మాణాలు పూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను రైతులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు దశల్లో మొత్తం ఈ కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. తొలి దశలో ఇప్పటికే రెండు డివిజన్లలో టెండర్లను ఆహ్వానించాం. మరో రెండు డివిజన్లలో టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేందకు సిద్ధం చేశాం. – ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్)లో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ విగ్రహం ఏర్పాటుకు ఈపీసీ విధానంలో ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయాన్ని రూ.180 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 14 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలి. టెండర్ డాక్యుమెంట్లు శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతిస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 249 కోట్లతో పార్కు అభివృద్ధి స్వరాజ్ మైదాన్లో సుమారు 20 ఎకారల విస్తీర్ణంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అండ్ డెవలప్మెంట్ పార్కును రూ.248.71 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం కింద భాగంలో జీ+1 తరహాలో 2,000 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా కన్వెన్షన్ సెంటర్, ధ్యాన మందిరం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించడంతో ఏపీఐఐసీ విగ్రహ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. -
రూ.3,650 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం బందరు (మచిలీపట్నం) పోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బందరు పోర్టు తొలిదశలో రూ.5,835 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీన్లో రూ.1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది ఏపీ మారిటైమ్ బోర్డు రుణ రూపంలో సమకూరుస్తుంది. వాణిజ్యపరంగా పోర్టు పూర్తయితే చుట్టుపక్కల పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడంతో పాటు 80 వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బందరు పోర్టును సొంతంగా అభివృద్ధి చేసి లీజుకు (ల్యాండ్ లార్డ్) ఇచ్చే విధానం అమలు చేస్తోంది. దీన్లో భాగంగా ఇప్పుడు రూ.3,650.07 కోట్లతో పనులు చేపట్టడానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలుస్తోంది. ఈపీసీ విధానంలో పనులు చేపట్టడానికి టెండర్లను న్యాయ పరిశీలనకోసం బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపింది. ఈ టెండర్లపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఏడు రోజుల్లోగా తెలపాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్ ఒక ప్రకటనలో కోరారు. తొలిదశలో ఇలా... తొలిదశలో వివిధ రకాల సరుకు రవాణాకు వినియోగించే విధంగా మొత్తం నాలుగు బెర్తులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఒకటి మల్టీ పర్పస్ బెర్త్కాగా, రెండు జనరల్ కార్గో బెర్తులు, ఒకటి బోగ్గు కోసం కేటాయిస్తారు. అలాగే 2.99 కిలోమీటర్ల బ్రేక్ వాటర్, 43.82 మిలియన్ మీటర్ల డ్రెడ్జింగ్తో పాటు, అంతర్గత, బహిర్గత మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ఈ పనులకు రూ.3,650.07 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల వ్యయాన్ని 2020–21 ఎస్వోఆర్ ప్రకారం లెక్కించారు. తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశించారు. ఈ టెండర్లను ఏపీ పోర్టు డాట్ జీవోవీ డాట్ ఇన్ లేదా జ్యుడిషియల్ ప్రివ్యూ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ల ద్వారా పరిశీలించవచ్చు. -
'నో ఆన్లైన్ బుకింగ్.. ఎక్కడినుంచైనా ఇసుకను తీసుకెళ్లొచ్చు'
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కొత్త పాలసీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్ల్లోనూ ధరను ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని, నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని వివరించారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. 'ఇసుక తవ్వకాలు, రీచ్ల నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాం. ఎవ్వరైనా పాల్గొనేందుకు వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చాం. పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహించాం. ఇందులో భాగంగానే జనవరి 4న ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ టెండర్ల విధానంలో ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ. మూడు ప్యాకేజీల కు కచ్చితంగా నిబంధనలు పెట్టాం. సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్ని ముందే పరిశీలించాం. ఏడాదికి సుమారు వెయ్యి కోట్లు ఇసుకను సరఫరా చెయ్యగలరు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలి. 70 శాతం రీచ్ లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేరు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 ధర ను ఖరారు చేశాం. దానికి అదనంగా రవాణా ఛార్జీల ఉంటాయి' అని స్పష్టం చేశారు. చదవండి : విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి -
రక్తహీనత నివారణకు బలవర్థక బియ్యం
సాక్షి, అమరావతి: రక్తహీనత లోపాన్ని నివారించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో బలవర్థకమైన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 3 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను సేకరించేందుకు వీలుగా పౌరసరఫరాలసంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన ఫోర్టిఫికేషన్ రిసోర్స్ సెంటర్ (ఎఫ్ఎఫ్ఆర్సీ) ప్రకారం బియ్యానికి బీ–12తో పాటు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను మిశ్రమం చేసే సొంత మిల్లు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని పౌరసరఫరాలసంస్థ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు 750 మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాకు 600, పశ్చిమ గోదావరి జిల్లాకు 850, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు 500, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు 300 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను కేటాయించారు. టెండరు దక్కించుకున్నవారు ఆయా జిల్లాల్లో సూచించిన గోదాములకు బియ్యాన్ని సరఫరా చేయాలి. కొందరు పేదలు తీసుకుంటున్న ఆహారంలో ఇనుము, అయోడిన్, జింక్, విటమిన్ ఏ, డీ, బీ–12 లోపించినట్లు గుర్తించా రు. వీటిలోపం వల్ల వస్తున్న జబ్బుల నుంచి వారిని దూరం చేసేందుకు బలవర్థకమైన ఆహా రం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. -
కొత్త వైద్య కళాశాలల్లో..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 16 వైద్య కళాశాలల్లో ముందుగా ఆస్పత్రుల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటిని పూర్తిచేసిన అనంతరమే వైద్య కళాశాలల నిర్మాణాలు చేపడతారు. ఈ మేరకు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మరోవైపు.. పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు వైద్య కళాశాలలకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే జరిగే ఒప్పందాల అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో పనులు మొదలుపెడతారు. అలాగే, ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు.. కడపలో మెంటల్ హెల్త్, క్యాన్సర్ బ్లాక్ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వీటన్నింటి పనులు ఏప్రిల్లో మొదలు పెట్టి ఏడాదిన్నరలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బీఆర్ఓ కోసం నిరీక్షణ మిగిలిన 12 మెడికల్ కాలేజీల డిజైన్లను అధికారులు ఖరారు చేశారు. బీఆర్ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్) రాగానే వీటికీ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అలాగే, ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలల్లో నాడు–నేడు పనుల కింద చేపట్టే పనులకు కూడా త్వరలో టెండరు ఆహ్వానించనున్నారు. దీంతో వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో బోధనాసుపత్రుల రూపురేఖలే మారనున్నాయి. సకాలంలోనే పూర్తవుతాయి మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ లక్ష్యం నిర్దేశించారు. అప్పటిలోగా వాటిని పూర్తిచేస్తాం. పేషెంట్లకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముందుగా ఆస్పత్రి భవనాలు నిర్మిస్తాం. ఇప్పటికే ఐదు స్పెషాలిటీ ఆస్పత్రులు, నాలుగు వైద్య కళాశాలల టెండర్లు పూర్తయ్యాయి. మిగతావీ త్వరలోనే పూర్తిచేసి పనులకు వెళ్లబోతున్నాం. – విజయరామరాజు, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ -
జోరుగా ఇళ్ల మంజూరు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి ఇళ్లు మంజూరు పత్రంతో పాటు ప్రత్యేకంగా పాసు పుస్తకం అందజేస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, మంజూరైన స్కీమ్, ఇంటి విలువ, హౌసింగ్ ఐడీ నంబర్, లే అవుట్ పేరు, కేటాయించిన ప్లాటు నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పాసు పుస్తకంలో పొందుపరిచారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్ అనంతరం బేస్మెంట్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్, ఫినిషింగ్ స్థాయిల్లో ఎంత మేరకు స్టీలు, సిమెంట్ వాడారనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టోల్ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. పరికరాల కొనుగోలుకు 15లోగా టెండర్లు సొంతంగా ఇళ్ల పట్టాలు, పొసెషన్ సర్టిఫికెట్ కలిగి ఉండి సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులకు వర్క్ ఇన్స్పెక్టర్లు మార్కింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గాల మార్కింగ్ వివరాలను ఏఈలు సేకరించి రోజూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయాలి. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు టెండర్లను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద పరికరాలు, ధరల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తి కాగానే నిర్మాణాలు.. ఇళ్ల నిర్మాణాల కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం. –అజయ్ జైన్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి -
గర్భిణుల వైద్యపరీక్షలకు ఉచిత రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవలకు వెళ్లే గర్భిణులు ఇకపై ఆటో కోసమో, బస్సు కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. వీళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఆపదలో ఉన్న వారి కోసం ఇప్పటికే 108 వాహనాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో మందులివ్వడానికి 104 వాహనాలున్నాయి. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు నడుస్తున్నాయి. అయితే.. గర్భిణులు ప్రసవానికి ముందు ఆస్పత్రులకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో 170 వాహనాలు గర్భిణులు 9 నెలల కాలంలో విధిగా నాలుగు దఫాలు వైద్యపరీక్షలకు వెళ్లాలి. దీన్నే యాంటీనేటల్ చెకప్స్ అంటారు. ఈ సమయంలో ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణులకు ఇంటివద్దకే వాహనాలను పంపిస్తారు. గర్భిణి ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో స్థానికంగా ఆశా వర్కర్కు, ఏఎన్ఎంకు అవగాహన ఉంటుంది. వీళ్లు ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్కు ఫోన్చేసి, వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి దాన్లో ఆస్పత్రికి పంపిస్తారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేవరకు వాహనం అక్కడే ఉండి తిరిగి ఇంటివద్దకు చేరుస్తుంది. దీనికోసం తొలుత 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యత్నిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. గర్భిణులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే వాహనాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్త ఎవరైనా డాక్టరుకు ఫోన్ చేయగానే ఆ గర్భిణి ఇంటివద్దకే వాహనాన్ని పంపిస్తారు. గర్భిణి ప్రయాణానికి వీలుగా ఉండేలా తుపాన్ వాహనాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ఏడాదికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి రాష్ట్రంలో ఏటా 7 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో 3 లక్షలమంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. రవాణా సౌకర్యం లేక వైద్యపరీక్షలకు వెనుకాడుతున్నారు. ఉచిత రవాణా కల్పిస్తే ప్రతి ఒక్కరు వైద్యపరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సమస్యలున్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల సుఖప్రసవాలు జరగడమే కాకుండా మాతాశిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. -
రూ.1,200 కోట్లతో కృష్ణపట్నం నోడ్ పనులు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు కారిడార్లో భాగంగా 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్ (కృష్ణపట్నం పారిశ్రామికవాడ)కు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించడానికి ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,134 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కింద రూ.2,139.44 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నోడ్లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడానికి ఏపీఐఐసీ రంగం సిద్ధం చేసింది. రహదారుల నిర్మాణం, నీటి వసతి, మురుగు నీటి శుద్ధి, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,200 కోట్ల విలువైన పనులకు ఈ నెలాఖరులో ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.432 కోట్లు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.420 కోట్లు, నీటి వసతి కల్పన, మురుగునీటి శుద్ధి వంటి పనులకు రూ.348 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూలై మొదటి వారంలో కృష్ణపట్నం నోడ్ పనులు ప్రారంభించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నివాసయోగ్యంగానూ అభివృద్ధి: కేవలం పారిశ్రామిక యూనిట్లే కాకుండా నివాస యోగ్యంగా కృష్ణపట్నం నోడ్ను అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్కతా నగరాల మాదిరిగానే పరిశ్రమలతో పాటు నివాస యోగ్యంగా కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఉద్యోగులు అక్కడే నివసించే విధంగా గృహ సముదాయాలు నిరి్మంచడానికి 13.9 శాతం వినియోగించనున్నారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయించి, పర్యావరణ పరిరక్షణ కోసం 10.9 శాతం ఖాళీగా ఉంచుతారు. తొలి దశలో అభివృద్ధి చేసే ఈ నోడ్ ద్వారా సుమారు 18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రధానంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్, ఆప్టికల్ వంటి తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. -
‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్–పయనీర్–హెచ్ఈఎస్ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. టెండర్ ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి నివేదిక పంపారు. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్ఎల్టీసీ సోమవారం సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలన అనంతరం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న ఆ సంస్థలకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. భారీ మొత్తంలో ఆదా పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్ కెనాల్ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.24 శాతం తక్కువకు అంటే రూ.2,507.04 కోట్లకు కోట్ చేసిన వీపీఆర్–పయనీర్–హెచ్ఈఎస్(జేవీ) సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో మొదటి ప్యాకేజీలో ఖజానాకు రూ.5.93 కోట్లు ఆదా అయ్యాయి. లిఫ్ట్ కెనాల్ 40 కి.మీ. నుంచి 102 కి.మీ. వరకూ చేపట్టే పనులకు రెండో ప్యాకేజీ కింద రూ.1,722.39 కోట్ల ఐబీఎంతో టెండర్ పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్ను శనివారం అధికారులు తెరిచారు. 1,763.73 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–గా నిలిచింది. అదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.67 శాతం తక్కువకు అంటే రూ.1,710.82 కోట్లకు కోట్ చేసిన గాజా–ఎన్సీసీ (జేవీ) పనులను దక్కించుకుంది. దాంతో ఖజానాకు రూ.11.57 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరలతో పోల్చితే.. మొదటి ప్యాకేజీలో రూ.51.16 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.52.91 కోట్లు వెరసి రూ.104.07 కోట్లు ఆదా అయ్యాయి. -
కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 108 ప్రతిపాదనలను వచ్చినట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే అందులో 10.77 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రాజెక్ట్స్ టుడే పేర్కొంది. మొత్తం రూ.54,714 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ప్రాజెక్ట్స్ టుడే సంస్థ దేశంలో కొత్తగా ప్రకటించిన పెట్టుబడులు, పిలిచిన టెండర్లు ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికను రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రకటించిన తాజా సర్వేలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రాజెక్టుల విలువలో మూడో వంతు కేవలం సాగు నీటి రంగానికి చెందిన అయిదు ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాగు నీటి రంగంలో పెట్టుబడులు తగ్గగా, కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రూ.10,044.5 కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్ఐ) స్కీం కింద ఫార్మా రంగంలో ఈ మూడు నెలల కాలంలో రూ.11,527.21 కోట్ల విలువైన 196 పెట్టుబడుల ప్రకటనలు వెలువడగా అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవి ఉన్నట్లుగా నివేదిక వివరించింది. కైనటిక్ గ్రీన్ ఎనర్జీ రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్తో పాటు లోయర్ సీలేరులో రూ.1,098.12 కోట్లతో ఏరా>్పటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రాజెక్టులుగా పేర్కొంది. పెరిగిన ప్రైవేట్ పెట్టుబడులు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్స్ టుడే స్పష్టం చేసింది. ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ప్రైవేటు సంస్థల వాటా 49.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రైవేటు రంగంలో రూ.1,36,946.3 కోట్ల విలువైన 711 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్న సంఖ్యలో కూడా వృద్ధి నమోదవుతోందని వివరించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ.1,29,388.84 కోట్ల విలువైన 1,237 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, ఇది అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 120 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. అక్టోబర్ – డిసెంబర్లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు -
యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.560 కోట్లతో రహదారుల మరమ్మతులకు సంబంధించి ఈ నెల 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు రహదారుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చాక భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఈ ఏడాది అంతా రోడ్ల మరమ్మతులపైనే దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. మరో రూ.2 వేల కోట్లతో కూడా రహదారుల మరమ్మతులపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి రుణం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రూ.12 వేల కోట్లతో కొత్త రహదారులు ► ఆర్ అండ్ బీకి సంబంధించి 31 ఎన్హెచ్ (నేషనల్ హైవే) ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.9,571 కోట్ల ఖర్చుతో 915 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలి. ► సుమారు రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి కూడా భూ సేకరణపై దృష్టి పెట్టాలి. నిర్ణయించిన తేదీ నుంచి 270 రోజుల్లోపు భూములను కాంట్రాక్టర్కు అప్పగించకపోతే కాంట్రాక్టరు డీస్కోపింగ్ (రేటు పెంచండని)కు అడిగే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యతగా ఉపాధి పనులు ► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ – భారీ పరిమాణంలో పాలను శీతలీకరణలో ఉంచే కేంద్రాలు), అంగన్వాడీ సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రాధాన్యతగా పూర్తి చేయాలి. ► ఒక మనిషికి లేదా ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలి. ఎక్కువ పనులు అప్పగిస్తే ఒక పని అయిపోయే వరకు రెండో పని మొదలు పెట్టడం లేదు. దీనికి అనుగుణంగా వెంటనే మార్పులు చేయాలి. మార్చి 31లోగా అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి. ► ఇందుకు సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. గ్రామాల వారీగా ప్లాన్ ఉండాలి. ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణాల్లో వేగం పెరగాలి ► గ్రామ సచివాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలి. గ్రామాల వారీగా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ► మన బడి నాడు–నేడు కింద స్కూళ్లలో చేపట్టిన మొత్తం పనులన్నీ వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కావాలి. ప్రతి బిల్డింగును ఒక యూనిట్గా తీసుకుని జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ► ప్రొక్యూర్మెంట్కు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు ► అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం పెండింగులో ఉన్న వాటికి వెంటనే స్థలాలను సేకరించాలి. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఈ కేంద్రాలకు కావాల్సిన స్థలాలను పూర్తి స్థాయిలో గుర్తించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను అభినందిస్తున్నా. ► ఆరేళ్ల లోపు పిల్లల్లో 85 శాతం మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది. అందువల్ల వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దడానికి ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంగ్లిష్ సహా వారికి అన్నీ నేర్పిస్తాం. ఎంపీఎఫ్సీల నిర్మాణానికి భూముల గుర్తింపు ► బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రాల (ఎంపీఎఫ్సీ – మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) కోసం ఆర్బీకేల సమీపంలో అర ఎకరా నుంచి ఒక ఎకరం వరకు స్థలం కావాలి. గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడానికి అవసరమైన వేదిక (డ్రైయింగ్ ప్లాట్ఫాం), వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు (కలెక్షన్ సెంటర్లు), ప్రాథమికంగా శుద్ధిచేసే పరికరాలు (ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్), అసైయింగ్ ఎక్విప్మెంట్ (పరీక్షించే పరికరాలు), సేకరణ పరికరాలు (ప్రొక్యూర్మెంట్ అక్విప్మెంట్) తదితర సదుపాయాల కోసం భూములు కావాలి. ► ట్రక్కులు వెళ్లేలా ఈ భూములు ఉండాలి. జనవరి 31 నాటికల్లా ఈ భూముల గుర్తింపు పూర్తి కావాలి. గ్రామాల్లోనే జనతా బజార్ల కోసం 5 సెంట్లు కావాలి. గ్రామం మధ్యలోనే ఉండేలా చూడాలి. వచ్చే ఏడాదిలో గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుంది. ► ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ప్రీప్రైమరీ స్కూల్, జనతాబజార్లతో మొత్తం గ్రామాల స్వరూపం మారుతుంది. ఆర్బీకేల పక్కనే ఎంపీఎఫ్సీలు వస్తాయి. దాదాపు రూ.10,235 కోట్ల ఆర్థిక వనరుల సమీకరణకు అనుసంధానం కూడా పూర్తవుతుంది. ► జనవరిలో పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్స్) పూర్తయితే, ఫిబ్రవరిలో ప్లానింగ్ నివేదిక ఆధారంగా ఏప్రిల్ నాటికి రైతులకు ఇన్సూరెన్స్ అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. జనవరి 11న అమ్మ ఒడి జనవరి 9న రెండో శనివారం, బ్యాంకులకు సెలవు కావడంతో జనవరి 11న అమ్మ ఒడి నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో డిసెంబర్ 21 నుంచి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాం. జనవరి 7 వరకు ఆ జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆ రోజు ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రకటిస్తాం. ఇంటింటికీ రేషన్ బియ్యం రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఈ నెల 20వ తేదీన 9,257 వాహనాలను ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం ఇస్తూ వారికి వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజు ఆవిష్కరిస్తాం. రేషన్ సరఫరాలో భాగంగా స్వర్ణ రకం బియ్యం అందిస్తాం. విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు ప్రారంభిస్తాం. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని వారి ఇళ్ల వద్దే అందజేస్తాం. -
వైఎస్సార్ తలపెట్టిన ప్రాజెక్టు నేటికి సాకారం
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లకు సుదీర్ఘకల నెరవేరుతోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన లెదర్ పార్క్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సుమారు రూ.281 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్సీ)లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. 537 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలతోపాటు కాన్పూర్, ఆగ్రా, చెన్నైకి చెందిన అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని కేపీఐఎల్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల తెలిపారు. ముఖ్యంగా భూ కేటాయింపుల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన చర్మకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు జనవరి 18లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఈ పార్కు అభివృద్ధికి రూ.281 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా.. మెగా లెదర్, ఫుట్వేర్ మరియు యాక్ససరీస్ క్లస్టర్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు సమకూరుస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని ఏపీఐఐసీ భరిస్తుందని తెలిపారు. భూసేకరణ పూర్తయిందని, అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. మార్చిలోగా పనులు ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 1665 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు.. ఎంత భూమి కావాలి, ఎటువంటి యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు, అవసరమైన మౌలిక వసతులు వివరిస్తూ బిడ్లు పిలిచామన్నారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా గ్రాంట్ థ్రాంటన్ భారత్ ఎల్ఎల్పీని ఎంపిక చేసినట్లు తెలిపారు. పర్యావరణానికి హాని లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధిచేసి సముద్రంలో 5.5 కిలోమీట్ల లోపలకు తీసుకెళ్లి వదిలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్కరకాలం తర్వాత.. షెడ్యూల్డ్ కులాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామం వద్ద లెదర్ పార్కును అభివృద్ధి చేయాలని దివంగతనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ఏపీఐఐసీ, లిడ్క్యాప్ భాగస్వామ్యంతో కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్సీ) పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 2009 ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేకపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో భూమి సేకరించడంతోపాటు అన్ని అనుమతులు సాధించారు. కాలుష్యానికి అవకాశం లేకుండా.. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పార్క్ను అభివృద్ధి చేస్తున్నాం. మత్యకారులకు ఇబ్బంది లేకుండా కాల్యుష్యాన్ని తగ్గించే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. అదేవిధంగా కాలుష్యం తక్కువ ఉండే ఫినిషింగ్ ఉత్పత్తులను తయారుచేసే యూనిట్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న సిలికా మైనింగ్ సమస్యను పరిష్కరించి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్డింగ్ కోరాం. త్వరలో లెదర్ పార్కు పనులు ప్రారంభిచనున్నాం. – మేకపాటి గౌతమ్రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి -
రహదార్ల విస్తరణలో ఎన్జీవోల భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్ల విస్తరణ, అభివృద్ధిలో ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. భూసేకరణ, పునరావాస కార్యాచరణ ప్రణాళికల్లో రైతులు, ప్రజలను ఒప్పించడంలో వీరు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 37 కిలోమీటర్ల మేర రహదార్లను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారి ప్రాజెక్టులకు కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు ఎన్జీవోలను టెండర్ల ద్వారా ఎంపిక చేయనుంది. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 తుది గడువుగా పేర్కొంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణసాయంతో ప్రభుత్వం విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, పట్టణ ముఖ్య కేంద్రాలను కలుపుతూ రహదార్ల విస్తరణ పనులు చేపట్టింది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రైతుల వద్ద భూములు సేకరించాలి. అంతేకాకుండా మెరుగైన పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు (ఆర్ అండ్ ఆర్) చేపట్టాలి. ఈ నేపథ్యంలో రైతులను ఒప్పించడానికి ఎన్జీవోలను ఎంపిక చేయాలని ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విదేశీ రుణ సాయంతో పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయనుండటంతో ఏడీబీ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీవోల ఎంపికకు సర్కార్ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా తొలుత ఎన్జీవోల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. ఎన్జీవోలు ఏం చేయాలంటే.. ► టెండర్ల ద్వారా ఎంపికైన ఎన్జీవోలు రహదార్ల విస్తరణకు అవసరమైన భూసేకరణపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ► ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ► స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జరిగే అభివృద్ధిపై ప్రచారం చేయాలి. ► రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి. -
దగదర్తి ఎయిర్పోర్ట్ డీపీఆర్కు టెండర్లు
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. ప్రయాణికులు, కార్గో ఎయిర్క్రాఫ్ట్లను నిర్వహించే విధంగా డీపీఆర్ తయారు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్క్యాప్) నోటిఫికేషన్ జారీ చేసింది. నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుండటంతో కార్గో రవాణాకు ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్రెడ్డి తెలిపారు. ఇప్పటికే చెన్నై ఎయిర్పోర్టులో కార్గో హ్యాండలింగ్ గరిష్ట స్థాయికి చేరడం, కృష్ణపట్నం పోర్టుకు అదనంగా ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం సమీపంలో భారీ పారిశ్రామిక పార్కు వంటివి ఏర్పాటు కానుండటంతో కార్గో రవాణా కేంద్రంగా దగదర్తి ఎయిర్పోర్టును అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూ సమగ్ర డీపీఆర్ను తయారు చేయడానికి టెండర్లు పిలిచామని, ఆసక్తి గల సంస్థలు డిసెంబర్ 2లోగా బిడ్లు దాఖలు చేయాలన్నారు. సుమారు 1,350 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని ఏపీఏడీసీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డీపీఆర్ తయారు కాగానే క్యాబినెట్ ఆమోదానికి పంపి పనులు ప్రారంభించనున్నట్లు భరత్ రెడ్డి తెలిపారు. -
రెండు నెలల్లో బందరు పోర్టుకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొలిదశలో రూ.5,834.51 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టనుంది. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈపీసీ విధానంలో రెండునెలల్లో టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలిదశలో మొత్తం ఆరుబెర్తులు (1 కోల్ బెర్త్, 1 కంటైనర్ బెర్త్, 4 జనరల్ కార్గో బెర్తులు) నిర్మించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం వద్ద సముద్రం లోతు తక్కువగా ఉండటంతో భారీనౌకలు వచ్చేవిధంగా 200 మీటర్ల వెడల్పు, 16.80 మీటర్ల లోతుతో 12.7 కి.మీ. దూరం అప్రోచ్ చానల్ తవ్వనున్నారు. దీంతోపాటు దక్షిణ దిశ వైపు రెండువేల మీటర్లు, ఉత్తరం వైపు 260 మీటర్ల మేర మొత్తం 2.32 కి.మీ. బ్రేక్ వాటర్ పనులు, 44.81 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు కన్సల్టెంట్గా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)ను ఎంపిక చేశారు. 2 నెలల్లో టెండరు డాక్యుమెంట్లు తయారు చేసి, జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. 2023–24 నాటికి ఏడాదికి 35.12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించే విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకు 800 నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుంది. మరో 155 ఎకరాలు పోర్డు బేసిన్, డ్రెడ్జింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన 2వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు. -
కడప–రేణిగుంట నాలుగు వరుసల హైవేకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించనున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) పనులు వేగవంతం చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా గుర్తించింది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం మొదలుకుని రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో ఈ హైవేకు ఎన్హెచ్–716 కేటాయించారు. ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి చొరవతో ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ను ఖరారు చేసింది. కడప వద్ద వైఎస్సార్ టోల్ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. రూ.3 వేల కోట్లతో 133 కి.మీ. మేర నిర్మించనున్న ఈ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తోంది. ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్హెచ్ఏఐ చేపట్టనుంది. నాలుగేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు వరుసల ఈ హైవే టెండర్లను త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో నిర్మిస్తాం. ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించాం. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. – రామచంద్ర, చీఫ్ ఇంజనీర్, ఎన్హెచ్ ప్రాజెక్ట్స్ -
రోడ్లు, వంతెన పనులకు రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టే రోడ్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు రీ టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్ నిబంధనల్లో గడువు విధించింది. బిడ్డర్ల మధ్య పోటీతత్వాన్ని పెంచి.. తద్వారా ఆదా అయ్యే నిధులతో మరికొన్ని రోడ్ల విస్తరణ పనులు చేపట్టేలా గతంలో దాఖలైన టెండర్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా టెండర్లు పిలవనుంది. రూ.682.16 కోట్లతో తొలి విడత పనులు ► మొదటి దఫాగా నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్లతో చేపట్టే పనులకు రీ టెండర్లు పిలుస్తున్నారు. ఇందులో కృష్ణా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల విస్తరణ పనులున్నాయి. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచేలా టెండర్ బిడ్ల దాఖలుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. జిల్లా యూనిట్గా పనులను ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలుస్తారు. ► ఈ నెల 9 నుంచి నవంబర్ 9 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుంది. టెండర్ డాక్యుమెంట్లు ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ► నవంబరు 10న బిడ్లు తెరుస్తారు. ఆ తర్వాత రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 26న కాంట్రాక్ట్ కంపెనీలతో ప్రీ బిడ్ సమావేశం జరుగుతుంది. ► తొలి దఫాగా పిలిచే టెండర్లలో కృష్ణా జిల్లాలో రూ.233.96 కోట్లు, విశాఖలో రూ.138.96 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.142.54 కోట్లు, తూర్పు గోదావరిలో జిల్లాలో రూ.166.70 కోట్ల విలువైన పనులున్నాయి. ► టెండర్లలో రెండు నిబంధనలను సవరించారు. బ్యాంక్ గ్యారెంటీలను ఏదైనా రూరల్/కోపరేటివ్ బ్యాంకులు కాకుండా షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి ఇవ్వవచ్చు. ► హార్డ్ కాపీ నిబంధనను సవరించారు. రివర్స్ టెండర్లు జరిగేలోగా హార్డ్ కాపీలు అందించాలి. ఇది ఆప్షన్ మాత్రమే. బిడ్లను మాన్యువల్గా స్వీకరించరు. -
నెలాఖర్లో ఎన్డీబీ రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి సంబంధించిన రీటెండర్ల ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ ఈ నెలాఖరున నిర్వహించనుంది. రద్దయిన టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ను మళ్లీ జారీచేయనున్నారు. ఈలోపు రీటెండర్లలో ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు పాల్గొనేలా అధికారులు అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో వెబినార్, ఈ–మెయిళ్ల ద్వారా చర్చించాలని నిర్ణయించారు. ఎన్డీబీ సహకారంతో మొత్తం రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా రాస్తున్న అసత్య కథనాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ శనివారం ఆర్ అండ్ బీ ముఖ్య అధికారులతో టెండర్ల విషయమై సమీక్షించారు. టెండర్లలో పోటీతత్వం పెంచాలని.. పారదర్శకత ప్రతిబింబించాలని, ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన ఆదేశించడంతో టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఎక్కవ సంఖ్యలో బిడ్లు వేస్తే ఆ మొత్తంతోనే ఇంకొన్ని ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. రీటెండర్ల విధివిధానాలివే.. ► బ్యాంక్ గ్యారెంటీ కోసం కాంట్రాక్టు సంస్థలు హార్డ్ కాపీ ఇవ్వాలి. ► జ్యుడీషియల్ ప్రివ్యూ సూచనల మేరకు జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి. ► చిన్న కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా జాయింట్ వెంచర్ కంపెనీలకు అవకాశం ఉంది. ► విదేశీ రుణంతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా.. ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానం అనుసరించాల్సిందే. ► ఏపీలో రాజమండ్రి–విజయనగరం హైవే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు అండ్ హైవేస్ ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానమే అనుసరిస్తోంది. నిజానికి టెండర్ల రద్దు అక్కర్లేదు ► ఇప్పటికే దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరంలేదు. ఎన్డీబీ కూడా ప్రస్తుత బిడ్లపై సంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థలే పాల్గొన్నాయి. కానీ, పారదర్శకత కోసమే ప్రభుత్వం రీటెండర్లకు ఆదేశించింది. -
ఎన్డీబీ టెండర్లు రద్దు
సాక్షి, అమరావతి: టెండర్లలో పోటీతత్వం పెంపొందించేందుకే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దుచేశామని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టంచేశారు. రీ టెండర్లలో వాస్తవాలు తెలుస్తాయని, పచ్చ పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వారికి నమ్మకం కలిగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లను రద్దుచేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన ఆర్ అండ్ బీ ఈఎన్సీ వేణుగోపాల్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ ప్రాజెక్టు ఫేజ్–1లో టెండర్లు పిలిచామని.. 26 పనులు, 13 ప్యాకేజీలకు 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం రీ టెండర్లలో బహిర్గతం అవుతుందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు.. పారదర్శకత ప్రతిబింబించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని.. టెండర్ల స్పందనపై ఆయన సమగ్రంగా సమీక్ష చేశారని కృష్ణబాబు వివరించారు. అధిక మొత్తం విలువగల టెండర్లలో తక్కువ మంది పాల్గొనడం సహజమేనని ఎన్డీబీ పేర్కొన్నా.. పారదర్శకత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసేందుకే ప్రస్తుత టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లను పూర్తిచేయాలని ఎన్డీబీ కోరిందని, అయితే.. తాను కేంద్రంతో మాట్లాడి గడువు కోరతానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే.. – అర్హత విషయంలో చాలా కంపెనీలున్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి గల కారణాలు తెలుసుకుంటాం. – ఏపీ ప్రభుత్వం, ఎన్డీబీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ ట్రైపార్టీ అగ్రిమెంట్కు లోబడి ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం పనులను నిర్వహిస్తాం. – ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశముంది. – జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే. – కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బందులు ఉండచ్చు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు. ముందుగా 15 శాతం అడ్వాన్స్లు విడుదల చేస్తారు. – ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం టెండరు విలువ ఎంత ఉంటుందో.. కాంట్రాక్టు కంపెనీ టర్నోవర్ అంత ఉండాలి. – రాష్ట్రంలో అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశాం. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. – ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టు ఏజెన్సీలు నేరుగా సూపరింటెండెంట్/చీఫ్ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. – జరిగిన టెండర్లపై ఒక్క ఫిర్యాదు లేదా అభ్యంతరం రాలేదు. – టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. – ప్రాజెక్టు టెండర్లను భౌతికంగా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం. – టెండర్ల పూర్తికి 45 రోజుల గడువు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి చెప్పారు. – మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. – కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ్యపూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దుచేశాం. – ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యత పెరుగుతుంది. – నిధులు మిగలడంవల్ల మరిన్ని పనులు చేపట్టే వీలు కలుగుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వ్యక్తంచేశారు. -
ఆర్ అండ్ బీ టెండర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్అండ్బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్కు, రుణం అందిస్తున్న ఎన్డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎన్డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి. ► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం. -
టెండర్లలో గోల్ మాల్కు తెర
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అవుతోంది. రివర్స్ టెండర్లు, గత సర్కారు నిర్ణయాలపై పునఃసమీక్షల ద్వారా గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.4 వేలకు కోట్లకుపైగా ఆదా కావడం దీన్ని రుజువు చేస్తోంది. గత సర్కారు హయాంలో ఏ టెండర్ ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుని వారికే దక్కేలా నిబంధనలు రూపొందించారు. కొన్నిసార్లు ఎలాంటి టెండర్లు పిలవకుండానే నామినేషన్పై అప్పగించారు. పరిపాలన అనుమతులు లేకుండానే నోటి మాటతో నామినేషన్పై ఆర్టీజీఎస్లో టెండర్ను అప్పగించారు. వీటికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ విధానాలను ప్రక్షాళన చేయడమే కాకుండా జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పూర్తి పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రివ్యూకు 45 ప్రాజెక్టులు.. ► టెండర్ల ప్రక్రియలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిరోధం, పోటీతత్వం పెంపు, బిడ్డింగ్లో పారదర్శకంగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తెచ్చింది. ► గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 45 ప్రాజెక్టులకు సంబంధించి రూ.14,286 కోట్ల విలువైన పనుల టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు ప్రభుత్వం పంపింది. రూ.100 కోట్లు, అంతకు మించిన పనులన్నీ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాయి. ► రివర్స్ టెండరింగ్తోపాటు గత సర్కారు నిర్ణయాలను సమీక్ష చేయడం ద్వారా ఇప్పటివరకు రూ.4,000 కోట్లకుపైగా ప్రజాధనాన్ని ఆదా చేయగలిగారు. సాధారణ టెండర్లో 7.7 శాతం ప్రజాధనం ఆదా కాగా రివర్స్ టెండర్లకు వెళ్లడంతో 15.01 శాతం ఆదా కావడం గమనార్హం. (చదవండి: కూలీల ‘ఉపాధి’నీ అడ్డుకుంటున్నారు..) గత సర్కారు హయాంలో నామినేషన్పై రూ.13 వేల కోట్ల పనులు.. ► గత ప్రభుత్వం నీరుచెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన పనులను నామినేషన్పై పందేరం చేసింది. ఇందులో 90 శాతం నిధులను టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీకి చెందిన రూ.180 కోట్ల విలువైన పనులను చంద్రబాబు చెప్పారంటూ మాజీ ఆర్థిక మంత్రి బంధువుకు నామినేషన్పై ఇచ్చేశారు. ► ఆర్టీజీఎస్లో పరిపాలన అనుమతి లేకుండా రూ.185 కోట్ల విలువైన పనులను నామినేషన్పై కట్టబెట్టారు. ► సీఆర్డీఏలో టెండర్లలో గోల్మాల్కు అంతే లేదు. ఐదారుగురు కాంట్రాక్టర్లకు భారీగా అంచనాలు పెంచి అప్పగించారు. ఇప్పుడు పారదర్శకంగా టెండర్లు, పనులు.. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫర్నీచర్తోపాటు సెల్ఫోన్లు, సిమ్ కార్డులకు కూడా టెండర్లను పిలవడమే కాకుండా రివర్స్ టెండరింగ్ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ► మన బడి నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి స్కూళ్లలో ఫర్నీచర్తో పాటు గ్రీన్బోర్డులు, అల్మారాలకు కూడా టెండర్లను పిలవడమేగాక రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రూ.కోటి విలువైన పనులతోపాటు కొనుగోళ్లు, సేవలకు కూడా రివర్స్ టెండరింగ్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. (చదవండి: శ్రీకాంత్కు ప్రభుత్వం అండగా ఉంటుంది) -
ఆర్టీసీలో నగదు రహిత టికెటింగ్కు టెండర్లు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆర్టీసీలో నగదు రహిత టికెటింగ్ విధానం అమలు కానుంది. ఆన్లైన్ టికెటింగ్ కోసం ఏపీఎస్ఆర్టీసీ యాప్ ప్రవేశపెట్టి ప్రయాణికులు సులువుగా ప్రయాణం చేసేలా వీలు కల్పించనుంది. దేశంలోనే మొబైల్ ఆధారిత టికెటింగ్ వ్యవస్థను ఒక్క ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే ప్రవేశపెట్టనుంది. ఈ నెలాఖరున మొబైల్ ఆధారిత టికెటింగ్కు అధికారులు టెండర్లు నిర్వహించనున్నారు. తాజాగా ప్రీ బిడ్ సమావేశం నిర్వహించగా, 92 సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం–అవనిగడ్డ రూట్ను ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ఇందులో సానుకూల ఫలితాలు రావడంతో ఆర్టీసీలో ఆన్లైన్ టికెటింగ్ను దశల వారీగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ► ప్రస్తుతం 39 శాతం మంది మాత్రమే ఆర్టీసీలో ఆన్లైన్ టికెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ► మిగిలిన 61 శాతం ఆఫ్లైన్లోనే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. మరింత మంది ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందేలా ఆర్టీసీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ► ఆర్టీసీ సిబ్బంది తమ సొంత సెల్ఫోన్లతోనే టికెట్ జారీ, టికెట్ల వాలిడిటేషన్, టికెట్ చెకింగ్ చేసేలా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ► ఈ విధానంపై సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ► దేశంలో మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీకి ఆన్లైన్ టికెటింగ్లో ఆదరణ ఎక్కువగా ఉంది. -
‘విలువ’ పడిపోనుందా!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు క్లాతింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తోన్న ప్రఖ్యాత సంస్థ ‘నైకీ’తో ఒప్పందం వచ్చే సెప్టెంబరుతో ముగియనుంది. దాంతో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలవాలని బీసీసీఐ యోచిస్తోంది. తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్కు రూ. 88 లక్షల చొప్పున బోర్డుకు చెల్లించింది. ఏడాదికి మరో రూ. 6 కోట్ల మినిమం గ్యారంటీ, 15 శాతం రాయల్టీతో పాటు సుమారు రూ. 10 కోట్ల విలువైన నైకీ ఉత్పత్తులు కూడా అందించింది. ఇదంతా కలిపి నాలుగేళ్లలో 220 మ్యాచ్లు జరిగేలా ఒప్పందం కుదిరింది. అయితే కోవిడ్–19 కారణంగా ప్రపంచ మార్కెట్ దెబ్బ తింది. అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఏ రూపంలోనైనా స్పాన్సర్షిప్ మొత్తం తగ్గుదల కనిపించవచ్చని బీసీసీఐ అంచనా వేసింది. అందుకనుగుణంగా తాజాగా ప్రకటించబోయే రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లో బేస్ ప్రైస్ విలువను తగ్గించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తం రూ. 61 లక్షలుగా ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఇది 31 శాతం తక్కువ కావడం విశేషం. పైగా కంపెనీలు పలు సడలింపులు కోరుతూ షరతులు కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రూ.2,978 కోట్లతో రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. తొలిదశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.2,978.51 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1,243.51 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదార్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి 70 శాతం నిధులు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణ సహాయం అందిస్తుండగా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వంభరించనుంది. ► అన్ని జిల్లాల్లో కలిపి 33 ప్యాకేజీల కింద రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు. 17 ప్యాకేజీల కింద 696.75 కి.మీ. విస్తరణకు రూ.1,746.84 కోట్లు, భూ సేకరణకు రూ.19.27 కోట్లు. మొత్తం రూ.1,766.11 కోట్లు ► 16 ప్యాకేజీల కింద 546.76 కి.మీ. విస్తరణకు రూ.1,200.79 కోట్లు, భూ సేకరణకు 11.61 కోట్లు కలిపి మొత్తం రూ.1,212.40 కోట్లు ► ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేందుకు ఆర్అండ్బీ కసరత్తు ► ఎన్డీబీ రుణ సాయంతో సుమారు 3,100 కిలోమీటర్ల మేర రహదార్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక టెండర్ల పారదర్శక నిర్వహణకు జ్యుడీషియల్ ప్రివ్యూ రాష్ట్రంలో రూ.100 కోట్లు పైబడిన ఏ ప్రాజెక్టు అయినా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతున్నారు. రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లను గత నెల 28న జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించారు. పారదర్శకత కోసం ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 3వ తేదీతో గడువు ముగిసింది. టెండర్ల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ తుది గడువుగా ఆర్అండ్బీ పేర్కొంది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతులతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. -
రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.660 కోట్లను వెచ్చించి మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్లుగా ఈ రెండు స్టేషన్లను తీర్చి దిద్దనున్నారు. ఇందుకోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ముందుగా నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ఆన్లైన్లో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించగా జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, అదానీ గ్రూప్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, శోభా, బ్రిగేడ్, ఎంబసీ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. జూన్ రెండో వారంలో టెండర్లను ఆర్ఎల్డీఏ ఖరారు చేయనుంది. టెండర్లు ఖరారైన తర్వాత మూడేళ్లలోపు రీ డెవలప్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసి నిర్వహణకు 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్ కోర్టులు, క్లోక్ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు వంటివి ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్ను రూ.130 కోట్లతో రీ డెవలప్మెంట్ చేయనున్నారు. పీపీపీ విధానంలో అభివృద్ధి ► డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు. ► కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ► తిరుపతి, నెల్లూరులలో ఉన్న రైల్వే భూములు వాణిజ్య అభివృద్ధికి, డెవలపర్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఉపయోగపడతాయి. ► ఈ సందర్భంగా ఆర్ఎల్డీఏ వైస్ చైర్మన్ వేద ప్రకాష్ దుడేజా మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ఆ ప్రాంతాల వాణిజ్య అభివృద్ధికి, పర్యాటక సామర్థ్యం, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుంది అన్నారు. -
వైద్య రంగంలో నాడు–నేడుకు జూన్లో టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు నాడు–నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులకు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన పనులను ఆర్ అండ్ బీకి.. సబ్సెంటర్ల పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే.. జిల్లా బోధనాస్పత్రుల్లో పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎటువంటి సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు, వైద్య పరికరాలను సమకూర్చడమే లక్ష్యంగా వైద్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. కార్యక్రమం అమలు పురోగతిపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విలేజ్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో చేపట్టదలచిన నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా.. ► ప్రజారోగ్య వ్యవస్థపై మనం రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం. ► దీనివల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ► ఎలాంటి సమస్యలొచ్చినా ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ► ఈ పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలి. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలి. ► ఈ పనులు ఇప్పటి వారికే కాదు.. భవిష్యత్తు తరాలకూ సంబంధించినవి. ► అందుకే పనుల్లో నాణ్యత ఉండాలి.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి. ► రాష్ట్ర చరిత్రలో ఈ పనులు చిరస్థాయిగా నిలిచిపోవాలి. నాడు–నేడు లాంటి కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుంది. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించేలా పంప్హౌస్లు, కాల్వలు, రిజర్వాయర్లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్బే, వెలగటూరు వద్ద మొదటి పంప్హౌస్ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్ 17 వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. -
వచ్చే నెలలో ‘కృష్ణపట్నం నోడ్’ టెండర్లు
సాక్షి, అమరావతి: బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్ (సీబీఐసీ)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్ (పారిశ్రామిక ప్రాంతం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్లో సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్డిట్)తో కలిసి 50 : 50 భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా నిక్డిట్ కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ను సర్కారు ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ, పర్యావరణ తుది అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలుపెడతామని ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్భార్గవ తెలిపారు. కాగితాల్లో నుంచి కార్యరూపంలోకి.. గత కొన్నేళ్లుగా కేవలం కాగితాలకే పరిమితమైన ఈ కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ పనులపై వైఎస్ జగన్ సీఎం కాగానే దృష్టిసారించారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్లో ఈపీసీ టెండర్లు పిలిచి సెప్టెంబర్లో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే సీబీఐసీ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం జపాన్కు చెందిన జైకా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మూడు క్లస్టర్ల అభివృద్ధి.. కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్లో వివిధ రంగాల పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా మూడు రకాల క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. అవి.. - ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, మినరల్స్ తదితర పరిశ్రమల కోసం క్లస్టర్–1ను అభివృద్ధి చేస్తారు. - ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమలకు క్లస్టర్–2ను ఏర్పాటుచేస్తారు. - ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ పరికరాల కోసం కస్టర్–3ను అభివృద్ధి చేస్తారు. 5.15 లక్షల మందికి ఉపాధి ఈ పారిశ్రామిక నోడ్లో పరిశ్రమలకు సుమారు 7,785 ఎకరాలు, నివాసాల కోసం 1,699 ఎకరాలు.. మిగిలిన మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన.. ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. - ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు రూ.37,500 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని అంచనా. - తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం 99,400 కుటుంబాలు నివాసం ఉండటం ద్వారా ఈ నోడ్లో 3.12 లక్షల మంది నివాసం ఉంటారన్న అంచనాతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. -
సహకార లావాదేవీలు పారదర్శకం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు వాటిని కంప్యూటరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్సీడీసీ (నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు) ఆర్థికకసాయం చేయనున్నాయి. ఎన్సీడీసీ 65 శాతం నిధులు రుణంగానూ, 20 శాతం సబ్సిడీగానూ అందిస్తుంటే 15 శాతం నిధులు ఆప్కాబ్ సమకూరుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణపై నిర్ణయం తీసుకోవడంతో అధికారులు దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కంప్యూటరీకరణ ఎందుకంటే.. - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని పాలకవర్గాలు, సిబ్బంది కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. - కంప్యూటర్ల వినియోగం లేకపోవడంతో ఒక సంఘంలో రుణాలు ఎగవేసిన రైతులు, వ్యాపారులు మరో సంఘంలోనూ రుణాలు పొందుతున్నారు. అక్కడా రుణాలు ఎగవేస్తుండటంతో సంఘాల ఆర్థికంగా నష్టపోతున్నాయి. - ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సహకార శాఖ పనితీరును అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సంస్థను నియమించాలని ఆదేశించారు. -దీంతో నాబ్కాన్స్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్)ను అధికారులు నియమించారు. ఆ సంస్థ ఇప్పటికే అనేక సంఘాల్లోని పరిస్థితులను పరిశీలించి అక్రమాలు నిలువరించడానికి కంప్యూటరీకరణ అనివార్యంగా పేర్కొంది. -
అదనపు టీఎంసీకి శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనుల వేగిరానికి శ్రీకారం చుడుతోంది. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే 3వ టీఎంసీ నీటిని తీసుకునేలా పంప్హౌస్ల నిర్మాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన మిడ్మానేరు వరకు ఉన్న పనులు జరుగుతున్నాయి. మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే కసరత్తులు చేస్తోంది. వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్మానేరు వరకు 2 టీఎంసీ, దిగువన ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అదనంగా మరో టీఎంసీని తీసుకుంటూ మిడ్మానేరు వరకు 3 టీఎంసీలు, దిగువన 2 టీఎంసీల నీటిని తీసుకునేలా పనులు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్లలో ఉన్న 28 పంపులకు అదనంగా మరో 15 పంపుల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎల్లంపల్లి నుంచి రెండు పంప్హౌస్లను నిర్మించి, దేవికొండ రిజర్వాయర్ ద్వారా వరద కాల్వ నుంచి నీటిని మిడ్మానేరు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 టీఎంసీల మేర నీటిని తరలించేలా వరద కాల్వను మరింత వెడల్పు చేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు మొత్తంగా రూ.11,800 కోట్లు అవుతుందని లెక్కించారు. ఈ పనులను 4 లేక 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిడ్మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు పైప్లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు కలిపి మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ పనులను సైతం 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచే యోచనలో నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అదనపు టీఎంసీ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. -
సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశకు టెండర్లు
సోమశిల హైలెవల్ కెనాల్.. మెట్టవాసుల ఆశాదీపం. మొక్క కూడా మొలవని ఈ ప్రాంతాన్నిసస్యశ్యామలం చేసేందుకు దీనికి శ్రీకారం చుట్టారు. సాగు, తాగునీటిని అందించేందుకు దశాబ్దం క్రితం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. దివంగత సీఎం వైఎస్సార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనా, అవి నత్తను తలపించాయి.జరిగిన పనుల్లోనూ ఎక్కువ శాతం నాసిరకంగానే జరిగాయి. భూ సేకరణలో సైతం జాప్యం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించింది. తొలిదశ పనులనువేగవంతం చేశారు. రెండో దశ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అయింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకుమంత్రులు గౌతమ్రెడ్డి, అనిల్కుమార్యాదవ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సాక్షి, నెల్లూరు: ఏటా కరువు కాటకాలతో బతుకు కష్టమై వలసలకు వేదికగా మారిన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చి మెట్టవాసులను ఆదుకోవాలని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. 2009లో సోమశిల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు సోమశిల జలాశయం నుంచి ఐదు టీఎంసీలను ఎత్తిపోతల పథకం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, మర్రిపాడు మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లోని దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీటితో పాటు 58 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి తాగునీరందించేలా రూ.1,560 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్కు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఐదు మండలాల్లోని 5,320 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో సోమశిల జలాశయం నుంచి కాలువ తీసి మర్రిపాడు మండలంలోనిపొంగూరులో, ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లి, పెగళ్లపాడులో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ ఉంచి సాగు, తాగునీరందించేలా ఏర్పాటు చేశారు. తొలి విడతగా రూ.840 కోట్లకు టెండర్ను ఆహ్వానించగా మెగా కంపెనీ దక్కించుకొని పనులను ప్రారంభించింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినానేటికి ఆయా పనులను 57 శాతం మేరే పూర్తి చేశారు. కేవలం పొంగూరు రిజర్వాయర్ వరకే పూర్తి చేశారు. ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లిలో భూసేకరణ కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో అక్రమాలే సోమశిల హైలెవల్ కెనాల్ భూసేకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తొలిదశలో మర్రిపాడు మండలంలోని పొంగూరులో టీఎంసీ నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్ పనులు చేశారు. ఆ గ్రామంలో 1,200 ఎకరాల భూసేకరణ చేశారు. అందులో 270 ఎకరాలకు మాత్రమే పరిహారమిచ్చారు. మిగిలినవి చుక్కలు భూములు, ప్రభుత్వ భూములు ఉండటంతో 930 ఎకరాలకు పరిహారాన్ని పెండింగ్లో ఉంచారు. పొంగూరు రెవెన్యూలో మాత్రం ఎకరా బీడు భూమికి రూ.ఐదు లక్షలు, బోరు, మోటార్ ఉన్న భూమికి రూ.5.5 లక్షల వంతున పరిహారమిచ్చారు. పొంగూరు కండ్రిక సమీపంలో నేషనల్ హైవేకు అనుకున్న భూములకు మాత్రం రూ.ఏడు లక్షల వంతున పరిహారం చెల్లించారు. ఒకే రెవెన్యూ పరి«ధిలో పరిహారం తేడాలు ఉన్న వెనుక భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక టీడీపీ నేతలు, రెవెన్యూ, తెలుగుగంగ భూసేకరణ అధికారులకు ఎకరాకు రూ.రెండు లక్షల వంతున పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడు, రాజులపాడు రిజర్వాయర్ల కోసం చేస్తున్న భూసేకరణలో కూడా భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడులో రిజర్వాయర్కు దాదాపు 600 ఎకరాలను సేకరిస్తున్నారు. ఆ గ్రామంలో ఎకరాకు రూ.3.5 లక్షల మేర నిర్ణయించి భూసేకరణ చేస్తున్నారు. రాజులపాడు రిజర్వాయర్ కోసం దాదాపు 400 ఎకరాల భూసేకరణ కోసం ఎకరాకు రూ.4.5 లక్షలు నిర్ణయించారు. దీంతో కొందరు అక్రమార్కులు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను వెబ్ అడంగల్లో పేర్లు నమోదు చేసుకొని నకిలీ డీ ఫారం పట్టాలను సృష్టించి పరిహారం పొందారనే ఆరోపణలున్నాయి. గత టీడీపీ హయాంలో ఓ తహసీల్దారు ఎకరా ప్రభుత్వ భూమికి రేట్ ఫిక్స్ చేసి వెబ్ అడంగల్లో పేర్లు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పడమటినాయుడుపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు నిర్మించారు. స్థానికంగా ఉన్న కేతామన్నేరు వాగునే అక్రమించి అక్రమ కట్టడం చేపట్టారు. గామంలో దాదాపు 200 అక్రమ ఇళ్ల నిర్మాణాలు జరిగాయని సమాచారం. నాసిరకంగా నిర్మాణాలు సోమశిల జలాశయం నుంచి జరిగిన హైలెవల్ కెనాల్ పనులు నాసిరకంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పొంగూరు రిజర్వాయర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానికంగానే చెరువులో ఉన్న మట్టినే తీసి కట్టకు వేశారు. ఆ మట్టిని వాడకూడదని నిపుణులు చెప్తున్నా నిర్మాణదారులు పట్టించుకోలేదు. పదికాలాల పాటు ఉండాల్సిన కట్ట పూర్తికాకముందే పగుళ్లు ఏర్పడటంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో టీడీపీ నేతలకు మెగా కంపెనీ సబ్ కాంట్రాక్ట్కు ఇవ్వడంతో పనుల్లో నాణ్యత తగ్గిందనే ఆరోపణలు ఉన్నాయి. పనులను నాసిరకంగా చేసి బిల్లులు తినేశారనే ఆరోపణలు ఉన్నాయి. మెట్టకు జీవం:అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆనం, మేకపాటి మెట్టప్రజలకు సాగు, తాగునీటిని అందించాలని 2009లోనే దివంగత సీఎం వైఎస్సార్ను కోరాం. అయన స్పందించి సోమశిల హైలెవల్ కెనాల్కు అంకురార్పణ చేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన కెనాల్ పనులు నాసిరకంగా జరిగాయి. భూసేకరణలో అక్రమాలు జరగడంతో కెనాల్ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. ఐదేళ్ల పాటు 57 శాతం కూడా పనులను పూర్తి చేయలేకపోయారు. తొలి దశ పనులనే పూర్తి చేయలేకపోయారు. రాజకీయ అవసరాల కోసం రెండో దశ టెండర్లను ఎన్నికలకు ముందు ఆహ్వానించి గత ప్రభుత్వం మోసం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. హైలెవల్ కెనాల్ను పూర్తి చేస్తే మెట్ట ప్రజలు జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు.మా హయాంలోనే పూర్తిచేస్తాం –అసెంబ్లీలో మంత్రి అనిల్కుమార్యాదవ్ సోమశిల హైలెవల్ కెనాల్ పనులను తమ హయాంలోనే పూర్తి చేస్తాం. రైతు భరోసా పథకం ప్రారంభానికి నెల్లూరు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన చొరవతోనే రెండో దశకు కూడా టెండర్లు ఆహ్వానించి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.67.9 లాభం చేకూర్చాం. గత టీడీపీ తొలి దశ పనులను 57 శాతమే పూర్తి చేసింది. ఆ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. రెండో దశపూర్తయితే.. సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం సగభాగం సస్యశ్యామలమవుతుంది. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగునీరందుతుంది. రూ.503.37 కోట్ల వ్యయంతో రెండో దశ పనులకు ప్రస్తుత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా, రివర్స్ టెండరింగ్తో బీవీఎస్సార్ కన్స్ట్రక్షన్ చేజిక్కించుకుంది. 36 నెలల్లో ఆయా పనులను పూర్తి చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. పనులు పూర్తి చేస్తే ఆ మూడు మండలాల్లోని బీడు భూములు సిరులు కురిíపించే అవకాశం ఉంది. -
రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టనున్న పనులకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకంగా రూ.33,397 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఆరంభించాలని సీఎం కేసీఆర్ సాగునీటి శాఖను ఆదేశించారు. ఇందులో కాళేశ్వరం పరిధిలోని అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన విలువే రూ.25 వేల కోట్లకు పైగా ఉండగా, ఖమ్మం జిల్లాలోని సీతారామ, కొత్తగా చేపట్టనున్న పనుల విలువ మరో రూ.7,400 కోట్ల మేర ఉండనుంది. ఈ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అదనపు టీఎంసీకి భారీగానే.. కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా మొదటి దశలో రెండు టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసేలా డిజైన్ చేసి పనులు పూర్తి చేశారు. అనంతరం మరో టీఎంసీ నీటిని సైతం తీసుకోవాలని నిర్ణయించి ఆ పనులను ఇప్పటికే మొదలు పెట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని 3 పంప్హౌస్లకు కలిపి రూ.7,998 కోట్ల అంచనాతో చేపట్టగా, అదనపు టీఎంసీ పనులను మరో రూ.4,394 కోట్లతో చేపట్టారు. ఈ పనులు జరుగుతున్నాయి. ఇక గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు చేపట్టిన పనుల టెండర్లకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రూ.11,500 కోట్ల ఈ పనులకు వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. ఇక మిడ్మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలా రోజులు పడుతున్న నేపథ్యంలో పైప్లైన్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుండగా, ఈ పనుల టెండర్లకు సీఎం ఓకే చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలోని క్యాంపు కార్యాలయాల కోసం రూ.43 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884 కోట్లతో చేపట్టగా, ఇందులో ఇప్పటికే 8 ప్యాకేజీల పనులకు రూ.4,816 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు సత్తుపల్లి ప్రధాన కాల్వ ప్యాకేజీ–9 నుంచి జూలూర్పాడ్ మండలం వరకు (ప్యాకేజీ–13 వరకు) చేపట్టే పనులకు టెండర్లు ఈ నెలలోనే ఆరంభించాలని సీఎం సూచించారు. ఈ పనులకు రూ.2,952 కోట్లవుతుందని అంచనా వేశారు. దుమ్ముగూడెం బ్యారేజీ, పవర్హౌస్కు రూ.4,500 కోట్లు.. ఇక దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఫ్లడ్ రిజర్వాయర్ లెవల్ 49.67 మీటర్లు ఉండగా నీటి సామర్థ్యం 1.3 టీఎంసీలుగా ఉంది. దీన్ని మరో 13 మీటర్ల మేర అంటే 63 మీటర్లకు పెంచి 37 టీఎంసీల మేర నీటి నిల్వ చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటే 320 మెగావాట్ల సామర్థ్యంతో పవర్హౌస్ నిర్మించాలని సూచించారు. ఇందులో బ్యారేజీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, పవర్హౌస్కు మరో రూ.1,500 కోట్లు అవుతుందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ బ్యారేజీ ద్వారా ఖమ్మం జిల్లాలో సీతారామ కింద నిర్ణయించిన 6.40 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో పాటు, నాగార్జునసాగర్ కింద ఖమ్మం జిల్లాలో ఉన్న 2.60 లక్షల ఎకరాలకు నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు ఆరంభించాలని సీఎం సూచించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. -
మద్యం ‘డ్రా’ ముగిసెన్..
