పాపం కేఏ పాల్‌ | KA Paul Election Results 2019 | Praja Shanthi Party Election Latest Updates in Counting - Sakshi
Sakshi News home page

ఫాఫం పాల్‌.. పరువు పోగొట్టుకున్నారు!!

Published Thu, May 23 2019 11:59 AM | Last Updated on Thu, May 23 2019 1:01 PM

KA Paul Gets Very Few Votes in Election - Sakshi

అమరావతి : ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌.. పెద్ద పెద్ద ప్రగల్బాలకు పోతూ.. భారీ ఆడంబరాలతో ఎన్నికల బరిలో నిలబడ్డారు. పచ్చ మీడియా కూడా ఆయనకు బాగానే ప్రచారం కల్పించింది. ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీలో చాలాచోట్ల అభ్యర్థులను నిలిపి.. ప్రచారంలోనూ హడావిడి చేసి.. ఒకింత కామెడీని కూడా పంచారు.  అలాంటి కేఏ పాల్‌ చివరకు తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌సభ స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ సమాచారం మేరకు కేఏ పాల్‌కు చాలా తక్కువ ఓట్లు మాత్రమే పడ్డాయి. నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం కేఏ పాల్‌కు మధ్యాహ్నం 11. 48 గంటలవరకు ఉన్న సమాచారం మేరకు కేవలం 407 ఓట్లు పడ్డాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement