asian badminton championship
-
ముగిసిన భారత్ పోరు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రణయ్... మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఆరో సీడ్ హాన్ యువె (చైనా)తో జరిగిన మ్యాచ్లో సింధు 18–21, 21–13, 17–21తో ఓటమి చవిచూసింది. ఏడో సీడ్ ప్రణయ్ 18–21, 11–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అశ్విని –తనీషా జోడీ 17– 21, 12–21తో మూడో సీడ్ నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా ఓటమి పాలైనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈనెల 30న విడుదలయ్యే ర్యాంకింగ్స్లో టాప్– 16లో ఉన్న డబుల్స్ జోడీలకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. అశ్విని–తనీషా ద్వయం 20వ ర్యాంక్లో ఉన్నప్పటికీ... ఒక దేశం నుంచి గరిష్టంగా రెండు జోడీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్లో అశ్విని ద్వయం 12వ స్థానంలో ఉండటం... ఇదే చివరి అర్హత టోర్నీ కానుండటంతో భారత జోడీ ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పు ఉండదు. -
వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ
భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన సింధు బృందం
ఆలమ్ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్ ఆడుతుంది. హాంకాంగ్తో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్పై నెగ్గి భారత్కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్లో అషి్మత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. గెలుపు వాకిట శ్రీకాంత్ బోల్తా భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లో 2–3తో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్లో శ్రీకాంత్ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్ను 22– 20తోపాటు మ్యాచ్ను 3–2తో జపాన్కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు. అంతకకుముందు తొలి మ్యాచ్లో ప్రణయ్ ఓడిపోగా... రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్లో లక్ష సేన్ నెగ్గగా... నాలుగో మ్యాచ్లో ధ్రువ్ కపిల–అర్జున్ జంట ఓటమి పాలైంది. -
ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న సెలెక్షన్ట్రయల్స్ టోర్నీలో సైనా నెహ్వాల్ పాల్గొనడంలేదు. ‘ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. చదవండి: ‘బ్రిజ్భూషణ్ను రక్షించే ప్రయత్నమిది’ న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్భూషణ్ను రక్షించే ప్రయత్నమే ఇదంతా. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్కీ బాత్’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్కీ బాత్ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సూచించారు. మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్భూషణ్ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్ నేషనల్స్ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్భూషణ్ చెప్పాడు. -
సింధు... కాంస్యంతో సరి
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–13, 19–21, 16–21తో పోరాడి ఓడింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను 13 నిమిషాల్లో సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో స్కోరు 19–19తో సమంగా ఉన్న కీలకదశలో సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో అకానె యామగుచి ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అకానె గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్కు లభించిన పతకాలు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు. -
PV Sindhu: సూపర్ సింధు...
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో 2014లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఈసారి కూడా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–9, 13–21, 21–19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి సెమీఫైనల్కు చేరింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఒకదశలో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. అయితే రెండో గేమ్లో హి బింగ్ జియావో పుంజుకుంది. స్కోరు 9–10 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన హి బింగ్ జియావో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకుంది. చివర్లో సింధు 20–16తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయిన సింధు ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 13–8తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పతకం సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 53 నిమిషాల్లో 21–12, 14–21, 16–21తో ఐదో సీడ్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ జంట గెలిచిఉంటే సెమీస్ చేరినందుకు కనీసం కాంస్య పతకం లభించేది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 10:30 నుంచి సోనీ టెన్–2లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Badminton Asia Championships: పతకానికి విజయం దూరంలో సింధు
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి భారత స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 100వ ర్యాంకర్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–16తో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 7–9తో వెనుకబడి ఉంది. సైనా, శ్రీకాంత్ పరాజయం భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్లో సైనా 21–12, 7–21, 13–21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–17, 17–21తో ప్రపంచ 81వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–15తో అకీరా కోగా –తైచి సైటో (జపాన్) ద్వయంపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 18–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రిక్వార్టర్స్లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్ పైనే
మనీలా (ఫిలిప్పీన్స్): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. వైరస్ వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం... ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన సింధుక ఆసియా టైటిల్ బాకీ ఉంది. గతంలో 2014లో సెమీస్ చేరడం ద్వారా సింధుకు కాంస్యమైతే వచ్చింది. అయితే ఈసారి పతకం రంగు మార్చేందుకు గట్టిపట్టుదలతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పై యు పొ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్... సిమ్ యుజిన్ (కొరియా)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఐదో సీడ్గా, కిడాంబి శ్రీకాంత్ ఏడో సీడ్గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ రన్నరప్ లక్ష్యసేన్ చైనాకు చెందిన లి షి ఫెంగ్ను ఎదుర్కోనుండగా, శ్రీకాంత్... మలేసియా ప్రత్యర్థి ఎన్జీ తే యంగ్తో తలపడతాడు. ఇంకా సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్లో స్టార్ జోడీ సాత్విక్–చిరాగ్ షెట్టి, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ బరిలో ఉన్నారు. గాయాలతో సింగిల్స్లో ప్రణయ్, మహిళల డబుల్స్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ వైదొలిగాయి. -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్లాండ్ను ఓడించింది. తొలి సింగిల్స్లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్గా జరిగిన డబుల్స్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్కురా (థాయ్లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్గా జరిగిన సింగిల్స్లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్లాండ్) జోడీని ఓడించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్షిప్లోనూ భారత్ సెమీస్లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
సైనా, సింధు ముందుకు...
వుహాన్ (చైనా): గత ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి భారత్కు సింగిల్స్ విభాగాల్లో ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈసారి ఏకంగా మూడు పతకాలు మన ఖాతాలో జమయ్యే అవకాశముంది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ చేరుకొని పతకానికి విజయం దూరంలో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటివరకు సైనా మూడు కాంస్య పతకాలను (2010, 2016, 2018లలో)... సింధు (2014లో) ఒక కాంస్య పతకాన్ని సాధించారు. గత ఏడాది పురుషుల సింగిల్స్లో ప్రణయ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఏడో సీడ్ సైనా 21–13, 21–13తో కిమ్ గా యున్ (కొరియా)పై గెలుపొందగా... నాలుగో సీడ్ సింధు 21–15, 21–19తో చురిన్నిసా (ఇండోనేసియా)ను ఓడించింది. కిమ్తో జరిగిన మ్యాచ్లో సైనా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. చురిన్నిసాతో జరిగిన మ్యాచ్లో రెండో గేమ్లో సింధు 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి విజయతీరాలకు చేరింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21–12, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్కర్‡్ష–కరిష్మా (భారత్) ద్వయం 10–21, 15–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్–జూహీ దేవాంగన్ (భారత్) జంట 10–21, 9–21తో వాంగ్ యిలు–హువాంగ్ డాంగ్పింగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
క్వార్టర్స్లో సైనా, సింధు
వుహాన్(చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్ ప్రిక్వార్టర్ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. పీవీ సింధు 21-15, 21-19 తేడాతో చోరన్నిసా(ఇండోనేసియా)పై విజయం సాధించగా, సైనా నెహ్వాల్ 21-13, 21-13 తేడాతో కిమ్ గా ఎన్(దక్షిణకొరియా)పై గెలుపొందారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21-12, 21-19 తేడాతో కా లాంగ్ ఆంగస్(హాంకాంగ్)పై విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. -
శ్రీకాంత్కు చుక్కెదురు
తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్లో రన్నరప్గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు. వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత్కు చుక్కెదురు
హాంకాంగ్: అగ్రశ్రేణి క్రీడాకారుల గైర్హాజరీలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శుభారంభం లభించలేదు. సింగపూర్తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్... డబుల్స్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీ గెలిచినా... మిగతా మూడు మ్యాచ్ల్లో ఓటమితో భారత్కు నిరాశ తప్పలేదు. తొలి మ్యాచ్లో అర్జున్–రుతుపర్ణా పండా ద్వయం 16–21, 13–21తో డానీ బవా–తాన్ వె హాన్ జోడీ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్లో ప్రణయ్ 21–8, 12–21, 21–17తో కీన్ యెవ్ లోపై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్లో అర్జున్–శ్లోక్ జోడీ 21–16, 21–18తో లో కీన్ హెన్–డానీ బవా ద్వయంపై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో మ్యాచ్లో అష్మిత చాలిహ 21–17, 12–21, 16–21తో యో జియా మిన్ చేతిలో ఓడటంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ఆరతి సారా సునీల్–రుతుపర్ణా జోడీ 24–22, 15–21, 16–21తో పుత్రి సరి దేవిసిత్ర–లిమ్ మింగ్ హుయ్ జంట చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు చైనీస్ తైపీతో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. -
మేఘన–తస్నీమ్ జంటకు ‘ఆసియా’ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మయన్మార్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో మారెడ్డి మేఘన రెడ్డి–తస్నీమ్ మీర్ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన మేఘన, గుజరాత్ అమ్మాయి తస్నీమ్ ఫైనల్లో 23–21, 21–18తో గాంగ్ యో జిన్–జియోంగ్ డా యోన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు జోడీలు ప్రతీ పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే కీలకదశలో మేఘన–తస్నీమ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్కు స్వర్ణం సహా నాలుగు కాంస్య పతకాలు లభించాయి. అండర్–15 బాలుర సింగిల్స్లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... అండర్–17 బాలికల సింగిల్స్లో అదితి భట్... అండర్–17 బాలుర సింగిల్స్లో మెరబా లువాంగ్... అండర్–15 బాలుర డబుల్స్లో పుల్లెల సాయివిష్ణు–గంధం ప్రణవ్ రావు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. -
సైనా, ప్రణయ్... కాంస్యాలతో సరి
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో తొలిసారి భారత్కు ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. సైనా, ప్రణయ్లకు 5,075 డాలర్ల చొప్పున ప్రైజ్మనీ (రూ. 3 లక్షల 37 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో సైనా 25–27, 19–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. 2013 స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్పై నెగ్గిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్పై మరో విజయం నమోదు చేయలేదు. 55 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసియా చాంపియన్షిప్లో సైనాకిది మూడో కాంస్య పతకం. గతంలో ఆమె 2010, 2016లలో కూడా సెమీస్లో ఓడి కాంస్య పతకాలు గెల్చుకుంది. తై జు యింగ్తో 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సైనాకు తొలి గేమ్లో నాలుగు గేమ్ పాయింట్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. రెండో గేమ్లో సైనా ఒక దశలో 19–17తో ఆధిక్యంలోకి వెళ్లినా మరోసారి ఒత్తిడికి తడబడి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 16–21, 18–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ప్రణయ్కిది తొలి కాంస్య పతకం. ఓవరాల్గా టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్లో భారత్కు నాలుగో పతకం. 1965లో దినేశ్ ఖన్నా స్వర్ణం సాధించగా... 2000లో పుల్లెల గోపీచంద్, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్య పతకాలు గెలిచారు. -
