Cyberabad traffic police
-
ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఔటర్, హైవేలపై జాగ్రత్త.. దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్ హెడ్లైట్లను వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి ► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. ► హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఉంచాలి. ► సెల్ఫోన్లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్ వినిపించదు. ► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. ► లేన్ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా వినిపిస్తుంది. ► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన) -
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్నగర్ మార్కెట్కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్నగర్ మార్కెట్కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్రోడ్డు మీదుగా భరత్నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ఇలానే ప్రమాదానికి గురవ్వాల్సిందే!
-
Cyberabad Traffic Police: మద్యం సేవించి వాహనం నడపకండి
-
Cyberabad Traffic Police: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
-
Rear Seat Belt: ‘కారు సీటు బెల్ట్’పై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: కారు ప్రయాణంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం వాహన చట్టం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులూ సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 194 బీ ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. 8 సీట్ల లో పు ఉన్న అన్ని ప్యాసింజర్ వాహనాలకు ఈ చ ట్టం వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా నిబంధనల అమలుపై అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. విజన్ ఉండదు.. బైక్ రైడర్కి హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్ రక్షణ కల్పిస్తుంది. కానీ, కారులో డ్రైవర్ మినహా ముందు, వెనక కూర్చున్న వారు సీటు బెల్ట్ను పెట్టుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు కూడా బెల్ట్ పెట్టుకోని డ్రైవర్ను మాత్రమే గుర్తించి జరిమానా విధించేవారు. కారు ప్రమాదంలో వెనకాల వ్యక్తులకూ ప్రాణ నష్టం వాటిల్లుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అ యితే ఈ నిబంధన అమలు సాంకేతికంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రోడ్డు మీద జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్కు వేగం కారణంగా వాహనాల లోపల వ్యక్తులు స్పష్టంగా కనిపించరు. నిరిష్టంగా వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే తప్ప వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో తెలియదు. పోనీ ప్రయాణంలో ఉన్న కారును రోడ్డు మీద ఆపి తనిఖీ చేస్తే ట్రాఫిక్ జాం అయ్యే ప్రమాదం ఉంది. ఇతర వాహనదారులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఇలా చేస్తే బెటర్.. దీంతో ఈ నిబంధనను అమలు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ సమయంలో కారును ఆపినప్పుడు వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదా గమనించి, ఒకవేళ పెట్టుకోకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికంటే ముందు సీటు బెల్ట్ ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన ఆల్బమ్ను రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికీ ప్రమాదాల గురించి వివరించనున్నారు. కరపత్రాలు, డిజిటల్ సూచికలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. -
Viral Video: రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పేరు తలుచుకుంటేనే గుర్తుకొచ్చేది ఒకటి బిర్యాని అయితే రెండు ట్రాఫిక్.. పని మీద బయటకొచ్చి రోడ్లపైకి వస్తే ఎన్ని గంటలకు గమ్య స్థానానికి చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఆఫీస్కు లేట్ అయితే బాస్ తిడతారనే భయంతో అతివేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే తొందరలో చాలా మంది తప్పని తెలిసినా రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది. చదవండి: రాజేంద్రనగర్లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి.. వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్పై రాంగ్ రూట్లో వస్తున్నాడు. హెల్మెట్ కూడా ధరించలేదు. అంతేగాక తప్పుడు మార్గంలో వస్తున్నాననే భయం లేకుండా బైక్ నడుపుతూ వాహనదారులకు ఎదురెళ్లాడు. ఇంతలో మలుపు నుంచి వస్తున్న కారు అతన్ని బలంగా డీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిట్టలాగ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది. సెంటిమీటర్ ప్రయాణం అయినా రాంగ్ రూట్లో నడపవద్దని పోలీసులు సూచించారు. సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022 -
రహదారి భద్రత పై అవగాహాన పాఠాలు...లక్షల్లో ఫాలోవర్స్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే అసలైన మందు. ఇందుకోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయుక్తకంగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలపై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలో పోస్ట్లు పెడుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. రహదారి భద్రతపై హిట్ సినిమాల్లోని పాత్రలతో పోస్ట్లు, షార్ట్ వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. లక్షల్లో ఫాలోవర్స్.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు సోషల్ మీడియాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. 1.2 లక్షలకు పైగా సబ్స్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్కు ఇటీవలే యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డ్ కూడా దక్కింది. రహదారి భద్రత, వాహనదారుల నిబంధనలపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అందించే సలహాలు, సూచనలతో కూడిన వీడియోలను యూట్యూబ్లో పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన రహదారి ప్రమాదాలను వీడియో ప్రదర్శిస్తూ.. అందుకు దారి తీసిన కారణాలు, వాహనదారుల తప్పిదాలను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారినపడి కోలుకున్న బాధితుల అనుభవాలు, గాయపడిన వ్యక్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులు పంచుకున్న అంశాలను యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్లకు చేరవేస్తున్నారు. 15 రోజులకొకసారి సమీక్ష.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సైబరాబాద్లో కొత్తగా నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లను ప్రజలు వినియోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కడ ఎంత ట్రాఫిక్ రద్దీ ఉందో ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్డేట్ చేస్తున్నారు. వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను, సృజనాత్మక చిత్రాలను రూపొందించి ప్రతి రోజు 4–5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అఖండ, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి కొత్త సినిమాలలోని డైలాగ్ను తీసుకొని వాటికి హెల్మెట్, డ్రంకన్ డ్రైవింగ్, అతివేగం, సీట్ బెల్ట్ ధరించడం తదితర అంశాలను సినిమా పాత్రల ద్వారా పోస్ట్లు రూపొందించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. అవగాహనతోనే ప్రమాదాల నివారణ రోడ్డు ప్రమాదాల నివారణకు అసలైన మందు అవగాహనే. ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది, నిబంధనల అమలుతో పాటు అవగాహన అత్యంత ముఖ్యం. ఇందుకోసం భౌతికంగా, ఆన్లైన్ వేదికగా కూడా సెషన్స్ నిర్వహిస్తున్నాం. మనసుకు హత్తుకునేలా, సులువుగా అర్థమయ్యేలా స్కిట్స్ రూపంలో రోడ్డు భద్రతా నిబంధనలను వివరిస్తున్నాం. – పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
‘పుష్ప’రాజ్ని అలా వాడేసిన పోలీసులు.. నెట్టింట ట్వీట్ వైరల్
సోషల్ మీడియాను వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసలు ఎప్పుడూ ముందుంటారు. ట్రెండింగ్లో ఉన్న అంశాలను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మంచి సందేశాలను అందిస్తుంటారు. మరీ ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు, డైలాగ్స్ని తమకు అనుగుణంగా మార్చుకొని ట్రాఫిక్ నియమాలపై జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమాను కూడా వాడేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్లో తెరకెక్కిన పుష్ప మూవీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: పుష్ప’మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని బన్నీ పోస్టర్తో సైబరాబాద్ పోలీసులు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. బుల్లెట్ బండిపై స్టైలిష్గా కూర్చున్న బన్నీ ఫోటోను సైబరాబాద్ పోలీసులు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను ఫిక్స్ చేయండి. సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. (చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ) గతంలో సింహా సినిమాలోని ఓ డైలాగ్ వాడుకుని.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదలైనపుడు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. హెల్మెట్స్ ఎక్కడా అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టులు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021 -
కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు!
మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మనలో ఎంత మందికి తెలుసు, మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ కంపెనీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న రెండు హెల్మెట్లను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్) కొత్త బైక్ ఎక్కడ కొంటున్నారో ఆ షోరూం వారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాలని అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు వినియోగదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది. CTP appeals citizens to rightfully claim two standard helmets along with any type of motor cycle they purchase as per the Rule 138(4)(f) of the Central Motor Vehicles Rules, 1989.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/EEbx5ud8kC — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
మీ వాహనంపై ట్రాఫిక్ చలానా ఉందా? అయితే, బండి సీజ్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలో ఉన్న వాహనాలపై ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్లో ఉన్నా.. వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా గతంలో మూడు చలానాలు పెండింగ్లో ఉంటే వాహనం సీజ్ చేసేవారు. అయితే గతేడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసిన పోలీసులు రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. కానీ ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చామంటే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ.. వాహనాలు నడపాలి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి.. మనమే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కేవలం ప్రాణం పోవడమే కాదు.. కొన్నేళ్ల పాటు మన కుటుంబం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అర సెకను అజాగ్రత్త.. ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తోందో చెప్పడానికి మాటలు చాలవు. ఇందుకు సంబంధించిన వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ ప్రమాద వివరాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోలోని ప్రమాదం బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్.. ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్ ఫాస్ట్గా వెళ్లడంతో బైక్ను ఢీ కొడతాడు. దాంతో ఆ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్టేక్ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్దే తప్పని విమర్శిస్తున్నారు. -
మాదాపూర్లో అర్ధరాత్రి మద్యం మత్తులో...
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. పరిసరాలను గమనించకుండా రోడ్డు మధ్యలోకి రావడంతో.. వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా బైక్ను ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. యాక్సిడెంట్కు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో
Drunk And Drive Funny Video: మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన తాగి నడిపే వారిలో మార్పు రావడం లేదు. అయితే తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాల గురించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై రోడ్డుమీదకొచ్చాడు ఓ ప్రబుద్ధుడు. మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఈ సంఘటన ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల నాలుగున చోటుచేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్లో షేర్ చేశారు. పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాడ్రౌండ్ మ్యూజిక్, ఎమోజీలను జోడించి ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. -
సర్రున దూసుకు వచ్చిన బండి.. గీత దాటారు.. దబిడి దిబిడే!
హైదరాబాద్: సాధారణంగా టోల్ గేట్ వస్తే ఏం చేస్తారు. ఓ కిలో మీటరు దూరం నుంచే బండిని నెమ్మదిగా నడుపుకుంటూ వస్తారు. కానీ తాజాగా ఓ టాటా ఏసీ డ్రైవర్ టోల్ గేట్ దగ్గరకి సర్రున దూసుకొచ్చాడు. పైగా దాని టాప్పైన ప్యాసింజర్లను ఎక్కించుకున్నాడు. ఇంకేముంది టోల్ గేట్ బారికేడ్ అందులోని ప్రయాణికులను బాదడం మొదులు పెట్టింది. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న వారు.. లబో దిబోమన్నారు. ఈ వీడియోను ‘‘రాష్ డ్రైవింగ్.. వస్తువులను తీసుకెళ్లే బండిలో ప్రజలను తీసుకెళ్లడం ఎల్లప్పుడూ ప్రమాదకరం.’’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగవైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘సిగ్నల్ దగ్గర లైన్ దాటి వాహనాలు ఆపేవాళ్లకు ఇలాంటివి ప్లాన్ చేయండి సార్.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ‘‘జీబ్రా లైన్స్ మీద క్రాస్ లైన్స్ దాటి ఆపేవారిని కూడా ఇలా కొట్టడానికి ఉంటే బాగుండు.’’ అంటూ రాసుకొచ్చారు. Rash driving and carrying people in goods carriage is always dangerous.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NlLzbahbjm — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 8, 2021 -
ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై
ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే బైక్పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. తాజాగా ఈ పోస్టర్ని తమదైన శైలీలో వాడుకున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బైక్పై వెళ్తున్న ఎన్టీఆర్, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్ఫెక్ట్గా ఉందంటూ ట్వీట్ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్గా ఇచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఇక ఈ ట్వీట్పై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఫన్నీగా స్పందించింది. ‘ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదు. నెంబర్ ప్లేట్ మిస్సయింది’అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. Ramaraju & Bheem ❤️🔥🌊 #RRRMovie pic.twitter.com/5vrM662iGo — RRR Movie (@RRRMovie) June 29, 2021 ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. Now it is perfect. Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021 -
తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్
-
E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్
సాక్షి, హైదరాబాద్: మీ క్షేమం.. భద్రత కోసం నిబంధనలు పాటించండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల తీరులో ఏమాత్రం మార్పు ఉండడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారికి అదే తీరులో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా ముగ్గురు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుండడంతో పాటు సెల్ఫోన్ వినియోగిస్తూ టైటానిక్ సినిమాలో మాదిరి స్టిల్ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు వెంటనే కెమెరాకు పని చెప్పారు. ఆ తర్వాత రూ.3,600 జరిమానా వారికి పంపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ముగ్గురు యువకులు పల్సర్పై వెళ్తున్నారు. మధ్యలో కూర్చున్న యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు చేతులు పెట్టి సెల్ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ను డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పరిశీలిస్తున్నాడు. ఈ సీన్ అచ్చం టైటానిక్ సినిమాలో స్టిల్ మాదిరి కనిపించింది. ఈ విన్యాసం చూసిన పోలీసులు ఫొటో తీసి జరిమానా పంపించారు. పైగా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. దీంతో అన్నీ కలిపి రూ.3,600 జరిమానా విధించారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. జరిమానాలు ఇలా.. హెల్మెట్ ధరించకపోవడం: రూ.100 బైక్కు అద్దాలు లేకపోవడం: రూ.100 బైక్పై ముగ్గురు ప్రయాణం: రూ.1,200 సెల్ఫోన్ డ్రైవింగ్: రూ.1,000 మాస్క్ సక్రమంగా ధరించకపోవడం: రూ.1,000 చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021 -
వైరల్: హెల్మెట్ లేకపోతే యువతి తల పగిలేది..
సాక్షి, హైదరాబాద్ : ద్విచక్ర వాహనం నడిపేవారికి హెల్మెట్ అవసరం ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదం జరిగినపుడు మన ప్రాణాల్ని కాపాడే అమృతంలా హెల్మెట్ పనిచేస్తుంది. కేవలం బైకు నడిపేవారు మాత్రమే కాకుండా వెనకాల కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించటం అత్యంత అవసరం.. ముఖ్యం కూడా. బైకుపై ఉన్న ఇద్దరూ హెల్మెట్ ధరించటం వల్ల ఎంత మేలో తెలియాలంటే నగరంలో జరిగిన ఓ ప్రమాదం గురించి తెలియాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డును దాటుతున్నారు. సరిగ్గా డివైడర్ను చేరే సమయానికి ఓ బైక్ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పాదచారులు, బైకు నడుపుతున్న యువకుడు, వెనకాల కూర్చున్న యువతి కిందపడ్డారు. ఆ యువతి తల నేరుగా డివైడర్ను తగిలింది. అయితే, ఆమె హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ బైకు నడుపుతున్న వ్యక్తి, వెనకాల కూర్చున్న అమ్మాయి ఎందుకు హెల్మెట్ ధరించారు?’’అని ప్రశ్నించారు. వీడియోను జత చేశారు. చదవండి : ఆమె మెడలో కేజీ బంగారు తాళి.. పోలీసులు అవాక్! Why should both rider and pillion rider wear Helmet while riding a two-wheeler?#RoadSafety #RoadSafetyCyberabad https://t.co/sfnPOS9OIY pic.twitter.com/TzqNubdN2J — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 24, 2021 -
వేగంగా యూ టర్న్.. లారీని ఢీకొట్టి ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా వాహనదారుల్లో అసలు ఏమాత్రం మార్పు రావడం లేదు. జరిమానాలు విధించినా.. కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటంలేదు. కనీస ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో షాబాద్లోని నాగర్గూడ కూడలి వద్ద వేగంగా బైక్ నడిపి యూ టర్న్ తీసుకున్నాడు. దీంతో రోడ్డుపై అంతే వేగంగా వస్తున్న లారీని ఢికోట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడళ్ల వద్ద ఎటువంటి నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలో చూచించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చూచించిన నిబంధనలు ఇవే.. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోవాలి. ► ముఖ్యంగా గ్రామాలలో, కూడళ్ల వద్ద వేగంగా వాహనాలు నడపకండి. ► పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోండి. ➡️గ్రామాలలో,కూడళ్ల వద్ద వేగంగా నడపకండి. ➡️పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. Location: Nagarguda, Shabad pic.twitter.com/nPNrjDkWFQ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 21, 2021 చదవండి: జెర్సీకి విషెస్ చెప్తూనే సెటైర్ వేసిన పోలీసులు! -
జెర్సీకి విషెస్ చెప్తూనే సెటైర్ వేసిన పోలీసులు!
కాదేదీ కవితకు అనర్హం అన్న చందంగా కాదేదీ అవేర్నెస్కు అనర్హం అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అరటి పండు వొలిచి నోట్లో పెట్టినంత ఈజీగా జనాలకు అర్థమయ్యేందుకు మీమ్ లాంగ్వేజ్ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో పాపులర్ సినిమాల్లో హీరోల ఫొటోలను డైలాగులను వాడుకుంటూ ట్రాఫిక్ నియమనిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని వాడుకున్నారు. ఇందులో క్రికెటర్గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్లో బ్యాట్ పట్టుకుని ముఖాన హెల్మెట్ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్.. "నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎవరైనా మీమర్కు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారా సర్? అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు. ఇదిలా వుంటే ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్ను కూడా ఫుల్గా వాడుకున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్ షేర్ చేసిన విషయం తెలిసిందే! Heartiest Congratulations #Jersy for the much deserved #NationalFilmAwards Win.@NameisNani @gowtam19 pic.twitter.com/5WmVjV0G6N — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 24, 2021 చదవండి: థియేటర్లు మళ్లీ బంద్? ‘హిట్’ సీక్వెల్: హీరో ఎవరో తెలుసా..? -
ఇంకెంత కాలం ఇలా ప్రమాదాల బారిన పడతారు?
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా గానీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జరిమానాలు కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం వంటి కనీస నిబంధనలు పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మృతిచెందాడు. రెడ్ సిగ్నల్ జంప్ చేసి బస్సుకు అడ్డంగా వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రామచంద్రాపురం(ఆర్సీ పురం)లో చోటుచేసుకుంది. స్కూటీపై రాంగ్ రూట్లో వస్తున్న బైకర్ను ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ఇంకెంత కాలం ఇలా? ప్రమాదాల బారిన పడతారు’’ అంటూ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి Opposite direction driving. Not strapping the helmet. Reckless driving at signal. How long !? The danger is just a whisker away. At RC Puram#RoadSafety #RoadSafetyCyberabad 👉Youtube Link: https://t.co/8fLztszMwT pic.twitter.com/6TaXsANJBN — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 27, 2021 -
సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి
మైలార్దేవ్పల్లి: సిగ్నల్ జంప్ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్ మజ్డా వాహనం బంజారాహిల్స్ వెళ్తుంది. కాటేదాన్ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్ అర్మాజ్(19)తో పాటు మహ్మద్ గౌస్(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్కు వచ్చే సమయానికి రెడ్ సిగ్నల్ పడింది. ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్ జంప్ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్ మజ్డా డ్రైవర్ దావూద్(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ అర్మాజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబరు బైక్కు పెట్టుకుని కొత్తూరు: చలానాలు తప్పించుకోవడంలో భాగంగా కొందరు ఇటీవల కాలంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరో వాహనానికి వేసుకోవడం పరిపాటిగా మారింది. తీరా చాలానాలు వచ్చే దాక విషయం తెలియడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు గ్రామానికి చెందిన పెండ్లిమడుగు విజయనిర్మల పేరు మీద మారుతి బ్రిజాకారు ఉంది. కాగా ఇదే నెంబర్ను ఓ యువకుడు బైకుకు పెట్టుకున్నాడు. ఈ నెల 17న షాద్నగర్ ఎక్స్రోడ్లో యువకుడు హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు బైకు ఫొటోను తీసి చలానా వేయడంతో కారు యజమానురాలికి మెసేజ్ వచ్చింది. దీంతో తనది కారు అయినప్పటికీ బైకు చలానా ఎందుకు వచ్చిందని ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ను వివరణ కోరగా తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టుకున్నట్లు తేలితే వాహనం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీజా కారు నంబర్ను బైకు పెట్టుకున్న విషయాన్ని విచారిస్తామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం నిర్లక్షంగా వాహనం నడిపి ఓ వ్యక్తి గాయపడేలా చేశాడో బైకర్. ట్రాఫిక్ సిగ్నల్ను సమీపిస్తున్న సమయంలో ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. మైలార్దేవపల్లి, దుర్గానగర్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. Rash driving when approaching a traffic signal is dangerous. At Durganagar Junction, Mailardevapalli.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/rovPPPhZhs — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 23, 2021 -
నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్ చేయకండి అంటూ ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ ‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా? -
జీడిమెట్ల చింతల్లో రోడ్డు ప్రమాదం
-
వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు
సాక్షి,హైదరాబాద్: భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..అనేకమంది ద్విచక్రవాహనదారుల ప్రాణాలు పోతున్నా..లైట్ తీసుకుంటున్నారా? హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఆఫీసుకు ఆలస్యం అవుతోందని, ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్తో రోడ్డెక్కుతున్నారా? అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021 -
కోవిడ్కు వ్యాక్సిన్ ఉంది.. రోడ్డు ప్రమాదాలకు లేదు..
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : అత్యంత ప్రమాదకర కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ, రోడ్డు ప్రమాదాలకు ఎలాంటి టీకా లేదని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ఒకసారి మీ కోసం ఎదురుచూసే భార్య, తల్లిదండ్రులు, పిల్లలను గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్–2021 వార్షిక సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్–బీజాపూర్ నేషనల్ హైవేపై పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి జూనియర్ ఎన్టీఆర్, అదనపు డీజీపీ సందీప్ శాండిల్య, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడు అన్ని చోట్లా ఉండడని, అందుకే తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు. అలాగే విద్యనేర్పిన గురువులను, దేశ సరిహద్దుల్లో పహారాకాసే సైనికులను, దేశం లోపల పహారా కాస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలన్నారు. పోలీసుల చేతిలో లాఠీ ఉండేది దండించడానికి కాదని, ప్రజల్ని సన్మార్గంలో పెట్టడానికేనని తెలిపారు. తాను ఈ కార్యక్రమానికి అతిథిగా, నటుడిగా కాకుండా ఇంట్లో ఇద్దరి(జానకిరామ్, హరికృష్ణ)ని కోల్పోయిన కుటుంబీకునిగా వచ్చానన్నారు. వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తెరగాలని రాష్ట్ర అదనపు డీజీ(రైల్వేస్, రోడ్సేఫ్టీ) సందీప్ శాండిల్యా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సైబరాబాద్ పరిధిలో రోడ్డు సేఫ్టీ చెక్పోస్టులు ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఏడు చోట్ల ఈ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. 10 వేల మందికి హెల్మెట్లు ఇప్పించామని వివరించారు. డీసీపీ విజయకుమార్ నాయకత్వంలోని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం పనితీరు ఎంతో బాగుందని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పుస్తకాన్ని, బుక్లెట్, లోగోను సందీప్శాండిల్యా, సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఎదుల, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, విమెన్ వింగ్, మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. కాగా, జబర్దస్త్ కళాకారులు చేసిన స్కిట్ విశేషంగా ఆకట్టుకుంది. విజేతలకు పురస్కారాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం ఇటీవల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాçసం, చిత్రలేఖనం తదితర పో టీలు నిర్వహించగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు పురస్కారాలను జూనియర్ ఎన్టీఆర్, సజ్జనార్, సందీప్శాండిల్య అందజేశారు. జీవన్దాన్ కింద అవయవదానం చేసిన వారి కుటుంబçసభ్యులను ఘనంగా సత్కరించి వారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. చదవండి: బర్త్డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్ ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! -
నంబర్ ప్లేట్ వంచితే క్రిమినల్ కేసు: ట్రాఫిక్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్ ప్లేట్కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ని మీమ్గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరలయ్యింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని.. క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి దీనికి రామ్ ‘రెడీ’ సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో వచ్చే సీన్ను మీమ్గా వాడారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్- ‘‘వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి’’ అంటే.. బైక్(బ్రహ్మానందం).. ‘‘వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్’’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలుతోంది. నవ్వు తెప్పిస్తూనే.. జనాల్లో ఆలోచన కలిగేలా ట్వీట్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021 చదవండి: ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..! -
జాగ్రత్త: ఇక మీకు మామూలుగా ఉండదు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా.. జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు పడే పాట్లు వర్ణనాతీతం. ఆ మధ్య కేబుల్ బ్రిడ్జిపై ఫొటోల కోసం ఆగిన ఓ కుటుంబం, రోడ్డుకు అడ్డంగా నిలుచోవడమే గాకుండా, తమ బండి నంబరు కెమెరాకు చిక్కకుండా చున్నీని అడ్డుపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక మొన్నటికి మొన్న, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడమే కాకుండా ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ, నంబరు ప్లేటు కనిపించకుండా ఓ మహిళ కాలు అడ్డుపెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలాగే, చలానాలు తప్పించుకోవడం కోసం బైకర్లు చేస్తున్న చిత్రవిచిత్ర విన్యాసాల ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. (చదవండి: ఎంత పని జేశినవ్ అక్క..!) పైగా అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పామో ఫన్నీ మీమ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం... నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలే గానీ, ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయరాదని చెప్పడమే. అయినా మంచిగా చెప్తే ఎవరు మాత్రం వింటారు.. అందుకే ఓవైపు అవగాహనా కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు భారీ జరిమానాలతో షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బీ సిటిజెన్ పోలీస్(పౌర పోలీసు)’ అంటూ బాధ్యత గల పౌరులుగా మెలగమంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వాట్సాప్ నంబరును షేర్ చేశారు. ఈ మేరకు.. ‘‘సైబబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనను బండి నెంబరుతో సహా ఫొటో/వీడియో తీసి, తేది, ప్రదేశం, సమయం జత పరిచి 9490617346 నంబరుకు వాట్సాప్ చేయండి. తగు చర్య తీసుకుని మీకు తెలియజేస్తాం. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అంటూ ఓ నంబరును ట్విటర్లో షేర్ చేశారు. Be citizen police. Report a Traffic Violation. Capture the violation and send that image to Cyberabad E-challan WhatsApp: 9490617346 with Date, Time and Location. pic.twitter.com/F1e79Z1H5D — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 5, 2021 -
ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ఉండేది ఎందుకు.. మనం జాగ్రత్తగా.. సేఫ్గా గమ్యం చేరడానికి. హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయకండి వంటి నిమయాలన్ని మన సేఫ్టి కోసం పెట్టినవే. కానీ జనాలు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇక చలానాల నుంచి తప్పించుకోవడానికి జనాలు వేసే వేషాలు.. పడే పాట్లు చూస్తే.. వీళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు అనిపిస్తుంది. గతంలో కేబుల్ బ్రిడ్జి మీద ఓ కుటుంబం నంబర్ ప్లేట్ మీద చున్నీ వేసిన ఘటన చూశాం. ఇక మరి కిందరు టీఎస్ తర్వత వచ్చే ఆల్ఫాబెట్ సిరీస్ కనపడకుండా స్టిక్కర్ అంటించడం.. మూతికి పెట్టుకోవాల్సిన మాస్క్ నంబర్ ప్లేట్కు పెట్టడం... ఇక బండి మీద వెనక కూర్చున్న ఆడవారు చున్నీ, చీర కొంగుతో బైక్ నంబర్ ప్లేట్ కనపడకుండా చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని వేషాలు వేసినా.. ఒక్కసారి ట్రాఫిక్ వారి కంట్లో పడితే.. తాటా తీయడం మాత్రం ఖాయం. అంతేకాదండోయ్.. మనకు అర్థం అయ్యేలా చేయడానికి సూపర్ హిట్ సినిమాల నుంచి మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి మీమ్ను షేర్ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ‘‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే హెల్మెట్ ఉంది. ఇక ట్రిపుల్ రైడింగ్కి చలానా పడుతుంది. దాంతో బైక్ మీద కూర్చున్న మహిళ అతి తెలివితో నంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా ఉండేందుకుగాను తన కాలిను దాని మీద పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్ నంబర్ ప్లేట్ని గుర్తించి.. 2,800 రూపాయల చలానా విధించారు. (చదవండి: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?) కావాలని వాహనం సమాచారం దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్కు 1,000 రూపాయలు.. ట్రిపుల్ డ్రైవింగ్కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. ఇక వీరి ఫోటోతో పాటు షేర్ చేసిన మీమ్ సూపర్. అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్ని వీరికి అన్వయిస్తూ.. ‘‘నువ్వేమో 1,300 రూపాయలు కాపాడాలని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి’’ అంటూ క్రియేట్ చేసిన మీమ్ సూపర్బ్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ ఏడాది ప్రభుత్వం, పోలీసులు అనేక చర్యలను చేపడుతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారులు రక్తసిక్తమవుతునే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నా.. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు పలు రకాలుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. చదవండి: 16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్.. తాజాగా ‘ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బైక్ రైడర్లకు సంబంధించి.. సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ను పాటించకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ ఇద్దరు బైక్ రైడర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసులు సంధించిన ప్రశ్న ఆలోచింపజేసింది. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు -
చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా...
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుండా, పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకునే ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్ ప్లేటుపై ట్రిక్కులు చేయాలనుకుంటే తిక్క కుదురుతుందని హెచ్చరిస్తున్నారు. నెంబర్ ప్లేటు సరిగా లేని బైకులకు రూ. 200, ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాయాలని చూసేవారికి రూ. 500 ఫైన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ ఖాతాలో ‘‘ అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ..’’ అంటూ ఓ ట్విట్ను చేశారు. చలాన్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ( కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి.. ) దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు..‘‘ హైదరాబాద్ పోలీసులనుంచి తప్పించుకోవటం కష్టం కాదు! అసాధ్యం.. ఇది మోసం సార్! అలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.. నగర పౌరులకు చలాన్లు విధించే డ్యూటీలో మీకు మీరే సాటి సార్!.. చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా ఇకపై లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట...#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/H5gsDf3Gjv — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) November 9, 2020 -
కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా..
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సందర్శించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన నగరవాసులకు దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. సాయంకాల సమయంలో వెలుగులు విరజిమ్మే లైటింగ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఫొటోలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వంతెన గుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఫొటోషూట్లు నిర్వహిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా వీరి వైఖరి మారడం లేదు.(చదవండి: అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు) ఈ క్రమంలో.. ఓ కుటుంబం సోమవారం సాయంత్రం ప్రమాదకర రీతిలో ఫొటోలు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైవ్లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. కాగా గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. -
చేవెళ్ల బస్స్టాండ్లో విషాద సంఘటన..
