Basara triple IT
-
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్టచ్–బ్యాడ్టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
బాసర ట్రిపుల్ ఐటీలో 1,404 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్/బాసర/భైంసా: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు. టెన్త్లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్ వెంకటరమణ, జాయింట్ కనీ్వనర్ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఠీఠీఠీ.టజuజ్టు. ్చఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్ఐటీ ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. మృతికి కళాశాల యాజమాన్యమే కారణం తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఐదు నెలల్లో ముగ్గురు ♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2023, నవంబర్ 25న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది. ♦ తాజాగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్లో విద్యార్థుల భవిష్యత్పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
Basara IIIT: వాడు లేని జీవితం నాకొద్దు!
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణంగా ప్రేమించిన బావ మృతిని తట్టుకోలేకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు లేఖ రాసింది. వర్సిటీ అధికారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష(17) గురువారం తన ఇంటి నుంచి వర్సిటీకి వచ్చింది. గంగా హాస్టల్లోని తన 117 గదిలోనే సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది క్యాంపస్ హెల్త్సెంటర్కి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. శిరీష మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఆమె రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె బావ ఈ మధ్యే మృతి చెందగా.. అది తట్టుకోలేకే శిరీష బలన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శిరీష మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్రెడ్డి ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. ప్రజాభవన్గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
బాసర ట్రిపుల్ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా, నారాయణఖేడ్: బాసర ట్రిపుల్ఐటీలో పీయూసీ–1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ గతనెల 31న బాసర ట్రిపుల్ఐటీలో చేరాడు. నాలుగు రోజులుగా నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. పీయూసీ–1లో అడ్మిషన్ పొందిన జాదవ్ బబ్లూ తరగతులకు హాజరైన రెండోరోజే హాస్టల్ బ్లాక్లో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. కాగా ట్రిపుల్ఐటీలో రెండు నెలల క్రితం జూన్ 14న సిద్దిపేట జిల్లాకు చెందిన బోర లిఖిత అనే విద్యారి్థని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగిన కొద్దిసేపటికే ‘‘నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగాడు.. కొద్ది సేపటికే మీ బిడ్డ చనిపోయాడని కళాశాల నుంచి పిడుగులాంటి వార్త విని గుండె పగిలినంత పని అయింది’అని జాదవ్ బబ్లూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డ చక్కగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనుకుంటే గర్భశోకం మిగిల్చాడని భోరుమని విలపించారు. ఇలా ఎందుకు చేశాడో తెలియదని విలపించారు. కాంగ్రెస్ ఆందోళన.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లేందుకు యతి్నంచారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే బాసరలో 20మంది విద్యార్థులు చనిపోయారనీ, ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే పాలకులు స్పందిస్తారని కాంగ్రెస్ నియోజకవర్గ నేత కూచాడి శ్రీహరిరావు ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాగా ట్రిపుల్ ఐటీ అధికారులు బబ్లూ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలని నినదించారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Basara IIIT: మరో బలవన్మరణం
సాక్షి, నిర్మల్: భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం.. విద్యార్థుల్ని బలిగొంటోందా?. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరో అఘాయిత్యం జరిగింది. మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ప్రకటించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ క్యాంపస్లోనే చదువుతున్న తన సోదరుడితో మాట్లాడాడు కూడా. ఈ క్రమంలో గదిలో అచేతనంగా వేలాడుతూ కనిపించిన జాదవ్ను హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించింది ట్రిపుల్ ఐటీ సిబ్బంది. అయితే అప్పటికే జాదవ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఉద్రిక్తత జాదవ్ క్యాంపస్లో చేరి నెల కూడా కాలేదు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బబ్లూ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించాల్సిన నేపథ్యంలో భైంసా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. వీసీ విచారం నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ మానసిక సమస్యలతో చనిపోయాడు. మధ్యాహ్నాం ఉరివేసుకోని అత్మహత్యచేసుకున్నాడు. ఇది విచారకరమైన ఘటన. కిందటి నెల 31వ తేదీన అడ్మిషన్ తీసుకున్నాడు. అతని అన్న కూడా ట్రిపుల్ ఐటీలోనే చదువుతున్నాడు. మధ్యాహ్నాం అతనితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న సమస్యను బబ్లూ సోదరుడితో కూడా చెప్పుకోలేదు. ఆత్మహత్యకు పాల్పపడటం బాధాకరం. ::: వీసీ వెంకటరమణ నాలుగో ఘటన ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సర కాలంలో నలుగురు మృత్యువాత చెందారు. డిసెంబర్లో ఒకరు, ఈ ఏడాది జూన్లో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు జాదవ్ మృతితో ఆ సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. విద్యార్థుల బలవన్మరణాలపై క్యాంపస్ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే.. ప్రాణం తీసుకునేంత ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు చేరుకుంటున్నారు? అసలు వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగ నిపుణులు. -
మహారాష్ట్రలో దొరికిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి బన్నీ మంగళవారం మహారాష్ట్రలో దొరికాడు. గురువారం వర్సిటీ నుంచి ఔట్ పాసు తీసుకుని వెళ్లిన బన్నీ ఇంటికి వెళ్లలేదు. స్నేహితులకు కూడా చెప్పకుండా సెల్ స్విచాఫ్ చేయడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాసర ఎస్ఐ మహేశ్ రైల్వేస్టేషన్లోని సీసీ పుటేజీలు పరిశీలించగా గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. బన్నీ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో మహారాష్ట్ర వెళ్లిన పోలీసులు.. పర్బనీ జిల్లా పూర్ణ ప్రాంతంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లి బన్నీని అక్కడే వారికి అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాసర పోలీసులు తెలిపారు. -
సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాల నోటిఫికేషన్కు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు గడు వు పెంచినా ఈ ఏడాది ఆన్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. వరుస ఘటనలే కారణమా.. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్ఐటీని రహస్య క్యాంపస్గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన వేగవంతం బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది. – ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
నిర్మల్: చదువుల తల్లులుగా నిలవాల్సిన వాళ్ల చావుల వెనుక కారణాలేంటి.? ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లిఖిత చనిపోవడం వెనుక సరైన కారణమేంటి..? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం ఇలా విద్యార్థుల బతుకులను ఎందుకు బలి తీసుకుంటోంది..? అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? ఇవీ..సాధారణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. ఈనెల 13న బలవన్మరణానికి పాల్పడిన సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక (17) మృతిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదేరోజు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా ఇప్పటికీ కారణాలు బయటపెట్టకపోవడం సందేహాలకు, క్యాంపస్ వాతావరణంపై అనుమానాలకు తావిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి తర్వాత గంగాబ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయిన లిఖిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు, వర్సిటీ వర్గాలు చెబుతున్నా.. ఏదో మిస్టరీ ఉందన్న వాదనలూ బలంగా ఉన్నాయి. రాత్రి 2.30 గంటల సమయంలో లిఖిత బయటకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె మరణంపై గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, అధికారులు చెప్పిన వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు ♦ విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పలు ప్రశ్నలూ సంధిస్తున్నాయి. ♦ పరీక్షలు రాస్తున్న సమయంలో కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థిని ప్రాణం తీసుకునేదాకా ఎందుకు తీసుకువచ్చారు? ♦ తన మానసిక పరిస్థితిని అంచనా వేయకుండా ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు..? ♦ వర్సిటీలో విద్యార్థుల కోసం ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉండగా, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ♦ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరూ, ఎందుకు లోతుగా పరిశీలించడం లేదు? ♦ స్థానికంగా ఉంటానని ఇన్చార్జిగా వచ్ఛిన వీసీ వెంకటరమణ గెస్ట్గానే ఎందుకు వ్యవహరిస్తున్నారు? ♦ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వర్సిటీలో వాతావరణాన్ని, అక్కడి అధ్యాపకులు, ఇన్చార్జీల తీరును నిలదీస్తున్నాయి. దీనిపై సర్కారు సీరియస్గా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం
-
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో మృత్యు ఘోష ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్ ఆసుప్రతికి తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం నాలుగో అంతస్తు నుండి దూకడంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదం అని వీసీ వెంకటరమణ అంటున్నారు.. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. ఆత్మహత్యను ఖండిస్తున్నానని, అబద్ధపు ప్రచారాన్ని నమ్మద్దని కోరుతున్నానని వీసీ అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని..
సాక్షి, హైదరాబాద్/నిర్మల్ చైన్గేట్/భైంసా: పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ఐటీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పరీక్షల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే పరీక్ష హాల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారంటూ పలువురు విద్యార్థులను పరీక్ష సిబ్బంది, చీఫ్ వార్డెన్ మందలించారని.. దీనితో ఆందోళనకు లోనైన దీపిక బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ–1 చదువుతోంది. మంగళవారం ట్రిపుల్ఐటీలో జరిగిన పరీక్షకు హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె.. పరీక్ష హాల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. చాలాసేపైనా ఆమె బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో అక్కడివారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దీపిక బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే క్యాంపస్లోని హెల్త్ సెంటర్కు.. అక్కడి నుంచి భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్కు తరలించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అయితే విద్యార్థిని దీపిక ఆత్మహత్య విషయం చాలాసేపు బయటికి రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మోహరించారు. లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీపిక ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఒత్తిడి అంటున్న అధికారులు పరీక్షల ఒత్తిడి కారణంగానే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్ చెప్పారు. ట్రిపుల్ఐటీలో ముగ్గురు సభ్యులతో కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్ ఉందని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా మని తెలిపారు. అయినా ఈ ఘటన చోటుచేసుకో వడం బాధాకరమన్నారు. దీపిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చేందుకు నలుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. నా బిడ్డను వేధించారు ట్రిపుల్ఐటీ సిబ్బంది, అధికారులు తన బిడ్డను వేధించారని, లేనిపోని విషయాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశారని దీపిక తండ్రి వడ్ల వీరన్న ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనను పిలిపించి ఆమె వాట్సాప్లో చాటింగ్లు చేస్తోందని ఆరోపించారని వివరించారు. తన బిడ్డను అడిగితే.. ట్రిపుల్ఐటీలో కొందరు తనపై కక్షగట్టి ఇలా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఈ విషయాన్ని వార్డెన్కు, ఉన్నతాధికారులకు వివరించేందుకు తాను ప్రయత్నించినా.. పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు కౌన్సెలింగ్ చేసి దారిలో పెడతానని రాసివ్వాలని ఒత్తిడి చేశారని.. లేకుంటే సీటు రద్దు చేసి ఇంటికి పంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దీపిక తమకు ఫోన్ చేసి సిబ్బంది అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. పత్తాలేని ట్రిపుల్ఐటీ అధికారులు దీపిక చనిపోయి కొన్ని గంటలు గడిచినా, రెండు ఆస్పత్రులకు మృతదేహాన్ని తరలించినా.. ట్రిపుల్ఐటీ అధికారులు, అధ్యాపకులెవరూ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరకు సమీపంలోనే మెరుౖగెన వైద్యసేవలు అందే నిజామాబాద్ పట్టణం ఉండగా.. ఆమెను భైంసాకు ఎందుకు తరలించారని దీపిక బంధువులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె మృతికి వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమగ్ర విచారణ జరపాల్సిందే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ట్రిపుల్ఐటీలో విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాగా దీపిక ఆత్మహత్యకు ట్రిపుల్ ఐటీ అధికారులు కారణం చెప్పేంత వరకు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించేది లేదని తండ్రి వీరన్న తేల్చి చెప్పారు. ఏడాదిలో ముగ్గురు ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగి మంగళవారం నేటికి ఏడాది అవుతోంది. రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇతర వర్సిటీలతో అనుసంధానం చేయాలని, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎండనకా, వాననకా వారం పాటు ఉద్యమించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాటి నుంచి ఇప్పటివరకు ట్రిపుల్ఐటీలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. బిడ్డ మార్చురీలో.. తండ్రి ఐసీయూలో.. దీపిక మృతిపై ట్రిపుల్ఐటీ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి వీరన్న.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు బంధువులు, బీజేపీ నేతలు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు తండ్రిని తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. దీనితో బంధువులు, బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆస్పత్రిలో బిడ్డ మృతదేహాన్ని ఉంచిన మార్చురీవైపు వెళ్తుండగానే వీరన్న ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు మార్చురీలో బిడ్డ మృతదేహం ఉండగా.. అదే ఆస్పత్రి ఐసీయూలో తండ్రికి చికిత్స జరుగుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. ఘటనపై కమిటీ వేశాం ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన షాక్కు గురిచేసింది. ఇంజనీరింగ్ ఫలితాల విడుదల నేపథ్యంలోనే నేను హైదరాబాద్లో ఉన్నాను. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత నిజ నిర్ధారణ కమిటీ వేశాం. త్వరలోనే ఘటనకు కారణాలు తెలుస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
విద్యార్థి సూసైడ్: బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన
బాసర/నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాథోడ్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో మరోమారు ఆందోళనలకు పిలుపునిచ్చారు విద్యార్థులు. తరగతులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. మేయిన్ గేట్ ముందు బైఠాయించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సురేశ్ రాథోడ్ కుటుంబానికి కోటి రుపాయలు పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు బలగాల మోహరింపు తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆత్మశాంతి కోసం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని, వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ట్రిపుల్ ఐటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ! -
బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై గవర్నర్ ఆవేదన
-
రాత్రంతా మెస్లోనే విద్యార్థుల జాగారం.. ఉద్యమం ఉధృతం!
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనశాలకు లైసెన్స్ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రంతా మెస్లోనే జాగారం చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. నేడు ట్రిపుల్ ఐటీ సందర్శించనున్నారు ఎంపీ సోయం బాపూరావు. ఇదీ చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి
బాసర/సంగెం: అనారోగ్యం కారణంగా సుమారు నెల కిందట ఇంటికి వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన శాబోతు సంజయ్ కిరణ్ (18) కొంతకాలంగా కాలేయ, జీర్ణవ్యవస్థ (ప్యాంక్రియాటైటిస్) సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. జూన్ 20న కడుపునొప్పి వస్తోందని.. అన్నం తింటే వాంతులు అవుతున్నాయని చెప్పి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని తల్లిదండ్రులు వరంగల్, హనుమకొండల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈ నెల 16న హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. సంజయ్ వైద్యం కోసం సుమారు రూ.16 లక్షలు వెచ్చించారు. అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంజయ్ మృతిచెందాడు. అయితే తమ కుమారుడి అనారోగ్యానికి బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనే కారణమని మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ ఆరోపించారు. ఈ ఆరోపణను వర్సిటీ అధికారులు ఖండించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు విద్యార్థి తమ కళాశాలలోనే లేడని పేర్కొన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
భారీ వర్షంలోనూ తగ్గేదే లే అంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
జాగరణకు సిద్దమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
చర్చలు సఫలం.. కాదు విఫలం
నిర్మల్/బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదోరోజుకు చేరింది. సమస్య పరిష్కారంపై అధికార వర్గాలు, విద్యార్థుల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. శనివారం ట్రిపుల్ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. వర్సిటీలోని సాక్ భవనంలో శనివారం విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులందరూ సోమవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 12 డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అయితే రేపటిలోగా కేటీఆర్ లెటర్ అందేలా చూస్తామన్నారు. మరోపక్క.. శనివారం నాటి చర్చలు విఫలమయ్యాయని, తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని విద్యార్థులు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ఏవోను తొలగిస్తూ ఉత్తర్వులు కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావును తొలగించి బాధ్యతలను నూతన డైరెక్టర్ సతీశ్కుమార్కు అప్పగించినట్లు వర్సిటీ వీసీ రాహుల్ బొజ్జా శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళనల వ్యవహారంలో బాధ్యతాయుతంగా పనిచేయకపోవడంతో రాజేశ్వరరావును విధుల నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి. మోదీజీ మీరైనా స్పందించండి.. ‘నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు సమాధానం ఇవ్వట్లేదు. మీరైనా స్పందించండని కోరుతున్నాం..’ అంటూ బాసర విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు సీఎంవో, కేటీఆర్, సబితారెడ్డికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమ్మలా బాధేస్తోంది: సబితారెడ్డి విద్యార్థులు ఆందోళన విరమించాలంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను పంపించారు. ‘కోవిడ్తో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉంటే.. మంత్రిగానే కాకుండా ఓ అమ్మలా బాధేస్తోంది, ఇప్పటికైనా ఆందోళన విరమించాలి’ అని కోరారు. ట్రిపుల్ ఐటీ.. ఉద్యమంలో ‘క్రియేటివిటి’ ఐదోరోజైన శనివారం విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగించారు. అందరూ పుస్తకాలు పట్టుకుని వచ్చారు. తమ సమస్యల్ని ఆర్ట్స్, బ్యానర్స్, డూడుల్స్, మీమ్స్, కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టించేలా కళను ప్రదర్శించారు. వాటిని తమ ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ చానళ్ల ద్వారా సోషల్మీడియాలో ఉంచారు. రోజంతా ఎర్రటి ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఐదురోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో పలువురు నీరసిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నినాదాలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలోకి ఎస్ ఎఫ్ఐ నేతలు దూసుకెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు అణచివేస్తుండడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల నిరసనలకు సంబంధించి విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఒకవైపు ఐటీ డైరెక్టర్గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ను నియమించింది ప్రభుత్వం. మరోవైపు విద్యార్థులతో చర్చలు ఫలించాయని కలెక్టర్ ప్రకటించారు. అయితే విద్యార్థులు మాత్రం కలెక్టర్తో చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద వరుసగా మూడో రోజుల విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు అంటున్నారు. సీఎం కేసీఆర్ వస్తే తప్పా.. ఆందోళన విరమించమని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పన్నెండు ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ బాసర ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ మూడు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ, మరోవైపు స్థానిక అధికార యంత్రాంగం కల్పించుకుంటున్న చర్చలు ఓ కొలిక్కిరావడం లేదు. -
ఉపకులపతి.. ఇదేం గతి?
నిర్మల్/బాసర: బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ఏం జరుగుతోంది? పదిరోజులుగా ఎందుకు పతాక శీర్షికలకు ఎక్కుతోంది!? దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈనెల మొదటివారంలో విద్యార్థులు తినే టిఫిన్లో కప్ప రాగా.. ఆపై వరుసగా అన్నంలో తోకపురుగులు, కూరల్లో లైట్పురుగులు వస్తూనే ఉన్నాయి. 8వేల మంది విద్యార్థులు తినే భోజనాల్లో ఇలా కప్పలు, పురుగులు వస్తున్నా.. అటు మెస్ నిర్వహించే వారు.. ఇటు వర్సిటీ వర్గాలు స్పందించింది లేదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ‘మా పిల్లలు బాసర ట్రిపుల్ఐటీలో చదువుతున్నార’ని ఇప్పటివరకు గర్వంగా చెప్పుకున్న తల్లిదండ్రులు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి చదువులపై బెంగలేదు కానీ విద్యార్థులకు పెడుతున్న తిండి గురించే కలవరపడుతున్నామని వారంటున్నారు. గతంలో బాసర వర్సిటీలోకి మీడియాను అనుమతించేవారు. కొన్నేళ్లుగా మీడియాను అనుమతించట్లేదు. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియట్లేదు. వీసీ కోసం ఎదురుచూపు. బాసర ట్రిపుల్ఐటీలో పాలన గాడితప్పడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం. ఏళ్లుగా ఇన్చార్జి వీసీలతోనే సర్కారు వర్సిటీని నెట్టుకొస్తోంది. రెండేళ్లుగా ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్న రాహుల్బొజ్జ.. న్యాక్బృందం వర్సిటీ పరిశీలనకు వచ్చినప్పుడే ఇక్కడికొచ్చారు. తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇటీవల ఘటనలపై స్పందించలేదు. సీఎంఓ కార్యాలయ బాధ్యతల్లోనూ ఉన్న ఆయన హైదరాబాద్ నుంచే వర్సిటీని పర్యవేక్షిస్తున్నట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో వర్సిటీలో స్థానిక అధికారులదే ఇష్టారాజ్యమైంది. మంత్రిని కలిసిన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇక్కడి పరిస్థితుల్ని వివరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. -
ట్రీపుల్ ఐటీ విద్యార్థి మృతి
సాక్షి, జక్రాన్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన బోండ్ల సంజయ్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి గురువారం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంజయ్ నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో బుధవారం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కళాశాలలో సంజయ్ మరో విద్యార్థి సాయిచరణ్లు ఘర్షణ పడ్డారు. ఈ విషయంలో సాయిచరణ్, సంజయ్పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు వీరిని ప్రత్యేక గదిలో ఉంచారు. బుధవారం ఉదయం సంజయ్ను విచారించే సమయంలో మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది చికిత్స కోసం తొలుత నిజామాబాద్లోని ప్రగతి ఆస్పతికి తరలించారు. తర్వాత సంజయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా గురువారం మధ్యాహ్నం సంజయ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషాదంలో కుటుంబం కొలిప్యాక్ గ్రామానికి చెందిన బోండ్ల శ్రీనివాస్, సత్తెమ్మల కుమారుడు సంజయ్. నిర్మల్లోని బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గీత కార్మికుడిగా పని చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి సత్తె మ్మ బీడీలు చుడుతుంది. సంజయ్ను ఎలా గైనా బాగా చదివించాలని ఆశించారు. అనుకోకుండా సంజయ్ ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. సంజయ్ అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థి సంజయ్ నాలుగు అంతస్తుల భవనం పై నుంచి దూకాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సిబ్బంది నిజామాబాదు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థి నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వాసిగా తెలుస్తోంది. నిన్న రాత్రి తోటి విద్యార్థుల తో ఘర్షణ పడగా.. అధ్యాపకులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసిన విద్యార్థులు
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్గా తెలుస్తోంది. -
బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట ఆందోళన
సాక్షి, బాసర : పెరిగిన జీతాలు చెల్లించలేదని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. గతేడాది (2018) జూలై నెలలో జీతాలు పెరగగా మే 2019 వరకు వాటిని చెల్లించలేదని సెక్యురిటీ సిబ్బంది ఆరోపించారు. క్యాంపస్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 180 మంది పెరిగిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. దాదాపుగా 10 నెలలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 29 లక్షలు చెల్లించాలని తెలిపారు. బకాయిల చెల్లింపు కోసం గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించిన లాభం లేకపోవటంతోనే ఇవాళ గేటు ఎదుట భైటాయించామని తెలిపారు. (చదవండి : బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు) -
బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి, బాసర : అసాంఘిక కార్యకలాపాలకు బాసర ట్రిపుల్ ఐటీ అడ్డాగా మారింది. చీకటి పడగానే విద్యార్థుల వసతి గృహాల సమీపంలో ప్రైవేట్ క్యాంటీన్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాసలీలలు సాగిస్తున్నారు. తాజాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్థానిక మహిళగా గుర్తించారు. వీరివురు ట్రిపుల్ ఐటీ ప్రైవేట్ క్యాంటీన్లో పనిచేసే వ్యక్తులుగా నిర్ధారించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం క్యాంపస్ పరిధిలో ప్రైవేట్ క్యాంటీన్లు నడపకూడదన్న రూల్స్ అతిక్రమించి క్యాంటీన్ను నడుపుతున్నారు. అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తయితే.. వేరే దేశమైన నేపాల్ వ్యక్తిని కుక్గా పెట్టుకొని, ఇలాంటి చర్యలకు ఒడిగట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7వేల మంది విద్యార్థులు చదివే ప్రదేశంలో, అందులోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉన్న చోట ఇలాంటి సంఘటనలు జరగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో తీస్తున్న సాక్షి కెమెరామెన్ నుంచి కెమెరా లాక్కొని మీడియా పట్ల బాసర ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా నేపాల్కు చెందిన ఓ వ్యక్తిని దాబాలో దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. -
ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు
-
ఎలక్ట్రిక్ బైక్పై రయ్రయ్!
సాక్షి, బాసర: బాసర ట్రిపుల్ఐటీలో ఈ–4 మెకానికల్ విభాగానికి చెందిన జి. విశాల్, జే. మహేశ్లు ఎలక్ట్రిక్ బైక్ను తయారుచేశారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా పర్యావరణ హితాన్ని కోరుతూ ఎలక్ట్రిక్ బైక్ తయారీ వైపు అడుగులువేశారు. విద్యుత్ చార్జింగ్తో పనిచేసే బైక్ తయారీకి రూ. 40వేల మేర ఖర్చుపెట్టారు. కళాశాలలో తోటి విద్యార్థుల ఆలోచనలతో తుదిరూపాన్ని ఇచ్చారు. గంట చార్జింగ్తో 30 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా బైక్ను రూపొందించారు. పాత ద్విచక్రవాహనాల విడి భాగాలతో పెట్రోల్ అవసరంలేని బైక్ను ఆవిష్కరించారు. ఆలోచనలు పంచుకుంటూ.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం సంఘం జాగర్లముడి గ్రామానికి చెందిన జి. విశాల్, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన జే. మహేశ్ బాసర ట్రిపుల్ఐటీలో ఈ–4 చదువుతున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు తమ ఆలోచనను ప్రొఫెసర్ కె. మహేశ్, సీనియర్లు ఎం. సంపత్కుమార్, డి. వినోద్, కె.సాయిదీప్, జి.ప్రశాంత్, జి. వేణుగోపాల్రావు, ఎం.రాకేశ్ల సలహాలతో రూ. 40వేలు ఖర్చుచేసి పాతబైక్, ఇతర ఎలక్ట్రిక్ సామాగ్రితో కొత్త బైక్ తయారు చేశారు, సొంత ఆలోచనలకు కళాశాల ప్రొఫెసర్, సీనియర్ విద్యార్థుల సలహాలు తోడుకావడంతో కాలుష్యాన్ని నివారించేలా ట్రిపుల్ఐటీలోనే ఎలక్ట్రికల్ బైక్ తయారైం ది. ఈ బైక్లో ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ మా ర్పించాల్సిన అవసరం రాదని, కేవలం బ్యా టరీలు అందులో ఉండే యాసిడ్ వాటర్ సరిచేసుకుంటేసరిపోతుందని విద్యార్థులు తెలిపారు. కంపెనీ తోడైతే... విద్యార్థుల ఆలోచనకు ఏదైన కంపెనీ తోడైతే ఇక్కడే ఎలక్ట్రిక్ బైక్లను తయారు చేయవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో రూ. 10 వేలు ఖర్చుచేస్తే ఈ బైక్ కొత్తలుక్లో కనిపిస్తుంది. రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ బైక్ రూపొందుంతుందని అంటున్నారు. ప్రకృతికి ఎంతో మేలు ఎలక్ట్రిక్ బైక్తో ప్రకృతికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ వాహనం నుంచి విషవాయువులు ఉత్పత్తికావు. శబ్దం కూడా వెలువడదు. దీంతో ధ్వని కాలుష్యం కూడా ఉండదు. –జి. విశాల్, విద్యార్థి డబ్బు ఆదా అవుతుంది సీనియర్ల సలహాలతో రూ. 40వేలు వెచ్చించి ఎలక్ట్రిక్బైక్ను తయారుచేశాం. ఈ చార్జింగ్ బైక్తో వాహనదారులకు డబ్బులు ఆదా అవుతాయి. ఒక గంట చార్జింగ్తో 30 కిలోమీటర్లు తిరగవచ్చు. –జె. మహేశ్, విద్యార్థి -
ట్రిబుల్..ట్రబుల్
ఉన్నత చదువులు చదివినా.. ఉత్తమ స్థానంలో ఉన్నా.. నిండా స్వార్థం పెంచుకున్నారు. పక్కవాడికంటే ఎక్కువ సంపాదించాలన్న కక్కుర్తితో వక్రమార్గం పట్టారు. ఈ క్రమంలో తమ పిల్లల్లా చూసుకోవాల్సిన అమాయక విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని బెదిరింపులకూ పాల్పడ్డారు. వారి జీవితాలతోనూ ఆడుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు వారి బండారం బట్టబయలైంది. ‘సార్..’ అని గౌరవంగా పిలిపించుకోవాల్సిన వాళ్లు.. సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు. ఇదంతా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ(ఆర్జీయూకేటీ)లో ఇటీవల పట్టుబడ్డ అధ్యాపకులు, ఉద్యోగులకు సంబంధించిన తతంగం. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చదువులక్షేత్రానికి దశదిశ చూపాల్సిన సర్కారు పట్టింపులేనితనం.. ఉన్నాలేనట్లు సాగే ఇన్చార్జి వైస్ చాన్స్లర్ పాలనతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిసారి ట్రబుల్ఐటీగా మారుతూనే ఉంది. – నిర్మల్ సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ప్రారంభమైంది. పేదింటి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతోముందుచూపుతో వైఎస్సార్ ప్రారంభించిన ఓ ప్రత్యేక విద్యాక్షేత్రమిది. చదువులమ్మ కొలువైన బాసరలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీ ఉత్తర తెలంగాణ విద్యార్థుల కలల చదువు.. కల్పతరువుగా విరాజిల్లుతోంది. మొత్తం 272 ఎకరాల విశాల వాతావరణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఇక్కడ ఏడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు వందల్లో విద్యార్థులను వారి ఆశలు, ఆశయాలకు తగినట్లు ఉన్నత స్థానాలకు చేర్చింది. ఇలాంటి రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇప్పటికీ ఇన్చార్జి పాలనలోనే.. సర్కారు బడుల నుంచి, పేద కుటుంబాల్లో నుంచి వచ్చే ఆణిముత్యాలకు ట్రిపుల్ఐటీ ఉత్తమ విద్యనందించి, ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో మిగిలిన ఏకైక ట్రిపుల్ఐటీ బాసర ఆర్జీయూకేటీ. రాష్ట్రంలో ఉన్న ఈ ఒక్క చదువుల క్షేత్రంపైనా ఏళ్లుగా వివక్ష కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదున్నరేళ్లుగా ఇన్చార్జి వీసీలతోనే ఇంతటి విద్యాక్షేత్రాన్ని నెట్టుకొస్తుండటమే సర్కారు తీరుకు అద్దం పడుతోంది. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన చట్టాలు, నిబంధనల్లో లోపాలు ఉంటే పరిష్కరించాలని, చాన్స్లర్తో పాటు శాశ్వత వీసీని నియమించాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తూనే ఉంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వీసీ.. అది కూడా స్థానికంగా ఉండాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నా కనీసం పట్టింపు లేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను మూడేళ్లపాటు ఇన్చార్జీగా నియమించారు. రెండున్నరేళ్ల కిందట ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్కు ఇన్చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కనీస భయం లేకుండా.. ఉన్నత ఆశయాలతో క్యాంపస్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే స్థాయికి ఉన్నత చదువులు చదివిన అధ్యాపకులు దిగజారుతున్నారంటే వారిలో కనీసం భయం లేదన్న విషయం వెల్లడవుతోంది. ఇటీవల బయటపడిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. మొన్నటివరకు కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల తోటి అధ్యాపకుల కంటే ఎక్కువ సంపాదించాలన్న దుర్బుద్ధి, తనలోని పశుత్వాన్ని ప్రవర్తించిన తీరు గురువులను తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థినుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. తాను అడిగినంత డబ్బు ఇస్తే.. చెప్పినట్లు చేస్తే పాస్ చేయిస్తానని చెబుతూ వారిని బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బులకు ఆశపడి క్యాంపస్ పరీక్ష కేంద్రం ఇన్చార్జి విశ్వనాథ్, ఐటీ అధ్యాపకుడు సుధాకర్, రవి వరాలతో జత కలిశారు. ముగ్గురూ కలిసి నాలుగో వ్యక్తికి తెలియకుండా ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయించే పని మొదలుపెట్టారు. దీనికి తోడు రవి వరాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం.. వారి బలహీనతలతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఇదేక్రమంలో ఇటీవల ఓ విద్యార్థినితో తన ఇంట్లో పరీక్ష రాయించేందుకు సిద్ధమయ్యాడు. తన సెల్ఫోన్కు అసభ్యంగా మెసెజ్లను పంపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. రవి వరాల నిర్వాకం కేవలం అసభ్య ప్రవర్తనకే పరిమితమని మొదట అందరూ భావించారు. కానీ రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్రెడ్డి క్యాంపస్కు వచ్చి పరిశీలించి, ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని చెప్పడంతో నిర్మల్ ఎస్పీ శశిధర్రాజు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రవి వరాల వ్యవహారంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఫెయిలైన విద్యార్థులతో మళ్లీ పరీక్ష రాయిస్తామంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్న ముగ్గురి తతంగమంతా బయటపడింది. దృష్టి పెట్టాల్సిన అవసరం.. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నారు. పదో తరగతిలో జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్లో హా జరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల స మీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పే దింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇకముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దృష్టి పెట్టాల్సిన అవసరం.. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నారు. పదో తరగతిలో జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్లో హా జరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల స మీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పే దింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇకముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్యవేక్షణ కొరవడటంతో.. ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా రెగ్యులర్ వీసీని నియమించకపోవడంతో ఆ ప్రభావం తరచూ కనిపిస్తోంది. ఏళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థలన్నీ ఇష్టారాజ్యంగా మారిపోతున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీంతో బాసర క్యాంపస్పై పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్ప ఇన్చార్జి వీసీ క్యాంపస్కు రావడం లేదు. ఏఓ, రిజిస్ట్రార్ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. -
ట్రిపుల్ ఐటీ పై పట్టింపేది?
సాక్షి, నిర్మల్: ఉత్తర తెలంగాణ పేదింటి విద్యార్థుల కలల చదువు.. కల్పతరువు.. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ. చదువులమ్మ కొలువుదీరిన చోట 272ఎకరాల విశాల ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాక్షేత్రం కొలువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో ప్రారంభమైంది. మొత్తం ఏడువేల మంది విద్యార్థుల కలల ప్రపంచమిది. ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన పేదింటి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. అలాంటి రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నవారూ అరకొర పర్యవేక్షణే చేపడుతుండటంతో ఇక్కడి క్యాంపస్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రిపుల్ఐటీలో తాజాగా కీచక చేష్టలూ వెలుగులోకి రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఏళ్లుగా ఇన్చార్జి పాలన.. పేద పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చాలన్న వైఎస్ఆర్ ఆశయంతో ఏర్పడిందే ట్రిపుల్ఐటీ. తెలంగాణలో ఏకైక ట్రిపుల్ఐటీ బాసర ఆర్జీయూకేటీ. ఉన్న ఒక్క చదువుల క్షేత్రంపై ఏళ్లుగా వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదున్నరేళ్లుగా ట్రిపుల్ఐటీని ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. శాశ్వత వీసీని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీకి రెగ్యులర్ వీసీ ఉండాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తున్నా..కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడి క్యాంపస్పై శీతకన్ను కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియామకంపై చర్చించకపోవడం గమనార్హం. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేశారు. అనంతరం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసి, ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్కు ఇన్చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. పర్యవేక్షణ కరువై.. ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీని నియమించడం లేదు. ఏళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఇన్చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే పూర్తి దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఆయన ఇన్చార్జిగా ఉన్న బాసర క్యాంపస్పై పడుతోంది. ఎప్పుడన్నా.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా ఇన్చార్జి వీసీ క్యాంపస్కు రావడం లేదు. ఇక్కడి ఏఓ, రిజిస్ట్రార్ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. వైస్ చాన్స్లర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు, అధ్యాపకుల్లో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కీచక చేష్టలు.. ఉన్నత ఆశయాలతో క్యాంపస్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లాంటి అధ్యాపకులూ ఇక్కడ ఉన్నారు. పదోతరగతి వరకు బాగా చదువుకుని, ట్రిపుల్ఐటీలో ప్రవేశమే లక్ష్యంగా అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునేవారు దాపురించారు. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన క్యాంపస్లో కొంతమంది అధ్యాపకుల వికృత చేష్టలకు అద్దం పట్టింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్నతస్థానంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల చేసిన పని అధ్యాపకవృత్తినే తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెల్ఫోన్లో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించడంతో పాటు కేసులనూ నమోదు చేశారు. ఇక ఇలాంటి కీచక చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్న వారు మరికొందరు ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దొరికితేనే దొంగ.. అన్న రీతిలో వీరు చేస్తున్న కథలు బయటపడక పోవడంతో గుట్టుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి, అక్రమాలకూ ఆస్కారం.. ట్రిపుల్ఐటీకి వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వచ్చే ఉత్తమ పురస్కారాలను అందుకుంటున్న ఇన్చార్జి వీసీ ఇక్కడి అక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల కోసం వచ్చే లాప్టాప్లు, యూనిఫాంలలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ మెస్లలో లోపాలపైనా విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని, అన్ని విభాగాలనూ వారికే దక్కేలా చూస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అకాడమిక్ పరంగా కూడా ఇన్చార్జి వీసీ ఉండటంతో విభాగాధిపతులపై పర్యవేక్షణ కరువైంది. ఈక్రమంలో రవి వరాల వంటి వారు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్లో భద్రతపైనా భరోసా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేవిషయంపై సోమవారం క్యాంపస్ను తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా.. 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్ఐటీ లో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువు లు సాధించారు. గ్రామీణ విద్యార్థులకు అ త్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పేదింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ఐటీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇక ముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇందు కోసం అత్యుత్తమ రెగ్యులర్ వైస్చాన్స్లర్ను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో శనివారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ భవనంపై నుంచి దూకిన ఆమె తీవ్రంగా గాయపడగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లికి చెందిన కొమురయ్య, పోసాని దంపతుల కూతురు అనూష(17) పీయూసీ రెండో ఏడాది చదువుతోంది. కళాశాలలోని వసతి భవనంలో మధ్యాహ్నం 12 ప్రాంతంలో హాస్టల్ భవనంపైకి ఎక్కి మూడో అంతస్తు పైనుంచి దూకింది. ఆమెను నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు అనూష రాసిన సూసైట్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంధువుల అబ్బాయితో ప్రేమ వ్యవహారం దెబ్బతిన్నట్లు, మనస్పర్ధల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. చదువుల్లో ముందంజలో ఉండే అనూష ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కాగా, భైంసా డీఎస్పీ రాజేశ్ భల్లా ట్రిపుల్ ఐటీని సందర్శించి.. ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం బాసర ఆర్జీయూకేటీలో వారం క్రితం ఓ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయం మీడియాకు తెలియకుండా కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా వాటిని నివారించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. -
పేద విద్యార్థులపై ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థులకు ఫీజుల కష్టం వచ్చిపడింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఒక్కసారిగా ఫీజులు పెంచటం వారికి శాపంగా మారింది. గతేడాదితో పోలిస్తే రూ.5 వేల ఫీజు పెంచుతూ రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫీజులు చెల్లించలేక అడ్మిషన్ కౌన్సెలింగ్కు సైతం హాజరుకాలేని దీన స్థితిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కోర్సుకు ఆర్జీయూకేటీ ఎంపిక చేసింది. సెలెక్టయిన విద్యార్థులకు కాల్ లెటర్లు పంపింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే రూ.5,000 ఫీజును అదనంగా వడ్డిస్తున్నట్లు ఫీజుల వివరాలను అందులో పొందుపరిచింది. యూనివర్సిటీ నిర్వాకాన్ని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజులను తగ్గించకుండా, పెంచిన తీరు విమర్శల పాలవుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్లోనూ కోత ఫీజు పెంపు కారణాన్ని యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది. కోర్సుకు నిర్దేశించిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయడం లేదని, అందులో కోత పెడుతోందని పేర్కొంది. దీంతో అంత మేరకు విద్యార్థులే భరించాలంటూ షరతు విధించింది. ట్రిపుల్ఐటీలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం రూ.40,700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.40,200 చెల్లించాలి. ఇందులో రూ.36 వేలు ట్యూషన్ ఫీజు కాగా, మిగతావి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, కాషన్ డిపాజిట్. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అర్హులైన వారందరికీ రూ.36 వేల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా యూనివర్సిటీకి చెల్లించాలి. కానీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆ ఫీజును తమకు చెల్లించటం లేదని, సగటున అర్హులైన ఒక్కొక్కరికి రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని కాల్ లెటర్లో ప్రస్తావించింది. అందుకే మిగిలిన వ్యత్యాసంలో రూ.5 వేలు విద్యార్థులే భరించాలనే నిబంధనను విధించింది. అడ్మిషన్ పొందేటప్పుడే ఈ ఫీజును చెల్లించాలని స్పష్టం చేసింది. చిల్లిగవ్వ లేదు: ట్రిపుల్ఐటీకి ఎంపికైన ధరణి రాయికల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని ధరణి ట్రిపుల్ఐటీకి ఎంపికైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ధరణి.. 10 జీపీఏ సాధించి టాపర్గా నిలిచింది. ధరణి తండ్రి రామగిరి నరేశ్ దర్జీ పని చేస్తుండగా.. తల్లి పద్మ బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలంగా బీడీల కంపెనీ తరచూ బంద్ ఉంటుండంతో తల్లి ఉపాధి కోల్పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. ‘ఈనెల 21న అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంది. రూ.9,700 చెల్లించాలట. నిరుడు రూ.4,700 ఫీజు కడితే చేర్చుకున్నారు. అదనంగా రూ.5 వేలు ఫీజు పెంచారు. ఇప్పుడు ఫీజు కట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ ధరణి కన్నీటి పర్యంతమైంది. రాష్ట్రం నుంచి 1,200 మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. వీరిలో 90 శాతం మంది నిరుపేదలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అదనంగా విధించిన ఫీజును భరించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. -
ఏపీ, తెలంగాణల్లో బాసర ట్రిపుల్ ఐటీ ప్రథమం
- నోటిఫికేషన్ విడుదల సందర్భంగా వీసీ సత్యనారాయణ బాసర: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీనే ప్రథమ స్థానంలో ఉందని ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో 2016-17 సంవత్సరానికిగాను పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 3 ట్రిపుల్ ఐటీలు ఉండగా.. బాసరనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి మంది విద్యార్థులకు సరిపోయే అడ్మిషన్లు ఉన్నాయన్నారు. వీటిలో 80 శాతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం ఉంటుందని, మరో 15 శాతం తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి వారికి, 5 శాతం మహారాష్ట్ర, ఎన్ఆర్ఐ, తదితర రాష్ట్రాల వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మరో 500 సీట్లు పెంచితే వారికి కూడా సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీట్లు పెంచడంతో పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 2009-10 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో చదివిన 2000 మంది విద్యార్థుల్లో 845 మంది ఉద్యోగాలు సాధించారని, 2010-11లో 315 మందికి ఉద్యోగాలు వచ్చాయని, వచ్చే ఆగస్టు నాటికి మరో 500మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు. అలాగే లెక్చరర్ల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి 12 బీ (యూజీసీ) హోదా వస్తే ప్రభుత్వం నుంచి రూ.12 కోట్లు వస్తాయని, దీంతో కళాశాల రూపురేఖలు పూర్తిగా మార ్చవచ్చని వివరించారు. విద్యార్థుల రాణింపు పట్ల ట్రిపుల్ ఐటీని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభినందించారని వెల్లడించారు. సమావేశంలో ఏవో రాజేశ్వర్, ఎస్డబ్ల్యూవో ఎం.సుధాకర్, పీఆర్వో గోపాలకష్ణ, మధుసూదన్గౌడ్, విజయ్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ విడుదల.. - తెలంగాణ లోని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. - ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు పొందాల్సి ఉంటుంది. - 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. - డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీబాసర.కంలో దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తులు సక్రమంగా పూర్తిచేసిన వారికి జూన్ 11న కౌన్సెలింగ్ ఉంటుంది. - జూన్ 23న వికలాంగులు, ఎన్సీసీ, స్పో ర్ట్స్ విద్యార్థులకు కౌన్సెలింగ్కు అవకాశం. - జూలై 1న మొదటి విడత, 7న రెండో విడత జాబితాల వెల్లడి. - జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం.