Brahmotsavams
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
తుదిదశకు స్వర్ణ తాపడం పనులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానగోపురానికి చేపట్టిన స్వర్ణతాపడం పనులు పూర్తికావొచ్చాయి. ఈ నెల 23న కుంభాభిషేకం కార్యక్రమానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దాతలు ఇచ్చిన సొమ్ముతోపాటు దేవస్థానం నిధులు రూ.21 కోట్లతో సుమారు 60 కిలోలకు పైగా బంగారంతో స్వర్ణతాపడం పనులు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాలో పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. అయితే, భక్తుల మనోభావాలకు అనుగుణంగా క్షేత్ర ప్రాశస్థ్యం పెంచే చర్యలు తీసుకోవడంతోపాటు భక్తులకు మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఆలయ ఉద్ఘాటన జరిగిన రెండు సంవత్సరాలు కావొస్తున్నా నిధుల లేమితో వసతుల పనులు ఇంకా పూర్తికాలేదు. మార్చిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. – సాక్షి, యాదాద్రిసీఎం సమీక్షించినాయాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి.. దేవస్థానంలో పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు జరిగిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.70 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కొండ ప్రాశస్త్యం, భక్తుల వసతులకు పనుల ప్రతిపాదనలు పంపించారు. ప్రధానంగా కొండపైన రాత్రి నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, కల్యాణకట్ట, క్యూలైన్లలో మరిన్ని వసతుల కోసం పంపిన ప్రతిపాదనలకు సంబందించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఇవీ చేపట్టిన పనులుగత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ప్రధానమైనవి కొండపైన కృష్ణ శిలలతో ఆలయ గోపురాలు, మాడవీధులు, చుట్టూ ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదాల వంటశాల, కొండపైన విష్ణుపుష్కరిణి, కొండకింద లక్ష్మి పుష్కరిణి, స్వామి తెప్పోత్సవం కోసం గండి చెరువు, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కొండపైన బస్బే, దీక్షాపరుల మండపం, గిరిప్రదర్శన రింగ్రోడ్డు, పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ, గుట్ట చుట్టూ రింగ్రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, దేవస్థానం బస్టాండ్, ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు.ఈ పనులు పూర్తికాలేదు » బాలాలయం స్థానంలో రంగ మండపం (కళాభవన్) నిర్మించాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాలు, భక్తుల రాత్రి నిద్ర చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించొచ్చని భావించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. » స్వచ్చంద సంస్థ వెగ్నేష్ రూ.11 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రం ఇంకా భక్తులకు అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వస్తే రోజు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించొచ్చు. ప్రస్తుతం దీక్షాపరుల మండపంలో భక్తులకు రోజు అన్నప్రసాదం అందిస్తున్నారు. » దేవస్థానం బస్టాండ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. » కొండ పైన దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు కొండ కింద 122 దుకాణాల కోసం మడిగెలు నిర్మిస్తున్నారు. ఇందులో పుష్కరిణి వద్ద కొందరికి దుకాణాలు కేటాయించారు. మిగతావి ఇంకా పూర్తి కాలేదు. » గోదావరి జలాలతో నింపిన గండి చెరువులో తెప్పోత్సవం పనులు పూర్తి కాలేదు. గ్రీనరీ, బెంచీలు ఏర్పాటు వరకే నిలిచిపోయాయి. » కొండపైకి చేపట్టిన ఘాట్రోడ్డు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాలకు ఇబ్బందిగా మారింది. » పెద్దగుట్టపైన వైటీడీఏ అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో దాతల సాయంతో నిర్మించతలపెట్టిన వసతిగదుల నిర్మాణం ప్రారంభం కాలేదు. -
TTD: అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.ఈ సమావేశంలో ఎస్విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
11నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ♦ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ ♦ 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం ♦ 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, వేద పారాయణం, సాయంత్రం శేష వాహనం సేవ ♦ 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ ♦ 15న ఉదయం శ్రీకృష్ణ (మురళీ కృష్ణుడు) అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ ♦ 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ♦ 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ♦ 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు. ♦ 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవలో శ్రీస్వామి వారి ఊరేగింపు, రాత్రి దివ్య విమాన రథోత్సవం. ♦ 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, రాత్రి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు ♦ 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11నుంచి 21వ తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను రద్దు చేయనున్నారు. 17, 18, 19 తేదీల్లో అర్చనలు, భోగములు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నారు. 18వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ.. తిరుమలలో విద్యుత్ కాంతులు (ఫొటోలు)
-
నేడు తిరుమలలో గరుడ వాహన సేవ
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశిష్టౖమైన గరుడ వాహన సేవ శుక్రవారం రాత్రి 7 గంటలకే ఆరంభమవనుంది. ఈ సేవకు 2.5 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయి. గరుడ సేవను అర్థరాత్రి తర్వాత 3 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడ సేవ కారణంగా శుక్రవారం నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని టీటీడీ తెలిపింది. కాగా, స్వామి ఊరేగే వాహనాలపై నాణేలు విసరవద్దని భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. భక్తులు విసిరే నాణేలు, మిరియాలు, ఉప్పు వంటి పదార్థాల వల్ల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం నాడు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలసి మలయప్ప పురవీధుల్లో వైభవంగా ఊరేగారు. సాయం సంధ్యావేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకార సేవ కోసం కొలువు మంటపంలో వేంచేపు చేశారు. వేయి నేతి దీపాల వె లుగులో ఉత్సవమూర్తులు ఊయలపై ఊ గుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంత రం బంగారు, వజ్రవైఢూర్య ఆభరణాలతో ఉత్సవరులకు విశేష అలంకరణ చేశారు. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారు వి హరించారు. ఈ వాహన సేవలో రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు, చెన్నయ్ గొడుగులు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి ధరించిన మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం శ్రీవారి వా హన సేవల్లో అలంకరిస్తారు. ద్వాపర యు గంలో గోదాదేవికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం మేరకు శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో వెలసిన గోదాదేవి ధరించిన మాలలు శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. శ్రీవిల్లి పు త్తూరు నుంచి తిరుమలకు వచ్చిన మా లలు, చిలుకలను శ్రీవారి ఆలయానికి అందజేశా రు. హిందూ ధర్మార్థ ట్రస్ట్ సమితి(చెన్నై) నిర్వాహకులు ఆర్ఆర్ గోపాల్జీ.. తిరుమలేశునికి 9 కొత్త గొడుగులను సమర్పించారు. -
కెనడా,యూఎస్లో వైభవంగా జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవాలు: వివరాలివిగో!
కెనడా, అమెరికాలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈసందర్బంగా కెనడా, యూఎస్లో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తాడేపల్లి కార్యాలయంలో ఉదయం (11.05.2023) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు స్త్రీ, శిశు సంక్షేమఅభివృద్ధి, కాపు కార్పోరేషన్ అధ్యక్షులు అడపా శేషు, ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో USA, UK & Europe లలోని 20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన బహ్రెయిన్లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. కెనడా యూఎస్లలోని పలు తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం తితిదే శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయం చేస్తోందన్నారు. తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కెనడా, అమెరికాలో దేవదేవుని కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడి ఏర్పాట్లు, తదితర విషయాల్లో ఇటు తితిదే అర్చకులు, అటు వేద పండితులతో సమన్వయం చేస్తున్నామని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెల్లడించారు. కెనడా , యూఎస్లో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు Toronto, ON, Canada - 4th June, 2023 Montreal, Quebec, Canada – 10th June, 2023 Ottawa, ON, Canada – 11th June, 2023 Raleigh, NC, USA – 17th June, 2023 Jacksonville, FL, USA – 18th June. 2023 Detroit, MI, USA – 24th June, 2023 Chicago, IL, USA- 25th June, 2023 Atlanta, GA, USA – 1st July, 2023 Dallas, TX, USA – 2nd July, 2023 St. Louis, MO, USA – 6th July, 2023 Philadelphia, PA, USA – 9th July, 2023 Morganville, NJ, USA – 15th July, 2023 Houston, TX, USA – 16th July, 2023 Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams) అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో NRIలు పాల్గొని, ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
Yadagirigutta : వైభవంగా సాగుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
యాదాద్రిలో వైభవంగా శ్రీచక్ర తీర్థం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలను నిర్వహించిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించాక విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. -
నృసింహస్వామి పెండ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం ప్రధానాలయ మాఢ వీధుల్లో శ్రీస్వామివారు జగన్మోహిని అలంకార సేవలో..సాయంత్రం అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని ఆలయ మాఢవీధిలో ఊరేగించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి... శ్రీనృసింహస్వామికి లక్ష్మీదేవితో వివాహం చేసేందుకు మూహుర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి తుల లగ్నం ముహుర్తంలో 9.30గంటలకు బ్రహ్మోత్సవ మండపంలో శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు. -
కనులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ. రంజిత్రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకృష్ణుడి అలంకార సేవలో శ్రీలక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు. ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
యాదాద్రి : మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన నరసింహస్వామి (ఫొటోలు)
-
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
వైభవంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచారాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానాలయాన్ని పూల మాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బంగారు వర్ణంలో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది. 0గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన, ఉపాచారాల అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం నిర్వహించారు. విష్వక్సేనుడు సమస్త సేవా నాయకులకు అధిపతి. అంటే.. సర్వసైనాధ్యక్షుడు కావడంతో ఈయనను ఈ ఉత్సవాలకు ఉద్యుక్తున్ని చేయడమే ఈ పూజ ప్రత్యేకత. అలాగే ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి మంత్రోచ్ఛారణల మధ్య వాటికి ప్రత్యేక పూజలు చేశారు. రక్షాబంధనం ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. గర్భాలయంలో స్వామివారి వద్ద కంకణాలకు పూజ చేసి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు.. చైర్మన్ బి.నర్సింహమూర్తి, దేవస్థానం ఈఓ గీతారెడ్డిలకు రక్షాబంధనం చేశారు. అంకురార్పణ సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పట్టు ధోవతి, కండువా, చీర సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు అగ్ని పరీక్ష, ధ్వజారోహణం, రాత్రి 7.30 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనము జరుగుతాయి. -
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు ఆలయ ఆచార్యులతో అధికారులు సోమవారం పూజలు చేయించారు. బ్రహ్మోత్సవాలలో జరిగే పూజా కార్యక్రమాలు ఇవీ.. ►21వ తేదీ ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు. ►22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. ►24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ. ►25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ►26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ. ►27న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం. ►మార్చి 1వ తేదీన ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన. ►3వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. ఉత్తర మాడవీధిలో కల్యాణం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరుతున్నారు. కల్యాణానికి సీఎం వచ్చే అవకాశం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణ వేడుకకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు ఉదయం సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆలయ అధికారులు, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు. -
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : హంస వాహనంపై విహరించిన మలయప్ప స్వామి (ఫొటోలు)
-
తిరుమల: అలంకార ప్రియునికి ప్రకృతి సొబగులు
తిరుమల: ఇల వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్నా రు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన వాటితో పాటు దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి ఉత్సవాల్లో పూటకో అలంకరణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. చదవండి: రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సంప్రదాయం. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వేర్వేరుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. బహుసుందరం రంగనాయకుల మండపం శ్రీవారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. ఇందులో భాగంగా ఉద్యానవనశాఖ సిబ్బంది రంగనాయకుల మండపాన్ని విదేశీ ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని ఫలపుష్పాదులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనువిందు చేశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట: పద కవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఉదయం పల్లకీసేవ నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవస్వామి ఆలయంలో ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవితో కలిసి చెన్నకేశవస్వామి శేషవాహనంపై ఊరేగారు. టీటీడీ అర్చకస్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. టీటీడీ సూపరిండెంట్ పి.వెంకటశేషయ్య, ఇన్స్పెక్టర్ బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రారంభం కానున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 28న సీఎం రాక యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం కలిగించే ఉద్ఘాటన కార్యక్రమం నిమిత్తం ఈ నెల 28న సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్యర్వంలో ప్రధానాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, 28వ తేదీకి ముందు కూడా ఒకరోజు సీఎం యాదాద్రిని సందర్శించి పనులు పరిశీలిస్తారని తెలిసింది. ఆ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మరో యాగం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ అర్చకులతో అధికారులు చర్చిస్తున్నారు. ఉద్ఘాటన పనులపై సమీక్ష యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో సీఎంవో కార్యదర్శి భూపాల్రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షాసమావేశం జరిగింది. ప్రధానాలయం ప్రారంభించే తేదీ కంటే ముందుగానే కొండకింద ఆలయ నగరిలో చేపట్టిన పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. తుదిదశలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ప్రధానం గా యాగస్థలి కోసం ప్రతిపాదించిన స్థలాన్ని చదును చేయడం, అంతర్గత రోడ్లు, అన్నప్రసాద సత్రం, సత్యనారాయణవ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, గండిచెరువు, కొండపైకి నిర్మిస్తున్న రెండు ఫ్లైఓవర్లు, కొండపైన బస్బే, ప్రధాన ఆర్చీ పనులను వేగంగా పూర్తిచేయాలని, పార్కింగ్, సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పూర్తి అయిన పుష్కరిణి, దీక్షాపరుల మండపం తుదిమెరుగులు దిద్దాలని యోచిస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ను దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు సీఎం వైఎస్ జగన్కు.. వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. -
ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సంప్రదాయల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 23న తిరుమల శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 7గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తిరుమల చేరుకుంటారని, ఈనెల 24వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారి దర్శించుకుంటారని వెల్లడించారు. (బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట నాద నీరాజనంలో జరిగే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని తెలిపారు. తిరుమలలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే వసతి సముదాయాల శంకుస్థాపన కార్యక్రమములో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు.(బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు) -
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
మహా శివరాత్రి బ్రహ్మోత్సవం
-
కన్నుల పండువగా చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
-
యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
-
నేటి నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 18 వరకు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఆ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. సుమారు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేసి ఉంచారు. భక్తుల కోసం ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లువేశారు. స్వామివారి కల్యాణం జరిగే హైస్కూల్ మైదానాన్ని ఉన్నతాధికారులు సందర్శించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 8న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం చేస్తారు. 9వ తేదీ దేవతాహ్వానం పలుకుతారు. 10 నుంచి అలంకార సేవలు ప్రారంభం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 10 నుంచి 16 వరకు వారం రోజులపాటు అలంకార, వాహనసేవలు జరగనున్నాయి. 10వ తేదీ ఉదయం మత్య్సావతారం అలంకార సేవ, రాత్రి 9 గంటలకు శేష వాహనసేవ, 11న ఉదయం 11 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ, 12వ తేదీ ఉదయం 11 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 9 గంటలకు పోన్న వాహన సేవ ఉంటుంది. 13న ఉదయం 11 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 14న ఉదయం 11 గంటలకు జగన్మోహినీ అలంకారం సేవ, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, 15న ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, రాత్రి 9 గంటలకు స్వామివారి కల్యాణం, 16వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ మహావిష్ణు అలంకారం సేవ, రాత్రి స్వామివారి దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది. -
ఆది దంపతుల కల్యాణోత్సవం
ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రంగా... అష్టాదశ శక్తి పీఠంగా ప్రశస్తి పొందిన శ్రీశైలమహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానం అని, ముక్కోటి దేవతలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లింగోద్భవ కాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తిలకించి బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించడానికి శ్రీశైలానికి చేరుకుంటారని పురాణ వచనం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువునా వ్యాపించి ఉందని పురాణ వాఙ్మయం చెబుతోంది. యోగపరంగా అంతఃక్షేత్ర సమన్వయాన్ని చెప్పేటప్పుడు సహస్రార స్థానంగా శ్రీశైలాన్ని చెప్తారు. అంత గొప్పదైన శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణం చెబుతోంది. ఇలాంటి సిద్ధక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై, మార్చి 7 వరకు విశేషవాహన సేవలతో అశేషజనవాహిని మధ్య ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశులను చేయనుంది. శ్రీశైలమహాక్షేత్రానికి ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మాత్రమే జరుగుతాయి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటూ నిర్వహించడం సాంప్రదాయం. చండీశ్వరుని ఆ«ధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 1960లలో రోడ్డు రవాణా వ్యవస్థ లేనప్పుడు కాలినడకన భక్తులు వివిధమార్గాల ద్వారా శ్రీశైలం చేరుకుని మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేవారు అప్పట్లో పంచాహ్నిక దీక్ష అంటే 5 రోజుల పాటు జరిగేవి. 1990 వ దశకంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని నవాహ్నిక దీక్షతో(9రోజులు) 11 రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ముల్లోకాలు, సకల చరాచర జగత్తు మహాశివరాత్రి పర్వదినం నాడు జరిగే లింగోద్భవ కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అంటారు. మహాశివరాత్రి రోజు రాత్రి 10 గంటల తరువాత శ్రీమల్లికార్జునస్వామికి లింగోద్భావ మహారుద్రాభిషేకం జరుగుతుంది. 11 మంది నిష్ణాతులైన వేదపండితులు, అర్చకులు ఏకకాలంలో మహన్యాసపూర్వకంగా రుద్రమంత్రాలను పఠిస్తుండగా దాదాపు 5 గంటలకు పైగా స్వామివారికి పవిత్రజలాలు, పంచామృతాలు, ఫలోదకాలు, సుగంధద్రవ్యాలతో ఈ రుద్రాభిషేకం జరుగుతుంది పాగాలంకరణతో వరుడయ్యే... శ్రీశైలేశుడు వివాహాలలో పెళ్లికుమారునికి తలపాగా చుట్టడం ఒక సాంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైలాలయంలో పాగాలంకరణ పేరుతో మహాశివరాత్రిన వరుడయ్యే శ్రీ మల్లికార్జునస్వామికి పాగాలంకరణ ఉత్సవమైంది. స్వామివారికి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ్యమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ పాగాను అలంకరింప జేస్తారు. పాగాలను సమర్పించే భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో రోజుకొక్క మూర చొప్పున 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఆగమం ఆచారం ప్రకారం పాగాను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరింపజేస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మచీకట్లో పాగాను అలంకరించడం అత్యంత నేర్పుతో కూడుకున్న పని. బ్రహ్మోత్సవ కల్యాణం మహాశివరాత్రి నాడు పాగాలకరణ పూర్తి అయిన వెంటనే శ్రీస్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వేదమంత్రోచ్చరణ మధ్య, మంగళవాయిద్యాల నడుమ బాసిక ధారణ, మాంగళధారణ, తలంబ్రాలు, తదితర కార్యక్రమాలతో కల్యాణోత్సవం కమనీయంగా సాగుతుంది. మల్లన్న రథోత్సవ వేడుక మహాశివరాత్రి పర్వదినం నాడు వధూవరులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మరుసటి రోజు సాయంత్రం రథంపై అధిష్టింపజేసి ప్రధాన పురవీధిలో అశేష జనవాహిని మధ్య కనులపండువగా రథోత్సవ వేడుక జరుగుతుంది. దీనికి ముందురోజు ప్రభోత్సవం కూడా ఉంటుంది. ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడు ప్రభోత్సవంలో తిరిగి రథవీధిని పరిశీలించడానికే ప్రభోత్సవం జరుగుతుందని అంటారు. సదస్యం –నాగవల్లి బ్రహ్మోత్సవాలలో 9 వ రోజు సాయంత్రం సదస్యంలో నూతన వధూవరులైన భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను వేదమంత్రాలతో స్తుతిస్తారు. ఆ తరువాత జరిగే నాగవల్లిలో అమ్మవారికి మట్టెలు అలంకరిస్తారు. త్రిశూల స్నానం ఉత్సవం (ఉత్+సవం) అంటే గొప్పయజ్ఞం. యజ్ఞనిర్వహణ సందర్భంగా చివరగా యజ్ఞం పరిపూర్తి అయినందుకు సూచనగా యజమాని అవభృధ స్నానం చేసి, బ్రహ్మోత్సవాలకు 10వ రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తరువాత వసంతోత్సవం, కలశోద్వాసన చేసి, త్రిశూల స్నానం జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో త్రిశూలానికి, చండీశ్వరునికి మల్లికాగుండంలో స్నపనం (పుణ్యస్నానం) చేయిస్తారు. ధ్వజావరోహణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాల ఆరంభం రోజున ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన నంది పతాకాన్ని అవరోహణ చేస్తారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లు గుర్తు. సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సాయంత్రం జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణచేయడమే ధ్వజారోహణ. ఒక కొత్తవస్త్రం మీద శివుని వాహనం అయిన నందీశ్వరుని అష్టమంగళ చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దీన్నే నంది ధ్వజపటం అంటారు. చండీశ్వరుని సమక్షంలో భేరీ (డోలు వాయి«ధ్యం) çపూజ, నాదస్వరంపై ఆయా రాగాలాపనలతో సమస్త దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పై ఎగురవేస్తారు. ధ్వజస్థంపై ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలు, యక్ష, గంధర్వ గణాలకు, ముక్కోటి దేవతలకు ఆహ్వానసూచిక. బ్రహ్మోత్సవాలకు వచ్చే దేవతల కోసం ఆయా ప్రదేశాలలో బలిహరణ పేరుతో నివేదన సమర్పిస్తారు. వాహన దర్శన ఫలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులందరికి దర్శనం ఇవ్వడానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై గ్రామోత్సవంలో దర్శనం ఇస్తారు. ఆయా వాహనాలపై స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎన్నో విశేషఫలితాలు లభిస్తాయని ఆగమాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా: భృంగివాహనసేవ: చేసే పనులలో ఏకాగ్రత. పాప హరణం. హంసవాహనసేవ: మానసిక ప్రశాంతత. విద్యాప్రాప్తి. మయూరవాహన సేవ: శత్రుబాధలు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. రావణవాహనసేవ: భక్తిభావాలు పెంపొందుతాయి. శివకటాక్షం లభిస్తుంది. పుష్పపల్లకీసేవ: కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. గజ వాహనసేవ: కష్టాలు తీరిపోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది. నందివాహనసేవ: చేపట్టిన పనులలో విజయం. భోగభాగ్యాలు కలుగుతాయి. రథోత్సవం: అరిష్ట నివారణ, ఐశ్వర్య ప్రాప్తి. తెప్పోత్సవం: లోకక్షేమం, సకాలవర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. అశ్వవాహనసేవ: సమస్యలు తీరిపోతాయి, సంతానం కలుగుతుంది. పుష్పోత్సవం శయనోత్సవం బ్రహ్మోత్సవాలు ముగిశాక చివరి రోజు రాత్రి 11 వ రోజున శ్రీస్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. 18 రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చించి ఏకాంత సేవ జరిపిస్తారు. తరువాత స్వామి, అమ్మవార్లను శయనింపజేయడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. – నేలవల్లి నాగ మల్లేశ్వరరావు, సాక్షి, శ్రీశైలం -
మోపిదేవి సుబ్రహ్మోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మోపిదేవిలో ప్రసిద్ధపు ణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిఏటా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో 5రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మూడవరోజు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. కోరికలు తీర్చే కార్తికేయుడు స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోర్కెలు నెరవేరతాయని అచంచల విశ్వాసం. ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుతున్నవారు, రాహు, కేతు, కుజ, సర్పదోషాలున్నవారిని స్వామివారు కొంగు బంగారమై ఆదుకుంటారు. పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాశన, నామకరణం, అక్షరాభ్యాసం, రుద్రాభిషేకాలు, నిత్యకళ్యాణం చేయించుకుంటారు. ముడుపుల మల్లి ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి నాగమల్లి వృక్షం ఉంది. నాగమల్లి వృక్షం పువ్వు వేయిపడగలతో లోపల లింగాకారంతో ప్రకాశిస్తుంది. ఏడాదికి రెండుసార్లు మాత్రమే పువ్వులు విచ్చుకుంటాయి. భక్తులు తమ కోర్కెలు తీర్చాలని కోరుతూ వృక్షానికి ముడుపులు కడతారు. పిల్లల కోసం మహిళలు ఊయలు కట్టి ఊపుతూ బిడ్డలను ప్రసాదించాలని కోరుకుంటారు. పుట్టలో పాలు పోసిన తర్వాతనే... ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తొలుత పుట్టలో పాలుపోసిన తరువాతనే స్వామివారిని దర్శించుకోవడం విశేషం. పుట్ట కలుగు మోపిదేవి నుంచి దక్షిణకాశీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయం వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. బ్రహ్మోత్సవ విశేషాలు నేటి ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలతో పూజలు సాయంత్రం 3.30 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన ‘శేష వాహనం’పై రావివారిపాలెం వరకు గ్రామోత్సవం 6.30 గంటలకు ఉత్సాహంగా ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 8గంటలకు స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహిస్తారు. ఇచ్చట ముత్యాల తలంబ్రాలు వినియోగిస్తారు. అనంతరం ‘నందివాహనం’పై ఊరేగిస్తారు. 11వ తేదీ సోమవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, అనంతరం రాత్రి 8 గంటలకు మిరుమిట్లు గొలిపే విద్యుత్కాంతుల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆసీనులైన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజనమంత్రపుష్పాలతో పూజలు, 9 గంటలకు వసంతోత్సవం, అవభృధస్నానోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యమాల దీక్షావిరమణ కార్యక్రమం, పూర్ణాహుతులు, అనంతరం స్వామివారి ప్రత్యేక వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. మద్యాహ్నం 3 గంటలకు వేద విద్వత్సభ–పండిత సభ నిర్వహించి పండితులను దేవస్థానం తరపున ఘనంగా సత్కరిస్తారు. రాత్రి 7 గంటలకు శమీవృక్షపూజ, రాత్రి 8 గంటలకు ‘మయూర వాహనం’పై స్వామివారిని రావివారిపాలెం వరకు గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, 10 గంటలకు సుబ్రహ్మణ్య హవనం అనంతరం తీర్థప్రసాదాలు అందిస్తారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షణలు, 8గంటలకు శ్రీస్వామివారి పుష్పశయ్యాలంకృత పర్యంక సేవతో కార్యక్రమాలు ముగిస్తారు. – ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి మాఘంలో ఎందుకంటే..? సుమారు 100 సంవత్సరాల క్రితం మార్గశిర మాసంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో కురుస్తున్న భారీవర్షాలకు రథోత్సవానికి, స్వామివార్ల ఊరేగింపునకు అంతరాయం ఏర్పడటంతో నాటి జమిందారు ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధానార్చకులు బుద్దు రామమ్మూర్తి సంయుక్త నిర్ణయంతో మాఘ మాసానికి మార్పుచేశారు. మార్గశిర మాసంలో నిర్వహించే ఉత్సవాలను చిన్న పవిత్రోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. నాటి నుంచి శాస్త్రోక్తంగా మాఘమాసం శుక్లపక్షం చవితితో ప్రారంభించి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ఐదు రోజులపాటు నిర్వహించడం పరిపాటిగా మారింది. – బుద్దు పవన్కుమార్ శర్మ ఆలయ ప్రధానార్చకులు -
గజవాహనంపై శ్రీనివాసుడు
-
మత్స్యావతారం.. శేష సేవ..
-
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
నార్కట్పల్లి(నకిరేకల్): బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరల్ ఉప్పల్ ఆదేశించారు. గట్టుపైన, కింద ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ అసంపూర్తి పనులను త్వరలో పూర్తిచేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టుపైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పా టు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 58 సీసీ కెమెరాలు, 3 కంట్రోల్ రూంలు, షీటీమ్, అగ్నిమాపక కేంద్రం, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిం చాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి ప్రభాకర్రావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలును వివరించాలని అధికారులకు సూచించారు. ప్రొజెక్టర్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖీమ్యానాయక్, జెడ్పీసీఈఓ హనుమానాయక్, పీడీ రాజ్కుమార్, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చైర్మన్ నల్ల వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎంపీడీఓ గుర్రం సురేశ్, ఈఓ అంజనారెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ మల్గ రమణాబాలకృష్ణ, ఎంపీటీసీ అనితవెంకన్న, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి ఉన్నారు. జాన్పహాడ్ ఉర్సు ఏర్పాట్ల పరిశీలన నేరేడుచర్ల(హుజూర్నగర్): ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహించనున్న జాన్పహాడ్ ఉర్సు ఏర్పాట్లను శుక్రవారం హుజుర్నగర్ సీఐ నర్సింహారెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ సుధాకర్రావు దర్గా పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. వారి వెంట దర్గా కాంట్రాక్టర్ సుబ్బారావు, వర్క్ ఇన్స్పెక్టర్ ఫయాజ్, నాయకులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఖాద్రీ లక్ష్మి నరసింహస్వామి అలుకోత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధాన మైనది అశ్వ బలం. కలియుగాంతంలో నారసింహుడు అశ్వ వాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారు. యాగశాలలో నిత్యహోమం గావించి శ్రీవారిని విశేషంగా అలంకరించి నృసింహాలయానికి సమీపంలోని రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద అలుకోత్సవం మంటపం వద్దకు తీసుకొచ్చారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అయిన పట్టెం గురుప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీవారికి సాంప్రదాయ బద్దంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అలుకోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి మాత్రం ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అలుకోత్సవంలో బీజేపీకి చెందిన మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అద్యక్షులు విష్ణువర్దన్రెడ్డి, ఆంద్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రతాప్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త చెన్నరాయశెట్టి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో టీటీడీ నిమగ్నం
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి పెట్టారు. వాహన సేవల్లో అన్నిటికంటే ఎక్కువగా రెండు టన్నుల బరువుండే సూర్యప్రభ వాహనాన్ని తిరుమలలో గురువారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనిపై ఉత్సవమూర్తులు, నలుగురు అర్చకులు, అలంకరణలతో కలిపి మొత్తం 3 టన్నుల వరకు బరువుంటుంది. ఆ వాహనాన్ని మావటులు రెండు గంటల పాటు ఆలయ వీధుల్లో తమ భుజాలపై మోయాల్సి ఉంది. గురువారం ముందు జాగ్రత్తగా వాహన మండపం నుంచి సూర్య వాహనాన్ని మోసి పరిశీలించారు. ఇదిలా ఉండగా వా రం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. జలాశయాలతోపాటు తెలుగుగంగ, బోర్లతో వంద రోజులకు పైగా తిరుమలకు నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు నిర్ధారించారు. కాగా, తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొంత పెరిగింది. -
‘ప్రభల’పై పురుషోత్తముడు
ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభపై ఊరేగింపు వేయిదీపాల వెలుగులో ఊయల సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణకాంతులీనే భాస్కరుడ్ని సప్త అశ్వాల రథసారథిగా మలచుకుని శంఖు, చక్ర, విల్లు, కత్తి, గద వంటి పంచాయుధాలు ధరించిన మలయప్ప ఉదయం తిరుమాడ వీధుల్లో విహరించారు. చంద్రుడ్ని వాహనంగా మలచుకున్న శ్రీనివాసుడు రాత్రివేళలో మాడ వీధుల్లో విహరించారు. సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు కొలువు మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఊయల సేవ నిర్వహించారు. వేయి నేతి దీపాల వెలుగులో స్వామి దర్శనమిచ్చారు. - సాక్షి, తిరుమల గజ వాహనంపై గరళకంఠుడు శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబాదేవి శుక్రవారం కాళరాత్రిరూపంలో దర్శనమివ్వగా, శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి గజ వాహనంపై విశేష పూజలందుకున్నారు. భక్తులు కర్పూర నీరాజనాలను అర్పించుకున్నారు. - సాక్షి, శ్రీశైలం శ్రీమహాలక్ష్మిగా కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఏడోరోజు శుక్రవారం బెజవాడ ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చింది. ప్రసన్నవదనంతో వరదాభయ హస్తాలు, వివిధ రత్నాభరణాలతో ప్రకాశిస్తూ చేతిలో పద్మం ధరించిన మహాలక్ష్మిని భక్తులు దర్శించుకున్నారు. -సాక్షి, విజయవాడ -
స్వర్ణ రథంపై శ్రీవారు
రాత్రి గజ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు గురువారం సాయంత్రం స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలేశుడు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6.50 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణ మధ్య అత్యంత వైభవంగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి భక్తశిఖామణి హనుమంతునిని వాహనంగా మలచుకుని భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుపై రారాజు విహారం : రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు గజ వాహనంపై ఆశీనుడై భక్తులకు కనువిందు చేశారు. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తన శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, అధికారులు పాల్గొన్నారు. సరస్వతీదేవిగా దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో గురువారం మూల నక్షత్రం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శ్వేతవర్ణపు చీర ధరించి ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాలతో హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీదేవిని వర్షంలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పార్థసారథి సతీసమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి బాలరాజు, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. పూల పల్లకిలో మల్లన్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో కాత్యాయని రూపంలో శ్రీభ్రమరాంబాదేవి దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతూ వచ్చి పుష్పపల్లకిని అధిష్టించారు. రాత్రి 8 గంటలకు గంగాధర మండపం నుంచి ప్రారంభమైన పుష్ప పల్లకి ఊరేగింపు అంకాలమ్మగుడి, నందిమండపం మీదుగా రథశాలకు చేరుకుంది. అక్కడి నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయప్రాంగణం చేరుకున్నారు. -
కోరిన వరాలిచ్చే కొండలరాయుని ఉత్సవాలెన్నో...
దేవదేవుని ఆలయంలో ఏడాది పొడవునా సాగే ఉత్సవాల్లో అతిముఖ్యమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆస్థానం, వసంతోత్సవం, పరిణయోత్సవం, జ్యేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి సేవల్లో స్వామి వైభవం గురించి... గత బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచికలో తెలుసుకున్నాం. తాజాసంచికలో మరికొన్ని ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకుందాం! శ్రీవారి పారు‘వేట’ ఉత్సవం జగత్ప్రభువైన శ్రీనివాస చక్రవర్తి శంఖ, చక్ర, గదా, ధనుః, ఖడ్గమనే పంచాయుధాలు ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. మృగంలాగా స్థిరత్వంలేని భక్తుని మనస్సును పంచాయుధాలతో వేటాడి పట్టుకుని ఏకాగ్రతను ప్రసాదించటమే ఈ పారు ‘వేట’ ఉత్సవ నిర్వహణలోని అంతరార్థం. ప్రతి సంవత్సరం కనుమపండుగరోజు, అధికమాసంలో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవం తర్వాత శ్రీవారు పారువేటకు వెళతారు. ఆ రోజున స్వామి వేట దుస్తులు, శిరస్త్రాణం ధరిస్తారు. సుదర్శనచక్రం, పాంచజన్యశంఖం, నందక ఖడ్గం, కౌమోదకిగద, శార్ఙమనే విల్లు వంటి పంచాయుధాలతో వేటకు సన్నద్ధమవుతారు. వేటపరికరాలైన డాలు, కత్తి, బల్లెం (ఈటె) స్వీకరించి బంగారు పీఠంపై ఆలయం నుంచి బయలుదేరుతారు. మరో బంగారు పీఠంపై శ్రీకృష్ణస్వామి కూడా శ్రీనివాస ప్రభువును అనుసరిస్తూ బాజాభజంత్రీలు, పండితుల వేదఘోష నడుమ ఆలయానికి మూడు మైళ్ల దూరంలోని పారువేట మంటపానికి చేరుకుంటారు. ఇక్కడ రెండు గంటలపాటు వైదిక ఆచారాలు, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామివారు వేటకు సన్నద్ధమవుతారు. శ్రీ స్వామివారు పంచాయుధాలను ఎక్కుపెట్టి పరుగెడుతుండగా, అర్చక స్వామి బంగారు బల్లెం(ఈటె)తో శ్రీస్వామివారిని అనుసరిస్తూ జంతువులను వేటాడతారు. ఇలా మూడుసార్లు ఈటెను విసరటంతో జంతువులు పారిపోతాయి. చివరగా శ్రీనివాసుడు, శ్రీకృష్ణస్వామి ఇరువురూ భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ప్రణయ కలహోత్సవం తాయార్లు, మలయప్ప మధ్య వినోద భరితంగా సాగే ఉత్సవంగా ప్రణయ కలహోత్సవం ప్రసిద్ధి పొందింది. వేటకు వెళ్ళి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవార్లు కోపగించడం, శాంతించవలసిందిగా అమ్మవార్లను శ్రీస్వామివారు బతిమాలుకోవడం... అత్యంత భక్తిరస భరితంగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఆరవరోజున తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పౌరాణికుడు శ్రీస్వామి, దేవేరుల ప్రణయ కలహ పురాణ ఘట్టాన్ని ఆలపిస్తుండగా పరివట్టం (తలకు పట్టుగుడ్డ) ధరించిన జీయంగార్ అమ్మవార్ల తరపున నిలబడి రెండు పూలబంతులను స్వామివారిపై విసురుతారు. అమ్మవార్ల పూలబంతుల దెబ్బకు జడిసినట్టు స్వామివారు కొంచెం వెనక్కు కదులుతారు. తప్పు చేయలేదని అమ్మవార్లకు నచ్చజెబుతూ స్వామివారు ముందుకు వస్తారు. మళ్లీ జీయంగార్ అమ్మవారి తరపున పూలబంతులు వేయటం, స్వామివారు వెనక్కు పోవటం ... ఇలా మూడుసార్లు జరుగుతుంది. చివరికి అమ్మవార్లు శాంతించి స్వామివారి పక్కన నిలిచి మూడుమార్లు పుష్పమాలలు మార్చుకుంటారు. చివరగా జీయంగార్లు, పౌరాణికులకు శఠారీ, మర్యాదలు చేసి ఉత్సవాన్ని ముగిస్తారు. ఒకరోజు బ్రహ్మోత్సవం రథ సప్తమి వేడుక తిరుమలలో మాఘమాసం శుద్ధ సప్తమి పర్వదినాన ‘రథసప్తమి’ వేడుకలు నిర్వహిస్తారు. ఏడు వాహనాలపై ఊరేగుతూ శ్రీమన్నారాయణుడు తన దర్శన భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. ఒకేరోజు వరుసగా ఏడువాహనాల ఊరేగింపు నిర్వహించటం వల్ల ఇవి ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందాయి. క్రీ.శ.1564 నుంచి తిరుమల ఆలయంలో రథసప్తమి నిర్వహిస్తున్నట్టు శాసనాలు చెబుతున్నాయి. స్వర్ణకాంతులతో ధగధగ మెరిసే సప్తాశ్వ సూర్యప్రభ వాహనంపై వజ్రకవచాది సర్వాభరణాలు ధరించిన మలయప్ప భక్తులకు దర్శనమిస్తూ సూర్యోదయానికి ముందే ఊరేగింపుగా ఆలయ ఉత్తరమాడ వీధి ప్రారంభానికి చేరుకుంటారు. సూర్య భగవానుడి తొలికిరణాలు సూర్యవాహనంపై దర్శనమిస్తున్న తేజోమూర్తి వజ్ర కిరీటం, శంఖుచక్రాలు, వక్షఃస్థల లక్ష్మి.... చివరగా స్వామివారి పాదపద్మాలను స్పృశించటంతో అశేష భక్తజనం గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకుని తన్మయం పొందుతారు. తర్వాత వరుసగా ఉదయం చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం ఇలా వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా చక్రస్నానం చేస్తారు. సాధారణ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్ని దర్శించలేని భక్తులు రథసప్తమి వేడుకలో వచ్చి ఉత్సవమూర్తులను దర్శించుకుని ఆనంద పరవశులవుతుంటారు. తెప్పతిరునాళ్లలో స్వామి కోనేటి విహారం ఈ ఉత్సవాన్ని శ్రీవారికి కలహకేళిగా చెప్పొచ్చు. ఆలయానికి ఉత్తరదిశలోని పుష్కరిణి మధ్యలో క్రీ.శ.15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా ఈ తెప్పతిరునాళ్లను తన సంకీర్తనల్లో ఆవిష్కరించారు. తర్వాత ఆగిపోయిన ఈ తిరునాళ్లను 1921లో అప్పటి మహంతు ప్రయాగదాసు ఆరంభించారు. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఐదురోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. తొలిరోజు శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామ చంద్ర మూర్తి అవతారంలో శ్రీ స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రెండవ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత తాయార్లతో కలసి మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. కోలాహలంగా సాగే ఈ ఉత్సవంలో స్థానికులు, ఉద్యోగులు తెప్పపై శ్రీవారి వైభవాన్ని దర్శిస్తారు. కైశిక ద్వాదశి ఉత్సవం ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో శుక్లద్వాదశి రోజున ఆలయంలో కైశిక ద్వాదశి ఉత్సవం నిర్వహిస్తారు. సూర్యోదయానికి చాలా ముందుగానే శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్న ఉగ్రశ్రీనివాసమూర్తికి అభిషేకం, అర్చనలు పూర్తి చేసి, సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. సూర్యోదయానికి ముందే ఉత్సవవర్లను తిరువీధుల్లో అంగరంగవైభవంగా ఊరేగించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ ఉగ్రశ్రీనివాసమూర్తికి సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుందని నమ్మకం. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. ఆ రోజు మాత్రమే ఆ స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీబాగ్సవారిలో అప్రదక్షిణ బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటిరోజు మలయప్ప స్వామి ఆలయానికి, పుష్కరిణికీ అప్రదక్షిణగా ఊరేగుతారు. అనంతాళ్వారుల తోటకు వెళ్లి అక్కడ పూజానివేదనలు అందుకుంటారు. శ్రీస్వామి, అనంతాళ్వారుల మధ్య గల అనుబంధానికి నిదర్శనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికే శ్రీబాగ్ సవారి అని పేరు. -
బ్రహ్మోత్సవాలకు టోల్ఫ్రీ నెంబర్
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వైశిష్ట్యాన్ని తెలిపేందుకు టోల్ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో ముక్కామల గిరిధర గోపాల్ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా భక్తులు స్వామివారి వైభవాన్ని, బ్రహ్మోత్సవ విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. తిరుమలలో సెంట్రలైజేషన్ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీని కోరామని.. ఇందుకు సంస్థ యాజమాన్యం, యూనియన్ నాయకులు అంగీకరించారని తెలిపారు. లడ్డూ ప్రసాదాలు నాలుగైదు రోజులు నిల్వ ఉంచినా రుచిలో మార్పు లేకుండా ఉండే విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నైలో స్వామి ప్రసాదాన్ని పోలిన లడ్డూలను తయారుచేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. స్వామివారి బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంపై ఆర్బీఐ సూచనలు పాటిస్తామని, అదే సమయంలో ఎక్కువ వడ్డీ కోసం ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయబోమని ఈవో స్పష్టంచేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్వామివారి కైంకర్యాలకు, తిరుమల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. తిరుపతిలో ఉన్న గోసంరక్షణ శాలను పలమనేరుకు మారుస్తామని, అక్కడ 450 ఎకరాల స్థలాన్ని సేకరించామని వెల్లడించారు. మరోవైపు, బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో వైకుంఠ ద్వారంలో ఉన్న లేబొరేటరీలో శ్రీవారి ఆభరణాలకు మెరుగులుదిద్దే పనులు మొదలయ్యాయి.