సాక్షి, ఖమ్మం: మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దరఖాస్తుదారుల్లో కొందరికి అదృష్టం తలుపు తట్టగా.. మరికొందరిని దురదృష్టం వెక్కిరించింది. నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రారంభించారు. ఈసారి డ్రా ప్రక్రియ సాయంత్రం 3.30 గంటలకే ముగిసే విధంగా ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేయడంతో సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 89 మద్యం దుకాణాలకు 4,303 దరఖాస్తులు రాగా.. వాటిలో సుమారు వెయ్యి మంది వరకు మహిళలు దరఖాస్తు చేయడం విశేషం. పాత సిండికేట్లకు భంగపాటు.. కొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో దాదాపు 10 నుంచి 12 షాపులు దక్కించుకోవడంతో ఈసారి కూడా వారు తమకు అదృష్టం తలుపు తడుతుందనే ఆశతో ఎదురుచేశారు. అయితే సిండికేట్లో 70 దరఖాస్తులు వేయగా.. ఒక్క షాపు కూడా దక్కలేదు. మరికొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పారు. ఈసారి కూడా అలాగే భావించి 104 దరఖాస్తులు వేయగా.. వారికి కేవలం 3 షాపులు మాత్రమే దక్కాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొత్తోళ్లకు కలిసొచ్చిన అదృష్టం.. గత ఏడాది మద్యం షాపులలో ఒక్క షాపు కూడా దక్కని సిండికేట్లు ఈసారి మద్యం షాపుల డ్రాలో మంచి షాపులను దక్కించుకున్నారు. దీనికితోడు కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు సిండికేట్లు గా ఏర్పడి వచ్చిన వారికి సైతం ఆశ్చర్యకరంగా వైన్ షాపులు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాగే మరికొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తే వైన్ షాపు దక్కుతుంది.. లేదంటే రూ.2లక్షలు పోతాయని రంగంలోకి దిగిన సుమారు 20 మందిలో ఐదుగురికి వ్యాపారం బాగా నడిచే ఎ–1 దుకాణాలు దక్కడం విశేషం. డ్రాలో మహిళలు ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలు డ్రా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికితోడు చాలా మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డ్రా జరిగే సీక్వెల్ ప్రాంతానికి జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచే చేరుకున్నారు. వీరిలో చంటిపిల్లలతో సైతం డ్రాలో పాల్గొనేందుకు వచ్చారు. ఇతర ప్రాంత వ్యాపారుల హవా.. జిల్లాలో మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న 27 మద్యం దుకాణాల్లో 20కిపైగా ఇతర ప్రాంతాల వారే దక్కించుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–2 ప్రాంతాల్లో సైతం ఇక్కడి వారితో సిండికేట్ అయి మొత్తం 30కిపైగా మద్యం షాపులను దక్కించుకున్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా ప్రాంతాలకు చెందిన వారికి షాపులు అధికంగా దక్కాయి. ఎక్సైజ్ శాఖకు రూ.6,43,75,000 ఆదాయం జిల్లాలో 89 షాపుల డ్రా ప్రక్రియ ద్వారా ఎక్సైజ్ శాఖకు లైసెన్స్ ఫీజు కింద రూ.6,43,75,000 ఆదాయం లభించింది. 41 షాపులకు రూ.55లక్షలు సంవత్సరానికి ఫీజు ఉండగా.. ఇందులో మొదటి విడతగా 8వ వంతు లైసెన్స్ ఫీజు కింద రూ.2,81,87,500 ఆదాయం రాగా.. 33 షాపుల కు రూ.65లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.2,68,12,500 వచ్చాయి. మరో 15 షాపులకు రూ.50లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.93,75,000 వచ్చాయి. ఈసారి ఈఎండీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం షాపును కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరాములు దక్కించుకున్నాడు. దీనికి 132 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మొదట ఎక్సైజ్ స్టేషన్–1కు డ్రా తీయగా.. పాశంగులపాటి కృష్ణారావు అనే వ్యక్తి ఈ షాపును దక్కించుకున్నాడు. మహిళల్లో మొదటి షాపుగా షాపు నం–4ను మౌనిక దక్కించుకుంది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మద్యం షాపుల టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ఆయనకు షాపు దక్కలేదు. అలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేసి.. ఎటువంటి అనుభవం లేకుండా మొదటిసారిగా షాపులు దక్కించుకున్న వారికి గుడ్విల్ కింద రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తామని.. తమకు ఆ షాపులు ఇవ్వాలని కొందరు తలపండిన మద్యం వ్యాపారులు బేరసారాలు కొనసాగించినట్లు తెలిసింది. డ్రా జరిగే హాలుతోపాటు బయట కూడా ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేసి డ్రా ప్రక్రియను అందరూ చూసేలా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. డ్రా ప్రక్రియలో కలెక్టర్ కర్ణన్తోపాటు సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, ఏసీపీ వెంకట్రావు, ఎక్సైజ్ ఏఈఎస్ సైదులు, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1 సీఐ రాజు, ఎౖMð్సజ్ సీఐలు సర్వేశ్వరరావు, రమ్య, జుల్ఫీకర్, పోశెట్టి తదితర సిబ్బంది పాల్గొనగా.. ఖమ్మం వన్టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
ఆబ్కారీ బోణీ రూ.80.26 కోట్లు
సాక్షి, కరీంనగర్ : నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాకముందే ఆబ్కారీ శాఖ గణమైన బోణీ కొట్టింది. 2019–21 కింద రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల(ఏ–4 షాప్స్) నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లాలోని 266 దుకాణాలకు ఏకంగా 4,013 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ఎక్సైజ్ శాఖ ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కో దుకాణానికి సగటున 15.01 దరఖాస్తులు అందగా, జగిత్యాల జిల్లాలో పోటీపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 2019–21 సంవత్సరాల కోసం(రెండేళ్ల పాటు) మద్యం దుకాణాల లైసెన్స్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకు న్నారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారంతో గడువు ముగియగా, అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాల్లో దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అదృష్టం కలిసి రాకపోతే దరఖాస్తుకు వెచ్చించిన రూ.2లక్షలు తిరిగిరావు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 266 మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా, ఎన్నడూ లేని విధంగా 4,013 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో దుకాణానికి 15 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల, కరీంనగర్తో పోలిస్తే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లల్లో పోటీ కొంత తక్కువగా ఉంది. వీరిలో 480 మంది మహిళలు కావడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్(తిరిగి చెల్లించని) రుసుం రూ.2 లక్షలు కాగా, ఈ దరఖాస్తుల ద్వారా ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం రూ.80.26 కోట్లు. ఈసారి ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్యం వ్యాపారులు కూడా తెలంగాణలో దుకాణాలు దక్కించుకునేందుకు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. ఈ తరహాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఏపీకి చెందిన వారు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తులు అందజేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అదే సమయంలో జిల్లాకు చెందిన వ్యాపారులు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది రింగ్ అయి, డిమాండ్ ఉన్న షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో షాపు కోసం సగటున 15 మంది దరఖాస్తు చేయడంతో 266 షాపులకు గాను ఎక్సైజ్ శాఖకు ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ దరఖాస్తుల్లో సగానికి పైగా చివరిరోజైన బుధవారం నాడు దరఖాస్తు చేసుకున్నవే. జగిత్యాలలో సగటున 20 దరఖాస్తులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జిల్లాలో 87 షాపులు ఉండగా, వీటిని దక్కించుకునేందుకు 1346 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో షాపు కోసం సగటున 15.5 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మహిళా దరఖాస్తుదారులే 170 మంది ఉండడం విశేషం. ఈ ఒక్క జిల్లా నుంచే దరఖాస్తులను విక్రయించడం ద్వారా రూ.26.92 కోట్లు ఆబ్కారీ శాఖకు ఆదాయం సమకూరింది. ఇక జగిత్యాల జిల్లాలో 64 దుకాణాలే ఉండగా, 1285 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక దుకాణానికి 20 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.25.70 కోట్లు ఆదాయం సమకూరింది. 161 మంది మహిళలు అదృష్టాన్ని నమ్ముకోవడం గమనార్హం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట మద్యం దుకాణం కోసం ఏకంగా 48 మంది దరఖాస్తులు దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలం 48వ దుకాణానికి 41 దరఖాస్తులు అందాయి. కరీంనగర్ పట్టణంలో లైసెన్స్ ఫీజు ఎక్కువగా ఉండడం, ఇక్కడ పాతుకుపోయిన ఒకటి రెండు దుకాణాలతో పోటీ పడి విక్రయాలు జరపలేమని పలువురు వ్యాపారులు ఆదాయం అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. అంచనాలు తప్పిన పెద్దపల్లి మద్యం విక్రయాల్లో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంటుంది. సింగరేణి కాలరీస్ నెలవై ఉన్న రామగుడం కార్పొరేషన్ , పెద్దపల్లి జిల్లా కేంద్రాలతోపాటు రాష్ట్ర, జిల్లాల సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో అధికం. గోదావరి ఖని కోల్బెల్ట్ ఏరియాలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు మాత్రం సింగరేణి కోల్బెల్ట్ నుంచి తక్కువగా రావడం గమనార్హం. దీనిని బట్టి ఇక్కడి వ్యాపారులు రింగ్ అయి పరస్పర ఒప్పందంతో కలిసి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వ్యాపారులే సిండికేట్ అయి దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలిసింది. ఒక్కో దుకాణానికి రెండు లేదా మూడు మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఓదెల మండలం పొత్కపల్లి, ఎలిగేడ్ మండల కేంద్రం దుకాణాలకు మాత్రమే 28 మంది చొప్పున దరఖాస్తు చేసుకోగా, గర్రెపల్లి దుకాణానికి 27 మంది పోటీ పడ్డారు. జిల్లాలో 61 మంది మహిళలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, సుల్తానాబాద్ సర్కిల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనే 34 మంది పోటీ మహిళలు పోటీ పడడం విశేషం. సిరిసిల్లలో 41 దుకాణాలకు 648 దరఖాస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 దుకాణాలకు గాను 648 దరఖాస్తులు అందాయి. వీటిలో 88 మంది మహిళా దరఖాస్తుదారులు ఉన్నారు. కాగా ఈ దరఖాస్తుదారుల ద్వారా ఎక్సైజ్ శాఖకు 12.96 కోట్లు ఆదాయంగా సమకూరనుంది. సిరిసిల్లలోని 6వ నెంబర్ దుకాణానికి అత్యధికంగా 36 మంది దరఖాస్తు చేసుకోగా రుద్రంగి మండలంలోని మానాల మద్యం దుకాణానికి అత్యల్పంగా కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి. నేడు లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు ఎక్సైజ్ శాఖకు జిల్లాల వారీగా వచ్చిన సీల్డ్ దరఖాస్తులను శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాలలో తెరవనున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమక్షంలో దుకాణాల వారీగా విభజించి, లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు జరపనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ఆడిటోరియాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ మౌలిక సదుపాయాల(న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టాన్ని రాష్ట్రసర్కారు తీసుకురావడం, టెండర్ల న్యాయ పరిశీలన బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జికి అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల జాబితాలను సంబంధిత శాఖలన్నీ తక్షణం పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాల్లోని వారి గత రికార్డుపై విజిలెన్స్ నివేదికల్ని తీసుకోవడంతోపాటు ఎటువంటి మచ్చలేని వారితోనే జాబితాలను పంపాలన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్థానిక అధికారి రూ.100 కోట్లు.. అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు వెళ్లేముందు ఆయా పత్రాలన్నింటినీ న్యాయపరమైన సమీక్షకోసం ముందుగా న్యాయమూర్తికి సమర్పించాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. ఒకసారి జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండబోవన్నారు. ‘స్పందన’కు ప్రామాణిక విధానాన్ని పాటించాలి ‘స్పందన’ కార్యక్రమం కింద వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలూ ఒకే ప్రామాణిక విధానాన్ని(స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్) పాటించాలని సీఎస్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ‘స్పందన’పై వర్క్షాప్ జరిగింది. ప్రజలనుంచి వచ్చే ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించాల్సిన ‘స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్’పై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచనలిచ్చారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్ట కాలవ్యవధి పెట్టి ఆ గడువులోగా సదరు ఫిర్యాదును పరిష్కరించడంతోపాటు ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ను సిద్ధం చేసి ఆ వివరాల్ని ప్రణాళికా శాఖకు అందించాలని సూచించారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి శాఖలవారీగా రూపొందించిన కాలవ్యవధి(టైమ్ లైన్), స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ వివరాల్నీ అందించాలన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించడంపై అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు.. లబ్ధిదారు ఎంపిక అనంతరం సోషల్ ఆడిట్ తప్పనిసరన్నారు. -
