Bal Thackeray
-
Bal Thackeray: సీఎంనే మందు పార్టీ అడిగిన బాల్ ఠాక్రే
న్యూఢిల్లీ: బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్ ముంబై ఫర్ ఎవర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాల్ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.అది 1995. బాల్ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్ హెచ్ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్ జోషితో ‘ఏంటి మనోహర్.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్ఠాక్రే డాక్టర్ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం?
ముంబై: రెబల్ ఎమ్మెల్యేల ద్వారా శివసేన పార్టీని విభజించిన ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండే.. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో సర్కార్ను ఏర్పాటు చేయడం, ఏకంగా సీఎం అయిపోవడం విదితమే. అయితే.. తమదే సిసలైన శివసేన అని ప్రకటించుకున్న షిండే వర్గం.. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతోందా? బాలాసాహెబ్(బాల్థాక్రే) నేతృత్వంలో స్థాపించిన బడిన శివసేన ప్రధాన కార్యాలయం శివసేన భవన్.. దాదర్లో ఉంది. ఈ భవనంతో సంబంధం లేకుండా ఓ శివసేన భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో షిండే వర్గం ఉన్నట్లు ఊహాగాన కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు దాదర్ ప్రాంతంలోనే కొత్త భవనం కోసం వేట ప్రారంభించినట్లు, ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక కార్యాలయాలను సైతం నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనాల సమచారం. అయితే ఈ కథనాలపై షిండే వర్గం స్పందించింది. తాజాగా షిండే కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయ్ సామంత్ అదంతా ఊహాగానమే అని ప్రకటించారు. కొత్త ప్రధాన కార్యాలయం లాంటి ఆలోచనేం లేదు. బాలాసాహెబ్పై ఉన్న గౌరవంతో శివసేన భవనాన్నే మేం గౌరవిస్తాం. కానీ, సీఎం షిండే.. సామాన్యులతో భేటీ కోసం ఓ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నాం. బహుశా ఈ కథనాలు తెలిసి పొరపాటుగా అర్థం చేసుకుని మీడియా ఇలా ప్రచారం చేస్తుందేమో అని ఉయద్ సామంత్ వెల్లడించారు. ప్రస్తుతం శివ సేన పార్టీ ఎవరికి చెందాలనే వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోంది. తమదే అసలైన క్యాంప్ అంటూ మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే క్యాంప్లు పోటాపోటీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. చదవండి: మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన -
ఉద్ధవ్కు మరో షాక్.. షిండే వర్గంలోకి సొంత కుటుంబ సభ్యులు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్ థాక్రేకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలతో పాటు కుటుంబ సభ్యుల్లోనూ కొందరు షిండే వర్గానికి మద్దతు తెలుపుతుండటం ఉద్ధవ్కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరో షాక్ తగిలింది. బాల్థాక్రే మనుమడు, ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్ థాక్రే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిహార్ థాక్రేకు ఇప్పటి వరకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షిండేను కలవటం హాట్టాపిక్గా మారింది. బాల్ థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ థాక్రే కుమారుడే నిహార్ థాక్రే. బిందుమాధవ్.. 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన సినీ నిర్మాతగా ఉండగా.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే.. ఆయన కుమారుడు నిహార్.. తాజాగా షిండేను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ఉద్ధవ్ మరో సోదరుడు జైదేవ్ థాక్రే మాజీ భార్యా స్మితా థాక్రే సైతం ఇటీవలే సీఎం షిండేను కలిశారు. నిహార్ థాక్రే ఒక న్యాయవాది. ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్ను గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. మంత్రిగానూ సేవలందించారు. వలసలు పెరిగిన క్రమంలో షిండేపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్ధవ్ థాక్రే. తాను అనారోగ్యానికి గురైనప్పుడు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
దమ్ముంటే ఆ పని చెయ్యి.. షిండేకు థాక్రే సవాల్
ముంబై: రాజకీయ చదరంగంలో ఓడినా.. న్యాయం తమవైపే ఉందని, ప్రజాక్షేత్రంలో నెగ్గి తీరతామని మరోసారి ఉద్ఘాటించారు శివ సేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోనుందుకే ఇదంతా జరిగిందని మరోసారి సంక్షోభంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తింపు వ్యవహారం ఈసీ దగ్గర ఉన్న తరుణంలో.. తాజా ఇంటర్వ్యూలో థాక్రే మరోసారి సీఎం షిండేపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లు(రెబల్స్) నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు బాల్థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి’’ అంటూ చురకలంటించారు. వాళ్లు శివ సేన అనే మహా వృక్షానికి పట్టిన చీడ. కుళ్లిన ఆకులు వెళ్లిపోయాయి. అయినా శివ సేనే నేలకు ఒరగదు. నా ప్రభుత్వం కుప్పకూలినా.. నా పదవి పోయినా.. నాకేం బాధ లేదు. కానీ, నా సొంత వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారన్న బాధను సహించలేకపోతున్నా. ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న సమయంలో.. కోలుకోలేని దెబ్బ వేశారు నా అనుకున్నవాళ్లే. నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎలాగైనా పార్టీని నిలబెడతాడన్న నమ్మకం అతనిపై ఉండేది. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. కుట్రకు తెరలేపాడు. ఆ నమ్మక ద్రోహికి సవాల్ చేస్తున్నా.. నీ తండ్రి ఫొటోతో ఎన్నికల్లో నెగ్గి చూపించూ.. అంటూ పరోక్షంగా షిండేపై విమర్శలు గుప్పించారాయన. తన తండ్రి తర్వాత పార్టీ చీలిపోకుండా ఉండేందుకు తాను ప్రయత్నించానని, కానీ, అయినవాళ్లే ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లను, వాళ్ల పాపులారిటీని వాడుకుని బీజేపీ లాభపడాలని ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ నుంచి సర్దార్ పటేల్ను ఎలాగ వాడుతుందో.. ఇప్పుడు తన తండ్రి(బాల్థాక్రే) విషయంలోనూ అదే పని చేస్తోందని చెప్పారు. బాల్ థాక్రేకు అసలైన వారసులం, శివ సైనిక్లం తామేనంటూ మహారాష్ట్ర సీఎం షిండే ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్దవ్ థాక్రే ఇలా తీవ్రంగా స్పందించారు. -
కూటమిలోనూ నేనే సీఎం కావాల్సింది!: సీఎం షిండే
బీజేపీ మద్దతుతో బలపరీక్షలో అలవోకగా నెగ్గిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన అనంతరం.. చనిపోయిన తన ఇద్దరు కొడుకులను తల్చుకుని సభలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారాయన. బలనిరూపణలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించే అర్హతను సంపాదించుకున్నారు ఏక్నాథ్ షిండే. పరీక్షలో 99 వ్యతిరేక ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాఢి కూటమిలోనూ సీఎంగా తన పేరే ముందుగా తెరపైకి వచ్చిందని, కానీ, ఎన్సీపీ నేత ఒకరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. సోమవారం బలనిరూపణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అజిత్ దాదా(అజిత్ పవార్ను ఉద్దేశించి)నో ఇంకెవరో నన్ను ముఖ్యమంత్రిని చేయకుండా అడ్డుకున్నారు. ఆ టైంలో నాకేం ఇబ్బంది లేదని, ఉద్దవ్తోనే ముందుకు వెళ్లాలని తాను చెప్పానని, అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నానని, సీఎం పదవి మీద తనకు ఎలాంటి వ్యామోహం షిండే వ్యాఖ్యానించారు. మేం శివ సైనికులం.. బాలాసాహెబ్(బాల్ థాక్రే), ఆనంద్ దిఘే సైనికులం మేమంతా. ఆరేళ్ల పాటు బాలాసాహెబ్ను ఓటు వేయకుండా నిషేధించారో మీకు గుర్తు చేయాలనుకుంటున్నా(కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ..1995-2001 మధ్య) అని షిండే వ్యాఖ్యానించారు. శివ సేనను రక్షించేందుకే తాను తిరుగుబాటు బావుటా ఎగరేశారనని చెప్పారు. బాలాసాహెచ్ ఆశయాలను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని వ్యాఖ్యానించారాయన. థానే కార్పొరేటర్గా పని చేస్తున్నప్పుడు నా ఇద్దరు కొడుకులను కోల్పోయా. అంతా అయిపోయిందనుకున్నా. రాజకీయాలు వదిలేయాలనుకున్నా. ఆనంద్ దిఘే సాహెబ్.. నన్ను రాజకీయాల్లో కొనసాగాలని కోరారు అంటూ సీఎం షిండే గుర్తు చేసుకుంటూ గద్గద స్వరంతో ప్రసంగించారు. #WATCH | Maharashtra CM Eknath Shinde breaks down as he remembers his family in the Assembly, "While I was working as a Shiv Sena Corporator in Thane, I lost 2 of my children & thought everything is over...I was broken but Anand Dighe Sahab convinced me to continue in politics." pic.twitter.com/IVxNl16HOW — ANI (@ANI) July 4, 2022 -
Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా. తొలి కేసు ఇందిరదే పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప జారీ చేసిన విప్ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్ (ఐ)కి హస్తం గుర్తు లభించింది. తాజా వివాదాలు... గత అక్టోబర్లో బిహార్లో లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి (రామ్విలాస్ పాశ్వాన్) పేరుతో, హెలికాప్టర్ గుర్తుతో; పరాస్ వర్గం రాష్ట్రీయ లోక్జనశక్తి పేరుతో, కుట్టు మిషన్తో పోటీ చేశాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తు ఆయనకే దక్కింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’ సంక్షోభం.. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!
ముంబై: శివసేన పార్టీలో అగ్రశ్రేణి నాయకుడు, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఏక్నాథ్ శిండే హఠాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో ఇటు శివసేన పార్టీలో, అటు ప్రభుత్వ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనాలు ఏర్పడ్డాయి. శివసేన పార్టీకి మొదట్నుంచి ఎంతో నిష్టావంతుడైన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక కారణాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. బాలాసాహెబ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడైన ఏక్నాథ్ శిండే అసంతప్తికి గురికావడానికి, తిరుగుబాటు చేయడానికి కారణం తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవి మధ్యలో ఉద్ధవ్ ఠాక్రే రావడం వల్ల చేజారిపోయిందని భావించటం ఒకటైతే, హిందూత్వ పార్టీగా పేరుపొందిన శివసేన, బాలాసాహెబ్ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్లాంటి బాలాసాహెబ్ ఠాక్రే వ్యతిరేక పార్టీలతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రెండవది అని కొందరు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. శరద్ పవార్ దౌత్యం ఫలించి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టిన మొదట్లో ఏక్నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారని అనుకున్నారు. ఏనాడూ ప్రభుత్వ పదవుల్ని ఆశించని ఠాక్రే కుటుంబం అకస్మాత్తుగా పదవిని ఆశించడం షిందేకు తీవ్ర నిరాశను కలిగించింది. ముఖ్యమంత్రి కావాల్సిన తనకు మంత్రి వర్గంలో సైతం తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతో లోలోన తీవ్ర అసంతప్తికి గురయ్యాడనీ కొందరు సన్నిహితులు చెబుతున్నారు. సంబంధిత వార్త: ఉద్దవ్ థాక్రేపై ఫడ్నవీస్ భార్య ట్వీట్! నిధులివ్వకుండా అవమానించారు.. హిందుత్వకు ప్రతీకగా పేరుపొందిన శివసేన పార్టీ అవకాశవాద పార్టీగా మారిందని, పదవుల కోసం బాలా సాహెబ్ సిద్ధాంతాలను మంటగలుపుతోందనీ, సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మీడియాలో వస్తున్న విమర్శలు కూడా ఏక్నాథ్ షిండేను ఆందోళనకు గురిచేశాయంటారు. ఆర్థిక మంత్రిగా ఎన్సీపీకి చెందిన వ్యక్తి ఉండడం వల్ల కూడా అవసరమైన నిధుల్ని విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం కూడా షిందే అసంతప్తికి మరోకారణంగా చెబుతున్నారు. తనను ఫ్లోర్ లీడర్ పదవి నుండి తొలగించడంపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రే శిష్యుడినేననీ, నిఖార్సయిన శివసైనికుడినని.. పదవుల కోసం తిరుగుబాటు చేయడం బాలాసాహెబ్ తనకు నేర్పలేదనీ.. హిందుత్వం కోసమే తాను తిరుగుబాటు చేస్తున్నాననీ.. శివసేన సిద్ధాంతాలను నమ్ముకున్న 35 మంది శాసన సభ్యులు తన వెంట ఉన్నారనీ’ చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా, తాను తిరిగిరావాలంటే, శివసేన పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్తో పొత్తు తెంపుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా కండిషన్ విధించాడు. సంబంధిత వార్త: ‘మహా’లో మరో ట్విస్ట్.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్కు కరోనా పాజిటివ్ తాజా సమాచారం ప్రకారం షిండేను బుజ్జగించేందుకు ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే కూడా రంగంలోకి దిగారు. ఆమె ఏక్నాథ్ శిండేతో మాట్లాడారనీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా శిండేతో మాట్లాడారనీ తెలిసింది. ఏక్నాథ్ షిండేతో మాట్లాడేందుకు ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు దూతల్ని సూరత్ పంపిస్తున్నట్లుగా సమాచారం. ఈ తిరుగుబాటు వెనక బీజేపీ హస్తమున్నట్లుగా కొందరు శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా బుధవారం సాయంత్రానికి పరిణామాలపై స్పష్టత రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందిదీ.. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్ధానాలున్నాయి. అందులో బీజేపీ–106, శివసేన–56, ఎన్సీపీ–53, కాంగ్రెస్–44, ఎంఐఎం–2, ఆర్ఎస్పీ–1, జేఎస్ఎస్–1, ఇండిపెండెంట్లు, ఇతరులు–24 (శివసేనకు చెందిన ఓ స్ధానం ఖాళీ ఉంది) ఇలా బలాబలాలున్నాయి. ఈ నెల 10న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు గెలిచారు. తాజాగా సోమవారం జరిగిన విధాన్ పరిషత్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఐదుగురు అభ్యర్ధులను గెలిపించుకుని మహా వికాస్ ఆఘాడి ప్రభు త్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ముఖ్యంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఇతరుల బలమున్నప్పటికీ కేవలం 52 ఓట్లు పోలయ్యాయి. అదే బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ 134 ఓట్లు పోల్ అయ్యాయి. దీన్ని బట్టి బీజేపీకి 134 మంది సభ్యుల బలముందని స్పష్టమవుతోంది. మెజార్టీ నిరూపించుకోవాలంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఏక్నాథ్ షిండేసహా ఆయన మద్దతుదారులు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కాంటాక్ట్లో ఉన్నట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో ప్రవేశిస్తుండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయే ఆస్కార ముంది. దీంతో మంగళవారం శివసేన పార్టీ కార్యాలయమైన సేన భవన్కు ఎమ్మెల్యేలందరు వెంటనే హాజరు కావాలని ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. కాని సేనా భవన్లోకి షిండే వర్గం మినహా కేవలం 21–24 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలిసింది. -
అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: గుజరాత్లో గోద్రా అల్లర్ల తరువాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ‘గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే ఆద్వానీ ఓ ర్యాలీ కోసం ముంబై వచ్చారు. అప్పుడు బాలా సాహెబ్తో మాట్లాడుతూ.. మోదీని తొలగించాల్సి ఉంటుందా అని అడిగారు. దీనిపై బాలా సాహెబ్ స్పందిస్తూ.. లేదు అతని జోలికి వెళ్లకండి. ‘మోదీ గయాతో గుజరాత్ గయా’(మోదీ పోతే, గుజరాత్ పోయినట్లే) అని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. కానీ మేము హిందుత్వానికి మద్దతు ఇచ్చాం’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి కూడా మోదీతో సత్సంబంధాలు ఉన్నాయని, కానీ దానర్థం పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మసీదుల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై శివసేన వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖల్యు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్లాగే మహారాష్ట్రలో త్వరలో ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని తెలిపారు. ‘ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వెళ్లాలంటే కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి రాకూడదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకోకూడదు. రాజకీయ నాయకులు చేసిన దానికి అధికారులు భయపడుతున్నారు. ప్రధాని దేశం మొత్తానికి. ఆయన దేశ శత్రువులతో పోరాడాలి. అదే విధంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రేపై సీఎం విరుచుకుపడ్డారు. కొంతమంది ఎప్పటికీ జెండాలు మారుస్తూనే ఉంటారని విమర్శించారు. ‘ముందుగా వారు మరాఠీయేతరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో హిందువేతరులపై దాడులు చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాలం. ఇది పని చేయకుంటే ఇంకొకటి. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఒక మతం గురించి చెప్పిందని నేను అనుకోను. మార్గదర్శకాలు అన్ని మతాలకు వర్తిస్తాయి’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. చదవండి: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్ వైన్ -
అమిత్ షా సవాల్కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు. స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు. ‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు. చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్ని ఎత్తి వ్యాన్లో వేశారు శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్ నాగ్పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్పూర్లో ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు. అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
పొలిటీషియన్ మనవడితో డేటింగ్: స్పందించిన నటి!
బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ కూతురు అలయ ప్రేమలో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రేతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు రహస్య ప్రేమలో మునిగి తేలుతున్నారని కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తమ మధ్య ఉన్నది వండర్ఫుల్ స్నేహం మాత్రమేనని స్పందించింది అలయ. ఐశ్వరీ ఒక అద్భుతమైన స్నేహితుడు అని అభివర్ణించింది. ఐశ్వరీకి, తనకు మధ్య ఏదో ఉందంటూ వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవద్దని సెలవిచ్చింది. మొదట్లో ఈ వార్తలు చూసి తన బంధుమిత్రులు ఆశ్చర్యపోయారని, కానీ రానురానూ వాళ్లకు కూడా అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది. కాగా అలయ, ఐశ్వరీ.. ఇద్దరూ ఒకరి బర్త్డేకు మరొకరు హాజరవుతూ, కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఫిక్సయ్యారంతా. అయితే అలయ తల్లి పూజా కూడా ఈ గాసిప్ను ఖాతరు చేయలేదు. ఇలాంటి పుకార్లు చాలా చూశానని లైట్ తీసుకుంది. అయినా నటీమణులకు కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కుంది అంటూ తన కూతురి లైఫ్, తనిష్టమని స్పష్టం చేసింది. చదవండి: ‘ఇది చాలా చిన్న విషయం, మరి ప్రజలు అంగీకరిస్తారో లేదో’ -
అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం కార్యక్రమం ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గుడి శంకుస్థాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దీని కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పోరాటం కొనసాగించిన శివసేనను శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా పెట్టడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 5న జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోనే కీలక ఘట్టానికి తమను ఆహ్వానించలేదని సేనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి) బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను భుజనాకెత్తుకున్న శివసేన మొదటి నుంచీ రామాలయ నిర్మాణం కోసం పాడుపడిందని, దేశంలోని హిందువుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు బాల్ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో రామాలయ నిర్మాణం కొరకు న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేశామంటారు. హిందుత్వ ఎజెండానే ధ్వేయంగా పురుడుపోసుకున్న శివసేనకు తొలుత నాయకత్వం వహించిన బాల్ఠాక్రే కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలో శంకుస్థాపన సందర్భంగా శివసేన సీనియర్ నేతలు, బాల్ఠాక్రే సహచరులు చంద్రకాంత్ ఖైరే, సూర్యకాంత్ మహడీక్, విశ్వనాథ్, విజయ్ దరువాలే వంటి నేతలు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించారు. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) ‘మహారాష్ట్ర రాజకీయాలను కను సైగలతో శాసించిన బాలా సాహేబ్.. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహరీ వాజ్పేయీలతో కలిసి మందిర నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేతలో కరసేవలతో పాటు, శివసేన కార్యకర్తలు, నేతల పాత్ర ఎంతో ఉంది. ఆ కేసు విచారణలో భాగంగా సీబీఐ మొదటిసారి నమోదు చేసిన చార్జ్షీట్లో 48 మంది పేర్లు ఉంటే వారిలో బాల్ఠాక్రేతో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణం కొరకు ఠాక్రే తన చివరిశ్వాస వరకూ పోరాటం చేశారు. ఆయన మరణం అనంతరం బాల్ ఠాక్రే బాటలోనే ఉద్ధవ్ నడిచారు. బీజేపీతో రాజకీయ పరమైన దోస్తీ కొనసాగిస్తూనే.. అయోధ్య కోసం కొట్టాడారు. కోర్టుల్లో కేసుల విచారణ సాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని ఠాక్రే అనేకసార్లు డిమాండ్ చేశారు. (భారీగా ఆలయ నిర్మాణం) వేయిమంది సేన కార్యకర్తలతో ఉద్ధవ్ అయోధ్యలో సైతం పర్యటించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణాల నేపథ్యంలో శివసేనపై బీజేపీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బీజేపీ తమను తక్కువ అంచనా వేయడం కారణంగానే సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ శివసేన హిందుత్వ ఎజెండా మాత్రం ఎప్పటికీ మారదు. రామాలయ నిర్మాణ శంకుస్థాపక కార్యక్రమానికి ఠాక్రేను ఆహ్వానించకపోవడం నిజంగానే అవమానం. తాను చేసిన కృషి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు. అయోధ్య పోరాట చరిత్రలో మమ్మల్ని ఎప్పటికీ తొలగించలేరు’ అని పేర్కొన్నారు. -
స్మారక నిర్మాణం కోసం చెట్లను నరకొద్దు: సీఎం
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగబాద్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఔరంగబాద్ మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో తాజాగా చెట్లను నరికి వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని ఈ మేరకు ఖైరే పేర్కొన్నారు. ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సుప్రియా సూలే భావోద్వేగ పోస్టు
ముంబై : మరికొద్ది గంటల్లో మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడి’ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. గత వారం రోజులుగా ‘మహా’ రాజకీయంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, శివసేన నేత సంజయ్ రౌత్, చాకచాక్యంగా పావులు కదిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ఉద్దవ్ ఠాక్రే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే ట్విటర్లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఉంచారు. ఉద్దవ్ ఠాక్రే తల్లిదండ్రులైన బాల్ ఠాక్రే, మీనాతాయ్ ఠాక్రే(మా సాహెబ్) లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా.. ఈ రోజు మాత్రం ఇక్కడే ఉంటారని అన్నారు. బాలా సాహెబ్, మా సాహెబ్లు తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని ఆమె తెలిపారు. నా జీవితంలో వారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని.. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని తెలిపారు. కాగా, మొన్నటివరకు పవార్, ఠాక్రే కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. వారి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. -
ఉద్ధవ్ స్టైలే వేరు..
ముంబై: తండ్రి బాల్ ఠాక్రే, మామయ్య రాజ్ ఠాక్రేల్లో ఉన్న చరిష్మా లేదు, వారిద్దరిలా అనర్గళ ఉపన్యాసకుడు కూడా కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. క్షేత్రస్థాయిలో శివసేనను నిలదొక్కుకునేలా చేయడంలో సఫలీకృతం అయ్యాడు. అంతేకాదు హిందుత్వ భావజాలమున్న శివసేనను బుద్ధిస్టు దళితులకూ, హిందీ మాట్లాడేవారికీ చేరువయ్యేలా చేయడంలో కృతకృత్యుడయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు కొందరిని అంచనావేయడంలో పొరబడే ప్రమాదం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే విషయంలో అదే జరిగిందని భావించొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేని సంకుచితవాదిగా అంతా భావిస్తారు. కానీ నిజానికి విశాల భావాలున్న వ్యక్తి. తనపై ఉన్న అపోహని తొలగించుకొని ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. దూకుడు స్వభావం కలిగిన శివసేన భావజాలాన్ని బట్టి ఉద్ధవ్ ఠాక్రేని అలా అంచనావేసి ఉండవచ్చు. కానీ దగ్గర్నుంచి చూసినవాళ్లు ఠాక్రే స్టైలేంటో సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. స్వభావ రీత్యా, అనుభవం రీత్యా బాల్ ఠాక్రే వారసుడు, శివసేన పార్టీ నడపగలిగిన వాడు రాజ్ఠాక్రేనేనని అంతా భావించారు. అయితే మృదుస్వభావి, విశాల స్వభావం కలిగిన ఉద్ధవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం సొంత మామ రాజ్ ఠాక్రేతో తలపడాల్సి వచ్చింది. - బాల్ ఠాక్రే మీనా థాయ్ల కుమారుడు ఉద్దవ్ ఠాక్రేకు వైల్డ్ లైఫ్ అన్నా ఫొటోగ్రఫీ అన్నా ఆసక్తి. - ఉద్ధవ్కి ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో మిలింద్ గునాజీ ఒకరు. తండ్రి బాల్ ఠాక్రేలా, రాజ్ ఠాక్రే మాదిరిగానే ఉద్ధవ్ కూడా తొలుత కార్టూనిస్టే. ఆ తరువాత ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరిగింది. - 1960లో జన్మించిన ఉద్ధవ్ ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వరై్టజింగ్ ఏజెన్సీని స్థాపించారు. 1985లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు. - 1990లో ములుంద్లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. - 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు. - 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు. - 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అంత మోదీ గాలిని సైతం తట్టుకొని 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. దీంతో బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాల్సి వచ్చింది. - 2019 ఎన్నికల్లో మాత్రం ముంబైలో తనకున్న పట్టునేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఉద్ధవ్ సిద్ధపడలేదు. ఫలితంగా బీజేపీయేతర పార్టీల మద్దతు కోరి, శివసేన లక్ష్యసాధనలో దాదాపు సఫలీకృతం అయ్యింది. కూటమి ప్రభుత్వంలో ఉద్ధవ్కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. దీంతో మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న పొత్తుకి ఫుల్ స్టాప్ పడినట్లయింది. -
ఆదిత్య ఠాక్రే ఆస్తులివే..
ముంబై : శివసేన యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ఠాక్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్ఠాక్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠాక్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్వల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి. -
‘సోనూ నిగమ్ను చంపాలని చూశారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నిలేశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ను శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే చంపాలని చూశారని ఆరోపించారు. దీనికోసం పలుమార్లు ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. అసలు బాల్ఠాక్రే, సోనూ నిగమ్ కుటుంబాలు మధ్య సంబంధం ఏమిటని తనను అడగవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన పార్టీ నాయకుడు వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. నారాయణ్ రాణేపై పలు వ్యాఖ్యలు చేశారు. వినాయక్ను ఉద్దేశించే నిలేశ్ ఈవిధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలస్తోంది. ఇంకా నిలేశ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎప్పుడు బాల్ఠాక్రేను రాజకీయ విషయాల్లో తప్పుపట్టలేదు. కానీ కొందరు మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేస్తే నేను కూడా కొన్ని విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. శివసేనలో ఉన్నప్పుడు నారాయణ్ రాణే ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. ఆయన కుటుంబం శివసేనకు దూరమైంది. -
‘థాకరే’ బయోపిక్కు సెన్సార్ అడ్డంకులు
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలోని ఆరు డైలాగులు, రెండు సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. సీబీఎఫ్సీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించుకుంటామని చిత్ర బృందం పేర్కొంది. చట్టబద్ధంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను ఎదుర్కొంటామని, సమస్యను పరిష్కరించుకంటామని చిత్ర నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా చిత్ర ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం.ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృతారావు మీనా థాకరే పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 23న బాల్ థాకరే జయంతి సందర్భంగా థాకరే మూవీ విడుదలవుతోంది. -
బాల్ఠాక్రే సమాధి నుంచి లేచొస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే నిజ జీవితం ఆధారంగా తీస్తున్న ‘బాల్ ఠాక్రే’ సినిమాలో టైటిల్ పాత్రను ఉత్తరప్రదేశ్కు చెందిన ముస్లిం నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పోషించడం పట్ల ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ముస్లిం మైనారిటీలను వ్యతిరేకించిన బాల్ ఠాక్రే పాత్రలో ఓ ముస్లింను ఎలా తీసుకున్నారని ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం బాల్ ఠాక్రేకే తెలిస్తే ఆయన సమాధి నుంచి లేచొస్తారని మరి కొందరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మరాఠీలకే ఉపాధి అవకాశాలు ఉండాలంటూ పోరాడిన బాల్ ఠాక్రే యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి ముంబై నగరానికి ప్రజల వలసలను, ముఖ్యంగా మైనారిటీల వలసలను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి జీవిత కథను తెరకెక్కిస్తూ ఓ మైనారిటీ ముస్లింను, అందులోనూ ఉత్తరప్రదేశ్కు చెందిన నటుడిని తీసుకోవం ఏమిటని వారు విమర్శించారు. మరాఠీ నటులను ఎందుకు ఎంపిక చేయలేదని వారు ప్రశ్నించారు. యూపీ, బీహార్ నుంచి ప్రజల వలసలను వ్యతిరేకిస్తూ బాల్ ఠాక్రే కొన్నిసార్లు విధ్వంసకర ఆందోళనలకు కూడా దిగారు. హిందూ ఛాందసవాద నాయకుడి పాత్రకు ఓ ముస్లిం నటుడిని తీసుకోవడం పట్ల కొందరు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఠాక్రే పాత్రలో ముస్లిం చూపించడం ఎంత చల్లని మాటని కొందరంటే ‘ఆహా! ఏమి వైరుధ్యవైవిధ్యము’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఠాక్రే పాత్ర కోసం యూపీ నుంచి సిద్దిఖీని తీసుకున్నట్టే బీహార్ నుంచి రవి కిషన్ను తీసుకుంటే తానింకా ప్రశాంతంగా మరణిస్తానని ఒకరు వ్యాఖ్యానించారు. ఠాక్రేను తెరపై చూపించడం ఇదే మొదటిసారి కాదని, ఓ ముస్లింను ఆయన పాత్రలో చూపించడం ఇదే మొదటిసారని, దాన్ని తాను హదయపూర్వకంగా హర్షిస్తున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్జాన్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ తన జర్నలిస్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సిద్దిఖీ ‘బాల్ఠాక్రే’ చిత్రంలో ఠాక్రేగానే కాకుండా దేశ విభజన సందర్భంగా జరిగిన సంఘటనలపై గుండెలను మండించే కథలను రాసిన ‘సాదత్ హసన్ మంటో’ బయోపిక్లో కూడా మంటోగా నటిస్తున్నారు. ‘బాల్ ఠాక్రే’ సినిమా షూటింగ్ మొన్న అంటే, గురువారం సాయంత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సినిమాకు శివసేన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ స్క్రీన్ప్లే రచించగా, 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొద్దకాలంపాటు నవ నిర్మాణ సేనలోకి వెళ్లి వచ్చిన శివసేన సభ్యుడు అభిజిత్ ఫాన్సే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. -
ఠాక్రే నాకు ప్రాణం పోశారు : అమితాబ్
సాక్షి, ముంబయి : తనకు ప్రమాదం జరిగినప్పుడు శివసేన అధినేత దివంగత నేత బాల్ ఠాక్రే తన ప్రాణాలు రక్షించారని బాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. కూలీ చిత్ర షూటింగ్ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని, అప్పుడు శివసేన అంబులెన్స్ సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిందని అన్నారు. 'అప్పుడు బాగా వర్షం పడుతోంది. అంబులెన్స్లు లభించే పరిస్థితి లేదు. చివరకు సేన అంబులెన్స్ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది' అని అమితాబ్ అన్నారు. బాల్ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం 'ఠాక్రే' షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఠాక్రే నాకు నా కుటుంబంలాగే. బోఫోర్స్ కుంభకోణం సమయంలో నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తనకు అండగా ఉన్నారు. ఠాక్రే చనిపోవడానికి ముందు కూడా ఆయనను చూసేందుకు నన్ను ఉద్దవ్ అనుమతించారు. ఆ సమయంలో నేను ఉద్దవ్ కుమారుడు ఆదిత్యతో ఠాక్రేకు చికిత్స జరుగుతున్న గదిలో ఉన్నాను. ఆయనను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను' అంటూ అమితాబ్ బావోద్వేగానికి లోనయ్యారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ 'ఠాక్రే' చిత్రానికి సంగీతం అందిస్తుండగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీ జనరల్ సెక్రటరీ అభిజిత్ పన్సే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఠాక్రేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. -
బాల్థాకరేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ
సాక్షి, న్యూఢిల్లీ: బాల్థాకరే బయోపిక్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టైటిల్ రోల్ పోషించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్లుక్ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఫస్ట్లుక్ లాంఛ్ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూడనున్నాయి. అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఫస్ట్లుక్ లాంఛ్కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిధిగా హాజరవనున్నారు. ఈ బయోపిక్కు రాజ్యసభ ఎంపీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్ర్కిప్ట్ సమకూర్చుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై సంజయ్ రౌత్ పనిచేస్తున్నారు. బాల్ థాకరేతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసని, వీటిని ప్రజారంజకంగా తెరకెక్కిస్తానని రౌత్ చెప్పారు. బాల్ థాకరే కుటుంబ సభ్యులు సహా ఏ ఒక్కరి జోక్యం లేకుండా మూవీని వాస్తవాల ఆధారంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. -
గాంధీ, మోదీ.. ఓ కార్టూన్..!
ముంబై: మహత్మాగాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీపై వినూత్న రీతిలో విమర్శలు సంధించారు. మాటల్లో కాకుండా.. కార్టూన్ రూపంలో మోదీని టార్గెట్ చేశారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ పక్కపక్కనే నిల్చుని ఉన్న ఒక కార్టూన్ను తన ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేశారు. ఆ కార్టూన్లో గాంధీ చేతిలో ఆయన ప్రసిద్ధ ఆత్మకథ ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’(సత్యంతో నా ప్రయోగాలు) అని మరాఠీలో ఉన్న పుస్తకం ఉండగా.. మోదీ చేతిలో ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ లైస్(అసత్యాలతో నా ప్రయోగాలు) అనే పుస్తకం ఉంటుంది. కార్టూన్ పై భాగంలో ‘ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు’ అనే కాప్షన్ ఉంటుంది. గతంలో బాల్ఠాక్రే నేతృత్వంలో వచ్చిన మార్మిక్ పత్రికలో రాజ్ ఠాక్రే కార్టూన్లు విరివిగా వచ్చేవి. -
బీజేపీతో పొత్తువల్లే నాశనమయ్యాం!
ముంబై: బీజేపీతో గత 25 ఏళ్లుగా కొనసాగించిన పొత్తు వల్ల శివసేన పార్టీ బాగా చితికిపోయిందని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. చాలాకాలం నుంచి మిత్రపక్షాలుగా కొనసాగిన ఈ రెండు పార్టీలు 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధికార ప్రతికలైన ‘సామ్నా’ (మరాఠీ), దోపహర్ కా ‘సామ్నా’ (హిందీ)కు ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ-శివసేన పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘25 ఏళ్లు అంటే రెండు తరాలు మనం చేతిలో చేయి వేసి ముందుకుసాగాం. మనం సొంతబలంతోనే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లం. కానీ బీజేపీతో పొత్తు వల్ల నాశనమైపోయాం’ అని ఠాక్రే పేర్కొన్నారు. మంగళవారం తన 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాద దృక్పథంతో భావజాల ఐక్యత పరంగానే బాల్ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇందులో ఎలాంటి ప్రేరణగానీ, స్వల్పకాలిక ప్రయోజనాలుగానీ లేవని, బాల్ ఠాక్రే ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదని చెప్పారు. -
అతను మా నాన్న కొడుకు కాదు: జయ్ దేవ్ ఠాక్రే
ముంబై: ఆస్తి కోసం కోర్టుకెక్కిన బాల్ ఠాక్రే కుమారుడు జయ్ దేవ్ ఠాక్రే కేసును గురువారం ముంబై హైకోర్టును మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన మాజీ భార్య స్మిత తనయుడైన జయ్ దేవ్ ఠాక్రే, ఐశ్వర్య ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు కాదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో కొంతభాగాన్ని మాత్రమే ధర్మాసనం మీడియాకు అనుమతినిచ్చింది. మిగిలిన విచారణను జస్టిస్ పటేల్, ఇరువైపులా లాయర్లతో కలిసి సమావేశమయ్యారు. తుది తీర్పు వెలువడే వరకు చర్చకు సంబంధించిన వివరాలను మీడియాకు అందుబాటులో ఉండవని ప్రకటించారు. కేసు విచారణలో భాగంగా ప్రస్తుత శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్ ఠాక్రే తరఫు లాయర్ రోహిత్ కపాడియా జయ్ దేవ్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. జయ్ దేవ్ కు ఆస్తిపై ఎటువంటి హక్కూలేదని, తన ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాల్ ఠాక్రే వీలునామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఐశ్వర్యకు ఠాక్రే నుంచి వారసత్వ సంపద దక్కడంపై జయ్ దేవ్ కోర్టుకెక్కారు. బాంద్రాలోని మఠోశ్రీ బాల్ ఠాక్రే నివాసంలో 2004కు ముందు రెండో అంతస్తులో తాను నివసించినట్లు జయ్ దేవ్ తెలిపారు. మొదటి అంతస్తులో ఎవరు నివసించేవారు? అని లాయరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎప్పుడూ తలుపుల మూసేసి ఉండేవని, అప్పుడప్పుడు తెరచి ఉండేవని చెప్పారు. బాల్ ఠాక్రేను ఈ విషయం గురించి అడుగగా ఐశ్వర్య ఉంటున్నాడని చెప్పారని తెలిపారు. మరి ఐశ్వర్యను బాల్ ఠాక్రే తన తనయుడని మీకు చెప్పారా? అని లాయరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన జయ్ దేవ్ ఆయన అలా చెప్పలేదని తెలిపారు. ఐశ్వర్యకు సంబంధించిన వివరాలను తాను సేకరించాలని ప్రయత్నించానని కానీ అవకాశం రాలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గత విచారణల్లో 1999లో తల్లి స్మితతో మనస్పర్దలు రావడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. 2004లో ఠాక్రేతో విడాకులు తీసుకునేంత వరకూ స్మిత మఠోశ్రీలోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. 1999-2004 మధ్య కాలంలో అప్పుడప్పుడు తన తండ్రి ఠాక్రేను కలిసేందుకు వెళ్లి రాత్రికి తిరిగి తన ఫ్లాట్ కు చేరుకునేవారని తెలిపారు. 2012 నవంబర్ లో ఠాక్రే మరణించే ఒక నెల ముందు వరకూ ఆయన్ను కలవడం ఆపలేదని చెప్పారు. -
తెగుతున్న పొత్తు బంధనాలు
బాల్థాక్రే నోట్లోంచి మాట ఊడిపడటం చాలు.. ఆయన నివాసానికి ప్రమోద్ మహాజన్ పరుగెత్తుకెళ్లి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాంటిది ‘మమ్మల్ని కాస్త గౌరవించండి’ అంటూ ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది. భారతీయ జనతాపార్టీ ఇప్పుడు దేశంలో ప్రాబల్య పార్టీగా ఉన్నప్పటికీ (కాంగ్రెస్ ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అంతిమ పత నంలో ఉన్నట్లు స్పష్టంగానే కనబడు తోంది), భారత్ ప్రాంతీయ శక్తుల అధికార పట్టులో ఇరుక్కుని పోయి ఉంది. దేశంలోనే అతి ప్రాచీన ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తమిళనాడులో తన సొంత బలంతోటే అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. దాని ప్రత్యర్థి ఏఐడీఎంకేది కూడా అదే చరిత్రే. ఈశాన్య ప్రాంతంలో 1980లలో ఏర్పడిన అసోం గణ పరిషత్ అస్సాంని పాలించడం మనం చూసే ఉన్నాం. ఇక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, దాని వైరి పక్షం బహుజన్ సమాజ్ పార్టీ తమవంతు పాలన సాగించాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్లో రెండో దఫా పాలనలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ, ఇప్పుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్లోనూ గెలుపు సాధిం చింది. కొత్త రాష్ట్రం తెలం గాణలో తెరాస అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, 1966 జూన్ 19న ఉనికిలోకి వచ్చిన శివసేన రాష్ట్ర లేక పార్ల మెంటరీ ఎన్నికల్లో గానీ లేదా ప్రత్యేకించి తనకు గుండెకాయ లాంటి ముంబైలో స్థానిక ఎన్ని కల్లోగానీ ఇలాంటి గెలు పును ఎన్నడూ సాధించలేకపోయింది. హిందుత్వ పునాది పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఇది బీజేపీతో భాగం పంచుకోవలసివచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు విచ్ఛిన్నమై పోయింది. ఆదివారం సాయంత్రం శివసేన పార్టీ నిర్వహించిన 50వ ఆవిర్భావ వార్షికోత్సవం దాని రెండో తరం అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రసంగానికి మాత్రమే పరిమితమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో కనిపించే అట్టహాసం, ఆడంబరం ఈసారి కనిపిం చలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎలాంటి భారీ బహిరంగ సభ లకు పథక రచన చేయడం, నిర్వహించడం జరగలేదు. ఎందు కంటే ఇపుడు కూడా ఆ పార్టీ తన పంథా విషయంలో అనిశ్చితి లోనే ఉంది. పాత భాగస్వామితో పోరాటం, తర్వాత కొత్త ప్రభు త్వంలో అవమానకరంగా సర్దుకునిపోవలసి రావడంతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఆనాడు మహారాష్ట్రలోని 62 జౌళి మిల్లులు, అనేక పారి శ్రామిక విభాగాల్లో ఎక్కువమంది మరాఠా కార్మికులే ఉన్న ప్పటికీ, ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల హక్కుకు భద్రత కలి గించే లక్ష్యంతో శివసేన ఒక సంస్థగా ఏర్పడ లేదు. స్థానికులకు హక్కులు అనేవి వైట్ కాలర్ ఉద్యోగాల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. మరాఠీ జనాభాలో ఇది ప్రతిధ్వనించేది. దీనివల్ల ఈ పార్టీ నగర కేంద్రకంగానే ఉండిపోయింది. ఆ స్థితి నుంచి శివ సేన బయటపడలేక పోయింది కూడా. నెమ్మదిగా, పురపాలక రాజకీయాల్లో కాలుమోపటం ద్వారా శివసేన రాజకీయ పార్టీగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ లోకి దాని ప్రవేశం చాలా సమయం తీసుకుంది. విజయాలు కూడా అంత సులువుగా రాలేదు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే, శివసేన ప్రత్యేకించి పురపాలక ఎన్నికల్లో ఒకటి లేక ఎక్కువ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. ప్రాంతీయ పార్టీ శక్తిని ఇదేమంతగా వివరించదు. పైగా, తనకు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఆకాంక్షలేవీ లేవని శివసేన స్పష్టం చేసింది. హిందుత్వను శివసేన పూర్తిగా బలపరుస్తున్న కారణంగా, అప్పట్లో అతి చిన్న పార్టీగా ఉన్న బీజేపీ మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. శివసేనతో భాగస్వామ్యం లేనిదే అతల్ బిహారీ వాజ్పేయి ప్రధాని కాలేరు కాబట్టి శివసేన పెద్దన్న వైఖరిని జీర్ణం చేసుకోవాల్సి ఉంటుందని ప్రమోద్ మహాజన్ బీజేపీ కార్యకర్తలకు పదే పదే ఉద్బోధించడాన్ని ఎవరైనా గుర్తుకు చేసుకోవచ్చు. ఆవిధంగా ఇరుపార్టీల మధ్య పొత్తు కొనసాగింది. మహా రాష్ట్రలో ఈ కూటమి 1995లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల్లో ప్రాంతీయపార్టీకి, పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీకి అనుకూలంగానే అన్ని వేళల్లో సీట్ల పంపిణీ జరిగేది. నరేంద్ర మోదీ నేతృత్వంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పుడు మినహా బీజేపీ తక్కిన అన్ని వేళలా జూనియర్ భాగస్వామిగానే వ్యవహరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సాధించిన ఘనవిజయంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇకనుంచి ఒంటరిగానే పోరుకి దిగాలన్న ఆకాంక్ష బీజేపీలో బలపడిపోయింది. యాభయ్యవ వార్షికోత్సవం సందర్భంగా, పురపాలక ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలన్న విషయంపై శివసేన ఆలోచిస్తోంది. బీజేపీ కూడా ఇలాగే భావిస్తోంది. మహా రాష్ట్రలో అధికారంలోకి వచ్చి వార్షికోత్సవం జరుపు తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర విభాగం రణగొణ ధ్వనులు చేస్తున్నప్పటికీ ఇకనుంచి మనం ఒంటరి గానే తలపడదామంటూ స్థానిక నేతలు పట్టుబడు తుండటం గమనార్హం. శివసేన ప్రస్తుతం కపటవైఖరితో ప్రదర్శిస్తున్న అనిశ్చితి పట్ల బీజేపీ మరింత కఠిన వైఖరితో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరడానికి ముందు శివసేన ఆడిన పిల్లి-ఎలుకల ఆట తీరు బీజేపీ కేడర్కు చేదుగుళికగా మారింది. శివసేన మొదట ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోవడమే కాదు. బీజేపీని అది పూర్తిగా పక్కకు నెట్టి వేసింది. తర్వాత అది ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, ప్రభుత్వంలో ప్రతిపక్షం పాత్రను పోషిస్తూనే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శివసేన ఒకవైపు రేచుకుక్క లాగా వేటాడుతూ, మరోవైపు కుందేళ్లతో పరుగు సాగి స్తోంది. రెండు పార్టీలలోని కేడర్కు ఇది నచ్చడం లేదు. స్పష్టంగానే ఇది ఒక అసౌకర్యాన్నే తలపిస్తోంది. తరచుగా శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో తన భాగస్వామిపై అటు ఢిల్లీలోనూ, ఇటు ముంబైలోనూ నిప్పులు కురిపి స్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఒంటరి ప్రచారానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడు ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో ఇది మొదలవుతుంది. పొత్తు కుదిరిన తొలినాళ్లలో శివసేన నిజంగానే కొర డాను చేత బట్టుకుని ఉండేది. బాల్థాక్రే నోట్లోంచి మాట వచ్చిందే తడవుగా, ప్రమోద్ మహాజన్ థాక్రే నివాసానికి పరుగెత్తుకుని వచ్చి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాం టిది ‘మమ్మల్ని కూడా కాస్త గౌరవించండి’ అంటూ శివసేన ప్రస్తుత అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది. పైగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శివ సేన లోగో అయిన పులి అందరికీ తెలిసినట్లే తక్కువగా గర్జి స్తుంది. ఉద్ధవ్ దానికి అనుగుణంగానే చెప్పారు, ‘‘అవును, మేము పొత్తును విచ్ఛిన్నపర్చం’’. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఠాక్రేపై హత్యాయత్నం చేశాం!