సెమీస్లో సైనా, ప్రణయ్
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, మూడో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సైనా 21–15, 21–13తో లీ జాంగ్ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19–21, 10–21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆసియా చాంపియన్షిప్లో సైనా సెమీస్కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 23–21, 21–12తో ప్రపంచ రెండో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 2007లో అనూప్ శ్రీధర్ తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు చేరిన తొలి ప్లేయర్గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 12–21, 15–21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడతారు. ఈ మ్యాచ్లు ఉదయం 11.30 నుంచి డి స్పోర్ట్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
సైనా, సింధు శుభారంభం
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లోనూ భారత క్రీడాకారులు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–14, 21–19తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై, సైనా 21–12, 21–9తో యో జియా మిన్ (సింగపూర్)పై అలవోకగా గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 13–21, 21–16, 21–16తో కెంటా నిషిమోటో (జపాన్)పై, సాయిప్రణీత్ 21–13, 11–21, 21–19తో అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై, ప్రణయ్ 21–15, 19–21, 21–19తో కాంతాఫోన్ (థాయ్లాండ్)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ 21–23, 17–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 14–21, 16–21తో బొదిన్ ఇసారా–నిపిట్ఫోన్ (థాయ్లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 14–21, 22–20, 21–17తో ఓంగ్ రెన్నె–వోంగ్ యింగ్ క్రిస్టల్ (సింగపూర్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో గావో ఫాంగ్జి (చైనా)తో సైనా; చెన్ జియోజిన్ (చైనా)తో సింధు; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (వియత్నాం)తో శ్రీకాంత్; చెన్ లాంగ్ (చైనా)తో సాయిప్రణీత్; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో ప్రణయ్ ఆడతారు. -
రెండో రౌండ్లో సింధు
వుహాన్:ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో సింధు 21-8, 21-18 తేడాతో ఆయుస్టినీ (ఇండోనేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. కేవలం 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఏకపక్ష విజయం సాధించింది. తొలి గేమ్ను అవలీలగా దక్కించుకున్న సింధు.. రెండో గేమ్లో కాస్త శ్రమించి గెలుపును సొంతం చేసుకుంది. మరొకవైపు సైనా నెహ్వాల్ పోరాటం తొలి రౌండ్ లోనే ముగిసింది. సైనా నెహ్వాల్ 21-19, 16-21, 18-21 తేడాతో సయకా సాటో(జపాన్) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ను గెలిచినప్పటికీ, మిగతా గేమ్ల్లో అనవసర తప్పిదాలు చేయడంతో సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సైనా... కాంస్యంతో సరి
సెమీస్లో పరాజయం వుహాన్ (చైనా): తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ చేతిలో 11వ సారి ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 16-2, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. క్వార్టర్స్లో షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించిన ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీస్లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. గతంలో యిహాన్పై నాలుగుసార్లు నెగ్గిన సైనా తొలి గేమ్లో ఒకదశలో 9-6తో ముందంజలో ఉంది. అయితే యిహాన్ పుంజుకొని రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అటునుంచి సైనా తేరుకోలేకపోయింది. ఆసియా చాంపియన్షిప్లో సైనా కాంస్య పతకం నెగ్గడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి సైనాకు కాంస్య పతకం దక్కింది. ఈ ఈవెంట్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా సైనా గుర్తింపు పొందింది. -
కాంస్యంతో సరి
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ క్రీడాకారిణి, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 16-21, 14-21 తేడాతో యిహాన్ వాంగ్(చైనా) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ఆరంభంలో 3-3,4-4, 6-5 తేడాతో ముందంజలో పయనించిన సైనా ఆ తరువాత అనూహ్యాంగా వెనుకబడి ఆ గేమ్ ను కోల్పోయింది. ఆపై రెండో గేమ్ ఆదిలో తీవ్ర ఒత్తిడికి లోనై 5-13 తేడాతో వెనుకబడింది. ఏ దదశలోనూ ప్రత్యర్థి ఎత్తులకు అడ్డుకట్టవేయలేకపోయిన సైనా రెండో గేమ్ ను కూడా కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్ర్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్న సైనా ..ఈ మెగా ఈవెంట్లో సెమీస్ కు చేరడం ద్వారా రెండుసార్లు పతకం సాధించిన క్రీడాకారిణి గుర్తింపుపొందిన సంగతి తెలిసిందే. కాగా, సెమీస్ లో అంచనాలను అందుకోలేకపోయిన సైనా పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. -
సైనా ముందుకు... సింధు ఇంటికి
► భారత స్టార్స్కు మిశ్రమ ఫలితాలు ► ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వుహాన్ (చైనా): మరోసారి నిలకడగా రాణించిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు తీవ్రంగా పోరాడినా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై గెలిచింది. నిచావోన్పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మరోవైపు ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు చేజేతులా ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు 21-13, 20-22, 8-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్ను నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్లో 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 20-19తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే కీలకదశలో తప్పిదాలు చేసి రెండో గేమ్ను కోల్పోయిన సింధు... మూడో గేమ్లో మాత్రం పట్టు కోల్పోయింది. ఆరంభంలోనే 0-8తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది. -
సైనా, సింధు శుభారంభం
► శ్రీకాంత్కు మళ్లీ నిరాశ ► డబుల్స్లో ఖేల్ఖతం ► ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీలకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. దాంతో ఈ మెగా ఈవెంట్లో భారత ఆశలన్నీ సైనా, సింధులపైనే ఉన్నాయి. సింగపూర్ ఓపెన్లో సెమీఫైనల్లో నిష్ర్కమించిన తర్వాత రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకున్న సైనా ఈ టోర్నీలో బరిలోకి దిగింది. ప్రపంచ 49వ ర్యాంకర్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్లో సైనా 21-16, 21-17తో గెలిచింది. కేవలం 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సైనాకు ఆరంభంలో కాస్త పోటీ ఎదురైనా కీలకదశలో వరుస పాయింట్లు సాధించి పైచేయి సాధించింది. మరో మ్యాచ్లో సింధు 21-10, 21-13తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)ను ఓడించింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)తో సైనా... తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏకైక భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. వరుసగా ఐదో టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ఆటగాడు తొలి రౌండ్ను అధిగమించడంలో విఫలమయ్యాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-13, 12-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, చైనా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలలోనూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 13-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావ (జపాన్)ల చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ 19-21, 17-21తో ఆర్ చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ (హాంకాంగ్)ల చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని ద్వయం 15-21, 11-21తో చాంగ్ యె నా-లీ సో హీ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
‘రియో’లో పతకమే లక్ష్యం: శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో అద్భుత ఆటతీరును కనబరిచిన భారత నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. సొంతగడ్డపై జరిగిన ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాంత్ తాను ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్ల్లోనూ గెలిచాడు. భారత్కు కాంస్యం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ‘ప్రపంచ ర్యాం కింగ్స్లో నంబర్వన్ కావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాలి. అలా జరిగితే ర్యాంక్ తనంతటతానే మెరుగవుతుంది. ఇప్పటికిప్పుడు టాప్ ర్యాంక్ సాధించాలని ఆరాట పడటంలేదు’ అని ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న శ్రీకాంత్ అన్నాడు. ‘అంచనాల గురించి ఎక్కువగా ఆలోచించను. కేవలం విజయం గురించే ఆలోచిస్తాను. మంచి ఫలితాలు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. రియో ఒలింపిక్స్లో పతకం నెగ్గడం ఈ ఏడాది నేను పెట్టుకున్న ఏకైక లక్ష్యం’ అని శ్రీకాంత్ తెలిపాడు. -
చాంప్స్ చైనా, ఇండోనేసియా
రెండు విభాగాల్లోనూ జపాన్కు నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్లో ఓడిన భారత్కు కాంస్యం లభిం చింది. భారత మహిళల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. జపాన్తో జరిగిన ఫైనల్లో చైనా మహిళల జట్టు అనూహ్యంగా పుంజుకుంది. తొలి మ్యాచ్లో షిజి యాన్ వాంగ్ 21-17, 16-21, 15-21తో నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్లో యింగ్ లు-కింగ్ తియాన్ జోడీ 12-21, 16-21తో మిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి జంట చేతిలో పరాజయం పాలైంది. దాంతో చైనా 0-2తో వెనుకబడింది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్ల్లో చైనా క్రీడాకారిణులు అద్వితీయ ఆటతీరుతో జపాన్ ఆశలను వమ్ము చేశారు. మూడో మ్యాచ్లో సున్ యు 22-20, 21-19తో సయాకా సాటోపై గెలుపొం దగా... నాలుగో మ్యాచ్లో యు లు-యువాన్టింగ్ టాంగ్ జంట 21-11, 21-10తో నోకో ఫకుమాన్-కురిమి ద్వయంపై నెగ్గింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో హీ బింగ్జియావో 21-18, 21-12తో యు హాషిమోటోను ఓడించడంతో చైనా 3-2తో విజయాన్ని ఖాయం చేసుకొని టైటిల్ను సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్ తొలి మ్యాచ్లో కెంటో మోమోటా 21-17, 21-7తో మౌలానా ముస్తఫాను ఓడించి జపాన్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్లో అంగా ప్రతమ-రికీ సువార్ది ద్వయం 22-20, 14-21, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా జోడీపై గెలువడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్లో జిన్టింగ్ ఆంథోనీ 21-7, 21-16తో షో ససాకిపై నెగ్గడంతో ఇండోనేసియా 2-1తో ముందంజ వేసింది. నాలుగో మ్యాచ్లో తకెషి కముర-కీగో సొనోడా జంట 21-16, 21-15తో బెరీ అంగ్రియవాన్-రియాన్ సపుత్ర జోడీని ఓడించడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో క్రిస్టీ జొనాథన్ 14-21, 21-19, 21-13తో కెంటా నిషిమోటోపై నెగ్గడంతో ఇండోనేసియా 3-2తో విజయం సాధించి విజేతగా నిలిచింది. -
అబ్బాయిలు అదుర్స్