-
మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి..
సాక్షి, చేవేళ్ల: చేవెళ్ల బస్స్టాండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి చక్రాల కిందపడి పోయాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అధిక రద్దీ కారణంగా మైనర్ బాలుడు చనిపోయాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే రద్దీగా ఉన్న బస్సులను ఎక్కవద్దని, బస్సు ఫుట్బోర్డు పై నిలబడొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. One minor has died in an accident at Chevella bus stand while climbing on Bus footboard. Cyberabad Traffic Police request the students/ public not to take running buses and do not stand on the footboard. pic.twitter.com/0zSXK2YXw4— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) -
‘ఇస్మార్ట్ ’ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: ఆయనది యాక్షన్.. వారిది ఇస్మార్ట్ రియాక్షన్! ఆయనది ట్వీట్.. వారిది ‘ట్రీట్’. ఆయన పోలీసులెక్కడున్నారంటే.. వారు చలానా రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన రూటే సెపరేటు.. రీల్లోనూ, రియల్గానూ ఆయనది వివాదా’స్పదం’. టీఎస్07 2552 బుల్లెట్ బైక్ను ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి డ్రైవ్ చేస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆగస్త్య, రాంగోపాల్ వర్మ వెనుక కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోను వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. తాము మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్నామంటూ ట్వీట్ చేసిన కొంతసేపటికి... ‘పోలీసులు ఎక్కడ ఉన్నారు... వాళ్లంతా థియేటర్లో సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నాను’అని మరో ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. వర్మ ట్వీట్లను ఫాలో అయ్యే ఓ వ్యక్తి.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరేలా చేసిన వ్యాఖ్యలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్బుక్ ద్వారా పంపి ఫిర్యాదు చేశారు. వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘మీరు పంపిన ఫొటో ఆధారంగా ఆ బైక్ నంబర్కు ఈ–చలానా విధిస్తున్నాం... మాతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’అంటూ ఇస్మార్ట్గా ప్రతిస్పందించారు. ట్రిపుల్ రైడింగ్కు రూ.1200, హెల్మెట్ లేనందుకు రూ.135... మొ త్తంగా రూ.1335 జరిమానాను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించారు. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ–చలానా బైక్ యజమాని బడ్డె దిలీప్కుమార్కు వెళ్లింది. -
కిరాక్ ఆన్సర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్లైన్లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు. -
సైబర్ షటిల్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఐటీ కారిడార్లో ఉద్యోగుల సురక్షిత ప్రయాణంతో పాటు కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇన్నాళ్లు పోలీసులు ఐటీ మహిళా ఉద్యోగుల కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో కలసి షీ షటిల్ సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పోలీసులు.. ఎస్సీఎస్సీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సహకారంతో ‘సైబర్ షటిల్’పేరుతో ఐటీ ఉద్యోగులందరూ ఉచితంగా ప్రయాణం చేసేలా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మూడు మినీ బస్సులను నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని వైఎస్ఆర్ భవన్ వద్ద టీఎస్ఐఐసీ సైబరాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వినోద్కుమార్తో కలసి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్ మహిళా ఉద్యోగుల కోసం నడిపే షీ షటిల్ బస్సులను రాచకొండ పరిధిలోనే కాకుండా వైజాగ్లో కూడా ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఎస్సీఎస్సీ సహకారంతో మూడు మార్గాల్లో ఉచితంగా మినీ బస్సు సేవలను అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సేవలను రాబోయే రెండేళ్లలో 15 నుంచి 30 వరకు పెంచుతామన్నారు. త్వరలో మరిన్ని బస్సులు ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణికుమార్ అరోల్ మాట్లాడుతూ షీ షటిల్ ద్వారా అయిదు బస్సులు మహిళల కోసం, టీఎస్ఐఐసీ ద్వారా కొత్తగా నాలుగు బస్సులను ఐటీ కారి డార్లో నడుపుతున్నామన్నారు. బస్సుల వినియోగానికి నెలకు రూ.1.25 లక్షలు అవుతోందని, స్పాన్సర్ల సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. టీఎస్ఐఐసీ సైబరాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కేవలం ఐటీ కారిడార్లోనే నడిపేందుకు సర్వీసులు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ జయరామ్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీఎస్సీ సభ్యులు కృష్ణారావు, టీఎస్ఐఐసీ అధికారులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇవే మార్గాలు...(సేవ సమయాలు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 9) రూట్ ఏ : మాదాపూర్ ఠాణా, ఇమేజ్ హాస్పిటల్, సైబర్ టవర్స్, మైండ్స్పేస్ జంక్షన్, వీ పార్క్, ఐలాబ్స్/ఇనార్బిట్, మాదాపూర్ ఠాణా రూట్ బీ: హైటెక్ ఎంఎంటీఎస్, సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, ఐసీఐసీఐ, వేవ్రాక్ రూట్ సీ: హఫీజ్పేట ఎంఎంటీఎస్, కొత్తగూడ, ఎస్ఎల్ఎన్ టెర్మినస్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, విర్టుస సీఏ, క్యూ సిటీ -
అదో బీఎండబ్ల్యూ కారు.. ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్..!