ముంబై దాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్ గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఈ రోజు కోర్టుకు మరిన్ని వివరాలు వెల్లడించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గతంలో అనేకసార్లు హెడ్లీని విచారించిన ముంబై న్యాయస్థానం తాజాగా మరోమారు విచారణ చేపట్టింది. శివసేన వ్యవస్థాపకుడు బాల ఠాక్రేని చంపేందుకు ఓ వ్యక్తి ఉగ్రవాద దుస్తులు ధరించి ప్రయత్నించాడని, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, అయితే అతడు ఆ తర్వాత కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడని తాజా విచారణలో భాగంగా డేవిడ్ కోల్మన్ హెడ్లీ కోర్టుకు తెలిపాడు. తన పర్యవేక్షకుడు సాజిద్ మీర్ సూచనల మేరకు తాను కూడా శివశేన నాయకుడ్ని చంపే లక్ష్యంతో రెండుమార్లు సేనా భవన్ సందర్శించానన్నాడు. ఠాక్రేను లష్కరే తాయిబా ఎందుకు చంపాలనుకుందో తనకు తెలియకపోయినా.. చంపడమే లక్ష్యం కావడంతో ప్రయత్నం మాత్రం చేశానని క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హెడ్లీ వెల్లడించాడు. అమెరికన్ చట్టాల్లో ప్రాధేయపడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అనేది లేదని, మీరు క్షమించినా లేకపోయినా నేరాన్ని కోర్టు ముందు అంగీకరించి ప్రాధేయపడుతున్నానని హెడ్లీ కోర్టుకు వివరించాడు. ముంబై కోర్టుకు తాను వాగ్మూలం ఇవ్వడం ద్వారా అమెరికా విట్నెస్ ప్రొటెక్షన్ లో తనకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నాడు. అంతేకాక తాను అమెరికా పాస్పోర్టులో పేరు మార్చుకునేందుకు అక్కడి అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని హెడ్లీ స్పష్టం చేశాడు. -
పోలీసులు శివసేన హోర్డింగులు పీకేశారు
ముంబయి: ముంబయి పోలీసులు శివసేన పార్టీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను, హోర్డింగ్లను పీకేశారు. ప్రధాని నరేంద్రమోదీని కించపరిచేలా, ఎత్తిపొడిచేలా అవి ఉండటంతో వాటిని తొలగించారు. ఆ ఫ్లెక్సీల కారణంగా బీజేపీ, శివసేన పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య వివాదం తలెత్తి శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగించినట్లు పోలీసులు తెలిపారు. శివసేన భాగస్వామ్యంతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్ది రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య అస్సలు పొసగడం లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎదురెదురుపడకముందే తూటాల్లాంటి మాటలు పేల్చుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత పరిస్థితి ఆ రెండు పార్టీల మధ్య నిశ్శబ్దంగా కొనసాగుతుంది. దసరా పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా శివసేన ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఒకప్పుడు శివసేన అధినేత బాల్ ఠాక్రే ముందు నేటి ప్రధాని నరేంద్రమోదీ తలవొంచి నవ్వుతూ నమస్కరిస్తున్న ఫొటోలు ఉంచారు. 'నాటి రోజులు అప్పుడే మర్చిపోయావా? మీలాంటి గర్విష్టులంతా ఠాక్రే పాదాల ముందు తలవంచినప్పటి రోజులు మీరంతా మర్చిపోయారా?' అంటూ వ్యాఖ్యలు పెట్టారు. వాజపేయి, ఎల్ కే అద్వానీ, రాజనాథ్ సింగ్ వీళ్లంతా ఒకప్పుడు ఠాక్రే పాదాల ముందు మోకరిల్లినవారే అన్నట్లుగా ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు పెట్టారు. దీంతో ఇవి రెండు పార్టీల మధ్య పెను ధుమారం రేపే అవకాశం ఉన్నందున పోలీసులు వాటిని తొలగించారు. -
బాల్ థాక్రే పై సినిమా
పరిచయ వాక్యాలు అవసరంలేని వ్యక్తి బాల్ థాక్రే. కంటిచూపుతో ముంబై నగరాన్ని శాసించిన మరాఠా వీరుడు. కార్టూనిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత శివసేన పార్టీ అధ్యక్షునిగా మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. థాక్రే మరణించి మూడేళ్లయినా ఇప్పటికీ ఆయన్ను దైవంగా కొలిచే వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో జీవితకథలు రాజ్యమేలుతున్న తరుణంలో బాల్ థాక్రే జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం చేస్తున్నది ఎవరో కాదు.. స్వయానా థాక్రే మనవడు రాహుల్ థాక్రే. తాత జీవిత చరిత్రను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారీ మనవడు. ఈ చిత్రానికి బాల్ థాక్రే కోడలు స్మితా థాక్రే నిర్మాతగా వ్యవహరించనున్నారు. ముంబైలో బాల్ థాక్రే అభిమానులు ఆయన్ను ‘బాల్ సాహెబ్’ అని పిలిచేవారు. అందుకని ‘సాహెబ్’ అనే పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు స్మితా థాక్రే తెలిపారు. కెనడాలో ఫిలిం కోర్సు పూర్తి చేసి వచ్చిన రాహుల్ గతంలో రాజ్కుమార్ హిరానీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ అనుభవంతో తాత జీవిత చరిత్రతో తీసే సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం బాల్ థాక్రే పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పని మీద ఉన్నారు. -
వివాదంలో తెహల్కా!
-
బాల్ఠాక్రేకు ఘన నివాళి
సాక్షి, ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ద్వితీయ వర్ధంతి సందర్భంగా శివాజీ పార్కులోని స్మారకాన్ని ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఠాక్రే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బాల్ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని సోమవారం శివాజీపార్క్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే స్మారకం వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన వేలాదిమంది పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు బాల్ ఠాక్రే స్మారకానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బాల్ ఠాక్రే అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్ధవ్ఠాక్రే కుటుంబ సభ్యులతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులయ్యారు. కాగా, మధ్యాహ్నం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వచ్చి నివాళులర్పించిన తర్వాత ఉద్ధవ్, రాజ్ పక్కపక్కనే కూర్చున్నారు. దాదాపు 15 నిమిషాలకుపైగా ముచ్చటించారు. సోదరులిద్దరూ విడిపోయిన చాలా కాలం తర్వాత ఇలా బహిరంగంగా చాలా సేపు మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రద్ధాంజలి ఘటించిన సీఎం.. అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బాల్ఠాక్రే స్మారకాన్ని సందర్శించారు. ఠాక్రే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ఉద్ధవ్తో భేటీ అయ్యారు. కాని అక్కడ గుమిగూడిన శివ సైనికులు ‘ముఖ్యమంత్రి చలే జావ్’ అంటూ నినాదాలు చేసి బీజేపీపై ఉన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన తర్వాత మీడియాతో సీఎం మాట్లాడుతూ ముంబైలో బాల్ ఠాక్రే స్మారకం నిర్మించేందుకు ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్తోపాటు ఇతర పార్టీల కీలక నాయకుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు బీజేపీ నాయకులు వెళతారా..? లేదా..? వెళితే ఎవరెవరూ వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవిస్ మంత్రి వర్గంలోని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, ఉద్యోగ మంత్రి ప్రకాశ్ మెహతా, విద్యాఠాకూర్ తోపాటు శివసేన ఎంపీ సంజయ్ రావుత్, నాయకులు అనిల్ దేసాయి, నీలం గోర్హే, మిలింద్ నార్వేకర్తోపాటు ఎమ్మెన్నెస్ నాయకులు బాలా నాంద్గావ్కర్, నితిన్ సర్దేశాయి. శిశిర్ షిండే తదితర ప్రముఖులు సందర్శించారు. కాగా, ఈ రోజును ‘ప్రేరణ దివస్’ గా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ షిండే అభివర్ణించారు. ఇదిలా ఉండగా, బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివాజీపార్క్ మైదానంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో శివసైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రక్తంలో కణాలు (ప్లేట్స్) తగ్గిన వారికి ఇలా దాతల ద్వారా సేకరించిన రక్తం ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. దగ్గరవుతున్న ఉద్ధవ్, రాజ్... ఠాక్రే కుటుంబం మళ్లీ దగ్గరవుతుండటం విపక్షాలకు మింగుడుపడని విషయమే.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో శివసేన, ఎమ్మెన్నెస్ విడివిడిగా పోటీచేసినా... అవసరమైతే ఉద్ధవ్తో కలిసి పనిచేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం పరిణామాల్లో భాగంగా ఇటీవల రాజ్ఠాక్రే కుమార్తె ఊర్వశి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నప్పుడు ఉద్ధవ్ఠాక్రే కుటుంబ సమేతంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది బాల్ఠాక్రే వర్ధంతి రోజున రాజ్ఠాక్రే శ్రద్ధాంజలి ఘటించేందుకు శివాజీ పార్క్కు వెళ్లలేదు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఏడాది ఆయన తన పుణే పర్యటనను సైతం వాయిదా వేసుకుని ఠాక్రే స్మారకాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఉద్ధవ్తో కొంత సేపు గడపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలాఉండగా, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీల మధ్య రాజీ కుదరలేదు. పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తమని వాడుకుని శాసన సభ ఎన్నికల్లో దూరం కొట్టిందనే భావన శివసేన నాయకుల్లో నాటుకుపోయింది. అదేవిధంగా లోక్సభ, ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పూర్తిగా చతికిలపడి పోయింది. దీంతో రాజకీయంగా ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకే విధంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడంతో భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఠాక్రేపై గౌరవముంటే విడిపోయేవారా?