సెమీస్లో భారత పురుషుల జట్టు క్వార్టర్స్లో 3-2తో మలేసియాపై విజయం కీలక మ్యాచ్లో నెగ్గిన ప్రణయ్ ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సొంతగడ్డపై భారత ‘రాకెట్’ దూసుకుపోతోంది. అంచనాలకు మించి రాణిస్తూ ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో పటిష్ట చైనా జట్టుపై సాధించిన విజయం గాలివాటమేమీకాదని నిరూపిస్తూ క్వార్టర్స్లోనూ భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మాజీ చాంపియన్ మలేసియాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల జట్టు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ పోటీల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించి ‘ఔరా’ అనిపించింది. మాజీ చాంపియన్ మలేసియాతో శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-2 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియా 3-0తో చైనాను చిత్తు చేయగా... జపాన్ 3-0తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3-0తో హాంకాంగ్పై గెలిచాయి. రెండో సెమీఫైనల్లో కొరియాతో జపాన్ పోటీపడుతుంది. శ్రీకాంత్తో శుభారంభం గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో చైనాపై 3-2తో సంచలన విజయం సాధించిన ఉత్సాహంతో భారత్ క్వార్టర ఫైనల్ పోరును గెలుపుతో మొదలుపెట్టింది. తొలి సింగిల్స్లో భారత నంబర్వన్, హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15తో ప్రపంచ 38వ ర్యాంకర్ జుల్కిఫ్లి జుల్ఫాద్లిపై నెగ్గి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమంకాలేదు. అయితే రెండో గేమ్లో శ్రీకాంత్ కాస్త తడబడ్డాడు. ఒకదశలో శ్రీకాంత్ 10-13తో వెనుకంజలో నిలిచాడు. అయితే వెంటనే తేరుకున్న శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 15-13తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థికి కేవలం రెండు పాయింట్లు సమర్పించుకున్న శ్రీకాంత్ విజయాన్ని దక్కించుకున్నాడు. పురురుషుల డబుల్స్ మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి భారత్కు రెండో విజయాన్ని అందించాడు. సుమీత్-మనూ అత్రి ద్వయం 21-10, 20-22, 21-16తో జువాన్ షెన్ లో-కియాన్ మెంగ్ తాన్ జంటను ఓడించింది. దాంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. జయరామ్ తడబాటు వరుసగా మూడో మ్యాచ్లోనూ గెలిచి భారత్ పోటీని ముగుస్తుందని ఆశించినా అలా జరగలేదు. ప్రపంచ 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-17, 12-21, 16-21తో ప్రపంచ 38వ ర్యాంకర్ ఇస్కందర్ జుల్కర్నైన్ జైనుద్దీన్ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ నెగ్గిన జయరామ్ ఆ తర్వాత పలు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఫలితంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో మ్యాచ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ ద్వయం 14-21, 21-14, 12-21తో యెవ్ సిన్ ఒన్గ్-ఇ యి తెయి జంట చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఆదుకున్న ప్రణయ్ ఇక నిర్ణాయక ఐదో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ అద్భుత ఆటతీరుతో భారత్ను గట్టెక్కించాడు. ఒత్తిడిని దరిచేరనీయకుండా నిగ్రహంతో ఆడిన ప్రణయ్ వరుస గేముల్లో 21-12, 22-20తో టెక్ జి సూపై గెలిచి భారత్కు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత మహిళల జట్టుకు నిరాశ మరోవైపు భారత మహిళల జట్టు పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పటిష్టమైన దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 0-3తో ఓడిపోయింది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్లను నిర్వహించలేదు. తొలి మ్యాచ్లో పీవీ సింధు 13-21, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జీ హున్ సుంగ్ చేతిలో ఓడిపోగా... డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 15-21, 22-20, 13-21తో కింగ్ యున్ జంగ్-సెయుంగ్ చాన్ షిన్ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో పీసీ తులసి 14-21, 15-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ యోన్ జు బే చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత కథ ముగిసింది. -
చైనాపై తొలిసారి...
టీమ్ ఈవెంట్లో భారత్ పురుషుల జట్టు విజయం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జపాన్ చేతిలో ఓడిన మహిళల జట్టు సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు చెలరేగింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్ 3-2 తేడాతో చైనాను ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్లలోనూ భారత్ నెగ్గగా...రెండు డబుల్స్ మ్యాచ్లలో ఓటమిపాలైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ టోర్నీలో అయినా టీమ్ ఈవెంట్లో భారత్... చైనాపై విజయం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. శ్రీకాంత్ జోరు వరల్డ్ నంబర్ 8 టియాన్ హోవీ, తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ల మధ్య జరిగిన తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్లో శ్రీకాంత్ ఆద్యంతం ఆధిపత్యం కనబర్చాడు. సింగపూర్తో గత మ్యాచ్లో తడబడిన హైదరాబాద్ ఆటగాడు ఈ సారి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో చివరకు శ్రీకాంత్ 21-11, 21-17తో విజేతగా నిలిచాడు. అనంతరం తొలి డబుల్స్లో చైనా జోడి జున్హుయ్ లి-జిహాన్ క్యు 22-20, 21-11తో భారత ద్వయం మను అత్రి-సుమీత్ రెడ్డిని ఓడించింది. ఆ తర్వాత గంట పాటు జరిగిన హోరాహోరీ పోరులో అజయ్ జైరాం 22-20, 15-21, 21-18తో జెంగ్మింగ్ వాంగ్పై గెలుపొందాడు. మళ్లీ డబుల్స్లో యిల్ వాంగ్-వెన్ జాంగ్ 21-10, 21-18తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్పై గెలుపొందడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో కీలక సింగిల్స్ ఆడిన హెచ్ఎస్ ప్రణయ్ ఒత్తిడికి లోను కాకుండా 21-14, 21-10తో యుఖీ షిని చిత్తు చేయడంతో భారత జట్టు గెలుపు ఖాయమైంది. మహిళల జట్టు చిత్తు మరో వైపు మహిళల జట్టుకు మాత్రం జపాన్ చేతిలో పరాజయం ఎదురైంది. జపాన్ 5-0తో భారత్ను ఓడించింది. తొలి సింగిల్స్లో ప్రపంచ 8వ ర్యాంకర్ నొజొమి ఒకుహరా 18-21, 21-12, 21-12తో సింధుపై గెలుపొందింది. తొలి గేమ్ను గెలుచుకున్నా...సింధు ఆ తర్వాత ఏమాత్రం పోరాడలేకపోయింది. తర్వాత మహిళల సింగిల్స్లో సయాకా సటో 24-22, 21-14తో పీసీ తులసిపై, యు హషిమొటో 23-25, 21-14, 21-14తో రుత్విక శివానిపై గెలుపొందారు. మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని జోడి 12-21, 18-21తో మిసాకి మట్సుటొమో-అయాకా టకహషి చేతిలో పరాజయం పాలు కాగా... ఆఖరి మ్యాచ్లో షిజుక మట్సువో-మామి నైటో 18-21, 21-11, 21-16తో సింధు-సిక్కిరెడ్డి ద్వయాన్ని ఓడించారు. -
గంటా 53 నిమిషాలు...