సాక్షి, హైదరాబాద్: అదో బీఎండబ్ల్యూ కారు.. ఏపీ28డీఎక్స్6363 నంబర్తో కూడిన ఆ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్.. ఇప్పటి వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిపై విధించిన రూ.1,00,450 జరిమానా పెండింగ్లో ఉండిపోయింది. హఠాత్తుగా శనివారం ఈ మొత్తం క్లియర్ అయింది. ఆన్లైన్లో సింగిల్ పేమెంట్తో జరిమానా మొత్తం చెల్లించేశారు దాని యజమాని. గతేడాది నవంబర్ వరకు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో టాప్–20 ఉల్లంఘనలు చేసిన వాహనాలపై పెండింగ్లో ఉన్న జరిమానా రూ.4.8 లక్షలుగా తేలింది. దీని ప్రకారం చూస్తే ఈ వాహనానిదే టాప్ అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ వాహన యజమాని హఠాత్తుగా ఈ మొత్తం చెల్లించడం వెనుక దాన్ని అమ్మాలని భావించడమో, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నోటీసుల ద్వారా ఒత్తిడి చేయడమో కారణమై ఉండవచ్చని నగర పోలీసులు భావిస్తున్నారు. ‘సైబరాబాద్’ పరిధిలోనే అధికం: ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు స్పాట్ చలాన్లు మాత్రమే విధించేవారు. ఈ కారణంగానే అప్పట్లో చలాన్ల పెండెన్సీ అన్నది అరుదుగా ఉండేది. ప్రస్తుతం రాజధానిలో అత్యధికంగా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. దీన్ని సదరు వాహన చోదకుడు ఆన్లైన్లోనో, ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లోనో చెల్లించాల్సి ఉంది. ఈ–చలాన్లను అనేక మంది బేఖాతరు చేస్తుండటంతో పెండెన్సీ పెరిగిపోతోంది. సైబరాబాద్, రాచ కొండల్లో కొరత కారణంగా సరాసరిన ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు ఒక పీడీఏ మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారణం గానే ఓ వాహనంపై ఎన్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయన్నది ఇక్కడ తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ కారణంగానే పెండింగ్ ఈ–చలాన్లలో అత్యధికం సైబరాబాద్, ఆ తర్వాత రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబంధించినవే ఉంటున్నాయి. -
పోలీసులను వణికించిన వాట్స్యాప్
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల అరాచకమంటూ బుధవారం సోషల్ మీడియాలో ఫొటోలు రావడం ఉప్పల్లో సంచలనం సృష్టించింది. ఉప్పల్ నల్ల చెరువు కట్టపై పండ్లను అమ్ముకుంటున్న చిరువ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల క్రితం తమ ప్రతాపం చూపారు. గంపలను లాక్కోవడంతో పాటు వారి వద్ద ఉన్న పండ్లను, వేరుశెనగ కాయలను బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించుకున్నారు. వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. ఇది గమనించిన ఓ యువకుడు పోలీసుల దాష్టీకాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి బుధవారం వాట్స్యాప్లో పెట్టడంతో ఈ వార్త ట్రాఫిక్ పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ట్రాఫిక్ సీఐ జానకిరెడ్డి వివరణ... ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుండటంతో రోడ్డును ఆక్రమించి పండ్లు అమ్ముతున్న వ్యాపారులను ముందస్తుగా హెచ్చరించాం. అయినా వారు వినిపించుకోకపోవడంతో అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇందులో మేం చేసిందేమీ లేదు. -
హెల్మెట్ ఉండాల్సిందే!
సైబరాబాద్ పరిధిలో ద్విచక్రవాహనదారులకు తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సైబరాబాద్ పరిధిలో రోడ్డెక్కాలంటే ద్విచక్ర వాహనదారులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇంతకుముందు ఈ నిబంధన ఉన్నా ఎక్కడా సరిగా అమలు కాలేదు. కానీ, ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ కావడం, నగర శివార్లటలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఘటనలో ఎక్కువగా ప్రమాదాల బారినపడడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట వాహనదారుల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి(బుధవారం) నుంచి 12వ తేదీ వరకు సైబరాబాద్ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించనున్నారు. ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ ఏసీపీలు, 12 ఠాణాల ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. వారోత్సవాల్లో భాగంగా శివార్లలోని కళాశాలల విద్యార్థులకు హెల్మెట్పై అవగాహన కల్పిస్తారు. ఇకపై కేసు నమోదు.. చలానాలు.. డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను 300కు తగ్గించగలిగారు. ఇక హెల్మెట్లపై కూడా ఇదే రకమైన తనిఖీలు నిర్వహించి ఈసారి ప్రమాద మృతుల సంఖ్యను భారీగా తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకపక్క అవగాహన కల్పిస్తూనే మరో పక్క మోటారు వాహనాల చట్టం -1988 ప్రకారం చలానాలు విధించడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తే కేసులు నమోదు చేసి, చలానా విధించేవారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీని వల్ల నగర రోడ్లపై ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే కొనుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా హైదరాబాద్లో చాలా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. - డీసీపీ మహంతి