అవినీతి అంతానికే రివర్స్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి అవినీతిని నిర్మూలించేందుకే రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు ముందుగానే అందించడం కోసం మిగిలిన పనులను పారదర్శకంగా కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికే రివర్స్ టెండర్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం రద్దు చేసిన కాంట్రాక్టు ఒప్పందం విలువ ఆధారంగా మిగిలిన పనుల విలువను ఖరారు చేసి దాన్నే అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)గా నిర్ణయించి, రివర్స్ టెండర్ నిర్వహిస్తుండటం వల్ల అదనపు భారం పడదని తేల్చి చెప్పింది. టెండర్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి చూడాలని కోరింది. గోదావరికి వరదల వల్ల నవంబర్ వరకు ప్రాజెక్టు పనులు చేసేందుకు ఆస్కారం లేదని, సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్ను ఖరారు చేసి నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని, దీనివల్ల ఎక్కడా జాప్యం జరగదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం పీపీఏ సీఈవో ఆర్కే జైన్కు లేఖ రాశారు. పోలవరం హెడ్వర్క్స్లో కాంట్రాక్టు ఒప్పందాలను ముందస్తుగా రద్దు చేయడం, మిగిలిన పనులకు రివర్స్ టెండర్ నిర్వహించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఈనెల 16న ఆర్కే జైన్ రాసిన లేఖకు సమాధానంగా ఆదిత్యనాథ్దాస్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న అంశాలు ఇవీ.. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా... ‘‘పునర్విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. వాస్తవంగా పోలవరం హెడ్వర్క్స్ను 2013 మార్చి 2న ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–ఈసీ–యూఈఎస్(జేవీ)కి అప్పగిస్తూ (ఈపీసీ ఒప్పందం నెం:1, 2012–13) నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2018 మార్చి 1 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. దీనిపై ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఫలితం లేదు. అప్పటి నిర్ణయం మేరకే.. పోలవరం హెడ్వర్క్స్లో కొంత భాగం పనులను 60 సీ కింద తొలగించి వాటికి 2016–17 ధరలను వర్తింప చేస్తూ 2017 నవంబర్ 27న గత ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై 2018 జనవరి 11న విజయవాడలో నిర్వహించిన పీపీఏ 7వ సమావేశంలో చర్చ కూడా జరిగింది. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రస్తుత కాంట్రాక్టు ఒప్పంద విలువ ప్రకారం ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఆ సమావేశంలో పీపీఏ పేర్కొంది. ఆ తర్వాత ట్రాన్స్ట్రాయ్ నుంచి మిగిలిన పనులను 60 సీ కింద మూడు విడతలుగా విడదీసిన పనులను నవయుగకు, నాలుగో విడత పనులను బీకెమ్కు గత ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పనులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరంలో ఈపీసీ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్ఎస్–ఓపెన్ విధానంలో నవయుగ, బీకెమ్లకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే హెడ్వర్క్స్లో మిగిలిన పనులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ నిర్వహించి ఒకే సంస్థకు అప్పగించాలని సూచించింది. కుడి, ఎడమ కాలువ పనులను 60–సీ కింద విడదీసి నామినేషన్పై అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసి మిగిలిన పనులకు రివర్స్ టెండర్ నిర్వహించాలని కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే నవయుగ, బీకెమ్లకు నోటీసులిచ్చాం. పారదర్శకంగా రివర్స్ టెండర్ నిర్వహణకు ఈనెల 16న మార్గదర్శకాలు జారీ చేశాం. అదనపు భారం పడదు.. జాప్యం జరగదు పోలవరం హెడ్వర్క్స్లో నవయుగ, బీకెమ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈనెల 12న రద్దు చేశాం. ఇదే అంశాన్ని ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించిన పీపీఏ 10వ సమావేశంలో వివరించాం. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకునే వరకు కాంట్రాక్టు ఒప్పందాలను ముందస్తుగా రద్దు చేయడం, మిగిలిన పనులకు రివర్స్ టెండర్ నిర్వహించడాన్ని నిలుపుదల చేయాలని సూచిస్తూ పీపీఏ సీఈవో ఈనెల 16న లేఖ రాశారు. గోదావరిలో అక్టోబర్ నాటికి వరదలు తగ్గుముఖం పడతాయి. నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించి జూన్ వరకు శరవేగంగా చేయడం ద్వారా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించాం. అందుకే కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి ఈనెల 12న రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశాం. రాష్ట్ర ప్రజలకు పోలవరం ఫలాలను సత్వరమే అందించాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్త కాంట్రాక్టర్ ఎంపిక కోసం రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశాం. రద్దు చేసిన ఒప్పంద విలువ ప్రకారం మిగిలిన పనుల అంచనా విలువను లెక్క కట్టి దాన్నే ఐబీఎంగా నిర్ణయించి రివర్స్ టెండర్ నిర్వహిస్తున్నాం. దీనివల్ల అదనపు భారం పడదు. నవంబర్ 1 నుంచి కొత్త కాంట్రాక్టర్తో పనులు ప్రారంభిస్తాం. ఇక పనుల్లో జాప్యం అన్న ప్రసక్తే ఉత్పన్నం కాదు’’ -
కొత్త సచివాలయానికి 8 నమూనాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవనం కోసం అధికారులు ఎనిమిది నమూనాలతో కుస్తీ పడుతున్నారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్లు కావాలంటూ రోడ్లు భవనాలశాఖ ఇటీవలే దేశవ్యాప్తంగా పేరున్న 20 మంది ఆర్కిటెక్ట్లకు లేఖలు రాయడం తెలిసిందే. వారి నుంచి వచ్చిన నమూనాలను సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది. గతంలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ స్వచ్ఛందంగా పంపిన నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆకట్టుకుంది. గుమ్మటాలతో ఉన్న ఆ నమూనాకు దగ్గరగా ఉండే డిజైన్ను సిద్ధం చేయాలని అప్పట్లోనే ఆయన అధికారులను ఆదేశించారు. ఆ నమూనాను జతచేస్తూ ఆ తరహాలో నూతన సచివాలయ డిజైన్ ఉండాలని అధికారులు అర్కిటెక్ట్లకు లేఖలు పంపారు. గతంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయానికి సంబంధించి మూడు నమూనాలు పంపారు. అందులో రెండు ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటే నిర్మించాలని భావించినప్పుడు వేసినవి కాగా, మరొకటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కనున్న బైసన్ పోలో గ్రౌండ్లో నిర్మించాలని యోచించినప్పుడు వేసింది. ఈ మూడు కూడా బాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వీటికి కొన్ని మార్పుచేర్పులు సూచిస్తూ ఆయన మరో డిజైన్ను సిద్ధం చేస్తున్నారు. ఈ నమూనాల్లో మెరుగ్గా ఉన్న కొన్నింటిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. వాటిని మంత్రులు పరిశీలించి మళ్లీ మార్పుచేర్పులు అవసరమైతే చేసి ముఖ్యమంత్రికి అందివ్వనున్నారు. ఆయన చెప్పే సలహాల ఆధారంగా మార్పులు అవసరమనుకుంటే చేసి తుది నమూనా ప్రకారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత సచివాలయ భవనాల పటుత్వం ఎలా ఉందన్న అంశాన్ని టెక్నికల్ కమిటీ ఇటీవలే పరిశీలించింది. ఆ భవనాలు పరిశీలించిన నిట్ డైరక్టర్ వాటి పటుత్వంపై ‘అంచనా’వేశారు. అగ్నిప్రమాదాల సమయంలో ఆ భవనాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొనగా తాజా పరిశీలనలో అధికారులు గుర్తించిన వివరాలతో నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి అందివ్వనున్నారు. -
ఇష్టానుసార టెండర్లకు చెక్
సాక్షి, అమరావతి: ఇక ఇష్టానుసారంగా టెండర్ల ఖరారు కుదరదు. స్విస్ చాలెంజ్ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్పై పనులు కట్టబెట్టడం లాంటి అనైతిక చర్యలకు తెర దించుతూ ఈమేరకు చట్టంలోని లొసుగులను సవరించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్ల పాలనలో ఎడాపెడా టెండర్లను ఖరారు చేయడమే కాకుండా అంచనాలను భారీగా పెంచేసి కమీషన్లు కాజేయటంపైనే టీడీపీ దృష్టి పెట్టింది. సూటిగా చెప్పాలంటే గత సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపథ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తెచ్చి ప్రజాధనాన్ని ఆదా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే టెండర్ల స్క్రూటినీ కోసం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ చట్టం(ఏపీఐడీఈ )–2001లో సవరణలకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలశాఖ కసరత్తు ప్రారంభించింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు సర్వ హక్కులు కల్పించిన బాబు సర్కారు స్విస్ చాలెంజ్ ముసుగులో రాజధాని రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్ వద్దకు పంపించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి. జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా.. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. మరోవైపు ఇదే చట్టంలో టెండర్లను జ్యుడీషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్రొవిజన్ చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడీషియల్ స్క్రూటినీ చేసిన అనంతరమే ఖరారు చేయనున్నారు. తద్వారా టెండర్లలో దోపిడీకి ఆస్కారం లేకుండా రాష్ట్ర ఖజానాకు నిధులు ఆదా అవుతాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టెండర్ల ఖరారుకు ముందు జ్యుడీషియల్ కమిషన్ పరిశీలనకు పంపిస్తారు. కమిషన్ ఏమైనా మార్పులు చేర్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాకే టెండర్లను ఖరారు చేస్తారని ఆ ఉన్నతాధికారి వివరించారు. ఈనెల 11వతేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్ వద్దకు పంపించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
మింగిన మట్టికి టెండర్ల ముసుగు!
సాక్షి, అమరావతి: మట్టి మాఫియాగా అవతరించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేయగా అరకొరగా మిగిలిన దాన్ని విక్రయించి అక్రమాలను కప్పిపుచ్చేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు. సీఎం కార్యాలయం(సీఎంవో) కీలక అధికారి సూచనల మేరకే ఈ టెండర్లు పిలిచినట్లు సమాచారం. పోలవరం కుడి కాలువలో మిగిలిన మట్టిని 261 రీచ్లుగా విభజిస్తూ ధరను రూ.312.88 కోట్లుగా నిర్ణయించి నెలన్నర క్రితం విక్రయానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఐదు రీచ్లలో మట్టిని రూ.5.76 కోట్లకు కొనుగోలు చేయడానికి కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేశారు. వాటిని ఆమోదించిన అధికారులు మిగిలిన రీచ్లకు టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. పోలవరం కుడి కాలువను 174 కి.మీ.లు, ఎడమ కాలువను 181.50 కి.మీ.ల పొడవున తవ్వే పనులను 2005లోనే ప్రారంభించారు. కాలువ తవ్వి మట్టిని ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో గట్లుగా పోశారు. కాలువ పనులు పూర్తయ్యాక ఈ మట్టిని టెండర్ల ద్వారా విక్రయించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకూ పోలవరం కుడి, ఎడమ కాలువల్లో మట్టిని తరలించడానికి ఎవరూ సాహసించలేదు. కుడి, ఎడమల దోపిడీ రూ.3,370 కోట్లు... పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాలువ మట్టిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దోచేశారు. క్యూబిక్ మీటర్ మట్టిని సగటున రూ.250 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. పోలవరం కుడి కాలువ తవ్వకంలో 11.82 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని కాలువ గట్లపై పోసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. టీడీపీ మట్టి మాఫియా దెబ్బకు ప్రస్తుతం 3.21 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే మిగిలినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే 8.61 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని టీడీపీ మాఫియా దోచేసినట్లు స్పష్టమవుతోంది. క్యూబిక్ మీటర్ రూ.250 చొప్పున విక్రయం ద్వారా రూ.2,152.50 కోట్ల మేర దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ మట్టిని మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప అనుచరులు, మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచేశారు.ఎడమ కాలువలో 10.81 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ 9.96 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. ఇందులో 4.87 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని మాఫియా మాయం చేసిందని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ మట్టిని క్యూబిక్ మీటర్ రూ.250 చొప్పున విక్రయించడం ద్వారా రూ.1,217.50 కోట్లకు పైగా దోచేసినట్లు స్పష్టమవుతోంది. కుడి, ఎడమ కాలువల్లో మట్టిని దోపిడీ చేయడం ద్వారా మట్టి మాఫియా రూ.3,370 కోట్లకు పైగా మింగేసినట్లు వెల్లడవుతోంది. విజిలెన్స్, నిఘా నివేదిక బుట్టదాఖలు.. పోలవరం కాలువల్లో మట్టిని కాజేసి అమ్ముకోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2017, 2018లో టీడీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మట్టి దందాను సర్కార్ దృష్టికి తెచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరం ఎడమ కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగం కూడా సర్కార్కు నివేదికలు ఇచ్చింది. వీటిపై చర్యలు తీసుకోకుండా సీఎం చంద్రబాబే మోకాలొడ్డినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. దోపిడీని దాచేందుకే టెండర్లు.. టీడీపీ నేతల మట్టి దందాపై ఉభయ గోదావరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు గుర్తించడంతో దోపిడీని కప్పిపుచ్చడం కోసమే ఎన్నికల ముందు మట్టి విక్రయానికి టెండర్లు పిలవాలని సీఎంవోకు చెందిన కీలక అధికారి జలవనరులశాఖను ఆదేశించారు. పోలవరం కుడి కాలువ 2, 3, 4, 5, 6 7 ప్యాకేజీల్లో మిగిలిపోయిన మట్టిని 261 రీచ్లుగా విభజించి కనీస విలువను రూ.312.68 కోట్లుగా నిర్ణయిస్తూ నెలన్నర క్రితం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఐదు రీచ్లకు మాత్రమే కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేయడంతో రూ.5.76 కోట్లకు విక్రయిస్తూ టెండర్లను ఆమోదించారు. మిగతా రీచ్లకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
టెండర్ల ద్వారా గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పశువైద్యుల సాయంతో లబ్ధిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అవి నీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా గొర్రె లను కొనుగోలుచేసి, గొల్ల కుర్మలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే నేరుగా లబ్ధిదారులకే సొమ్మును జమ చేసి గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించే అంశంపైనా కూడా పరిశీలన చేస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తే క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున జరుగుతున్న రీసైక్లింగ్ను నివారించడంతోపాటు, పశువైద్యుల అక్రమాలకు తాళం వేసినట్లవుతుందని భావిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 75.95 లక్షల గొర్రెలను కొనుగోలు చేసినట్లు గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు చేసి పంపిణీ చేసిన గొర్రెలనే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి పంపిణీ చేయడంతో గొర్రెలు యథేచ్ఛగా రీసైక్లింగ్ అయినట్లు తేలింది. కొందరు పశువైద్యులు అమ్మకందారులతో కుమ్మక్కై అక్రమంగా వ్యవహరించారు. ఈ క్రమంలో గొర్రెలు గ్రౌండింగ్ చేయకున్నా చేసినట్లు చూపారు. దీంతో ఆరుగురు పశువైద్యులను సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ పశువైద్యులు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ శాఖలోని అధికారులే విమర్శలు చేస్తున్నారు. ఫలితంగానే టెండర్ లేదా నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు సబ్సిడీ రూపంలో డబ్బు జమచేసి గొర్రెలు కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరఫరా గొర్రెలపై సర్వే... 2018 జూన్లో సీఎం కేసీఆర్ గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంపై పశుసంవర్థక శాఖ సర్వే చేపట్టింది. ఏయే గ్రామాల్లో ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు. వాటిలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి. ఎన్నింటిని అమ్ముకున్నారు. ఎందుకోసం విక్రయించుకోవాల్సి వచ్చిందనే కారణాలతో ఈ సర్వే చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
కాళేశ్వరం కాల్వల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కాల్వల నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం రూ.1,094.56 కోట్ల పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డి కాల్వలను కొండపోచమ్మ దిగువన వర్గల్ మండలం గౌరారం నుంచి మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామం వరకు 37 కి.మీ కాల్వను తొలి రీచ్గా విభజించారు. దీనికి రూ.365.54 కోట్లకు టెండర్ పిలిచారు. జీడిపల్లి నుంచి నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పలపర్తి వరకు 73 కి.మీ కాల్వను రెండో రీచ్ గా విభజించి రూ.375.54 కోట్లతో టెండర్లు పిలిచా రు. కొండపోచమ్మ సాగర్ దిగువన ఉన్న రావల్కోల్ కాల్వల ద్వారా శామీర్పేట్ చెరువు నింపడం, దాని కింద 31 కి.మీ.ల బొమ్మలరామారం కాల్వల ద్వారా 15,676 ఎకరాలకు నీరివ్వడం, ఇదే చెరువు నుంచి కీసర కాల్వ ద్వారా 20 కి.మీ మేర కాల్వలు తవ్వి 4,324 ఎకరాలకు నీళ్లిచ్చే పనులకు మరో రూ.353. 48 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 8 నుంచి 21 వరకు టెండర్లు స్వీకరిస్తారు. 22న టెక్నిక ల్ బిడ్, 27న ప్రైస్ బిడ్ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తారు. మార్చిలోనే ఈ పనులను ఆరంభించే అవకాశాలున్నాయి. -
కమీషన్ల కోసమే!