హోరాహోరీ పోరులో జెన్పై కశ్యప్ విజయం ఆసియా బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్స్కు చేరిక సింధు కూడా ముందంజ మ్యాచ్ సుదీర్ఘంగా, కఠినంగా జరిగింది. నా ఆటతీరుపట్ల సంతృప్తితో ఉన్నాను. గతేడాది ‘ఏబీసీ’లో అతను నన్ను ఓడించాడు. అతనితో ఇం డియా ఓపెన్లో ఆడిన మ్యాచ్లోనూ గట్టిపోటీ ఎదురైంది. గురువారం మ్యాచ్ సమయానికి మళ్లీ తాజాగా బరిలోకి దిగుతానని ఆశిస్తున్నా. -కశ్యప్ వుహాన్ (చైనా): భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నమ్మశక్యంకాని విధంగా గంటా 53 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ పోరులో కశ్యప్ 15-21, 21-18, 21-19తో తన ప్రత్యర్థి, ప్రపంచ 25వ ర్యాంకర్ జెన్ హావో సు (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఈ విజయంతో నిరుడు ఇదే టోర్నీలో జెన్ హావో సు చేతిలో ఎదురైన పరాజయానికి కశ్యప్ ప్రతీకారం తీర్చుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జెంగ్మింగ్ వాంగ్ (చైనా)తో కశ్యప్ ఆడతాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో సింధు 21-6, 21-5తో అనైత్ ఖుర్షుద్యాన్ (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ విభాగం రెండో రౌండ్లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా ద్వయం 15-21, 17-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోగా... సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంటకు ‘వాకోవర్’ లభించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జెన్ హావో సుతో జరిగిన మ్యాచ్లో కశ్యప్కు ఆద్యంతం తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో 0-2తో వెనుకబడి ఆ తర్వాత స్కోరు సమం చేసిన కశ్యప్ అనంతరం పూర్తిగా లయ తప్పాడు. రెండో గేమ్ మొదట్లో 2-5తో వెనుకబడ్డ ఈ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సహనం కోల్పోకుండా ఆడుతూ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడుతున్న దశలో కశ్యప్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15-12తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో కశ్యప్ తొలుత 2-5తో, ఆ తర్వాత 4-7 తో వెనుకంజ వేశాడు. అయితే పట్టువదలకుండా పోరాడి తేరుకున్నాడు. కశ్యప్ 20- 19తో ఆధిక్యంలో ఉన్న దశలో విద్యుత్ అంతరాయంతో మ్యాచ్ 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. కరెంటు వచ్చాక కశ్యప్ కీలకమైన పాయింట్ నెగ్గి విజయాన్ని దక్కించుకున్నాడు. అనధికార రికార్డుల ప్రకారం సుదీర్ఘ సమయం మ్యాచ్ ఆడిన భారత ప్లేయర్గా కశ్యప్ గుర్తింపు పొందాడు. బ్యాడ్మింటన్లో సుదీర్ఘ మ్యాచ్ రికార్డు పీటర్ రస్ముస్సేన్ (డెన్మార్క్), సున్ జు (చైనా)ల పేరిట ఉంది. 1997 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో పీటర్ 2 గంటల 4 నిమిషాల్లో సున్ జును ఓడించి విజేత అయ్యాడు. -
కశ్యప్ శుభారంభం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వుహాన్ (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో భారత స్టార్ పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-17, 21-13తో జిలియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో కాస్త పోటీ ఎదుర్కొన్నా కశ్యప్కు రెండో గేమ్లో ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ 9-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరుతో మ్యాచ్ను ముగించాడు. బుధవారం జరిగే తదుపరి రౌండ్లో జెన్ హావో సు (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్షిప్లో జెన్ హావో సు చేతిలో ఓడిన కశ్యప్ ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోవైపు మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జ్వాల-అశ్విని జంట 17-21, 21-15, 15-21తో యు పో పాయ్-యా చింగ్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
క్రీడలు: షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్
చిత్ర మగిమైరాజ్కు ప్రపంచ మహిళల స్నూకర్ టైటిల్ బెంగళూరుకు చెందిన చిత్రమగిమైరాజ్ ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్ టైటిల్ గెలుచుకుంది. లీడ్స్ (ఇంగ్లండ్)లో ఏప్రిల్ 22న జరిగిన ఫైనల్లో బెలారస్కు చెందిన అలెనా అస్మోలోవను చిత్ర ఓడించి విజేతగా నిలిచింది. లిన్ డాన్, సుంగ్ జీలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్స్ దక్షిణ కొరియాలో ఏప్రిల్ 27న ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను లిన్డాన్, మహిళల సింగిల్స్ టైటిల్ను సుంగ్ జీ యున్ గెలుచుకున్నారు. విజేతలు పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) ఫైనల్స్లో ససాకి షో (జపాన్)ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్: సుంగ్ జీ యున్ (కొరియా) గెలుచుకుంది. ఈమె ఫైనల్స్లో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్: షిన్ బీక్ చోయెల్ - యు యోన్ సియోంగ్ (కొరియా) గెలుచుకున్నారు. వీరు లియు, యుచెన్ (చైనా)లను ఓడించారు. మహిళల డబుల్స్: లూ యింగ్ - లు యు (చైనా) గెలుచుకున్నారు. వీరు కిమ్ హ నా-జుంగ్ యుంగ్ యున్ (కొరియా)లను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: లీ చున్ హె - చావు హో వా (హాంకాంగ్) గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్లో షిన్ బీక్ చోయెల్ - జాంగ్ యె నా (కొరియా)లను ఓడించారు. ఈ చాంపియన్షిప్ లో భారత్కు చెందిన సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి. లాహిరికి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్ భారత్కు చెందిన అనిర్బన్ లాహిరి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్ను గెలుచుకున్నాడు. జకర్తాలో ఏప్రిల్ 27న ముగిసిన పోటీలో లాహిరి టైటిల్ సాధించగా కొరియాకు చెందిన బేక్ సెయుహైన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ టైటిల్ లాహిరి గెలుచుకోవడం ఇది నాలుగోసారి. ఎమ్మా బొన్నీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్స్ టైటిల్ ఎమ్మాబొన్నీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. లీడ్స్లో ఏప్రిల్ 24న జరిగిన ఫైనల్లో భారత్కు చెందిన ఉమాదేవి నాగరాజ్ను బోన్నీ ఓడించింది. ఈ టైటిల్ను భారత్ నుంచి తొలిసారి 2005లో అనూజ ఠాకూర్ గెలుచుకుంది. తర్వాత 2006, 2007లో చిత్ర గెలుచుకుంది. షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్ పోర్షే గ్రాండ్ ప్రి టెన్నిస్ టైటిల్ను మరియా షరపోవా గెలుచుకుంది. స్టుట్గార్టలో ఏప్రిల్ 27న జరిగిన ఫైనల్స్లో అనా ఇవనోవిక్ను షరపోవా ఓడించింది. -
‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ
గిమ్చియోన్ (కొరియా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 14-21, 21-9, 21-15తో ససాకి షో (జపాన్)పై విజయం సాధించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ సాధించాక లిన్ డాన్ పాల్గొన్న టోర్నీ ఇదే కావడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నాలుగోసీడ్ సుంగ్ జీ యున్ (కొరియా) 21-19, 21-15తో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్లో షిన్ బీక్ చోయెల్-యూ యోన్ సియోంగ్ (కొరియా); మహిళల డబుల్స్లో లూ యింగ్-లూ యు (చైనా); మిక్స్డ్ డబుల్స్లో లీ చున్ హె-చావు హో వా (హాంకాంగ్) జోడిలు టైటిల్స్ సాధించాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి. -
కాంస్యాలతో సరి
సెమీస్లో ఓడిన సింధు జ్వాల-అశ్విని జోడీకి నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, జ్వాల-అశ్విని జోడి... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-15, 20-22, 12-21తో టాప్సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. గంటా 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతంగా ఆడింది. అటాకింగ్తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ అదే జోరు కనబరిచింది. 20-18తో రెండు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే కీలకదశలో ఒత్తిడికిలోనైన సింధు వరుసగా రెండు పాయింట్లను కోల్పోవడంతో స్కోరు 20-20 వద్ద సమమైంది. ఆ తర్వాత షిజియాన్ మరో రెండు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ను 22-20తో నెగ్గి మ్యాచ్లో నిలిచింది. ఓటమి అంచుల్లోంచి బయటపడిన షిజియాన్ మూడో గేమ్లో విజృంభించడంతో సింధు చేతులెత్తేసింది. మహిళల డబుల్స్ సెమీస్లో జ్వాల-అశ్విని 12-21, 7-21తో లూ యింగ్-లూ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. తొలి గేమ్ ఆరంభంలో నెట్ వద్ద జ్వాలా జోడి కొన్ని పాయింట్లు చేజార్చుకోవడం దెబ్బతీసింది. బ్యాక్ కోర్టులో అశ్విని అద్భుతంగా ఆడటంతో 3-3తో స్కోరు సమమైంది. కానీ చిన్న చిన్న తప్పిదాలతో 6-11, 6-15, 11-20తో వెనుకబడి గేమ్ను కోల్పోయారు. షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టేందుకు ప్రయత్నించిన జ్వాల ద్వయం రెండో గేమ్లో సుదీర్ఘ ర్యాలీలు ఆడింది. కానీ చైనా జోడి మెరుగైన డిఫెన్స్తో 11-2 ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ తప్పిదాలతో భారత్కు కొన్ని పాయింట్లు సమర్పించుకున్నా విజయానికి సరిపోలేదు. 20-6 స్కోరుతో వద్ద జ్వాల-అశ్విని మ్యాచ్ పాయింట్ను కాపాడుకున్నా.. తర్వాత సర్వీస్ కోల్పోయారు. ఆసియా బ్యాడ్మింటన్లో సెమీస్కు చేరితే కాంస్యం వస్తుంది. కాబట్టి అటు సింధు, ఇటు జ్వాల జోడిలకు కాంస్యాలు దక్కుతాయి. ‘ఓవరాల్గా సింధు బాగా ఆడింది. రెండో గేమ్లో 20-18తో ముందంజలో ఉన్న దశలో సింధు రెండు పాయింట్లను కోల్పోయింది. ఈ తరహా మ్యాచ్ల్లో కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ఒకరోజు మనం గెలుస్తాం. మరోరోజు ఓడిపోతాం. మొత్తానికి సింధు ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాను.’ - పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
‘రాకెట్’ తడాఖా
సెమీస్లో పి.వి.సింధు, జ్వాల అశ్విని జోడి కనీసం రెండు పతకాలు ఖాయం ఏబీసీ చరిత్రలో ఇదే తొలిసారి పోరాడి ఓడిన గురుసాయిదత్ భారత బ్యాడ్మింటన్లో మరో కొత్త అధ్యాయం. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో మనోళ్ల రాకెట్ లాంటి ఆటతీరుకు ఒకేసారి రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్లో యువతార పి.వి.సింధు... మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం సెమీఫైనల్కు దూసుకెళ్లి భారత సత్తాను చాటారు. 23 ఏళ్ల ఈ చాంపియన్షిప్లో చరిత్రలో భారత్కు ఒకేసారి రెండు పతకాలు రావడం ఇదే ప్రథమం. గిమ్చియోన్ (కొరియా): నిలకడగా రాణిస్తూ పి.వి.సింధు... తమ పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు తగిన సమాధానమిస్తూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో ముందంజ వేశారు. అయితే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ తీవ్రంగా శ్రమించినా విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-10తో ఒంగ్బుమ్రంగ్పాన్ బుసానన్ (థాయ్లాండ్)పై గెలుపొందగా... డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని జోడి 21-12, 21-12తో అలిసియా-సూంగ్ ఫీ చో (మలేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్లో గురుసాయిదత్ 24-22, 9-21, 13-21తో లియు కాయ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఏబీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్లో టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సింధు... లూ యింగ్లూ యు (చైనా)లతో జ్వాల -అశ్విని తలపడతారు. 1991లో మొదలైన ఏబీసీ లో ఇప్పటివరకు భారత్కు రెండు కాంస్యాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా సెమీఫైనల్స్లో ఓడిపోయారు. గతంలో బుసానన్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సింధుకు ఈసారి గట్టిపోటీనే లభించింది. మ్యాచ్లో కుదురుకునేలోపే సింధు తొలి గేమ్ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న ఈ తెలుగమ్మాయి రెండో గేమ్లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. నిర్ణాయక మూడో గేమ్లోనూ ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్ మ్యాచ్లో జ్వాల జోడి ఏదశలోనూ ప్రత్యర్థి జంటకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ 40 నిమిషాల్లో మ్యాచ్ను ముగించారు. ఆత్మవిశ్వాసం పెరగడంలో ఈ గొప్ప విజయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మ్యాచ్లో మేమిద్దరం చాలా బాగా ఆడాం. నిలకడగా రాణిస్తే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయని మా ఇద్దరికీ తెలుసు. జోడిగా మరింత ప్రాక్టీస్ చేసి, మరిన్ని మ్యాచ్లు ఆడితే పూర్వపు ఫామ్ను సాధిస్తాం. అశ్విని పొనప్ప తొలి గేమ్లో మినహా సింధు అద్భుతంగా ఆడింది. రెండో గేమ్ నుంచి సింధు స్మాష్లలో పదును పెరిగింది. ఈ అంశం విజయంలో కీలకపాత్ర పోషించింది గోపీచంద్, కోచ్ షిజియాన్ వాంగ్తో జరిగే సెమీఫైనల్లో సింధు ఆమెను ఓడిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. వాంగ్ బలాబలాలు, బలహీనతలపై సింధుకు మంచి అవగాహన ఉంది. రమణ (సింధు తండ్రి) 1 భారత్ తరఫున ప్రపంచ చాంపియన్షిప్లోనూ, ఆసియా చాంపియన్షిప్లోనూ పతకాలు నెగ్గిన తొలి క్రీడాకారిణులుగా సింధు, జ్వాల, అశ్విని. -
క్వార్టర్ ఫైనల్లో సింధు, సాయిదత్
గిమ్చియోన్ (కొరియా): ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)పై 4-21 21-13 21-18తో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో థాయలాండ్కు చెందిన బుసానన్ అంగబుంరంగపాన్తో సింధు తలపడుతుంది. గురు సాయిదత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో వాంగ్ జు హుయ్ (చైనీస్ తైపీ)పై 17-21 21-13 21-19తో గెలుపొందాడు. తర్వాతి మ్యాచ్ లో చైనాకు చెందిన లియు కాయ్ పై పోటీ పడతాడు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
కశ్యప్ శుభారంభం
శ్రమించి నెగ్గిన సింధు, గురుసాయిదత్ శ్రీకాంత్ పరాజయం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 21-14, 21-17తో గో సూన్ హువాట్ (మలేసియా)పై గెలిచాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కశ్యప్ రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సూ జెన్ హావో (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సూ జెన్ హావోతో ఆడిన ఏకైక మ్యాచ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వరుస గేముల్లో నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో గురుసాయిదత్ ముందంజ వేయగా... కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 22-20, 23-21తో ఫెట్ప్రదాబ్ ఖోసిట్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 7-21, 14-21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు శ్రమించి గెలిచింది. ప్రపంచ 147వ ర్యాంకర్ చుయెంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్లో సింధు 21-15, 15-21, 21-18తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)తో సింధు తలపడుతుంది. హిరోస్తో గతంలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి 21-18, 21-15తో ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 21-16, 13-21, 20-22తో లో జువాన్ షెన్-హెగ్ నెల్సన్ (మలేసియా) చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) 18-21, 19-21తో జాంగ్ వెన్-వాంగ్ యిల్వ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
గిమ్చియోన్ (కొరియా): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... ఈసారి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో భారత ఆశలన్నీ పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్లపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీల తర్వాత బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గో సూన్ హువాట్ (మలేసియా)తో కశ్యప్ తలపడతారు. స్థాయికి తగ్గట్టు ఆడితే కశ్యప్ సెమీఫైనల్కు చేరుకునే అవకాశముంది. కశ్యప్తోపాటు ఆంధ్రప్రదేశ్కే చెందిన కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో శ్రీకాంత్; ఫెట్ప్రదాబ్ ఖోసిట్ (థాయ్లాండ్)తో గురుసాయిదత్ ఆడతారు. ‘రెండేళ్ల క్రితం చివరిసారి లిన్ డాన్తో థాయ్లాండ్ ఓపెన్లో ఆడాను. లిన్ డాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అతనితో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతాను. గెలిచేందుకు నా వందశాతం కృషి చేస్తాను. సింగపూర్ ఓపెన్లో ప్రపంచ నంబర్వన్ లీ చోంగ్ వీతో ఆడిన మ్యాచ్తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. అన్ని విభాగాల్లో సెమీఫైనల్కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. 1991లో మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్లో ఓడిపోయి కాంస్య పతకాలను గెల్చుకున్నారు.