సాక్షి, ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. 25 ఏళ్ల అనుబంధం తెగిపోతున్న సమయంలో బాల్ఠాక్రేపై ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు గుర్తుకురాలేదా..? అని మోడీని నిలదీశారు. శివసేనపై విమర్శలు చేయనని, ఇలా దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రేకు నివాళులు అర్పిస్తున్నాని మోడీ ఆదివారం ముంబైలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్.. సామ్నా సంపాదకీయం ద్వారా తనదైన శైలిలో మోడీపై మండిపడ్డారు. ‘బాల్ఠాక్రే పై మోడీకి గౌరవం ఉండడం మంచిదే. ఇందుకు మేము ఆయనకు స్వాగతం పలుకుతాం. మేం కూడా మోడీని గౌరవిస్తాం. అయితే హిందుత్వం అనే గట్టిదారంతో ఏర్పడిన బంధాన్ని శివసేన అధినేత బాల్ఠాక్రే 25 ఏళ్లు కొనసాగించారు. ఆ బంధం ఇప్పుడెలా తెగిపోయింద’ని ప్రశ్నించారు. సీట్ల పంపకాల విషయంపై ముందుకువచ్చి బంధం తెగకుండా చూసినట్లయితే బాల్ఠాక్రేకు అది నిజమైన నివాళి అయ్యేదంటూ చురకలంటించారు. రాష్ట్ర ప్రజలు తెలివైనవారేనని, వారందరికీ అసలు దొంగలెవరు..? బురఖాలో ఉన్న దొంగలెవరో..? అనేది తెలుసునంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రను దోచుకున్నాయని ఆరోపించారు. ‘ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబేన్ పటేల్ ముంబైకి ఏ ఉద్దేశంతో వచ్చివెళ్లారో తెలిసిందే. ముంబైలోని పారిశ్రామికవేత్తలను మహారాష్ట్రలో ఉండవద్దని, అందరు గుజరాత్కు తరలిరావాలని ఆనందీబేన్ పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇలా చేయడం కూడా మహారాష్ట్రను దోచుకోవడమే అవుతుంద’ని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన బెల్గావ్, కారవార్ తదితర ప్రాంతాలపై మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ల అభిప్రాయాలేమిటి..? సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 20 లక్షలమంది మరాఠీలపై జరుగుతున్న అన్యాయంపై వైఖరేమిటి? ఛత్రపతి శివాజీ మహారాజు ఆశీర్వాదాలున్నాయంటు మహారాష్ట్రలోకి వచ్చిన వారు సరిహద్దు అంశంపై ఎందుకు మాట్లాడడంలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మోడీ ప్రధానిగా ఉన్నారు. కాని యెల్లూర్లో మరాఠీ ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగతోంది. ఇలాంటి సమయంలో మరాఠీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మహారాష్ట్రను ముక్కలు చేయాలన్న కలతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింద’ని ఆరోపించారు. తుల్జాపూర్లో ఆవేశంగా.. శివసేన, బీజేపీల బంధం తెగిపోవాలనేది మాతా తుల్జభవాని నిర్ణయం కావొచ్చని, అందుకే బంధం తెగిపోయిందని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తుల్జాపూర్లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు బీజేపీపై విమర్శలు గుిప్పించారు. గోపీనాథ్ ముండే ఉండి ఉంటే కూటమి ముక్కలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అధికారం చేజిక్కించుకునేందుకు అందరు ప్రచార బరిలోకి దిగారని, ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు అనేక హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. ‘అధికారం మాకివ్వండి.. మాకివ్వండి.. మేము రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తామో చూడండ’ని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీట్ల పంపకాలపై మాట్లాడుతూ ... ‘అసెంబ్లీపై కాషాయం రెపరెపలాడాలంటే తుల్జాపూర్లో కూడా కాషాయం రావాలని కార్యకర్తలు చెప్పారు. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లితే ఎలా అని కొందరు ప్రశ్నించారు. అదే సమయంలో బంధం తెగిపోయిందని వార్త వచ్చింది. దీన్నిబట్టి నీకు నిండుగా ఇస్తానని చెబుతుండగా కూటమిలో ఏముందని తుల్జాభవాని నాకు సంకేతాలిచ్చినట్టయింది. అలా బీజేపీ, శివసేన కూటమి తెగిపోవాలని మాతా తుల్జాభవాని నిర్ణయించిందని నాకు అనిపిస్తోందన్నారు. తుల్జాపూర్తోపాటు రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఎవరూ శ్రద్ధ వహించలేదు. కానిమేము రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకోసం అన్ని ప్రణాళికలు మావద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే మాకు అధికారం ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోండ’ంటూ ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. -
ఒక్కసారి అధికారమివ్వండి
సాక్షి, ముంబై: తమ పార్టీకి ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండీ, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని అభివృద్ధి చేసి చూపిస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ఠాకూర్ విలేజ్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొదటి ప్రచార సభలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ పార్టీలను లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు. ఆయా పార్టీల నాయకులపై ఘాటుగా విమర్శలు చేశారు. 10-15 రోజులుగా సీట్ల సర్దుబాటుపై ఇరు కూటములు తర్జన భర్జన పడ్డాయి. చర్చలు జరుపుతున్నట్లు నాటకాలాడాయని ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఓ బీజేపీ నాయకుడికి ఫోన్ చేసి ‘మీరు శివసేనతో తెగతెంపులు చేసుకున్న అర గంటకే మేం కూడా కాంగ్రెస్తో విడిపోతామని’ చెప్పారని ఆరోపించారు. ఈ సమయంలో బాల్ ఠాక్రే బతికి ఉన్నట్లయితే బీజేపీ ఇలా వ్యహరించే సాహసం చేసేదికాదన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగేవి, ఎలా పొత్తు సాగేదని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, అందరూ స్వార్థపరులేనని ఇలాంటి పార్టీలను ఎలా నమ్మాలో తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు చెప్పుకోవడాన్ని ఎద్దెవా చేశారు. ఈ ఆఫర్ విని బయటవారే కాదు ఇంట్లో వాళ్లు కూడా నవ్వుకుని ఉండవచ్చని అన్నారు. ముంబై ఇతర ప్రాంతీలకు అడ్డగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం, స్థలం దొరికి న చోట గుడిసెలు వేసుకోవడం.. ఇలా వెలసిన మురికివాడలను ప్రభుత్వం పునరాభివృద్థి పథకం కింద వారికి పక్క ఇళ్లు నిర్మించి ఇవ్వడం, తరువాత వాటిని అమ్ముకుని మళ్లీ గుడిసెలు వేయడం ఇలా ద శాబ్ధాల నుంచి జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తామో అందుకు సంబంధించిన బ్ల్యూ ప్రింట్ ఇటీవల విడుదల చేశానని, ఆ ప్రకారం కచ్చితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నానని అన్నారు. -
‘ఉద్ధ’రించిందేమీ లేదు..!
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రేకు నాయకత్వ లక్షణాలు లేవు..అసలు శివసేనకు అతడు చేసిందేమీ లేదు.. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను అత్యధికంగా ఇబ్బంది పెట్టింది ఉద్ధవ్ ఠాక్రేనే.. ఈ నిజాన్ని ఆయన ఇంట్లో పనిచేసే నౌకర్లను అడిగినా చెబుతారని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే విమర్శించారు. కొంకణ్ పర్యటనలో భాగంగా నారాయణ్ రాణే సింధుదుర్గ్ జిల్లాకు బయలుదేరారు. అంతకు ముందు హాత్ఖంబా ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిష్టతో పనిచేసేవారికి, సమర్థవంతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తను ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ందులో ఎటువంటి మార్పూ లేదని, రాజీనామాకు గల కారణాలను అప్పుడే స్పష్టం చేస్తానని తెలిపారు. ‘ఉద్ధవ్ ఠాక్రే నన్ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన విమర్శలు, దూకుడుతనం మరింత ఎక్కువైంది.. ఇతరులపై ఆరోపణలు చేయడానికి బదులు బాల్ ఠాక్రే ఆదర్శాలను, సిద్ధాంతాలను కాపాడేందుకు కృషిచేస్తే మంచిది..’ అని రాణే వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మరోసారి ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, మొత్తం వారి కుటుంబంలో, పార్టీలో ఏం జరుగుతుందో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ‘కొంకణ్వాసులను భయాందోళన నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తానని ఉద్ధవ్ అంటున్నారు.. నేను నెలకు మూడుసార్లు కొంకణ్లో పర్యటిస్తుంటాను.. ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదుల దాడులు, భయానక వాతావరణం, నేరాల కేసులు నమోదు కావడం లాంటి సంఘటనలు నాకు ఎక్కడా కనిపించడం లేదు.. మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్న ఆ భయాందోళనలు ఏమిటో. .’నని చమత్కరించారు. ఎన్నికలు సమయంలో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు కొంకణ్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు రైళ్ల గురించి పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్ధవ్కు తెలుసా అని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం పెరిగిన రైలు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మీకు కనిపించడం లేదా.. లేకుంటే ఇవన్నీ చూసి మీకు భయమేస్తోందా.. అలా అయితే కొంకణ్ రావద్దు’ అని ఉద్ధవ్కు రాణే సలహా ఇచ్చారు . లోక్సభ ఎన్నికల్లో శివసేన ఎంపీలు గెలవడంలో వారి గొప్పతనమేమీ లేదన్నారు. కేవలం మోడీ ప్రాబల్యం వల్లే వారంతా గెలిచి గట్టేక్కారని వ్యాఖ్యానించారు.‘శివసేనకు నాయకుడు లేడు.. అది నేతృత్వం లేని పార్టీ. అందులో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహిస్తున్న పాత్ర ఏమీ లేద’ని రాణే దుయ్యబట్టారు. ‘ 39 సంవత్సరాలు శివసేనలో కొనసాగాను.. అందులో ఆఖరు 15 సంవత్సరాలు బాల్ ఠాక్రేకు దగ్గరగా ఉన్నాను.. వాస్తవానికి శివసేన నుంచి బయటపడిన వారందరి కంటే బాల్ ఠాక్రేను ఎక్కువగా వేధించింది ఉద్ధవ్ ఠాక్రేనే..’అని ఘాటుగా విమర్శించారు. ‘బాల్ ఠాక్రే అప్పట్లో కుటుంబ సభ్యుల్ని, ఇంటిని వదిలి రెండుసార్లు బయటపడ్డారు. ఆయన ఎందుకు వెళ్లారు..? ఎక్కడ ఉంటుండేవారు...? మాకు తెలుసు.. ఇంటి వాతావరణం గురించి నౌకర్లను అడిగితే వారే చెబుతారు’ అని రాణే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాణే ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలియదు : మాణిక్రావ్ నాగపూర్: మంత్రిపదవికి నారాయణ్ రాణే ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారో తనకు తెలియదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాణేకు ప్రభుత్వంలో సముచితం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న రాణే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే అధిష్టానంతో ఆయన చర్చించవచ్చని ఠాక్రే సూచించారు. -
నేటి నుంచి అసెంబ్లీ
ముంబై: శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదుర్కొన్న అధికారపక్షాలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి విపక్షాలు సిద్ధమయ్యాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలను నెరవేర్చని పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని మహాకూటమి ఆదివారం విమర్శించింది. సమావేశాల ప్రారంభానికి సూచికగా ముఖ్యమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన తేనిటి విం దును బహిష్కరించామని సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ప్రకటించారు. చవాన్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల రాష్ట్రం రూ.మూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చవాన్ 500 ఎకరాల భూమిని బిల్డర్లకు కట్టబెట్టారని శివసేన నాయకుడు సుభాష్ దేశాయ్ మండిపడ్డారు. ఆదర్శ్ కుంభకోణంతో ప్రమేయమున్న ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవాడ్కు మంత్రిపదవి కట్టబెట్టడం సరికాదని తావ్డే స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎఫ్ కూటమికి ఓటమి తప్పదని చెప్పారు. -
వారసులదే రాజ్యం!
కీలక పదవులు చేపట్టింది నేతలు, వారి కుటుంబసభ్యులే తాజా లోక్సభ ఎన్నికల్లోనూ పలువురి పోటీ సాక్షి, ముంబై: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 30కి పైగా కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో పాటు దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, దివంగత నేత ప్రమోద్ మహాజన్ తదితర నేతల వారసులు రాజకీయ రంగంలోకి అడుగిడారు. వీరిలో కొందరైతే తండ్రి, కుమారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రి పదవులను చేపట్టినవారు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వారి వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘పవర్’ ఫుల్... రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో పవార్ కుటుంబం కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనకు తల్లి నుంచి రాజకీయ వారసత్వం లభించింది. ఆయన ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బారామతి లోక్సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన కూతురు సుప్రియా సూలే మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రులుగా... రాష్ట్ర రాజకీయాలలో తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత చవాన్ కుటుంబీకులకు దక్కింది. దివంగత శంకర్రావ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్రంలో రక్షణమంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆయన వారసుడైన అశోక్ చవాన్ కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటన అనంతరం రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అశోక్ చవాన్కు ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ఆదర్శ్ కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో హవా ఠాక్రే లదే... శివసేన పార్టీ ఠాక్రే కుటుంబీకులకే వారసత్వంగా లభించింది. ఠాక్రే కుటుంబీకులు ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను తెరవెనుక నుంచే నడిపిస్తున్నారు. దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే శివసేన పార్టీ స్థాపించారు. ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను వారసుడుగా ప్రకటించడంతో బాల్ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాల్ఠాక్రే మనుమడు, ఉద్ధవ్ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దేశ్ముఖ్ కుటుంబీకులు... దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ వారసులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన విలాస్రావ్, ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటనతో పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్రమంత్రి పదవిని అప్పగించింది. ఆయ న మరణించిన తర్వాత కుమారుడు అమిత్ దేశ్ముఖ్, సోదరుని కుమారుడు దిలీప్ దేశ్ముఖ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముండే కుటుంబీకులు.. బీజేపీ సీనియర్ నాయకుడైన గోపీనాథ్ ముండే కూడా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోదరుని కుమారుడు ధనంజయ్ ముండేతోపాటు ఆయన కుమార్తె పంకజా ముండేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే గోపీనాథ్ ముండేతో వచ్చిన విభేదాల వల్ల ధనంజయ్ ముండే ఎన్సీపీలో చేరారు. మరోవైపు దివంగత ప్రమోద్ మహా జన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి మహాకూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వసంత్దాదా పాటిల్ కుటుంబీకులలో ఆయన భార్య శాలినీతాయి పాటిల్, కుమారుడు ప్రతీక్, మనుమడు మదన్ పాటిల్కు మంత్రి పదవులు లభించాయి. ప్రస్తుత అటవీశాఖ మంత్రి పతంగ్రావ్ కదం కుమారుడు విశ్వజీత్ కదంను పుణే లోక్సభ నుంచి బరిలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ రాణే, ఆయన కుమారుడు నీలేష్ రాణే రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు గణేష్ నాయక్తోపాటు ఆయన కుమారులు సంజీవ్ నాయక్, సందీప్ నాయక్లతోపాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్ నాయక్లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సందీప్ నాయక్ ఎమ్మెల్యేగా, సంజీవ్ నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా సంజీవ్ లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగానే సాగుతున్నట్టు కనబడుతోంది. -
జయదేవ్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, ముంబై: తమ తండ్రి దివంగత బాల్ఠాక్రే ఆస్తుల వివాదం పరిష్కారమయ్యేవరకు ఉద్ధవ్ ఠాక్రే అధీనంలో ఉన్న ఆస్తులు విక్రయించరాదని పెద్ద కుమారుడు జయదేవ్ ఠాక్రే దాఖలుచేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్ధవ్కు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం బాల్ఠాక్రే ఆస్తులన్నీ ఉద్ధవ్ అధీనంలో ఉన్నాయి. ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ఉద్ధవ్ హైకోర్టులో ‘ప్రొబేట్’ దాఖలు చేశారు. దీన్ని జయదేవ్ ఠాక్రే ‘నోటీస్ ఆఫ్ మోషన్’ ద్వారా కోర్టులో సవాలు చేశారు. ఉద్ధవ్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన అధీనంలో ఉన్న ఆస్తుల న్నీ విక్రయించే ప్రమాదముందని,వాటిని విక్రయిం చకుండా ఆదేశాలివ్వాలని జయదేవ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కాగా, బాల్ఠాక్రే చనిపోయిన కొద్దిరోజులకే ఆస్తుల విషయమై ఉద్ధవ్, జయదేవ్ల మధ్య వాగ్వాదం మొదలైంది. తన తండ్రి రాసిన వీలునామాలో ఆయన సంతకం లేదని, ఆ వీలునామా తప్పుల తడకగా ఉందని జయదేవ్ పిటిషన్లో పేర్కొన్నారు. మరాఠీ భాష అభ్యున్నతి కి పాటుపడే ఆయన ఆంగ్లంలో వీలునామా రాయడమేంటన్నారు. స్థిరాస్తులు, చరాస్తులు బ్యాంక్లో డిపాజిట్, ఇలా మొత్తం రూ.14.85 కోట్లు మాత్రమే ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొనడం అనుమానంగా ఉందన్నారు.తన తండ్రి నివాసముంటున్న బాంద్రా లోని మాతోశ్రీ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40 కోట్లకుపైనే ఉంటుందని, ఇంకా చాలా ఆస్తులు ఉన్నా వాటిని ఉద్ధవ్ వీలునామాలో చూపించలేదని జయదేవ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, రుజువులు చూపించాలని జయదేవ్ను కోర్టు కోరింది. కానీ ఆస్తులను ఉద్ధవ్ రహస్యంగా విక్రయించే అవకాశాలున్నాయని ముందుగానే గ్రహించిన జయదేవ్ హైకోర్టులో దాఖలు చేసిన నోటీస్ ఆఫ్ మోషన్ను తిరస్కరించింది. -
ఉద్ధవ్ వ్యాఖ్యలు బాధించాయి
సాక్షి, ముంబై: ‘శివసేన అధినేత బాల్ఠాక్రేకు వెన్నుపోటు పొడవలేదు. ఒకవేళ అలాచేసి ఉంటే పెద్దాయన తుదిశ్వాస విడిచే వరకు పార్టీలోకి రావాలని నాతో ఎందుకు సంప్రదింపులు జరిపారు. ఇప్పటికైనా ఉద్ధవ్ఠాక్రే అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాల’ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ఠాక్రే హెచ్చరించారు. కల్యాణ్ లోక్సభ నియోజకవర్గ ఎమ్మెన్నెస్ అభ్యర్థి ప్రమోద్ పాటిల్కు మద్దతుగా డోంబివలిలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారం రాజ్ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను బాల్ఠాక్రేకు వెన్నుపోటు పొడిచానని ఒక్కసారి కాదు అనేకసార్లు ఉద్ధవ్ ఆరోపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాల్ఠాక్రేకు అరోగ్యం బాగా లేనప్పుడు మాతోశ్రీ బంగ్లాకు వెళ్లి భేటీ అయ్యేవాడిని. ఆయన ఎప్పుడూ నేను వెన్నుపోటు పొడిచినట్లుగా భావించలేదు. మరి ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని ఉద్ధవ్కు ఆకస్మాత్తుగా నేను వెన్నుపోటు పొడిచానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమ’ని ఆయన ప్రశ్నించారు. ఆనారోగ్యం బారిన పడిన ఉద్దవ్కు బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో అంజియోగ్రఫీ, అంజియో ప్లాస్టీ వైద్య పరీక్షలు జరిగాయని, ఆ తర్వాత శస్త్రచికిత్స పూర్తయ్యేవరకు తాను అక్కడే ఉన్నానని రాజ్ఠాక్రే గుర్తు చేశారు. డిశ్చార్జి అయిన తర్వాత ఉద్ధవ్ను తీసుకుని స్వయంగా నా కారులో మాతోశ్రీ బంగ్లాలో దింపివచ్చానన్నారు. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు, నేను వెన్నుపోటు పొడిచిన వాడి పక్కనే కారులో కూర్చున్నానని అంటూ నిలదీశారు. బాల్ఠాక్రే బతికుండగానే ఎమ్మెన్నెస్ స్థాపించానని చెప్పారు. అయితే ఉద్ధవ్ అనారోగ్యానికి గురైనప్పుడు బాల్ఠాక్రే తనకే ఎందుకు ఫోన్ కాల్ చేశారు...? అదే గణేశ్ నాయక్, ఛగన్ భుజ్బల్, నారాయణ రాణే..ఇలా పార్టీ నుంచి బయటకువెళ్లిన వారిని రమ్మని ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. అథవలేపై విమర్శలు తమకు పదువులు వస్తే చాలు అనుయాయుల సమస్యలు పరిష్కారమైనట్లేనని కొందరు భావిస్తున్నారని రాజ్ఠాక్రే అన్నారు. అదే బాటలో నడుస్తున్న ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే దళితులకు ఎలా నేతృత్వం వహిస్తారని నిలదీశారు. అథవలే రాష్ట్రానికి లాలూప్రసాద్లాంటి వారని ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నోర్లు మూయించాలంటే రాజు పాటిల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ముంబై-పుణే ఎక్స్ప్రెస్ వేపై ప్రభుత్వం టోల్ పెంచి దోచుకోవడం మళ్లీ ప్రారంభించిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గడువు పూర్తికాగానే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సభలో ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు శిశీర్ షిండే, రమేశ్ పాటిల్, ప్రకాశ్ భోయిర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్ థాక్రే ఫోటో ఎగ్జిబిషన్
-
నీటి బిల్లు బకాయిదారుల్లో సచిన్, ఠాక్రే
ముంబై: ముంబైలో నీటి బిల్లులు చెల్లించని వారి జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ నేత అబూ అజ్మీ తదితర ప్రముఖులున్నారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రెండు లక్షల మంది డిఫాల్టర్లతో ఓ జాబితాను తన వెబ్సైట్లో పెట్టింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలేను కూడా జాబితాలో పేరు చేర్చింది. జనవరి 16, 2014 నాటికి బీఎంసీ రెండు లక్షల మంది డిఫాల్టర్ల నుంచి సుమారు రూ. వెయ్యి కోట్లు బకాయిలు వసూలు చేసింది. 24 వార్డుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. వాణిజ్య, పారిశ్రామిక, గృహ అవసరాల కేటగిరీల వారీగా ఈ జాబితాను రూపొందించినట్టు బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. డిఫాల్టర్లు చెల్లించాల్సిన బకాయి మొత్తం ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై థాకరే కుటుంబ సన్నిహితులను ప్రశ్నించగా.. బిల్లులను సరిచూసుకుంటామని చెప్పారు. ఎస్పీ నేత అబూ అజ్మీ స్పందిస్తూ.. ‘నేను ఎలాంటి బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదు. బీఎంసీలో నిర్వహణ లోపాల వల్ల నాకు బిల్లు రాకపోయి ఉండొచ్చు. నా చేతికి బిల్లు వస్తే ఆ రోజే చెల్లించేస్తా’ అని చెప్పారు. తనను డిఫాల్టర్ల జాబితాలో చేర్చినందుకు బీఎంసీకి నోటీసులు ఇస్తానన్నారు. -
‘ఠాక్రే’ల తకరారు!
సాక్షి, ముంబై: దివంగత బాల్ ఠాక్రే కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తులపై ఇటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అటు పెద్ద కుమారుడు జయదేవ్ ఠాక్రే ఇద్దరూ కోర్టులో పిటి షన్లు దాఖలు చేశారు. ఉద్ధవ్ తన తండ్రి ఆస్తులకు సంబంధించిన పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జయదేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆస్తుల వీలునామాలో బాల్ ఠాక్రే సంతకం లేదని, అది తప్పుల తడకగా ఉందని, అనేక అంశాలను పొందుపర్చలేదని జయదేవ్ తన పిటిషన్లో స్పష్టం చేశారు. ‘మా తండ్రి తన జీవితాన్నంతా మరాఠీ భాష, మరాఠీ ప్రజల అభ్యున్నతికే ధారపోశారు. అలాంటి భాషా ప్రేమికుడు తన వీలునామాను ఆంగ్లంలో రాశారంటే నమ్మశక్యంగా లేదు..’ అని జయదేవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేనంటే మా తండ్రికి చాలా అభిమానం .. రోజూ నాతో ఫోన్లో సంప్రదిస్తుండేవారు..అలాంటి ఆయన నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని అంటే హాస్యాస్పదంగా ఉంది..’ అని జయదేవ్ ఆరోపించారు. ‘ఉద్ధవ్ పిటిషన్ లో మా తండ్రి సంపాదించిన వివిధ ఆస్తులు, బ్యాంకులో డిపాజిట్ల మొత్తం రూ.14.85 కోట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. కాని నా తండ్రి నివాసమున్న బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40 కోట్లు ఉంటుంది.. దీంతోపాటు బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇంట్లో, వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారు ఆభరణాలు ఇలా రూ.కోట్లలోనే ఉంటాయి. వీటన్నింటిని ఉద్ధవ్ వీలునామాలో చూపించలేదు..’ అని జయదేవ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, ఉద్ధవ్ పొందుపరిచిన ప్రకారం ఠాక్రే వీలునామా ఇలా ఉంది. ‘నా కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ఎల్లప్పుడు నాతోనే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాకు నూతనోత్తేజాన్ని నింపారు. మాతోశ్రీ నిర్మాణంలో ఉద్ధవ్ పాత్ర ఎంతో ఉంది. ఆయురారోగ్యాలతో ఉద్ధవ్ తన శేషజీవితం గడపాలనదే నా చివరి కోరిక. ఉద్ధవ్ ఎంతో బాధ్యతతో పార్టీని ముందుకు నడిపిస్తారని, ఠాక్రే కుటుంబంలో శాంతిని నెలకొల్పుతారనే నమ్మకం నాకుంది. కాగా జయదేవ్ కూడా నా కుమారుడే. కాని అనివార్య కారణాలవల్ల కొన్నేళ్ల కిందట స్వయంగా మాతోశ్రీ విడిచారు. భార్య స్మితతో తెగదెంపులు చేసుకుని మరో భార్యతో దూరంగా ఉంటున్నారు. ఈ సంఘటన లతో ఎంతో బాధపడ్డాను. దీంతో నా ఆస్తుల్లో ఆయనకు ఎలాంటి వాటా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను.’అయితే జయదేవ్ ఈ వీలునామాపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చే స్తున్నారు. దీంతో ఠాక్రే ఆస్తి వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. -
‘ప్రతిజ్ఞా దివస్’గా ఠాక్రే జయంతి
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే జయంతిని ఇకపై ‘ప్రతిజ్ఞా దివస్’గా జరుపుకోనున్నట్లు ఆ పార్టీ కార్యధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రే తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో ఠాక్రే జయంతిని శివసైనికులు తమ తమ ప్రాంతాల్లోనే జరుపుకున్నారని, ఈసారి మాత్రం కార్యకర్తలందరూ జనవరి 23న సోమయ్య మైదానానికి చేరుకోవాలన్నారు. అక్కడ బాల్ఠాక్రే కలల సాకారం కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ ఉనికిని చాటడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, పార్టీ సత్తా ఏమిటో దసరా ర్యాలీ, శివసేన వ్యవస్థాపక దినోత్సవాల ద్వారానే చాటి చెప్పామన్నారు. శివసైనికులందరిలో తామంతా ఒకే కుటుంబమనే భావన ఉందని, అందుకే అంతా ఒకచోటుకు చేరుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే భావంతో కూడా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని, అంకితభావంతో పనిచేసి ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారన్నారు. ఇది కేవలం శివసైనికులకు చిందిన కార్యక్రమమని, బీజేపీ నేతలను ఆహ్వానించడంలేదన్నారు. మోడీపై రాజ్ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
బాల్ఠాక్రే వర్ధంతి కోసం భారీ ఏర్పాట్లు
సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ప్రథమ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న శివాజీపార్క్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు తరలిరానున్నారు. ఇప్పటికే రాష్ర్టంలోని ప్రతి పార్టీ కార్యకర్త, అభిమానులు తరలివచ్చి నివాళులు ఆర్పించాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే బాల్ఠాక్రే వర్ధంతి కార్యక్రమానికి శివసేన మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐ నాయకులను కూడా హాజరుకావాలని ఆహ్వనించింది. దీంతో ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భారీ సంఖ్యలో శివసైనికులను శివాజీపార్క్ మైదానానికి తరలించే బాధ్యతలు ముంబైలోని అన్ని విభాగ ప్రముఖులకు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. శివాజీపార్క్ మైదానంలో బాల్ఠాక్రే పేరుతో నిర్మించిన (ఉద్యానవనం రూపంలో ఉన్న) స్మారకాన్ని శివసైనికులు ‘శక్తి స్థల్’ గా గుర్తించాలనే ఉద్ధేశ్యంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలాఉండగా బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివసేన సీని యర్ నాయకుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశాయి గోరేగావ్లో మూడు రోజుల పాటు ‘ఠాక్రే ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నుం చి మూడు రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. బాల్ఠాక్రే ప్రథమ వర్థంతి సందర్భంగా శివసేన విడుదల చేసిన పోస్టర్లపై ‘చలా శివ్ తీర్థావర్’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు జనాలను భారీ సంఖ్యలో తరలించడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. బాల్ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆయన లేని లోటు కారణంగా కార్యకర్తలు, పదాధికారులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉద్ధవ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక ముంబైతోపాటు రాష్ట్రంలో శివసేనకు చెందిన కీలక లోక్సభ నియోజకవర్గాలలో సమావేశాలు జరిపి మరింత పటిష్టం చేశారు. ఆదివారం జరగనున్న ప్రథమ వర్ధంతికి పెద్ద ఎత్తున జనం, శివసైనికులు తరలి వచ్చేందుకు ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్లలో భారీగా పోస్ట్లు చేశారు. దీన్నిబట్టి ఆ రోజు భారీగానే బలప్రదర్శన జరిగే అవకాశాలున్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఫేస్బుక్’ కలకలం
సాక్షి ముంబై: శివసేన అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రేపై ఫేస్బుక్లో వచ్చిన అవమానకర సందేశంతో కళ్యాణ్లో మంగళవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివసేన పార్టీని, బాలాసాహెబ్లను అవమానించారంటూ పెద్ద సంఖ్యలో శివసైనికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి అల్లర్ల నియంత్రణ బృందం, రాష్ట్ర రిజర్వు పోలీసు దళం రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా శివసేన దసరా ర్యాలీ ఉత్సవాల అనంతరం రెండో రోజున సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫేస్బుక్’లోని ఒక పేజీలో శివసేన, ఆ పార్టీ అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రేలపై కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా సందేశాలను గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్లోని శివసేన నాయకుడు విజయ్ దల్వీ స్థానిక ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేకు తెలిపారు. అనంతరం ఈ సమాచారం నగరమంతటా దావానలంలా వ్యాపించింది. పార్టీ తరఫున నాయకులు వాగ్లే తదితరులు ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో అలాగే సైబర్ క్రైం సెల్కు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బాలాసాహెబ్ను అవమానించిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే సదరు అభ్యంతరకర పోస్టును దాదర్లో నివసించే ఒక వ్యక్తి లైక్ చేసినట్లు పార్టీ నాయకులు దత్తా దల్వీ, భావు కోర్గావ్కర్ల దృష్టికి వచ్చింది. వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని నిలదీశారు. ఈ ఫేస్బుక్ పేజీని కళ్యాణ్ నివాసి ధనంజయ్ పాఠక్ తయారు చేశాడని అతడు చెప్పాడు. ఆ తర్వాత విషయం కళ్యాణ్కు చేరింది. దీంతో రాత్రి అనేక మంది శివసేన కార్యకర్తలు ఖడక్పాడా పరిసర ప్రాంతంలో ఉన్న ధనంజయ్ పాఠక్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ధనంజయ్ పాఠక్ నిందితుడని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని శివసైనికులకు నచ్చజెప్పడంతో వారు చల్లబడ్డారు. శివసైనికులు ధనంజయ్ ఇంటికి వచ్చినప్పుడు అతడు ఇంట్లో లేడు.కాగా, తన భర్త నిర్దోషని, బాలాసాహెబ్ను అవమానించే విధంగా ఫేస్బుక్లో ఎటువంటి సందేశం పంపలేదని, ఎవరో అతడి అకౌంట్ను హ్యాక్ చేశారని ఆమె ఆరోపించింది. -
శివాజీపార్క్లోనే బాల్ఠాక్రే స్మారకం
సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే స్మారకాన్ని శివాజీపార్క్లోనే నిర్మిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఆయన స్మృతి స్మారక నిర్మాణ పనులు అనుకున్న సమయానికి నవంబర్ 17వ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు నగర మేయర్ సునీల్ ప్రభు, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలేతో కుంటే భేటీ అయ్యారు. బాల్ఠాక్రే ప్రథమ వర్థంతి జరిగే నవంబర్ 17వ తేదీ లోపే స్మారకం నిర్మించి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ స్మారకం చుట్టూ ఉద్యానవనం ఉంటుంది. ఈ స్థలం సీఆర్జెడ్ (తీర ప్రాంత నియంత్రణ మండలి) పరిధిలోకి రావడంతో బాల్ఠాక్రే స్మారక నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సంబంధిత శాఖకు పంపించాం. ఉద్యానవనంలో నిర్మించే స్మారక నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాపు హెరిటేజ్ కమిటీకి పంపించాం. దీంతో అన్ని పనులు నియమాలకు లోబడి అధికారికంగా కొనసాగుతుండడంతో ఈ స్మారకం నిర్మించేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావ’ని సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఈ స్మారకం నిర్మాణానికి అవసరమయ్యే అన్ని అనుమతులు బీఎంసీ పరిపాలన విభాగం ప్రభుత్వం నుంచి తీసుకుందని సునీల్ ప్రభు వివరించారు. పనులన్నీ నియమాలకు లోబడే సాగుతున్నాయని, దీనిపై వివిధ రాజకీ య పార్టీలు అనవసరంగా రాజకీయం చేసి లబ్ధిపొందే ప్రయత్నం చేయవద్దని రాహుల్ శేవాలే అన్నారు. కాగా, బాల్ఠాక్రే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం పార్టీ అవిర్భవించిన నాటి నుంచి ఏటా దసరా రోజున శివాజీ పార్క్ మైదానంలో శివసేన భారీ ర్యాలీ జరిగేది. దీంతో ఈ మైదానంతో ఠాక్రేకు అవినావ భావం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఠాక్రేకు అంత్యక్రియలు నిర్వహిస్తామని శివసేన నాయకులు పట్టుబట్టారు. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే నియయనిబంధనలు అడ్డువచ్చాయి. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో శివాజీపార్క్ మైదానంలో ఠాక్రే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఈ ప్రాంతాన్ని ఠాక్రే అభిమానులు దర్శించుకునేందుకు అక్కడ గద్దె నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ప్రతీరోజు వేలాది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ గద్దెను సందర్శించి వెళుతుండేవారు. దీంతో ఠాక్రే స్మృతి స్మారకాన్ని ఇక్కడే నిర్మించాలని శివసేన నాయకులు పట్టుబట్టారు. తర్వాత అనేక రంగాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావడంతో మార్గం సుగమమైంది.