-
తమ్ముళ్లకు పనుల పందేరం!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రోడ్ల విస్తరణ పనుల పందేరం ద్వారా వారికి నిధులు దోచిపెట్టనున్నారు. ఈ ప్రక్రియలో నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. పరిపాలన అనుమతులు రాకముందే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణ పనుల వ్యయంతో సమానంగా విస్తరణ పనులకు వ్యయం చేసేందుకు అనుమతులిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రధాన రహదారులను విస్తరించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 82 పనులకు గాను రూ.500.17 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. అయితే పనులకు సంబంధించిన జీవో జారీ కాకముందే, పరిపాలన అనుమతులు రాకముందే ఈ పనులకు టెండర్లు పిలవడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయకుండా ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టకూడదు. ఇది ప్రాథమిక నిబంధన. కానీ ప్రధాన రహదారుల పనులకు పరిపాలన అనుమతులు రాకముందే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. పరిపాలన అనుమతులకు సంబంధించిన జీవోలోనే ఇప్పటికే 80 శాతం పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టామని, 20 శాతం పనులు టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. లైన్ ఎస్టిమేట్ (ఉజ్జాయింపు అంచనా) ద్వారా టెండర్లు పిలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత అంచనాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించే లైన్ ఎస్టిమేట్ ఆధారంగా టెండర్లు పిలవడమంటే ప్రజాధనాన్ని దోచుకునేందుకేననే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 80 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెబుతున్న ఆర్అండ్బీ అధికారులు అవి అసలు ఏ దశలో ఉన్నాయో, ఎవరెవరికి దక్కాయనే అంశంపై నోరుమెదపక పోవడం గమనార్హం. స్థానికంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడం వల్లే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారని తెలుస్తోంది. కిలోమీటరు విస్తరణకు రూ.2.5 కోట్లా? జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కిలోమీటరు జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్లు మేర ఖర్చు చేస్తారు. సుందరీకరణ, డివైడర్లు తదితరాలకైతే రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రహదారుల విస్తరణకు కిలోమీటరుకు రూ.2 కోట్లు నుంచి రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు అనుమతులివ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో కత్తిపూడి–పామర్రు మధ్య 1.850 కిలోమీటర్ల రహదారి పటిష్టతకు ఏకంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఇదే జిల్లాలో సామర్లకోట పరిధిలో కిలోమీటరు రోడ్డు విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు–అమరావతి రోడ్డులో పొన్నెకల్లు గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.2.40 కోట్లు కేటాయించారు. ఇష్టమొచ్చినట్లు నిధుల కేటాయింపు ద్వారా రూ.కోట్లు కొట్టేసేందుకు, తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకు పెద్దలు స్కెచ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మిగిలిన 20 శాతం పనులు నామినేషన్ విధానంలో చేపట్టాల్సిందిగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ప్రారంభమైనట్టు ఆర్అండ్బీ వర్గాలు వెల్లడించాయి. -
ఈ–ఆటోలపై చినబాబు ట్యాక్స్ రూ.83 కోట్లు
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి : ఏదైనా వస్తువు కొనాలంటే మార్కెట్ ధర పరిశీలించి, బేరం ఆడి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, తక్కువ ధరకే ఆ వస్తువును అందించే సంస్థకే టెండర్ ఖరారు చేసి, కొనుగోలు చేయడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆరాటంతో మార్కెట్ ధర కంటే రెండింతలు అధికధరకు వస్తువు సరఫరా చేస్తామంటున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో చోటుచేసుకున్న ఈ బాగోతం వెనుక చినబాబు హస్తం ఉన్నట్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో చెత్తను సేకరించడానికి బ్యాటరీతో నడిచే ఈ–ఆటోలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తొలివిడతగా 7,500 ఈ–ఆటోలను కొనుగోలు చేసి, షెడ్యూల్ క్యాస్ట్(ఎస్సీ) నిరుద్యోగ యువతకు అప్పగించాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఈ–ఆటోల కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. జూలై 29వ తేదీన కైనెటిక్ గ్రీన్ ఇండియా సంస్థ ప్రతినిధులు సచివాలయంలో చినబాబును కలిశారు. ఈ–ఆటోల సరఫరా టెండర్ను ఆ సంస్థకే అప్పగించేలా డీల్ కుదిరినట్లు ఆరోపణలున్నాయి. ఓపెన్ టెండర్ కావడంతో మొత్తం 24 ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అందులో 16 సంస్థలు అర్హత సాధించినట్లు అధికారులు నిర్ధారించారు. టెండర్ను తెరిచే సమయంలో చినబాబు తెరపైకి వచ్చారు. తాము సూచించిన కంపెనీకే టెండర్ దక్కేలా చూడాలని ఆదేశించారు. ఆప్పట్లో చినబాబు ఆశీస్సులు ఉన్న కంపెనీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ ధర కోట్ చేసింది. దాంతో ఆ కంపెనీకి టెండర్ దక్కే అవకాశాలు లేవని అధికారులు ఏకంగా ఆ టెండర్నే రద్దుచేశారు. మరోసారి సెప్టెంబర్లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లపైనా వివాదం తలెత్తడంతో మళ్లీ నవంబర్లో టెండర్లు పిలిచారు. డిసెంబర్ 4న టెండర్లను తెరిచారు. ఇటీవల సచివాలయంలో మంత్రి లోకేశ్ను కలిసిన కైనెటిక్ గ్రీన్ ఇండియా ప్రతినిధులు టెండర్ నిబంధనల్లో మార్పులు అస్మదీయ సంస్థకే టెండర్ దక్కేలా టెండర్ నిబంధనల్లోనూ చినబాబు మార్పులు చేయించారు. ముందుగా పిలిచిన టెండర్లో ఈఎండీ(ఎర్నేస్ట్ మనీ డిపాజిట్) నాన్ రిఫండబుల్ రూ.25 వేలు కాగా, తాజాగా పిలిచిన టెండర్లో ఈఎండీ రూ.1.5 కోట్లుగా చూపించడం గమనార్హం. దాంతోపాటు ఈ–ఆటోలను సరఫరా చేసే సంస్థ ఇప్పటికే 2,500 ఆటోలను ఏదైనా సంస్థకు సరఫరా చేసినట్లు అధికారిక ధ్రువీకరణ కావాలని నిబంధన విధించారు. అయినప్పటికీ టెండర్లలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. ఎస్ఎస్వీ టెక్నాలజీ, గోయెంకా మోటార్స్, విక్టరీ ఎలక్ట్రికల్, రిప్ టెక్నాలజీ, కైనెటిక్ గ్రీన్ ఇండియా, భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. చివరకు చినబాబుతో డీల్ కుదుర్చుకున్న కైనటిక్ గ్రీన్ ఇండియా సంస్థకే టెండర్ను ఖరారు చేశారు. అర్హత లేని కంపెనీకే టెండర్ టెండర్ నిబంధనల ప్రకారం హోమోలోగేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఆ సర్టిఫికేట్ లేని కైనెటిక్ గ్రీన్ ఇండియాకు టెండర్ ఖరారు చేయడం గమనార్హం. మిగిలిన సంస్థల కంటే ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టడం విశేషం. కైనెటిక్ గ్రీన్ ఇండియా ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు సరఫరా చేయనున్నట్లు టెండర్లలో చూపించారు. మిగిలిన సంస్థలు రూ.2.20 లక్షల లోపు ధరకే సరఫరా చేస్తామంటూ బిడ్ దాఖలు చేశాయి. ఈ–ఆటో ప్రస్తుతం రూ.1.48 లక్షల ధర పలుకుతోంది. కానీ, చినబాబు సూచించిన సంస్థ మాత్రం ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంటే ఒక్కో ఆటోకు అదనంగా రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. తొలివిడతగా ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఒక్కో ఆటోను రూ.1.08 లక్షలకు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.16 లక్షలకు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చాయి. కానీ, ఆ టెండర్లను రద్దు చేయించారు. అధిక ధర కోట్ చేసిన కైనెటిక్ గ్రీన్ ఇండియాకే టెండర్ కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.1.08 విలువైన ఆటోను అస్మదీయ సంస్థ నుంచి రూ.2.44 లక్షలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది. అంటే ఖజానాపై రూ.83 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఈ సొమ్ముంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్సీ యువతపై అదనపు భారం పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా అర్హులైన దళిత యువతకు ఈ–ఆటోలను సరఫరా చేయనున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఆటోలకు ప్రభుత్వ సబ్సిడీ పోను బ్యాంకు రుణం అందిస్తారు. బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీగా చెల్లించుకోవాలి. చినబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ–ఆటోల టెండర్లలో అవినీతి ‘‘ఈ–ఆటోల సరఫరా టెండర్లలో అవినీతి చోటుచేసుకుంది. కొందరి స్వార్థం కోసం మన రాష్ట్రానికి చెందిన చిన్న తరహా పరిశ్రమలకు అన్యాయం చేశారు. మరో రాష్ట్రానికి చెందిన కంపెనీకి ఈ–ఆటోల సరఫరా టెండర్ను అప్పగించడం దారుణం. టెండర్లలో అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సృందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ – కె.పి.రావు, ఎలక్ట్రికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నేత, విజయవాడ -
పట్టణాల్లో కురవని 'అమృత్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అటల్ మిషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) పథకం పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించడం, ఆ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించలేకపోవడంతో ‘అమృత్’ పథకం పడకేసింది. నగరాలు, పట్టణాలను పట్టిపీడిస్తున్న రక్షిత మంచినీరు, మురుగునీటి సరఫరా సమస్యలు ‘అమృత్’ పథకంతో పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. అయితే, తొలిదశలో విడుదలైన నిధులను మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాయి. రెండో దశలో చేపట్టనున్న పథకాలకు నిధులు విడుదల చేయాలని అందచేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. దీంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతితోపాటు 31 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలను ‘అమృత్’ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కనీసం లక్ష జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వంటి కార్పొరేషన్లతోపాటు మచిలీపట్నం, గుడివాడ, ఆదోని, నరసరావుపేట, చిలకలూరిపేట వంటి చిన్న మున్సిపాల్టీలను అమృత్ పథకం కింద ఎంపిక చేశారు. ఈ పథకం అమలుకు కేంద్రం ఐదేళ్లపాటు విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంది. తొలిదశలో రూ.2,717 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఇప్పటిదాకా రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. విశాఖపట్నంలో పాతపైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు, నివాస గృహాలకు కుళాయిలు, మురుగునీటి శుద్ధిప్లాంట్ నిర్మాణాలకు నిధులు విడుదల కాగా, నిర్మాణ సంస్థలు పనుల్లో జాప్యం చేస్తున్నాయి. 75 వేల కుళాయిలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటిదాకా 23 వేల కుళాయిలనే ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో రూ.82 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు, పార్కుల సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.17.80 కోట్లతో నిర్మించనున్న ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నిధులున్నా.. పనులేవీ? గుంటూరు జిల్లా తెనాలిలో రక్షిత మంచినీటి పథకం అమల్లో భాగంగా ఇచ్చే కుళాయి కనెక్షన్లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికోసం అమృత్ పథకం కింద రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలోని 21,748 గృహాలకు రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 12 వేల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఒప్పందం కాలపరిమితి ముగియనుంది. మచిలీపట్నం మున్సిపాల్టీకి రూ.37.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు, 9,158 కుళాయిలు, 156.465 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లు, 8.42 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్ల ఏర్పాటు వంటి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. తిరుపతిలో రూ.72 కోట్లతో కొత్త పైప్లైన్ల నిర్మాణం, ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మూడేళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు విధించారు. దాంతో కొన్ని సంస్థలకు ఐదారు నగరాల్లోని పనులు గంపగుత్తుగా లభించాయి. ఆ సంస్థలు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానిస్తే 23 పథకాల నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మూడు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు కాలేదు. 60 పార్కుల సుందరీకరణకు టెండర్లు ఆహ్వానిస్తే 56 పార్కులకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 41 పార్కుల పనులు కేవలం 30 నుంచి 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మురుగునీటి శుద్ధిప్లాంట్ల నిర్మాణాలకు నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో నగరాలు, పట్టణాల్లో మురుగునీటి సమస్య వేధిస్తోంది. -
‘ఫైబర్ గ్రిడ్’లో పైసా వసూల్
సాక్షి, అమరావతి బ్యూరో: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పైసలు పిండుకుంటున్నారు. రూ.1,500 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా పెద్ద స్కెచ్చే వేశారు. మొత్తం ప్రాజెక్టు విలువలో సగం.. అంటే రూ.765 కోట్ల మేర కమీషన్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రెండో దశ కాంట్రాక్టును ఇతర సంస్థలు దక్కించుకోకుండా ప్రభుత్వ పెద్దలు సాగించిన కుట్రలను గమనిస్తే.. ఇంత నీచానికి ఒడిగడుతారా అని ఛీ కొట్టక తప్పదు. టెండర్ అర్హత నిబంధనల్లో 11 సార్లు మార్పులు చేశారు, బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కటంటే ఒక్కరోజే గడువు ఇచ్చారు. ఇలాంటి చోద్యం ఇంకెక్కడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 55 వేల కిలోమీటర్ల మేర వేయనున్న ఫైబర్ గ్రిడ్ రెండో దశ కాంట్రాక్టును ఏకపక్షంగా అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రతిపాదించిన ఆ కాంట్రాక్టును కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మొదట షాక్ తగిలింది. మరోసారి టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఈసారి ముఖ్యనేత సూచనలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పకడ్బందీగా వ్యవహరిం చింది. కేవలం ఒక్కరోజు గడువుతో కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై అక్కసు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు కోసం తొలుత 7 సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. ఇండియా టెలికాం ఇండస్ట్రీస్(ఐటీఐ), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. దాంతో ప్రభుత్వ పెద్దలు దొంగాట ప్రారంభించారు. ప్రాజెక్టు కాలపరిమితిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించడం ద్వారా ఇతర సంస్థలు తామంతట తామే వెనక్కి వెళ్లేలా చేయాలని భావించారు. టెండర్లు ఖరారు చేసేనాటికి టెలికాం స్టాండర్డ్ ఎలిజిబిలిటీ సెంటర్(టీఎస్ఈసీ) సర్టిఫికెట్ సమర్పించకపోతే ఎర్నెస్టు మనీ డిపాజిట్(ఈఎండీ) రూ.5 కోట్లు జప్తు చేస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జోక్యం చేసుకున్న తర్వాత ఆ సంస్థల టెక్నికల్ బిడ్లను అనుమతించాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడలేదు ‘ఒక్క రోజు’ మంత్రాంగం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా టెండర్ అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ వచ్చారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశ టెండర్ల ప్రక్రియలో ఏకంగా 11 సవరణల ద్వారా 20 అదనపు నిబంధనలను చేర్చడం విస్మయపరుస్తోంది. ఆ సవరణలన్నీ ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకు అనుకూలంగా ఉండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు గడువు తేదీ ఈ ఏడాది నవంబర్ 1 కాగా... చివరిదైన 11వ సవరణను పేర్కొంటూ అక్టోబరు 28న టెండర్ నిబంధనలను నిర్ణయించారు. ఆ రోజు ఆదివారం కావడంతో అక్టోబరు 29న అధికారికంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసి సవరణను అక్టోబరు 30న విడుదల చేశారు. కానీ, సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్ల దాఖలుకు గడువును పొడిగించకపోవడం గమనార్హం. నవంబరు 1 నాటికి టెండర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికంగా మూడు రోజులు గడువు ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. దాంతో సవరించిన నిబంధనల మేరకు 4 కన్సార్టియం సంస్థలు బిడ్లు దాఖలు చేయలేకపోయాయి. కేవలం మూడు సంస్థలే బిడ్లు దాఖలు చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన ఆ సంస్థలకు ముందే సమాచారం ఉన్నందున ఒక్కరోజులోనే సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్లు దాఖలు చేయగలిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్! టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్ గ్రిడ్ టెండర్లో ఎక్కువ ధర కోట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్ఎఫ్ఎల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్ గ్రిడ్ టెండర్ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. కాగా, ప్రభుత్వ పెద్దల కుతంత్రంపై టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెండర్ నిబంధనల సవరణలో మతలబు ఫైబర్ గ్రిడ్ టెండర్లో పాల్గొనేందుకు బిడ్ దాఖలు చేసే సంస్థలు భారతదేశంలో 24/7 సేవలు అందించే సొంత సర్వీసింగ్ సెంటర్, టోల్ఫ్రీ సెంటర్ ఉండాలి. 100 మంది సొంత సాంకేతిక నిపుణులతో ఈ సెంటర్ ఉండాలని నిబంధన విధించారు. కానీ, తరువాత ఆ అర్హత నిబంధనల్లో మార్పులు చేశారు. దీనిప్రకారం.. కనీసం 100 మందితో 24/7 సేవలందించే సర్వీసింగ్ సెంటర్, టోల్ఫ్రీ సెంటర్ ఉండాలి. దాంతోపాటు సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ) సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని షరతు విధించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్అండ్డీ సెంటర్లు ఉండవు. తద్వారా ఆ సంస్థలను పోటీ నుంచి తప్పించడానికే నిబంధనలను మార్చినట్లు స్పష్టమవుతోంది. టెండర్ దక్కించుకునే సంస్థలు ఏర్పాటు చేయాల్సిన రూటర్ల సామర్థ్యాన్ని కూడా అమాంతంగా పెంచేశారు. మొదట టెండర్లలో రూటర్లు 20 లక్షల ఎంఏసీ సామర్థ్యంతో 20 లక్షల ఐపీవీ4 యూనికాస్ట్ రౌట్లు, 10 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 16 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తప్పించేందుకు రూటర్ల సామర్థ్యాన్ని పెంచేశారు. రూటర్లు 40 లక్షల ఎంఏసీ సామర్థ్యంతోపాటు 30 లక్షల ఐపీవీ 4 యూనికాస్ట్ రౌట్లు, 15 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 50 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని నిబంధన విధించడం గమనార్హం. అంతేకాదు రూటర్ ఎస్ఆర్, ఎస్ఆర్–టీఈ, ఎస్ఆర్వీ 6, టిల్ఫా, బీజీపీఎల్ఎస్ ఉపకరణాలకు అనుగుణంగా ఉండాలని కొత్త నిబంధన విధించారు. -
నెలాఖరులోగా నూతన అసెంబ్లీకి టెండర్లు
సాక్షి, అమరావతి: అనంత–అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భూసేకరణను వేగవంతం చేయాలని, వచ్చే ఏడాది మార్చిలోగా టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సీఎం రహదారులు, భవనాల శాఖ ప్రాజెక్టులు, పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అనంతపురం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలో భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి కార్యప్రణాళిక రూపొందించి తనకు అందజేయాలని కలెక్టర్లను కోరారు. మార్చి నాటికి కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తిచేసి తీరాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని కోరారు. హైవేలవద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి గంటకు ఎన్ని వాహనాలు వెళుతున్నాయో గమనించి అందుకనుగుణంగా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. నిర్మాణంలో ఉన్న కత్తిపూడి–కాకినాడ బైపాస్ సహా రాష్ట్రంలోని పలు రహదారి పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. దివిసీమకు కృష్ణానది కరకట్ట రోడ్డును పర్యాటకాభివృద్ధికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీకనుగుణంగా రోడ్ల మరమ్మతులు, వెడల్పుకు రూ.855 కోట్ల విలువైన ప్రతిపాదనలతో రూపొందించిన కార్యప్రణాళికను రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ సీఎంకు వివరించారు. తిత్లీ తుపాను బాధితులకు రూ.7 లక్షల విరాళం ప్రకటించిన రోడ్లు, భవనాల శాఖ ఉద్యోగులు మంత్రి అయ్యన్నపాత్రుడు చేతులమీదుగా చంద్రబాబుకు చెక్ అందించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికం: సీఎం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమని, కేంద్రంలో మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పరాకాష్ట అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ నిరంకుశ పెత్తందారీ పోకడలకు ఇది అద్దం పడుతోందని, దీన్ని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాలన్నారు. -
మాయ ఉంది..మోసం ఉంది!
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థలో గతంలో జరిగిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు సంబంధిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నాయకులు గతంలో చేసిన పనులనే ప్రస్తుత టెండర్లలో పొందుపరచి వాటిని కొత్తగా చేస్తున్నట్లు చూపించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు పావులు కదుపుతున్నారు. మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు కనీసం వాటిని గమనించకుండానే కళ్లు మూసుకొని టెండర్లు ఖరారు చేయడం నగర పాలక సంస్థ కార్యాలయంలో హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీ నాయకులు వేసిన టెండర్లను ఖరారు చేయకుంటే స్థాన చలనం కలుగుతుందన్న భయాందోళనలతో గతంలో జరిగిన పనులకు తాజాగా నిర్వహించిన టెండర్లలో ఆమోదముద్ర వేసి కొంతమంది ఇంజినీరింగ్ అధికారులు ‘అధికార’ ఆశీస్సులు పొందుకుంటున్నారు. ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్రావు తన పార్టీకి చెందిన నాయకులతో కలిసి నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో రివ్యూ చేస్తూ తమ వారు చెప్పిన పనులే చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఇంజినీరింగ్ అధికారులు జీ హుజూర్..అంటూ పచ్చ జెండా ఊపుతూ ఎప్పుడో జరిగిన పనులను ప్రస్తుత టెండర్లలో చూపించి పచ్చచొక్కా వారికి మార్గం సుగమం చేస్తున్నారు. 6 కోట్ల రూపాయల సాధారణ నిధులతో 100 పనులకు గురువారం ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచారు. వాటిలో గతంలో జరిగిన పనులు ఉండటాన్ని బట్టి చూస్తే నగర పాలక సంస్థ అధికార పార్టీ ఆదేశాలను ఏ విధంగా అమలు చేస్తుందో చెప్పకనే చెబుతోంది. వాస్తవానికి అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేస్తే వర్క్ ఆర్డర్ ఇచ్చి పనుల అంచనా వేసి ఆ తర్వాత అగ్రిమెంట్ ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి దాదాపు నెల రోజులు పడుతోంది. ముందుగానే పనులు చేసి టెండర్ పొందిన వెంటనే ఆ సొమ్ము తమ ఖాతాల్లో జమ చేసుకునేలా అధికార తెలుగుదేశం నాయకులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తూ యంత్రాం గాన్ని పక్కదారి పట్టించడం గమనార్హం. టాయి‘లేటెస్ట్’ స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల మొదటి అంతస్తులో గదులు కూడా కేటాయించారు. మొదటి అంతస్తులోనే విద్యార్థుల కోసం టాయిలెట్లు నిర్మించారు. టాయిలెట్లను దాదాపు పది లక్షల రూపాయలతో నిర్మించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ టాయిలెట్లను గురువారం నగర పాలక సంస్థ పిలిచిన పలు అభివృద్ధి పనుల టెండర్ల జాబితాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఎప్పుడో జరిగిపోయిన టాయిలెట్ల పనులను ప్రస్తుత టెండర్లలో వర్క్ నంబర్ 648 కింద ఖరారు చేసి సంబంధిత కాంట్రాక్టర్కు కట్టబెట్టి ‘వెంకటేశ్వర’ మహత్యాన్ని పొందుకొని నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. ‘సైడ్’ డ్రెయిన్లు స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నిర్మిస్తున్న సైడ్ డ్రెయిన్లు చివరి దశకు చేరుకున్నాయి. అద్దంకి బస్టాండ్లోని మాగుంట సుబ్బారామిరెడ్డి విగ్రహం దక్షిణం వైపు నుంచి సమైక్యత నగర్ వరకు పది లక్షల రూపాయలతో సైడ్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టి తుది దశకు చేరుకొంది. అదేవిధంగా సమైక్యతనగర్ నుంచి ఊరచెరువులోని కొత్త కూరగాయల మార్కెట్ వరకు పది లక్షల రూపాయలతో సైడ్ డ్రైయిన్లు నిర్మించేందుకు తాజాగా పిలిచిన టెండర్లలో నగర పాలక సంస్థ అధికారులు ఖరారు చేయడంతో విమర్శలను మూటగట్టుకొంది. ఈ రెండు పనులను వర్క్ నంబర్ 650, 651 కింద ఖరారు చేసి తిరుపతి‘స్వామి’ భక్తిని నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు చాటుకున్నారు. పైపు‘లైన్ క్లియర్’ స్థానిక మామిడిపాలెంలో హెచ్డీపీ పైపులైన్ వేశారు. అక్కడ పైపులైన్ దెబ్బతినడంతో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం పిలిచిన టెండర్లలో 660 వర్క్ నంబర్ కింద చూపించి 2.47 లక్షల రూపాయలతో ఆ పని చేసిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పనికి సంబంధించి టెండర్ దాఖలు చేసిన వారిలో అతి తక్కువగా కోడ్ చేసిన కాంట్రాక్టర్కు జరిగిన పనిని కట్టబెట్టి మునిసిపల్ ఇంజినీరింగ్ అధికారులు ‘శ్రీనివాస’ మహత్యాన్ని ముందుగానే చూపించారు. కలెక్టర్ కన్నెత్తి చూస్టే ఒట్టు ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా పనులు కట్టబెడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ వినయ్చంద్ స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచి సంబంధిత కాంట్రాక్టర్లకే ఇంజినీరింగ్ అధికారులు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నా ప్రత్యేక అధికారి ప్రేక్షకపాత్ర వహించడంపై అనేక మంది పెదవి విరుస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రజాధనం హారతి కర్పూరంలా హరించుకుపోయిన తర్వాత కలెక్టర్ జోక్యం చేసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ రంగంలోకి దిగితేనే.. ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా పనులు కట్టబెడుతూ ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు. విజిలెన్స్ బృందం స్వయంగా రంగంలోకి దిగితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. నగర పాలక సంస్థలో జరుగుతున్న అడ్డగోలు పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. -
టెండర్లకే టెండర్!
మంత్రులకు తెలియకుండానే వారి శాఖల్లో కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయా?.. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ల రద్దు తతంగం చూస్తే.. ఈ అనుమానాలు కలగకమానవు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆ శాఖ మంత్రి ప్రకటించిన రోజే.. అవి రద్దు కావడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.టెండర్ల రద్దు వెనుక కూడా నెలరోజులకు పైగా పెద్ద మంత్రాంగమే నడిచినట్లు తెలుస్తోంది. రూ.1300 కోట్ల విలువైన ఈ పనులను కొద్దిమంది పాత కాంట్ట్రార్లకే.. అదీ ఎక్సెస్ రేటుతో కట్టబెట్టి.. ఆ ఎక్సెస్ రేటులో మాకింత.. మీకింత.. అని వాటాలు పంచుకునే ప్రణాళికను అమలు చేయాలని పథకం పన్నారు. మూడు నాలుగు దఫాలు చర్చల పేరుతో కాంట్రాక్టర్లను లొంగదీసుకునేందుకు ఆ శాఖలో భారీగా లాబీయింగ్ నిర్వహించే ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ప్రస్తుతానికి ఆ టెండర్లను రద్దు చేశారు. సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఎంపిక చేసిన వారికే..ఎక్కువ రేటుకు పనులు కట్టబెట్టడం.. ఆమోదించిన ఎక్కువ రేటులో కమీషన్లు కొట్టేయడమే లక్ష్యంగా నెలరోజులకుపైగా సాగిన మంత్రాంగం బెడిసికొట్టడంతో ఏకంగా పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లను ఆ శాఖ మంత్రికే తెలియకుండా రద్దు చేయడం రోడ్లు, భవనాల శాఖలో కలకలం రేపుతోంది. దివంగత సీఎం వైఎస్ హయాంలో కేంద్ర సహకారంతో లాంగ్టర్మ్ ఫెర్ఫార్మెన్స్ బేస్డ్ మెయింటెన్స్ కాంట్రాక్టు(ఎల్టీపీబీఎంసీ) అమలు చేశారు. అప్పట్లో 20 మంది కాంట్రాక్టర్లు ఈ పనులను సాఫీగానే నిర్వహించారు. అదే పథకం కింద ప్రస్తుతం కేంద్రం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 36 ప్యాకేజీలుగా సుమారు రూ.1400 కోట్ల అంచనాతో సెప్టెంబర్ 25న టెండర్లు పలిచారు. వీటిలో విశాఖ జిల్లాకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా విలువైన మూడు ప్యాకేజీలు ఉన్నాయి. నిబంధనల సంకెళ్లు ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. ఇప్పటికే ఆ శాఖ వ్యవహారాల్లో తలదూస్తున్నారన్న ఆరోపణలున్న మంత్రి కుమారుడి స్నేహితుడు రంగంలోకి దిగి చక్రం తిప్పాడు. వరుసగా పదేళ్లు ఇవే పనులు చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులన్న నిబంధనను చేర్చడం ద్వారా మిగతా కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా చేశారు. దీంతో వారంతా ఇంజినీర్ ఇన్ చీఫ్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకుండా గతంలో ఈ పనులు చేసిన 20 మంది కాంట్రాక్టర్లను అక్టోబర్ ఐదో తేదీన విశాఖ నగరంలోని ఓ స్టార్ హోటల్లో సమావేశపర్చి ఒప్పందం కుదుర్చుకోవడానికి సదరు స్నేహితుడు ప్రయత్నించాడు. ఐదు శాఖ అధిక రేటుకు టెండర్లు ఖరారు చేసేలా చూస్తామని.. ఆ ఐదు శాతంలో ‘మూడు శాతం మాకు.. రెండు శాతం మీకు’ పద్ధతిలో పంచుకుందామని ప్రతిపాదించాడు. దీనికి కొందరు కాంట్రాక్టర్లు ససేమిరా అన్నారు. మూడుసార్లు వాయిదా.. చివరికి రద్దు కాంట్రాక్టర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అక్టోబర్ పదో తేదీన ముగియాల్సిన టెండర్ల దాఖలు గడువును అదే నెల 24కు వాయిదా వేశారు. ఈలోగా పలుమార్లు కాంట్రాక్టర్లతో రాయాబారాలు నెరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో టెండర్లను గత నెల 31వరకు ఒకసారి.. ఈ నెల 5వ తేదీకి మరోసారి.. ఇలా మూడుసార్లు వాయిదా వేశారు. జీవో నెం.180 ప్రకారం ఏర్పాటు చేసిన మెటీరియల్ తయారీ ప్లాంట్లను కూడా మూయించేస్తామని మంత్రి కుమారుడి స్నేహితుడు బెదిరించాడని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయినా సరే తాము లొంగకపోవడంతో చివరికి అర్ధంతరంగా ఈనెల మూడో తేదీన మొత్తం టెండర్లనే రద్దు చేశారని ఆరోపించారు. ఆన్లైన్ టెండర్ నోటిఫికేషన్ కూడా తొలగించారని అంటున్నారు. రోడ్లు భవనాల శాఖలో ఇతగాడి చోరబాటుతో అధికారులతోపాటు కాంట్రాక్టర్లు సైతం ఏమాత్రం ‘సంతోష’ంగా లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టెండర్ల రద్దు విషయం సంబంధిత శాఖ మంత్రితి తెలిసి జరగలేదని అంటున్నారు. సరిగ్గా టెండర్లు రద్దు చేసిన మూడో తేదీనాడే మంత్రి మీడియాతో మాట్లాడుతూ రూ.1400 కోట్లతో రోడ్ల నిర్వహణ టెండర్ల ప్రక్రియ సాగుతోందని.. త్వరలో టెండర్లు ఖరారు చేసిన పనులు చేపడతామని ప్రకటించడం విశేషం. ఆ వార్త 4వ తేదీన పత్రికల్లో వచ్చింది కూడా. కమిషనర్ ఆదేశాలతో రద్దు:ఈఎన్సీ ఈ అంశాలపై రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బారావును వివరణ కోరగా.. తమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే టెండర్లు రద్దు చేశామని స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ పిలుస్తామన్నారు. ఈ వ్యవహారంలో జరిగిన తతంగం తన దృష్టికి రాలేదని, వాటితో తనకు సంబంధం లేదని అన్నారు. మరిన్ని వివరాలు కోరేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు.